రామనామ స్మరణంతో నగర సంకీర్తన.
చిట్యాల నేటి ధాత్రి :
చిట్యాల మండల కేంద్రం లో వెంకట్రావుపల్లి సి గ్రామం లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం లో హనుమాన్ మాలదారులు శనివారం గ్రామం లో నగర సంకీర్తన కార్యక్రమం* ని అంగరంగ వైభవం గా నిర్వహించారు. ఈ సందర్బంగా హనుమాన్ స్వాములు గ్రామం లోని అన్ని పురావిధుల గుండా హనుమాన్ వేశాధారణలో రామనామా స్మరణ చేస్తు డీజే చప్పుళ్లతో అంజన్న స్వామి ల గంతులు వేస్తూ హంగామా చేశారు. అదే విధంగా రామ నమా స్మరణ తో జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమం లో దేవస్థానం గురుస్వాములు ఈగ కోటి, బ్రాహ్మం, మాసు రమేష్, చారి, అంకం రమేష్, కొక్కుల కరుణాకర్, చిలుకల సదానందం,జంగపల్లి సతీష్,అంకం సదానందం,కన్నె స్వాములు సతీష్, ప్రవీణ్, నాగరాజు, నగేష్, సురేష్, బిట్టు దేవస్థాన హనుమాన్ స్వాములు,తదితరులు పాల్గొన్నారు.