Dalit Rights Ignored: Ashok
దళితుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు-అశోక్
కరీంనగర్, నేటిధాత్రి:
దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ జగిత్యాల జిల్లా రెండో మహాసభలో ఏఐడిఆర్ఎమ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా అట్టడుగు వర్గాలైన దళితులు అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు నేటికీ దళితులకు దరిచేరడం లేదు. భారత రాజ్యాంగం ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించడం జరిగినది, తరతరాలుగా అణిచివేత, అంటరానితనం, వివక్ష, దోపిడి పీడనాల కింద నలిగిపోతున్న వర్గాలు దళితులు అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా దళిత సామాజిక న్యాయం కోసం విద్య, వైద్య, వ్యాపారాలని రద్దు చేయాలని, ఉపాధి అవకాశాల కోశం దేశ సంపదలో దళితుల వాటా కోసం సమర శంఖం పూరించడానికి 2026 ఏప్రిల్ 17,18న వరంగల్ లో జరిగే రాష్ట్ర రెండో మహాసభలకు జగిత్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రతినిధులు హాజరుకావాలని కోరారు. అనంతరం డిహెచ్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా ఆర్థికంగా రాజకీయ సామాజిక హక్కుల పరిరక్షణ కోసం, కుల వివక్షత కుల నిర్మూలన కోసం ఎస్సీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలని నిధులు కేటాయించాలని స్వయం ఉపాధి పథకాలను అమలు చేయాలని కోరారు. ఈసందర్బంగా రెండో మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా మునుగూరి హనుమంతు, ప్రధాన కార్యదర్శిగా ఇరుగురాల భూమేశ్వర్, ఉపాధ్యక్షులుగా సురేష్, సహాయ కార్యదర్శిగా ప్రవీణ్, కోశాధికారిగా రాజయ్య, చిలుముల మైసయ్య, జుట్టు శేఖర్, మచ్చ అంజయ్య, గుండు నారాయణ, మునుగురి గంగనర్సయ్య, తాటికొండ నరేందర్, మోదుగుపెల్లి మల్లయ్య, బొమ్మన పురుషోత్తం, మల్లార్పు నర్షయ్యలను ఎన్నుకోవడం జరిగింది. మరో పదమూడు మందిని కార్యవర్గ కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
