తిప్పనగుల్లలో పౌర హక్కుల దినోత్సవం
నిజాంపేట్, నేటి ధాత్రి
నిజాంపేట మండల పరిధిలోని తిప్పనగుళ్ల గ్రామంలో బుధవారం రోజున పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎస్ఐ జైపాల్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని ఉద్దేశాలను తెలుపడం జరిగింది. గ్రామంలో ఎస్సీ ఎస్టీలను కులం పేరుతో ఎవరైనా దూషిస్తే మా దృష్టికి తీసుకురావాలని గుడిలోకి, బడిలోకి, రానివ్వకుండా కులం పేరుతో మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, హోటళ్లల్లో అందరికీ ఒకేలాగా ఒకే తీరు గ్లాసులల్లో చాయ్ ఇవ్వాలని మీకు వేరు మాకు వేరు అనే పద్ధతిని ఉంటే అటువంటి అంశాలపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని కోనేరు రంగారావు సిఫారసుల మేరకు ప్రతినెల చివరి రోజున మండలంలోని ఏదో ఒక గ్రామంలో ఇలాంటి పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం చేపడతామని, ఆ గ్రామాలలో ఏవైనా కులాల వారీగా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో జీవించాలని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం సమాన హక్కులు సమాన అవకాశాలు సమాన విద్య అందరికీ అందించే విధంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇమాద్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి శ్యామల పోలీస్ సిబ్బంది గ్రామస్తులు చంద్రం, యాదగిరి, రాజు, నవీన్, గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.