ఘనంగా భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు.

చిట్యాల నేటి ధాత్రి ;

షాహిద్ భగత్ సింగ్ 117 వ జయంతి వేడుకలను చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ 1907 సెప్టెంబర్ 28వ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని భంగా గ్రామంలో భగత్ సింగ్ గారు జన్మించారు యుక్త వయసులోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు 1926 సంవత్సరంలో నౌ జవాన్ భారత్ సభను స్థాపించి ఇంకివిలాబ్ జిందాబాద్ అనే నినాదంతో యువకులలో విప్లవ భావాలను రేకెత్తించాడు. జెపి స్కండర్ అనే ఆంగ్లేయ పోలీస్ ఆఫీసరును కాల్చి చంపాడు అందుకు జైలుకు వెళ్లాడు ఈ విధంగా తన జీవితాన్ని స్వాతంత్రం కోసం అర్పించాడు ఈనాటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు కాబట్టి మీరు భగత్ సింగ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేశ సేవకు సమాజ సేవకు అంకితమై తల్లిదండ్రులకు సమాజానికి పాఠశాలకు పేరుతోలని కోరారు ఈ సమావేశంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!