తవక్కల్ విద్యార్థినిలను అభినందించిన చైర్మన్ అబ్ధుల్ అజీజ్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణం లోని తవక్కల్ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు ఆశ్లేష, దీక్షిత,రచన,ఐశ్వర్య, శ్రీవైష్ణవి లు మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక పోటీలలో జాతీయస్థాయిలో మూడవ స్థానం సాధించారని, భారతదేశ గౌరవ పురస్కారానికి ఎంపికయ్యారని, ఈ నెల 8న హైదరాబాద్ లో వీరికి భారతదేశ గౌరవ పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాలను సైతం అందజేశారని తవక్కల్ విద్యా సంస్థల ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. సోమవారం రామకృష్ణాపూర్ పట్టణం లోని తవక్కల్ పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులను వారి తల్లిదండ్రులను తవక్కల్ విద్యా సంస్థల చైర్మైన్ అబ్దుల్ అజీజ్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ… చదువు తో పాటు సాంస్కృతిక రంగాలలో రాణిస్తున్న విద్యార్థుల కృషిని వారి తల్లితండ్రుల ప్రోత్సహాన్ని సైతం కొనియాడుతున్నానని అన్నారు. తమ పాఠశాల విద్యార్థులకు ఇంత చక్కటి తోడ్పాటునందించి వారి విజయానికి కృషి చేసిన సమీక్ష ఆర్ట్స్ అకాడమీ వారి కృషిని కూడా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, ఉపాధ్యాయబృందం విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *