
సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు వరం.
జిల్లా ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ గౌడ్.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.
సీఎం సహాయ నిధి పేదలకు వరమని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ గౌడ్ అన్నారు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామంలోసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పలువురుపేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని చెక్కులను అందజేశారు సీఎం సహాయ నిధి ఆర్థిక సహాయం ఎంతో సహాయపడుతుందని అన్నారు పేదవారు అనివార్య పరిస్థితుల్లో ప్రవేట్ ఆసుపత్రిలో చేరి ఆర్థిక ఇబ్బందులకు గురైతే వారికోసం ప్రభుత్వ ఆసుపత్రిలోనే కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నారని పేదవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కాంతాల సతీష్ రెడ్డి గౌరవ అధ్యక్షుడు మోత్కూరి మల్లయ్య ఉపాధ్యక్షులు పసునూటి సంపత్ మండ శ్రీకాంత్ దొమ్మటి అశోక్ వీళ్ళ తిరుపతి ఈళ్ల రమేష్ ఈర్ల అశోక్ పాల్గొనడం జరిగింది