చర్లపల్లి పాఠశాల మరో జలియన్వాలాబాగ్
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో జలియన్వాలా బాగ్ సంఘటనను పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో ఆ సంఘటనను కనులకు కట్టినట్లుగా విద్యార్థుల ద్వారా నాటకీకరణ చేయించడం విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రజలను ఆకట్టుకున్నది. జలియన్వాలా బాగ్ ప్రదేశంలో మరణించిన భారతీయుల స్తూపానికి విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ నివాళులర్పించారు.అనంతరం అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ 1919 ఏప్రిల్ 13 న భారత నేల రక్తంతో తడిసిన రోజు అని, దుర్మార్గపు చట్టాన్ని వ్యతిరేకించినందుకు బ్రిటీష్ వారు ఆడిన రక్తపు క్రీడ అని, బ్రిటీషు ప్రభుత్వం ఆమోదించిన “రౌలత్ చట్టం” ప్రకారం పోలీసులు ప్రజలను అనుమానితుల పేరుతో ఎటువంటి విచారణ లేకుండా, రెండు సంవత్సరాలపాటు నిర్భందించవచ్చఅని, ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సైపుద్దిన్ క్లిచ్, సత్యపాల్ సింగ్లను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వీరి అరెస్ట్ కు వ్యతిరేకంగా ప్రజలు అమృత్సర్ లోని జలియన్ వాలాబాగ్ లో సమావేశం అయ్యారు అని
ఈ సమావేశంలో హన్స్ రాజ్ అనేవ్యక్తి ప్రసంగిస్తున్నప్పుడు, అప్పటి సైనిక అధికారి జనరల్ డయ్యర్ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే, నిరాయుధులైన ప్రజలపై 1650 రౌండ్ల కాల్పులు పది నిమిషాల పాటు,379 మరణాలు, రెండువేల మందిని గాయపరిచారు,అనేక మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకొనుటకు అక్కడి బావిలో దూకారనీ,తుటాలు తగలి చాలామంది చనిపోయారు అని అన్నారు.ఈ సంఘటనలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనయే భారతదేశ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురాగతంగా నిలిచిపోయిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మేకల సత్యపాల్,
ఐ ఈ ఆర్ టి రమేష్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.