పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసిన పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి
రాష్ట్రంలో సమగ్ర కుల సర్వేకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల ఉప్పల్ కార్పొరేటర్ మందముల పరమేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అసెంబ్లీలో ఆమోదం తెలిపిందన్నారు.
రాష్ట్రంలోని అన్ని కులాల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఫూలే విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమానికి పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ లో ఫూలే విగ్రహానికి పరమేశ్వర్ రెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చెయ్యడం జరిగింది.
కార్యక్రమంలో రాజు గౌడ్ ,బెల్లం సీను , కాప్రా సాయి ,నెమలి అనిల్ ,కిట్టు ,సుదర్శన్ ,బాలరాజ్ గౌడ్ ,మనోహర్ ,జమిలా బేగం ,ఫసీదుద్దిన్ ,జోషి ,మల్లు ,సతీష్ ,మున్ని బేగం ,శ్రీకాంత్ రెడ్డి ,శైలజ ,లావణ్య ,ఇంతియాజ్ బేగం ,ఉపేందర్ రెడ్డి ,శేఖర్ ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు .