కోటగుళ్లలో చెల్పూర్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి పూజలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో చెల్పూర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గండ్ర సత్యనారాయణరెడ్డి గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి అర్చకులు నాగరాజు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.