సీఎంఆర్ చెక్కు అందజేత..
రామాయంపేట మే 17 నేటి ధాత్రి (మెదక్):
రామయంపేట: కాట్రియాల గ్రామానికి చెందిన గొల్ల అంజయ్య కు వచ్చిన సిఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అంజయ్యకు అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది నిరుపేదలకు ఒక వరం అని, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని వారు అన్నాను.పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు అందిస్తు నిరుపేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారికి కాట్రియాల గ్రామ కాంగ్రెస్ నాయకులు మరియు లబ్ధిదారుడు అంజయ్య కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కమ్మరి రమేష్ చారి మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,నాయకులు చింతం సత్యం,కొప్పుల హనుమండ్లు,కుమార్,లింగం,బాలయ్య,కట్ట రాజు తదితరులు పాల్గొన్నారు