జల జీవన్ మిషన్ లో భాగంగా కేంద్ర బృందం పర్యటన

నిజాంపేట, నేటి ధాత్రి

మెదక్ జిల్లా నిజాంపేట మండలం రజాక్ పల్లి గ్రామంలో కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. జల జీవన్ మిషన్ లో భాగంగా గ్రామాల్లో పర్యటించిన అధికారులు ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న మిషన్ భగీరథ నీటి సరఫరా విషయాలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీటి నాణ్యతను వారు పరిశీలించారు. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ భగీరథ నీటిని ఇంటింటికి సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బిక్షపతి తో పాటు కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *