కామారెడ్డి జిల్లా / పిట్లం నేటి ధాత్రి:
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పిట్లం, నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాలు చెందిన వారికి చెక్కులు అందించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, వైస్ ఛైర్మన్ మారెడ్డి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జంబి హనుమాన్లు, నాయకులు రామ్ రెడ్డి పటేల్, మోహన్ రెడ్డి నిజాంసాగర్ తహశీల్దార్ భిక్షపతి, ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.