
జైపూర్, నేటి ధాత్రి:
చెన్నూరు నియోజవర్గ పర్యటనలో భాగంగా జైపూర్ మండల్ ఇందారం లో కాబోయే మంత్రివర్యులు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కి సాల్వాతో సాధారణ స్వాగతం పలికిన జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ ఫయాసుద్దీన్ వారితో మండలంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల విషయంలో చర్చించి ఎన్నికల కోడ్ వలన కార్యక్రమాన్ని ముందుకు తీసుకోలేకపోయాం . రైతులకు అండగా ఉంటాం చెన్నూరు నియోజవర్గానికి సంబంధించిన రైతుల వడ్ల విషయంలో సుల్తానాబాద్, పెద్దపల్లి రైస్ మిల్లుల దగ్గర కలిసి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. ప్రతి రైతు వడ్ల ప్రభుత్వం తీసుకుంటుంది. జైపూర్ మండలంలో సుమారు 95 శాతం వడ్లు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది . రైతుల బాధ పడాల్సిన అవసరం లేదని తెలియజేయడం జరిగింది. గ్రామాలలో ఉన్న ప్రతి సమస్య పరిష్కరిద్దాం స్థానిక నాయకులు వాటిపై దృష్టి పెట్టాలని కాబోయే మంత్రివర్యులు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ ఫయాజుద్దీన్ జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఆసంపల్లి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముక్త శ్రీనివాస్, ఎంపీటీసీ ఆర్కే సంతోష్, మాజీ ఎంపిటిసి సుంకరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చిప్పగుర్తి దుర్గయ్య, ఎస్కే షరీఫ్, బేధ మల్లేష్ ,మున్నాభాయ్ ,ప్రశాత్ టేకుమట్ల ఉపసర్పంచ్ గుడిగందుల సాగర్ ,మారుతి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.