
పుర కమీషనర్ మురళీకృష్ణ
రామకృష్ణాపూర్, మార్చి 22, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్థి పన్ను చెల్లింపు విషయంలో మినహాయింపు ఇచ్చిందని క్యాతనపల్లి పుర ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు. జి.ఓ. ఆర్.టి నెం.101 ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2022-23 ఆర్దిక సంవత్సరము వరకు బకాయి ఉన్నటువంటి ఆస్తి పన్ను ల వడ్డీ/ పెనాల్టీ ల పై 90% మాఫీ చేయటం జరిగిందని, ఈ నెల 31 వ తేదీ వరకు ముగుస్తున్నందున వెంటనే ఇట్టి అవకాశమును పుర, పట్టణ ప్రజలు వినియోగించుకోని ఆస్తి పన్నులు చెల్లింపు చేయాలని కోరారు. 2023-24 ఆర్ధిక సంవత్సరం నకు సంబందించిన ఆస్తి పన్నులు ఈ నెల 31 లోపు చెల్లించి పట్టణాభివృద్దికి తోడ్పడాలని కమీషనర్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ ఆదేశాల ప్రకారము భవన నిర్మాణ యజమానులు/ భవన నిర్మాణ బిల్డర్లు భవన నిర్మాణ నియమ నిబంధనల ప్రకారము ఇంటి లోపల ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.