ఈనెల 19న చలో హైదరాబాద్ విజయవంతం చెయ్యాలి
అంబాల చంద్రమౌళి మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి:
ఈనెల 19న హైదరాబాద్ నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాల్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సన్మాన సభ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకుడు అంబాల చంద్రమౌళి మాదిగ తెలిపారు జిల్లాలోని ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అంబాల చంద్రమౌళి మాదిగ పిలుపునిచ్చారు సోమవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా ఈనెల 19న విహెచ్ పిఎస్ సంఘo ఆధ్వర్యంలో వికలాంగులు పెద్ద ఎత్తున సన్మానం చేయబోతున్నారని తమకు సమాజంలో ప్రత్యేక గుర్తింపును తీసుకొని వచ్చి అనేక హక్కులను సాధించి పెట్టిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పట్ల కృతజ్ఞత భావంతో వికలాంగులు ఈ సన్మాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వారికి చేయూతనందించాల్సిన బాధ్యత ఎమ్మార్పీఎస్ అన్ని అనుబంధ సంఘాల నాయకుల మీద ఉంది కనుక మనలో జిల్లా మండల స్థాయిలో ఎదిగిన నాయకులు నాయకురాలు తక్షణమే తమ సొంత గ్రామాలలోని వికలాంగులను సమన్వయం చేసి వాహనం ఏర్పాటు చేసి వారిని పెద్ద ఎత్తున జాగ్రత్తగా హైదరాబాద్ కు తరలించాలని వివిధ మండలాలలో ఇన్చార్జులుగా కొనసాగుతున్న వారు ఫోన్లో ద్వారా తమ సొంత గ్రామాలలోని వికలాంగులను మాట్లాడి హైదరాబాద్కు తరలించే విధంగా అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాలని మన అధినేత మంద కృష్ణ మాదిగ మీద ఎంతో అభిమానంతో వికలాంగులు చేస్తున్న సన్మాన సభను విజయవంతం చేయాలని చంద్రమౌళి మాదిగ పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ
నియోజకవర్గ ఇన్చార్జి అంతడుపుల సురేష్ మాదిగ
బట్టువిజయకుమార్
మేకల రమేష్ మాదిగ
ఎంవైఎస్ జిల్లా అధ్యక్షులు
మంద తిరుపతి
ఎర్ర భద్రయ్య మాదిగ
సిరిపంగ చంటి మాదిగ
ఓనపకల కుమార్ మాదిగ
అంతడుపుల చందర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు