సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం..
జహీరాబాద్. నేటి ధాత్రి:
న్యాల్ కల్ మండలంలోని మల్గి గ్రామంలో శుక్రవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరు జరిగిన సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.మల్గి శివారులోని మల్లన్న స్వామి ఆలయానికై సీసీ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేయడం జరిగింది.ఇట్టి రోడ్డును డాక్టర్ రాజశేఖర్ శివ చారి స్వామీజీ పూజలు చేసి పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ మల్గి గ్రామ సర్పంచ్,మల్లన్న స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు మారుతి,మాజీ ఎంపీటీసీ శివానంద నాయకులు సిద్ధారెడ్డి, కుశాల్ పాటిల్ ,అర్జున్,వైద్యనాథ్,బీరప్ప, తుకారం,మారుతి,హనుమంత్,నగేష్ తదితరులు పాల్గొన్నారు.