మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన సిఐ సుబ్బారాయుడు.

pg

రంగంపేట వద్ద
పి.జి హాస్టల్ యాజమాన్యం,
విద్యార్థులకు
మత్తు పదార్థాలపై

అవగాహన కల్పించిన సిఐ సుబ్బారాయుడు

తిరుపతి(నేటి ధాత్రి)

అసాంఘిక కార్యకలాపాలు నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్.
ఆదేశాల మేరకు రంగంపేట పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి, తనిఖీ మరియు అవగాహన కార్యక్రమం చేపట్టారు.
విద్యార్థుల భవిష్యత్ తోపాటు భద్రత దృష్ట్యా పీ.జీ. ప్రైవేటు హాస్టల్ నందు తనిఖీలు నిర్వహించిచారు.
సైబర్ క్రైమ్ నార్కో ట్రిక్స్ మరియు గంజాయి పై సుబ్బరాయుడు సి.ఐ.అవగాహన కార్యక్రమం ఎర్పాటు చేశారు.
రంగంపేట లోని ప్రతి హాస్టల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు బ్యాకప్ 30 రోజు ఉండాలని సూచించడం అయినది.
రంగంపేట పరిసర ప్రాంతాలలో పి.జి హాస్టల్ యాజమాన్యల తోపాటు మత్తు పదార్థాలపై విద్యార్దులకు అవగాహన నిర్వహించారు..
గంజాయి సేవించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోతుందని, దానివల్ల జరిగే నష్టాలు అనర్ధాల గురించి విద్యార్థులకు వివరించారు..
దినితో పాటు విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరాలు గురించి నార్కో ట్రిక్స్ డ్రగ్స్ గురించి, వాటి వల్ల జరిగే నష్టాలు గురించి తెలపడం అయింది..
రంగంపేట పరిసర ప్రాంతాలులో గల గంజాయి స్పాట్లను కూడా గుర్తించి వాటిని ద్వంసం చేశారు..

pg
pg

అంతే కాకుండా ఈ ప్రదేశాలలో గంజాయి సేవించిన, లేదా ఇతరేతర కార్యక్రమాలు చేపట్టిన అలాంటి వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యాజమాన్యం కు మీకు ఏదైనా సమాచారం ఉంటే పోలీసు వారికి వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
నార్కోడ్ ట్రిక్స్ డ్రగ్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్1972 కు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు తెలిపారు.
గంజాయి పై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీస్ వారికి డయల్ 100/112/8099999977 సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీజీ హాస్టల్లో యాజమాన్యం ఆటో డ్రైవర్లు ఎస్టిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!