
Farmers Alerted
చింగేపల్లి పెద్దవాగు ఉప్పొంగుతోంది: రైతులు అప్రమత్తం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం, న్యాలకల్ మండలం, చింగేపల్లి గ్రామంలోని పెద్దవాగులో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు చేరింది. ఆనకట్ట పైనుండి పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తుండటంతో, ఆనకట్ట క్రింద ఉన్న పంట పొలాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వరద పరిస్థితిపై రైతులు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.