CM Revanth Reddy Launches Medaram Jatara 2026 Poster
మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదారాబాద్,నేటిధాత్రి:
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర
మేడారం మహా జాతర 2026 పోస్టర్ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రస్తుత ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో గల అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర 2026 జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరగనుంది. మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ,ధనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
