తహసీల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం.

Tahsildar's office Tahsildar's office

తహసీల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం

నిజాంపేట: నేటి ధాత్రి

మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఇంచార్జ్ తహసీల్దార్ రమ్య శ్రీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… గ్రామానికి చెందిన పాక మైసయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు నాగరాజు చలివేంద్రం ఏర్పాటు చెయ్యడం సంతోషంగా ఉందన్నారు. అలాగే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ రమాదేవి ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఆర్ ఐ ప్రీతి, కంప్యూటర్ శ్రీకాంత్ గౌడ్, కళ్యాణ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!