చవువే అన్నిటినీ మూలం. ఎంఈఓ బస్వరాజ్.
జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ ము ,స్థానిక జహీరాబాద్ పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల లో జయ విజ్ఞాన భారతి సొసైటీ ఆధ్వర్యంలో ప్రముఖ కవి,రచయిత డా.పెద్దగొల్ల నారాయణ జహీరాబాద్ పట్టణంలో ని అన్ని డిగ్రీ కళాశాల లో విద్యార్థుల ఉన్నతి కోసం ,ఉత్తమ విలువలకోసం మొదటి రోజు ఆచార్య డిగ్రీ కళాశాలలో ట్రైన్ థ మైండ్ ఫర్ బ్రెట్ ఫ్యూచర్ ప్రోగ్రాం ను నిర్వహించారు. కళాశాల లో చదువుకుంటున్న విద్యార్థులకు వ్యాస రచన ,ఉపన్యాస, చిత్ర లేఖన పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మొదటి బహుమతి గోల్డ్ మెడల్, ద్వితీయ ,తృతీయ బహుమతులుగా సిల్వర్ మెడల్ లను ప్రదానం చేశారు.విద్యార్తులనుద్దేశించి ముఖ్య అతిధిగా పాల్గొన్న జహీరాబాద్ మండల విద్యాధికారి బస్వరాజ్ మాట్లాడుతూ చదువు తో పాటు ఉన్నత విలువల తో విద్యార్థులు బాగా చదువు కొని జీవితం లో ఎదగాలని, కేవలం చిన్న చిన్న ఉద్యోగం తో సరి పెట్టుకోకుంటా గ్రూప్స్ ,మరియు సివిల్స్ లాంటి ఉన్నత మైన ఉద్యోగాలు సాధించాలని కొనియాడారు. వశిష్ఠ డిగ్రీ కళాశాల ఉపన్యాసకులు శ్రీనివాస్ మాట్లాడుతూ క్రమ శిక్షణ తో విద్యార్థులు ఏదైనా సాధించ వచ్చు అని,అదే విద్యార్థులు డిగ్రీ కె పరిమితం కాకుండా వి భిన్న కోర్స్ లు చేసి ఉన్నత ఉపాధి,ఉద్యోగులుగా స్థిరపడలని తెలియజేసారు.జయ విజ్ఞాన భారతి చైర్మన్ డా.పెద్దగొల్ల నారాయణ మాట్లాడుతూ జహీరాబాద్ ప్రాంతం లో చదువు కుంటున్న విద్యార్థులు బాగా చదివి సివిల్స్ లో మంచి ర్యాంకు లు సాధించాలని, విద్యార్థులు తప్పకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ ,మనేజ్మెంట్ స్కిల్స్, చక్కని చేతి రాతను, కంప్యూటర్ కోర్సు లను నేర్చుకోవాలని చూచించారు. సీనియర్ జర్నలిస్ట్ షకీల్ మాట్లాడుతూ చదువే అన్నింటికీ మూలం అని, చదువు బాగా చదువుకుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని తెలియజేసారు. ముఖ్య అతిధులకు శాలువా ,మెమోంటో తో సన్మానం చేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల విద్యాధికారి బస్వరాజ్,ఆచార్య కళాశాల ప్రిన్సిపాల్ డా.హరికుమార్,వశిష్ఠ డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఉప్పరి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ షకీల్, డా.పెద్దగొల్ల నారాయణ, సంస్థ డైరెక్టర్ లు డోరే బాలకృష్ణ, మొహమ్మద్ ఫహిమ్, నితీష్ రెడ్డి,మిథున్ నాయక్,మొహమ్మద్ ఖయూమ్, విశాల్,ఆచార్య డిగ్రీ కళాశాల అధ్యాపకులు నందకుమార్ గౌడ్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.