ఆకట్టుకున్న ఉన్నత పాఠశాల విద్యార్థుల బాలసభ

జమ్మికుంట: నేటిధాత్రి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపల్లిలో జరిగిన బాలసభ సాంస్కృతి కార్యక్రమాలు అందర్నీ అలరించాయి తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ వారు విద్యార్థులను సాంస్కృతికంగా సాహిత్య పరంగా అభివృద్ధి పరిచేందుకు ప్రతినెల నాలుగవ శనివారం ‘నో బ్యాగ్ డే’ నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత శక్తులను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని విద్యార్థిని విద్యార్థులు బాలసభను ఉపయోగించుకుని చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కవితలు గేయాలు పాటలు వినిపించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు చేసిన దేశభక్తి నృత్యాలు, విద్యార్థులు పాడిన పద్యాలు గేయాలు అద్భుతంగా అందరిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేందర్ రమేష్ అవినాష్ ఐలయ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *