హుగ్గెల్లిలో బసవేశ్వర విగ్రహాన్ని ప్రారంభించిన సీఎం.

CM CM

హుగ్గెల్లిలో బసవేశ్వర విగ్రహాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

◆ పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పండితులు
వేదమంత్రాల నడుమ బసవేశ్వరుడి విగ్రహం ప్రారంభం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ లో జహీరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐజీ సత్యనారాయణ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎంపీ కాంటెస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు తదితరులు హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు. హుగ్గెల్లిలో బసవేశ్వరుడి విగ్రహం వద్ద వేద పండితులు, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ పరితోష్ పంకజ్ లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
బసవేశ్వరుడి విగ్రహ ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విశ్వగురు బసవేశ్వరుని స్పూర్తి, ఆలోచన విధానంతో బసవేశ్వరుని దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం జన గణనలో కుల గణన చేసి చూపెట్టిందని తెలియజేశారు. భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ అడుగడుగున మహాత్మా జ్యోతి రావు పూలే, మహాత్మా గాంధీ, బసవేశ్వరుడు స్ఫూర్తితో
సామాజిక న్యాయాన్ని ప్రజలందరికీ అందజేయాలని ఆయన ఆక్షించారని ఆయన సూచనలతోనే తెలంగాణలో కుల గణన చేసి చూపించామన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ , జిల్లా ఇంచార్జీ మంత్రి కొండా సురేఖ, ఎంపీ సురేష్ షట్కర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, జిల్లా లింగాయత్ సమాజా నాయకులు గురువులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!