కలెక్టర్ కార్యాలయం లో ప్రజావాణి రద్దు కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిధాత్రి .
మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందుకు కలెక్టర్ కార్యాలయం లో ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికలు పూర్తయి కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజావాణి దరఖాస్తు దారులు గమనించి సహకరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురబి కోరారు దరఖాస్తులు ఫిర్యాదులు తీసుకుని రావొద్దని ఒక ప్రకటన లో ప్రజలను కోరారు
