మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న చిట్యాల జర్నలిస్టులు.
చిట్యాల నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రపంచ రక్త దాన దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ వర్కింగ్ జర్నలిస్టు టి యు డబ్ల్యు జె ఐ జె యు, ఐటీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో చిట్యాల మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాట్రేవుల ఐలన్న పాల్గొని మాట్లాడుతూ రక్తదానం మహాదానమని అన్ని దానాల కన్నరక్త దానం గొప్పదనం గొప్పదని అన్నారు, ఈ రక్తదాన శిబిరంలో జర్నలిస్టులందరూ పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు క్యాతం సతీష్, శామంతుల శ్యామ్ ఐజేయు జిల్లా జిల్లా నాయకులు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాట్రేవుల ఐలన్న ప్రెస్ క్లబ్ సభ్యులు సీనియర్ జర్నలిస్టులు పుల్ల రవితేజ, వెల్దండ సత్యనారాయణ, శృంగారపు రంగాచారి, బోల రాజేందర్, బుర్ర రమేష్, గుర్రం రాజమౌళి, కటుకూరి శ్రీనివాస్, సరి గొమ్ముల రాజేందర్, చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు.