వర్గ పోరాటాలను
ఉధృతం చేయాలి
శిక్షణ తరగతులు
ముగింపు సమావేశంలో
సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యు లు వీరయ్య
మరిపెడ నేటిధాత్రి:
కమ్యూనిస్టు కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని వారి కోసమే జీవించాలని ,పాలకవర్గాలు ప్రజా వ్యతిరేక విధానాలను వారు చేస్తున్న తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిలదీస్తూ వర్గ పోరాటాలను ఉదృతం చేయాలని సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. మహబూబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని స్థానిక కనకదుర్గ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న గురువారం 5 వ రోజు జిల్లా స్థాయి శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో వీరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కమ్యూనిస్టు పోరాటం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వారికి మేము ఉన్నామని ప్రజలకు భరోసా కల్పించాలన్నారు.
-ఇచ్చిన హామీలు
అమలు చేయాలి
జిల్లా కార్యదర్శి
సాదుల శ్రీనివాస్
గత ఎన్నికల ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆశ చూపెడుతూ లబ్ధిదారులను గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు. అర్హులైన పేదలకు ఇల్లు రాకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అర్హులైన వారికి ఇండ్లు ఇవ్వకపోతే ప్రభుత్వ భూములు పేదల గుడిసెలు వేసి సిపిఐ (ఎం) పార్టీ ఇండ్లు నిర్మిస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు సూర్నపు సోమయ్య గునుగంటి రాజన్న, ఆకుల రాజు, కుంట ఉపేందర్, కందనూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి మధుసూదన్, రాజన్న, , లచ్చయ్య, రాజశేఖర్, ఉప్పలయ్య, తదితరులు ఉన్నారు.