అంగన్వాడి సెంటర్లో ఘనంగా పిల్లల జన్మదిన వేడుకలు.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలోని అంగన్వాడీ నెంబర్ వన్ సెంటర్ లో సూపర్వైజర్ జయప్రద ఆదేశాల మేరకు విద్యార్థుల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శీలపాక నాగరాజు వనితల కుమారుడు సాహసమిత్ర పుట్టినరోజు సోమవారం నిర్వహించగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉష కంపెనీ అసిస్టెంట్ సేల్స్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ మెండు వెంకట్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ స్వీట్లను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ల నుండి అందుతున్న పౌష్టికాహారాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడి సెంటర్లో ఆట పాటల విద్యతో విద్యార్థుల భవితవ్యాన్ని సక్రమంగా తీర్చిదిద్దడానికి అంగన్వాడీ టీచర్స్ ఆయాలు చేస్తున్నటువంటి కృషిని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల సంధ్యారాణి ఆయా లావణ్య తదితరులు పాల్గొన్నారు.