మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం.

Revanth Reddy Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణం అంబేద్కర్ కాలనీలోని ఎమ్మార్పీఎస్ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలభిషేకం చేయడం జరిగింది.ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితం అమరుల త్యాగాల ఫలితంగా వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ ఎస్సీ లోని 59 ఉప కులాలకు సమాన న్యాయం జరగాలని మూడు దశాబ్దాలుగా పోరాటం చేసి వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ కి పాదాభివందనాలు తెలియజేశారు.అలాగే పాలాభిషేకం అనంతరం కాలనీవాసులు టపాసులు పేల్చి డబ్బు చప్పుళ్లతో ఒకరికొకరు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు కొప్పర్తి రాజం,అంబేద్కర్ కాలనీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మాడుగుల మహేష్,ప్రధాన కార్యదర్శి ఇరికల్లా మనోజ్,ఎమ్మార్పీఎస్ నాయకులు,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!