CM Relief Fund
సీఎంఆర్ఎఫ్ తో భరోసా
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
గంగాధర, నేటిధాత్రి:

ప్రమాదాల్లో గాయపడి, అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం భరోసానిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూట ఎనభై మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నలబై ఆరు లక్షల అరవై మూడు వేల రూ.ల ఆర్థిక సహాయం మంజూర అయింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు గురువారం గంగాధర మండలం మధురానగర్ లోని ప్రజా కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. సీఎంఆర్ఎఫ్ తో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సత్తు కనుకయ్య, రోమాల రమేష్, కర్ర విద్యా సాగర్ రెడ్డి, గుజ్జుల బాపురెడ్డి, తోట కరుణాకర్, వేముల భాస్కర్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, వేముల అంజి, గరిగంటి కరుణాకర్, ముచ్చ శంకరయ్య, శ్రీనివాస్, మంత్రి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
