#నెక్కొండ ,నేటి ధాత్రి:
ఎస్ బిఐ బ్యాంకు వరంగల్ రీజినల్ మేనేజర్ అబ్దుల్ రహీం షేక్, క్రెడిట్ సెక్షన్ చీఫ్ మేనేజర్ దుర్గాప్రసాద్ లను చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఎస్బిఐ రీజనల్ అబ్దుల్ రహీం ను సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి కలిసి పూల బొకేలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ చెన్నారావుపేట సహకార సంఘం స్వల్పకాలిక రుణాల అకౌంట్ రూ.30 కోట్లకు సంబంధించినది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 రెన్యువల్ చేసినందుకు గాను అలాగే సకాలంలో అర్హత కలిగిన సభ్యులకు రుణాలు మంజూరు చేసినందుకుగాను ఎస్బిఐ రీజనల్ మేనేజర్ అబ్దుల్ రహీం , దుర్గాప్రసాద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.