ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం ప్రారంభం

ఉదయం చక్కని అల్పాహారం మధ్యాహ్నం సన్న బియ్యంతో భోజనం

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత, ఎం.పి.ఎస్ పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా తో కలిసి సీఎం అల్పాహార పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించి సీఎం అల్పాహార పథకాన్ని ఈరోజు ప్రారంభిస్తుందని, ఇది చాలా మంచి పథకమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పిల్లల చదువుతోపాటు శ్రేయస్సు గురించి శ్రద్ధ వహిస్తుందని, తొలిమెట్టు వంటి కార్యక్రమాలను అమలు చేస్తూ విద్యార్థుల విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగు పరుస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు యూనిఫార్మ్స్ ,వర్క్ బుక్స్, నోట్ బుక్ లను పంపిణీ చేస్తుందని కలెక్టర్ తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలను గణనీయంగా పెంచే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన వసతులను కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన బట్టలు కాస్మెటిక్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు.
పిల్లలకు ఉదయం అల్పాహారం అందించడం వల్ల చదువు చక్కగా మనసు పడుతుందని, పౌష్టికరమైన ఆహారం లభించడం వల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదల సక్రమంగా జరుగుతుందని, ఎందుకోసం ప్రభుత్వం ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి చదివే విద్యార్థులందరికీ ఉదయం బడికి రాగానే పౌష్టికాహారాన్ని అందిస్తూ శక్తివంతమైన భవిష్యత్తు తయారు చేసేందుకు సీఎం అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.
జిల్లాలోని 438 ప్రభుత్వ పాఠశాలలో సీఎం అల్పాహార పథకాన్ని దసరా సెలవుల అనంతరం ప్రారంభిస్తున్నామని, ఇకపై ప్రతిరోజూ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారంతో విద్యార్థులకు అల్పాహారం అందిస్తామని అన్నారు.
తమిళనాడు ప్రభుత్వం నాలుగు నెలల క్రితం 5వ తరగతి వరకు విద్యార్థులకు ఉదయం పూట ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించే పథకాన్ని ప్రారంభించిందని, విద్యార్థులకు మంచి జరుగుతుందని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తమిళనాడుకు సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందాన్ని పంపి ఆ పథకాన్ని స్టడీ చేశారని అన్నారు.
దేశంలో ఎక్కడైనా ఒక మంచి కార్యక్రమం జరిగితే మన రాష్ట్రంలోనే ప్రజలకు సైతం అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, తమిళనాడు లో 5వ తరగతి లోపు విద్యార్థులకు మాత్రమే అల్పాహార పథకం అందిస్తున్నారని, మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు అల్పాహారం అందించాలని నిర్ణయించారని ఎమ్మెల్యే తెలిపారు.
మన ఊరు మనబడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ లో ఏర్పాటు, 12 రకాల మౌలిక వసతులు కల్పించామని అన్నారు. గతంలో ఉన్న 200 గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలను నేడు 1050 కు పెంచుకొని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం నాణ్యమైన పౌష్టికాహారం అందించడం వల్ల విద్యార్థుల సంతోషంగా ఉన్నారని, వారు కడుపునిండా తిని ఏకాగ్రతతో విద్యను నేర్చుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట్రాణి సిద్దు , కౌన్సిలర్లు ఎంపీపీలు, జడ్పిటిసిలు మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు, జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ రమేష్ గౌడ్ మహిళలు, ప్రజా ప్రతినిధులు, డీఈఓ రాంకుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!