ఘనంగా జాతీయ వినియోగదారుల వారోత్సవాలు

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట పట్టణంలోని వల్లబ్ నగర్ లో గల తెలంగాణా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షనల్ స్కూల్, మరియు గిరిజన బాలికల వసతి గృహంలో జాతీయ వినియోగదారుల వారోత్సవాలు పాఠశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో వాటి పట్ల బాలబాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ముఖ్యఅతిధిగా పాల్గొన్న వినియోగదారుల మండలి (క్యాట్కో) రాష్ట్ర ఉపాధ్యక్షులు,రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఠాకూర్ రతన్ సింగ్ మాట్లాడుతూ సమాజంలో వినియోగదారుల హక్కుల రక్షణ కొరకు వినియోగదారుల సంఘాలు కృషి చేస్తాయని తెలియజేశారు.వస్తువులలో కల్తీ, నకిలీ,అసౌకర్యం జరిగినప్పుడు రక్షణగా వినియోగదారుల రక్షణ చట్టం భరోసా ఇస్తుందన్నారు.ఈ బిల్ ద్వారా జరిగిన నష్టానికి,మోసానికి కన్స్యూమర్ కోర్ట్ లో పైసా ఖర్చు లేకుండా నష్ట పరిహారం 90 రోజులలో పొందవచ్చునని పేర్కొన్నారు.జిల్లా అధ్యక్షులు గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ వినియోగదారుల చట్టం లో ఉన్న ఆరు హక్కుల పట్ల వివరించారు.సమస్యలు వస్తే టోల్ ఫ్రీ నెంబర్ 180042500333 కు ఫోను చేసి న్యాయం పొందవచ్చునని తెలిపారు.అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వినియోగదారుల విజిలెన్స్ కమిటీ మెంబెర్ నాగేల్లి సారంగం గౌడ్, వినియోగదారుల ఖానాపురం మండల అధ్యక్షులు కె.లక్ష్మయ్య, స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్, ఉపాధ్యాయులు శ్రీధర్ రావు, శివరామ క్రిష్ణ, గర్ల్స్ హాస్టల్ వార్డెన్ రాధిక, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!