వనపర్తి నేటిదాత్రి :
వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు యువకులు ఎండ వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి జలాశయాల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరుగుతుండటం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా విషాదం కాకూడదు వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షిత కే మూర్తి సూచించారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఈత ను నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యముగా తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల వద్దకు చెరువుల కాలువల కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పిల్లలను జలాశయాల, చెరువులు, వద్దకు వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి ఎస్పీ
