నూతన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డిఓ.

— నూతన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డిఓ

నిజాంపేట, నేటి ధాత్రి

 

 

మండల పరిధిలోని కే. వెంకటాపూర్ నూతన పోలింగ్ కేంద్రాన్ని మెదక్ ఆర్డీవో రమాదేవి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో 1200 కు పైగా ఓటర్లు ఉన్నారని స్థానిక అధికారుల నివేదిక మేరకు నూతన పోలింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇమద్ లు ఉన్నారు.

పెట్రోల్ బంక్ సీజ్ చేసిన అధికారులు.

పెట్రోల్ బంక్ సీజ్ చేసిన అధికారులు

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామ పరిధిలోని కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారిని ఆనుకొని ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్న జియో పెట్రోల్ బంకును గురువారం అధికారులు సీజ్ చేశారు. టిజిబిపాస్ అనుమతి లేకుండా చాలా రోజుల నుండి బంకు నిర్మాణం జరుగుతుండగా నిర్మాణాన్ని ఆపాలని గ్రామపంచాయతీ మూడు సార్లు ఇచ్చిన నోటీసులను బంకు యజమానులు బేఖాతరు చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఎంపీఓ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ముంజంపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి పద్మలత పంచాయితీ సిబ్బందితో బంకును సీజ్ చేయించారు.

నోట్ బుక్స్ పంపిణీ చేసిన మాజీ ఎంపీపీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

నోట్ బుక్స్ పంపిణీ చేసిన మాజీ ఎంపీపీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

రామడుగు నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం గ్రామంలో శుక్రవారం రోజున ప్రభుత్వ పాఠశాల ప్రారంభ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి గాజుల శ్రీనివాస్ పదివేలు విలువ గల నోట్ బుక్స్ అందజేశారు. అట్టి నోట్ బుక్స్ పంపిణీ చేసిన రామడుగు మాజీ ఎంపీపీ, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ ముఖ్యఅతిథిగా హాజరై నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం మాజీ ఎంపీపీ, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ మాట్లాడుతూ మాగ్రామ ప్రభుత్వ పాఠశాలకు గత సంవత్సరం నోట్ పుస్తకాలతో పాటు వంట పాత్రలు అందజేశారు. మాపాఠశాలకు ఇంత సేవ చేస్తున్నందుకు మాగ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గుంట ఓంప్రకాష్, గుత్తూరి శ్రీనివాస్, పొన్నాల అజయ్, రవీందర్, లక్ష్మయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చిన్నారి ని ఆశీర్వదించిన నాగుర్ల.

చిన్నారి ని ఆశీర్వదించిన నాగుర్ల
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ సాయి ఫంక్షన్ హాల్లో రంగాపురం మాజీ సర్పంచ్ కత్తి రాజయ్య గౌడ్ – శ్రీలత గార్ల మనవరాలు, కత్తి అఖిల రామకృష్ణ గార్ల కూతురు అద్వైత మొదటి పుట్టినరోజు కార్యక్రమానికి హాజరై చిన్నారి ని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు .. ఆశీర్వదించారు. వారి తో పాటు బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తిరుపతిరావు, మాజీ మార్కెట్ చైర్మన్ కొడారి రమేష్, నాయకులు రవీందర్ రావు, రాజేశ్వరరావు,రాజయ్య, భాస్కర్,దానయ్య, నరేష్,ప్రభాకర్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం…

అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం…

వీణవంక సెక్టర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

 

 

 

వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో హుజురాబాద్ ప్రాజెక్టు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలవేసి పూజ కార్యక్రమం నిర్వహిస్తూ సామూహిక అక్షరాభ్యాసాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెక్టర్ సూపర్వైజర్ జి రమాదేవి హాజరై మాట్లాడుతూ, ప్రీ ప్రైమరీ పిల్లలకు అక్షరాభ్యాసం తో చదువు నేర్చుకోవడం ఆరంభం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేసినందని, అంగన్వాడి కేంద్రాలలో ప్రీ ప్రైమరీ పిల్లలకు ఆంగ్ల విద్యను అందించడంలో అంగన్వాడీ టీచర్లు సంసిద్ధతతో ఉన్నారని, అంగన్వాడీ కేంద్రాలు ఆలనా- పాలనా కేంద్రాలుగా పేరుగాంచాయని అన్నారు. అలాగే వీణవంక మండల కేంద్రంలోని ఏరియా సమీపంలో ఉన్న ప్రైమరీ స్కూల్లో సామూహిక అక్షరాభ్యాసాన్ని ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ప్రభుత్వ టీచర్లు, అంగన్వాడి టీచర్లు, తల్లులు, ప్రీ ప్రైమరీ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పనులు శరవేగం.

ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పనులు శరవేగం

 ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన

★ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్

★ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో శాంతినగర్ మరియు డ్రైవర్ కాలనీ లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మరియు మాజీ మంత్రి డా౹౹చంద్రశేఖర్ మాట్లాడుతూ అరుహులైన ఇల్లు లేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి 5 ఐదు లక్షల రూపాయలు ఇవ్వనుంది.ఈ పథకం పేద ప్రజలకు నీడగా నిలవనుంది అని వారు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ ఛైర్మెన్ గిరిధర్ రెడ్డి,మాజీ ఇండస్ట్రియల్ ఛైర్మెన్ తన్వీర్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు,ఏయంసి.డైరెక్టర్ జఫ్ఫార్,మాజీ ఎంపీటీసీ అశోక్,కాంగ్రెస్ నాయకులు మంకల్ శుభాష్,శుక్లవర్ధన్ రెడ్డి,ఖాజా,తదితరులు పాల్గొన్నారు.

కేజీబివిలో అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం.

కేజీబివిలో అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం.

స్పెషల్ ఆఫీసర్, ఎంఈఓ ప్రకటన..

నర్సంపేట నేటిధాత్రి:

దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ (ఎంఎల్టి ) గ్రూపులో
తాత్కాలిక పధతిలో విద్యా బోధన చేయడానికి మహిళా విద్యాపకుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు,పాఠశాల ప్రత్యేక అధికారిని మంజుల ఒక సంయుక్త ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మంజుల మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల కళాశాలలో టిజిసిఆర్టి ఇంగ్లీష్ ఫస్ట్ ఒకటి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఒకటి లకు గాను దరఖాస్తు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. ఇంగ్లీష్ పీజీసిఆర్టి పోస్ట్ కు గాను అభ్యర్థి విద్య అర్హత ఎంఏ ఇంగ్లీష్ బీఈడీ అర్హత ఉండాలి, ఎంఎల్టి పోస్ట్ కు గాను
ఎండి పాతాలోజి, బీఫార్మసీ, ఎంఎస్సీ జెనెటిక్స్, ఎంబిబిఎస్, బిహెచ్ఎంఎస్, పిజిడి క్లినికల్ బయో కెమిస్ట్రీ అర్హతలు గల అభ్యర్థులు వారి వారి దరఖాస్తులను పాఠశాలకు నేరుగా వచ్చి ఈనెల 14 నుండి 18 తారీకు లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె తెలియజేశారు.

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య.

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య

జెఇఇ అడ్వాన్స్డ్ మైన్స్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్య అందుతున్నదని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ అరిగకూటి శ్రీనివాస రెడ్డి, ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ ఖాదిర్ షరీఫ్ లు అన్నారు. జెఇఇ అడ్వాన్స్డ్ మైన్స్ లో రాష్ట్ర స్థాయిలో 1446 ర్యాంక్ సాధించిన బానోత్ సోమన్న, డైట్ సెట్ లో ప్రతిభ కనబరిచిన పరమేశ్వరి ని ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌సౌకర్యం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా చదువవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీను, కవిరాజు, రఘురాం, నాగేశ్వరరావు, శ్రీనివాస్, సుధాకర్, మహేందర్, రామ్మూర్తి, బాబు, యాకన్న, సతీష్, అనిల్ కుమార్, సుభాష్ అధ్యాపకేతర బృందం సైదా, ప్రదీప్, లక్ష్మణ్, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం చేసిన.

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారురాలు

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

గూడు లేని తమకు సొంత ఇంటి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు లక్షలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మురళి నాయక్ చిత్రపటాలకు కేసముద్రం మండలం ఉప్పరపల్లి లో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారురాలు పాల్వాయి మౌనిక పాలాభిషేకం చేశారు. కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో పాల్వాయి మౌనిక,మురళి దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం తమకు ఇల్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మురళి నాయక్ చిత్రపటాలకు ఆ దంపతులు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఉప్పరపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు నూకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి నిర్మాణం కోసం ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లకు రూ.6లక్షలు, ఇతరులకు రూ.5లక్షల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఆర్థిక సహాయం అందిస్తారని తెలిపారు. ఉప్పరపల్లి గ్రామంలో 39 ఇల్లు మంజూరు కాగా లబ్దిదారులందరు ఇంటి నిర్మాణాలు ప్రారంభించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నూకల వెంకటేశ్వర్లు, వివిధ పార్టీల కార్యకర్తలు కోమాకుల రమేష్, తండ సంపత్, ఎట్రోజు సత్యనారాయణచారి, పసుల వెంకన్న, పోలేపాక ఉప్పలయ్య, మంద సాయిబాబా, మంద విక్రమ్, పందుల నాగేంద్రబాబు, పందుల అజిత్ తదితరులు పాల్గొన్నారు.

మా సొంత ఇంటి కలలు నెరవేరుతున్నాయి.

మా సొంత ఇంటి కలలు నెరవేరుతున్నాయి…

ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం… మహమూద్ పట్నం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు

కేసముద్రం నేటి ధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మహిళలకు అలాగే ప్రతి పేదవానికి లబ్ధి చెందేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిజమైన లబ్ధిదారులకే చెందేలా ఎంతో పటిష్టంగా అధికారులచే నిజమైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా కేసముద్రం మండలంలోని మహమూద్ పట్నం గ్రామంలో ఇసం పెళ్లి సారమ్మ వైఫ్ ఆఫ్ మల్లేష్, సొంత ఇంటి కలను నిజం చేస్తూ వారి ఇండ్ల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేసి ముగ్గు పోయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు మిట్ట గడుపుల యాకు తొగరి నవీన్ మాజీ ఎంపిటిసి ముంజల శ్రీనివాస్ కాసు రాజేంద్ర చారి చిలువేరు శివాజీ పోలు శ్రీనివాస్ మొదలగువారు పాల్గొన్నారు.

టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా.

టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా నాగేంద్ర

పరకాల నేటిధాత్రి

 

 

 

టిడబ్ల్యూజేఎఫ్ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా గూడెల్లి నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన జిల్లా మహాసభల్లో నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రకటించారు.ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర జిల్లా నాయకులకు నాగేంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు.జర్నలిస్టు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ టిడబ్ల్యూజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.ఈ సందర్భంగా పలువురు నాగేంద్రకు అభినందనలు తెలియజేశారు.

3 మండలాలకు నిలిచిపోనున్న మిషన్ భగీరథ నీరు.

3 మండలాలకు నిలిచిపోనున్న మిషన్ భగీరథ నీరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హుగ్గేలి చౌరస్తా వద్దా NIMZ రోడ్డు విస్తరణ లో మిషన్ భగీరథ పైపు లైన్ రోడ్డు కిందకి పోతున్నందున కొత్త పైప్‌లైన్ వేయడం జరుగుతుంది.ఇందుచేత 2 రోజుల పాటు జహీరాబాద్ మున్సిపాలిటీ, జహీరాబాద్, మొగుడంపల్లి,కోహీర్ మండలంలో మరియు ఝరాసంగం లో 10 గ్రామాలు మిషన్ భగీరథ నీరు నిపివేయడం జరుగుతుంది.

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన.

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మృతులకు సిపిఐ సంతాపం

మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి-సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

 

అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన ప్రజలందరినీ తీవ్రంగా కలిచివేసిందని, విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారందరికీ సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి వైపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుందని,మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్నిఒక ప్రకటనలో కోరారు.

ఈసందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్‌లోని గాట్విక్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ ఏడువందల ఎనబై ఏడు డ్రీమ్‌లైనర్ విమానం ఏఐ-నూటడెభైఒకటి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడం, సిబ్బందితో సహా రెండు వందల నలభై రెండు మందితో ప్రయాణిస్తున్న విమానం, విమానాశ్రయ సమీపంలో ఉన్న వైద్య కళాశాలలోకి దూసుకెళ్లి కూలిపోయిందని, విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు బిల్డింగ్ లో భోజనం చేస్తున్న డాక్టర్లు, వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా చనిపోవడం అత్యంత బాధాకరమనన్నారు. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిందని, సాంకేతిక కారణాలవల్ల ఈసంఘటన జరిగి ఉండవచ్చని, ఇంత పెద్ద ఘటన జరగడం భారతదేశాన్ని కాకుండా యావత్తు ప్రపంచాన్ని విషాదంలో ముంచిందని, భారత ప్రయాణికులతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని, విమాన ప్రయాణాలకు ముందు సాంకేతిక కారణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఈఘటనపై సమగ్రమైన దర్యాప్తు జరపాలని, మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని శ్రీనివాస్ కోరారు.

మహిళా స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ ను పరిశీలించిన.

మహిళా స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ ను పరిశీలించిన
జిల్లా వైద్య అధికారి డాక్టర్ రజిత

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత రాజన్న సిరిసిల్ల మరియు వేములవాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును మరియు లోని పిఎస్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, అంబేద్కర్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం ను తనిఖీ నిర్వహించి మహిళా స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ ను పరిశీలించినారు.

Health Officer Dr. Rajitha.

 

 

 

ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్ శానిటేషన్ మహిళ సిబ్బంది, స్వయం సహాయక మహిళా సిబ్బందిని ఉద్దేశించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ ఆరోగ్య రక్షణలో తన బాధ్యతగా క్యాన్సర్ సంబంధిత రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్ మరియు దీర్ఘకాల వ్యాధుల( మధుమేహం, రక్తపోటు) పై ప్రతి మహిళ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాల్సిందిగా అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణ, డిపిఓ రాజేందర్, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక ద్రుఢత్వం లభిస్తుంది.


క్రీడలతో మానసిక ఉల్లాసం శారీరక ద్రుఢత్వం లభిస్తుంది

ప్రతి మండలానికి ఒక క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

చందుర్తి నేటిధాత్రి:

క్రీడలతో మానసిక ఉల్లాసం,శారీరక ద్రుఢత్వం లభిస్తుందనీ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..శుక్రవారం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్వహించిన మూడపల్లి ప్రీమియం లీగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విలేజ్ టూ విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మొదటి విజేత తంగళ్ళపల్లి రెండో విజేత మూడ పల్లి గ్రామ క్రీడాకారులకు బహుమతులు అందజేశారు…

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందనీ తెలిపారు…మన ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు..గతంలో విద్యార్థి దశలో ఉన్న
సమయంలో కోర్టు లైన్ పోసే వాడినని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు..

ఎల్లపుడూ క్రీడాకారులకు తన వంతు సహాయ సహారాలు ఉంటాయని అన్నారు.. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డి పోటీలు జిల్లా పరిదిలో తన వంతు ప్రోత్సాహకం ఉంటుందన్నారు… రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాలకు పెద్ద పీట వేస్తన్నరని అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు…

క్రీడాకారులు జీవితంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని ఎదుర్కొనే ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు.. సిరిసిల్ల ప్రాంతంలో మంత్రుల చేతుల మీదుగా అనేక అభివ్రుద్ది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిoదన్నారు..

మన ప్రాంతంలో కోరుట్ల, సిరిసిల్ల,వేములవాడ ప్రాంతాల్లో క్రీడాకారులకు నూతన స్టేడియం లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.. ఇప్పటికే సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ తెప్ప వద్ద క్రీడా ప్రాంగణాన్ని చూడటం జరిగిందనీ తెలిపారు..గ్రామీణ ప్రాంతాల్లోనీ క్రీడాకారులను వేలికి తీయడానికి సీఎం కప్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపoటి రామస్వామి, మాజీ జెడ్పిటిసి నాగం కుమార్, సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కం మోహన్, నాయకులు. బద్దం తిరుమలరెడ్డి, ప్రసాద్, బాణాల రవీందర్ పుల్కల్ లచ్చయ్య, మేకల గణేష్ క్రీడాకారులు పాల్గొన్నారు.

టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు.

టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు.

నేటి ధాత్రి:

 

ఇటీవల నూతనంగా టిపిసిసి ఉపాధ్యక్షులుగా నియమితులైన నమిండ్ల శ్రీనివాస్ ను 14 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ అడుప మహేష్ ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. రానున్న రోజుల్లో అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ హనుమకొండ వర్కింగ్ ప్రెసిడెంట్ పులిచేరి రాధాకృష్ణ. ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు పస్తం శంకర్ ఏనుమాముల గ్రామ పార్టీ అధ్యక్షులు సౌరం చిన్ని. సుందరయ్య నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు. త్రికోవెల శీను. బాలాజీ నగర్ గ్రామ అధ్యక్షుడు కడెం కుమార్ ఎస్సార్ నగర్ యూత్ అధ్యక్షుడు పల్లకొండ చందు. సౌరం ప్రభాకర్ సౌరం అభిలాష్. కోగిల సుధాకర్. ఖల్నాయక్ కాశెట్టి కమలాకర్. సౌరం మాణిక్యం ఇందిరమ్మ కమిటీ మెంబర్ ఏకాబ్రాచారి. తిరుపతి.ఎండి సంధాని. ఎండి యూసుఫ్ సంగారబోయిన రాజు. ఎండి ఖాజా రేహాన్ ఖాన్. వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు.

బల్దియాను ప్రక్షాళన చేయండి…!

బల్దియాను ప్రక్షాళన చేయండి…!

నూతన మున్సిపల్ కమిషనర్ కు ప్రజల విన్నపం.

పేరుకుపోతున్న గ్రీవెన్స్ దరఖాస్తులు. వాటిని పరిష్కరించటంలో అధికారుల అలసత్వం.

మున్సిపల్ కార్యాలయంలోనే ముద్దులు పెట్టుకున్న ఉద్యోగులపై వారం గడిచిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ప్రధాన కార్యాలయంలో రాత్రి పది గంటలకు కూడా థంబ్ వేస్తున్న ఉద్యోగులు.

మున్సిపల్ ప్రధాన కార్యాలయం ముందు ప్రైవేట్ వ్యక్తి దర్జాగా ఆక్రమించిన చర్యలు తీసుకొని అధికారులు.

ఎక్కడ కట్టడం జరిగిన అక్కడ మున్సిపల్ సిబ్బంది ప్రత్యక్షం కావడం. ఎంతో కొంత ఇస్తే కానీ వదిలి పెట్టరు.

కమర్షియల్ కాంప్లెక్ నిర్మాణాలకు “మేయర్ ప్రత్యేక అనుమతి” ఉంటేనే ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

ఓ మహిళా కార్పొరేటర్ ఇంట్లో మున్సిపల్ సిబ్బంది పనులు?

కమీషనర్ లు వస్తున్నారు, పోతున్నారు కానీ సమస్యలు అలాగే ఉంటున్నాయి అని ప్రజల ఆవేదన.

నూతన కమిషనర్ తనదైన ముద్ర వేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

వరంగల్ నేటిధాత్రి.

 

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ ల బదిలీలో బాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు కరీంనగర్ నుండి బదిలీపై వచ్చి, శుక్రవారం నాడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నూతన కమిషనర్ చాహాత్ బాజ్ పేయి. నూతన కమిషనర్ కి బల్దియాను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని నగర ప్రజలు కోరుతున్నారు. కమీషనర్ లు మారుతున్నారు కానీ సమస్యలు అలాగే ఉంటున్నాయి అని ప్రజల ఆవేదన.

పెరుగుతున్న గ్రీవెన్స్ దరఖాస్తులు

నగర ప్రజలు వారి సమస్యల పట్ల గ్రీవెన్స్ లో దరఖాస్తులు ఇస్తున్నారు, వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రీవెన్స్ లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను గుర్తించి, పరిష్కరించే దిశగా కృషి చేయాల్సిన సంబంధిత అధికారులు అలసత్వం చేస్తున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రతి వారం గ్రీవెన్స్ లో పిర్యాదు చేసిన కూడా సమస్య పరిష్కారం కావట్లేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నూతన కమిషనర్ ప్రత్యేక చొరవ చూపాలని కోరుతున్నారు నగర ప్రజలు.

“మున్సిపాలిటీ ముద్దులాట” లకు నోటీసులు?

ప్రభుత్వ కార్యాలయంలో ముద్దులు పెట్టుకున్న ఇద్దరు ఉద్యోగులకు “సిడిఎంఏ” నుండి నోటీసులు అందినట్లు సమాచారం. వారిపై వారం రోజులు గడిచిన ఎలాంటి చర్యలు లేవని, ఇద్దరిని వేర్వేరు కార్యాలయాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారా? లేక ఇక్కడే కొనసాగిస్తారా? అనేది వేచి చూడాలి. తాము చేసిన తప్పుకు కొంచెం కూడా పశ్చాతాప్తం లేని “సదరు ఉద్యోగులు”? పైగా తాము చేసింది తప్పు కాదు అంటూ, తప్పును కప్పి పెడుతూ, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు అని రాజకీయ నాయకుల లాగా ఆరోపణలు చేయడం. మున్సిపల్ కార్యాలయంలో చెట్టాపట్టాల్ వేసుకొని తిరగడానికి అదేం పార్క్ కాదు, ప్రైవేట్ ప్లేస్ కాదు. పబ్లిక్ కార్యాలయం అనేది గుర్తు పెట్టుకోవాలి సదరు ఉద్యోగులు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు ఉంది వీళ్ళ ప్రవర్తన. కొన్ని రోజులుగా వీళ్లు కార్యాలయంలో చేసే పనులు చూసి, విసిగి వేసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మారని తీరు. “ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం” సినిమా లాగా మున్సిపల్ ఆఫీసులో “అన్నాచెల్లెళ్ల” బంధానికి కొత్త అర్థం చెబుతున్న కొందరు ఉద్యోగులు. గత శని, ఆదివారాలు సెలవు రోజులు లేకుంటే మున్సిపల్ కార్యాలయాల్లో ప్రేమ జంటలపై ప్రత్యేక డిబేట్లు కూడా ఉండేవేమో. మీకేమి కాదు మేమున్నాం అంటూ ఓ అధికారి, కొందరు రిపోర్టర్లు అభయ హస్తం ఇచ్చినట్లు వినికిడి? నూతన కమిషనర్ ఈ అంశంపై చర్యలు తీసుకుంటారా లేదా అని కొందరు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారి మీద చర్యలు తీసుకుంటేనే ఇంకోసారి ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటారు అనేది తోటి ఉద్యోగుల వాదన.

థంబ్ ఎప్పుడైనా వేస్తాం మా ఇష్టం

 

 

New Municipal Commissioner.

 

 

 

 

మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో రాత్రి 8 గంటల తరువాత స్టైల్ గా నిక్కర్ టీ షర్ట్ వేసుకుని రావడం మున్సిపల్ కార్యాలయంలో థంబ్ వేసి వెళ్తుంటారు కొందరు ఉద్యోగులు. అసలు ఎవరు వీళ్లు ఎక్కడ పని చేస్తున్నారు రాత్రి వేళ వచ్చి థంబ్ వేయడం ఏంటి.
మరి కొందరు మహిళా ఉద్యోగులు ఏకంగా కారులో వచ్చి, దర్జాగా సాయంత్రం 7 తరువాత థంబ్ వేయడం.
వీళ్లు ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు అనేది పర్యవేక్షణ చేసే నాథుడే లేడు. పట్టించుకునే అధికారి పర్వాలేదు అంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, వారి వృతి రీత్యా ఉదయాన్నే ప్రధాన కార్యాలయంకు వచ్చి హాజరు వేసి, కొందరు బయటకు వెళ్లి నగరంలో పనిచేస్తూ, సాయంత్రం ఆరు గంటల లోపు ఆఫీసుకు వచ్చి హాజరు వేసి ఇంటికి వెళ్ళడం మనం సామాన్యంగా చూస్తాం.. కానీ ఇక్కడ వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లడం సహజం. సాయంత్రం వేళ థంబ్ వేయడానికి రాత్రి పది గంటలకు మున్సిపల్ కార్యాలయంకు వచ్చి వేయడం జరుగుతుంది అదేందో మరి అర్థం కావడం లేదు అని అంటున్నారు కొందరు ఉద్యోగులు. పని వేళలు ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు అనుకున్న కానీ వీరు మాత్రం పని చేస్తున్నారో లేదో తెలియదు. రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు మున్సిపాలిటీ ఉద్యోగులు థంబ్ వేయడంపై దృష్టి సారించాలని అంటున్నారు కొందరు ఉద్యోగులు.

ప్రధాన కార్యాలయం ముందు ప్రైవేట్ వ్యక్తి కబ్జా?

మున్సిపల్ ప్రధాన కార్యాలయం గేటు ముందు ప్రైవేట్ వ్యక్తి దర్జాగా ఆక్రమించుకొని పనులు చేయడం జరుగుతుంది. మున్సిపల్ స్థలాన్ని ఎవరు లీజుకు ఇచ్చారు ఎన్ని యేండ్ల పాటు ఇచ్చారు? అనేది అధికారులకే తెలియాలి. ప్రధాన కార్యాలయం గేట్ ముందు వినాయక విగ్రహాల తయారీకి సంబంధించిన వాటిని గేట్ ముందే పెట్టడం, రోడ్డు మీద పనులు చేస్తూ మున్సిపల్ ప్రధాన కార్యాలయం ముందు ఆగం ఆగం చేస్తున్న పట్టించుకొని అధికారులు.

బల్దియాలో సమస్యలు అనేకం. వాటిని అధిగమించి ప్రజల మన్ననలు పొందాలని ఆశిస్తూ. నూతన కమిషనర్ తనదైన ముద్ర వేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

 

 

గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా రావడం చాలా ఆనందంగా ఉంది. చాహాత్ బాజ్ పేయి.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నూతన కమీషనర్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చేశాను. అంతకంటే పెద్ద అయినా గ్రేటర్ వరంగల్ కు కమిషనర్ గా రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు మంచి అవకాశంగా భావిస్తున్నాను అని తెలిపారు.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్

వనపర్తి నేటిధాత్రి:

కొత్తకోట.మండల కేంద్రంలో 5 కోట్ల 75 లక్షలతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజలో కార్యక్రమంలో జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కొత్తకోట మండల కేంద్రంలో ప్రజల అవసరాల నిమిత్తంఆసుపత్రిని నిర్మించలేక పోయిందని అన్నారు ఎన్నికల తరుణంలో హడావుడిగా హాస్పిటల్ నిర్మాణ భూమి పూజ పేరుతో హంగామా చేశారని ఎమ్మెల్యే అన్నారు
కొత్తకోట లో గతంలో కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన ఆరుపడకల ఆసుపత్రిలోనే ఇప్పటికీ ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయనిఅన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామనిఅన్నారు హాస్పటల్ నిర్మాణాన్ని పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే జి మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు.

డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన.

డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన దోస్త్ మూడవ విడత అడ్మిషన్ ల ప్రక్రియ

కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సంతోష్ కుమార్

పరకాల నేటిధాత్రి

 

 

పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్)తెలంగాణ మూడో విడత అడ్మిషన్లు ప్రక్రియ 13వ తేదీ నుండి ప్రారంభమైందని అలాగే రెండో విడత అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రికార్డింగ్ చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ మేతి సంతోష్ కుమార్ తెలిపారు.దోస్త్ ప్రక్రియలో విద్యార్థులకు ఏమైనా సాంకేతిక ఇబ్బందులు కలిగితే కళాశాలకు వచ్చి సహాయక కేంద్రంలో పరిష్కారం పొందగలరని కళాశాల సహాయక కేంద్రంలో విద్యార్థులకు దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉచితంగా చేయబడుతుందని డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ మూడో విడత 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్ధారించడం జరిగిందని జూన్ 3వ తేదీ నుండి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని అయన తెలిపారు.

101 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు.

101 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు

మందమర్రి నేటి ధాత్రి:

మందమర్రి మండలం తిమ్మాపూర్ లోని జగదాంబేశ్వర ఆలయం లో వివేక్ వెంకటస్వామి కి మంత్రి పదవి రావడం తో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లించుకున్నా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అఖిలభారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానందం యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.

అలాగే మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఆలయంలో నూతన బోర్ వెల్ ను ప్రారంభించిన నాయకులు.

ఈ సందర్భంగా బండి సదానందం మాట్లాడుతూ.

ఆలయానికి బోర్ కావాలని అడగ్గానే మంత్రి స్పందించి వెంటనే మంజూరు చేశారు

రోడ్డు వేసి ఇబ్బందులు తొలగించారు.

ప్రజా సేవ కోసమే కాక కుటుంబం ఉంది.

మంత్రి పదవి వస్తె 101 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నాం అందుకే మొక్కలు చెల్లిస్తున్నాం

రెండు నెలల నుంచి చాలా మంది లీడర్లు వివేక్ వెంకటస్వామి పై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు

ఆరోపణలు చేస్తున్న వారి మెదడు తలలో ఉందో మోకాళ్ళో లో ఉంది అర్థం కావడం లేదు

తెలంగాణ ఉద్యమం కోసం బుల్లెట్ గాయాలు తిన్నది కాక వెంకటస్వామి కాదా

అదే సిద్ధాంతాన్ని కొడుకు వివేక్ వెంకటస్వామి పాటిస్తూ తెలంగాణ కోసం పార్లమెంట్ లో గళం విపిన నాయకులు వివేక్

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version