ప్రేమ పేరుతో మోసం….మనస్థాపంతో ప్రేయసి ఆత్మహత్య యత్నం.
పెళ్లిచేసుకుంటానని కులం నెపంతో మోసం చేసిన ప్రేమికుడు..
మనస్థాపంతో ప్రేయసి ఆత్మహత్య యత్నం.
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న దళిత యువతి.
పోలీసులను ఆశ్రయించిన యువతి తల్లిదండ్రులు..
వరంగల్/నర్సంపేట/దుగ్గొండి నేటిధాత్రి:
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని, కులాలు వేరైనా ఒకే గ్రామస్థులం అంటూ ప్రేమ పేరుతో నమ్మించి ఒక నర్సింగ్ దళిత యువతిని మోసం చేశాడు ఒక కారు డ్రైవర్ కాగా..
ఆ ప్రేమికుడి మాయమాటలకు మోసపోయి మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన దుగ్గొండి మండలంలోని ముద్దునూరు గ్రామంలో శనివారం ఉదయం చోటు చేసుకున్నది.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దనూరు గ్రామానికి చెందిన బండి లక్ష్మి , నర్సయ్య పెద్ద కుమారుడు బండి నాగరాజు సికింద్రాబాద్ లో కార్ డ్రైవింగ్ పని చేస్తూ బ్యాచిలర్ గా అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
అదే గ్రామానికి చెందిన కన్నం పూలమ్మ ముత్తయ్య పెద్ద కూతురు కన్నం అరుణ సికింద్రాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సింగ్ చేస్తుంది.
గత సంవత్సరం నర క్రితం కారు డ్రైవర్ నాగరాజు యువతి
కన్నం అరుణతో మనం ఇద్దరం ఒకే గ్రామానికి చెందిన వారిగా పరిచయం చేసుకున్నాడు.
ఒక సంవత్సరం పాటు ప్రేమ పేరుతో ఆమె వెంట పడ్డాడు.
కులాలు వేరైనప్పటికీ ఒకే గ్రామానికి చెందినవారిమి కనుక పెళ్లి చేసుకుందామని నమ్మ పలికాడు.
నర్సింగ్ చేస్తున్న అరుణతో ప్రేమ వివాహం పెంచుతూ ఆమె వద్ద నుండి ఖర్చుల నిమిత్తం సుమారు రూ. 50 వేలకు పైగా తీసుకున్నాడు.
అనేకసార్లుగా హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో యువతిని తీసుకెళ్లి శికార్లకు కొట్టాడు.
వారు దిగిన ఫోటోలు గ్రామంలో వైరల్ కావడంతో ముఖం చాటేసి తక్కువ కులానికి చెందిన దళిత యువతిగా నిరాకరిస్తూ మరో అమ్మాయితో వివాహం చేసుకున్నాడు ఆ కిలాడి యువకుడు నాగరాజు.
మనస్థాపానికి గురి చెందిన దళిత నర్సింగ్ యువతి కన్నం అరుణ ఇంట్లో ఎవరు లేని సమయంలో కెమికల్ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కాగా అంతకుముందే పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిగినప్పటికీ వాటిని సైతం లెక్కచేయకుండా మరొక యువతితో పెళ్లి చేసుకోవడంతో నాగరాజుపై పలువురు దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఆమె తల్లిదండ్రులు నర్సంపేట ఏసీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ సందర్భంగా యువతి తల్లిదండ్రులు కన్నం పూలమ్మ ముత్తయ్యలు మాట్లాడుతూ మా ముద్దునూరు గ్రామానికి చెందిన బండి నాగరాజు అనే కార్ డ్రైవర్ హైదరాబాదులో ఉంటూ తమ కూతురు అరుణకు మాయ మాటలు చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి మరో యువతీతో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు.
వారి ప్రేమ వివాహారంపై నాగరాజు తల్లిదండ్రులు బండి లక్ష్మి నర్సయ్యలను కొందరు పెద్దమనుషుల సమక్షంలో నిలదీయగా ప్రేమించిన విషయం వాస్తవమే మా కుమారుడిని పిలిపించి మాట్లాడతామని నమ్మ పలికి మరొక యువతతో వారి కొడుకుకు వివాహం చేశారని తెలియజేశారు.
హైదరాబాదులో ఉన్నప్పుడు ప్రేమ పేరుతో తన కూతురు వద్ద ఉన్న రూపాయలు 50 వేలకు పైబడి తీసుకొని పలు విధాలుగా వేధింపులకు గురిచేస్తూ ఫలుదపాలుగా విచక్షణ రహితంగా దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
మనస్థాపానికి గురైన తమ కూతురు అరుణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స నిమిత్తం నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు తల్లిదండ్రులు బండి లక్ష్మి నర్సయ్యలు ఆరోపించారు.
ప్రేమ పేరుతో మోసం చేసిన నాగరాజుపై నర్సంపేట ఏసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే దుగ్గొండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు.
ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి కులం పేరుతో దూషిస్తూ తన కూతుర్ని మానసికంగా వేధించి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన నాగరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు తల్లిదండ్రులు పోలీసుల వేడుకున్నారు.
దుగ్గొండి ఎస్ఐ నీలోజు వెంకటేశ్వర్లు వివరణ కోరగా నర్సంపేట ఏసిపి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఉందని తెలిపారు.
దుగ్గొండి పోలీస్ స్టేషన్ లో బాదితుల ఫిర్యాదు చేయలేదని ఎస్సై తెలిపారు.