చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామ శివారులోని మలుపు వద్ద ఏపీ 15 బి ఈ 8718 నెంబరు గల ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో దేవా మల్లేష్, దేవా స్వామి అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఆ దారిలో వెళ్తున్న వాహనదారులు వీరిని గమనించి అంబులెన్స్ కు ఫోన్ చేయడంతో సకాలంలో వారిని వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి వైద్యుల వివరాలు తెలుసుకొని బైకును అదుపులోకి తీసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది