
“Che Guevara Ideals Remembered in Bhupalpalli”
చే గెవారా ఆశయాలను కొనసాగించాలి
కామ్రేడ్ చంద్రగిరి శంకర్
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని చే గువేరా వర్ధంతి సందర్భంగా ఏఐఎఫ్ టీయు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ చే గెవారా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు. రాజకీయ నాయకుడు. ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేకించాడు. క్యూబా ప్రభుత్వం లో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడు.
అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14 న ఒక మధ్య తరగతి కుటుంబంలో చే జన్మించాడు.
1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం
నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు చేగువేరా భావించాడు ఎన్నో పోరాటాలు చేసిన అతడు 39 సంవత్సరాలు అనేక ప్రజా పోరాటాలు చేసినారు
1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియా అనే పట్టణంలో జన్మించిన చెగువేరాను..
1967 అక్టోబర్ 9న బొలీవియాలోని లా హిగువేరాలో అమెరికా సీఐఏకు బలైపోయారు. ఆయన్ని ఓ పాఠశాలలో బంధించి కాల్చి చంపారు. ఓ మహా ప్రస్థానానికి ముగింపు పలికారు. కావున చేగువేరా ఆశయాలను కొనసాగించాలి