నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నర్సంపేట పట్టణానికి చెందిన కూచన రవీందర్ నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మగ్గాలపై జీవనం సాగిస్తున్న పద్మశాలీల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించిన రాపోలు వీర మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు.