పిల్లలు చదువుకు.. ప్రజలు వైద్యానికి… దూరమవుతున్నారు.

5 కి.మీ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది

జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి.

సిపిఐఎంఎల్, వి సీ కే పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో.

చిట్యాల, నేటి ధాత్రి :

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కైలాపూర్ గ్రామపంచాయతీ శివారు ఐదు కిలోమీటర్ల దూరం లో ఉన్న శాంతినగర్లో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చెయ్యాలని అంగవాడి పర్మినెంట్ బిల్డింగ్ మరియు హెల్త్ క్యాంపు నిర్వహించాలి, ప్రవేట్ స్కూల్స్ టాటాఏసీలను నిషేదిహించాలి ,మౌలికవసతులు కల్పించలని డిమాండ్ తో శాంతినగర్ ప్రజలతో విద్యార్థుల తో రాస్తారోకో నిర్వహించడం జరిగింది, అని సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్, వీసీకే పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి అంబాల అనిల్ అన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శాంతినగర్ లో విద్య వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పిల్లలను పాఠశాలలకు పంపించాలాంటి అటు 5 కిలోమీటర్ల దూరం లో ఉన్న చిట్యాలకు ఇటు 5 కిలోమీటర్ల దూరం లో ఉన్న టేకుమట్లకు ప్రాథమిక పాఠశాలకు పిల్లలు బస్సుకు వెళ్తున్నారు బస్సులు కూడ ఆపడం లేదు ప్రైవేట్ స్కూల్స్ అయినాఅటవంటి యాజమాన్యం ప్రయివేట్ వాహనాల్లో విద్యార్థులను తీసుకెళ్తున్నారు ప్రయివేట్ యాజమాన్యం స్కూల్స్ పై చెర్యలు తీసుకోవాలని ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే స్థానిక ప్రజల తో విద్యార్థులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దర్న నిర్వహిస్తామని తెలియేజెస్తున్నాము ఈ కార్యక్రమంలో విద్యార్ధి నాయకుడు చేరిపెల్లి విజయ్ వి సి కె గ్రామ అధ్యక్షులు పర్లపెల్లి శ్రీకాంత్ శాంతినగర్ గ్రామ ప్రజలు రాంబాబు నవీన్ కిషన్ లాసమయ్య శ్రీను ఇస్తారీ లక్ష్మి జేయమ్మ సరోజన అర్షణ విజయ కాంతమ్మ అనూష మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *