అభివృద్ధిలో దూసుకుపోతున్న చర్లపల్లి డివిజన్

సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే,కార్పొరేటర్

కాప్రా నేటి ధాత్రి జనవరి 10

చర్లపల్లి డివిజన్ లోని కుషాయిగూడ మరియు సెయింట్ జోసెఫ్ కాలనీలో 1250 మీటర్ల సిసి రోడ్లను స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ,స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ప్రారంభించారు.పెండింగ్ లో ఉన్న అరకొర పనులను కూడా వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మహేష్ గౌడ్ ,జిహెచ్ఎంసి ఆధికారులు,సిబ్బంది,డివిజన్ నాయకులు,కాలనీల అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *