చే గువేరా ఆశయాలను కొనసాగించాలి.

చే గువేరా ఆశయాలను కొనసాగించాలి

భూపాలపల్లి నేటిధాత్రి:

జిల్లా కేంద్రంలో చేగువేరా జయంతి వేడుకలను కామ్రేడ్ చంద్రగిరి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
చే గువేరా జయంతిని ప్రతి సంవత్సరం జూన్ 14న జరుపుకుంటారు. ఈ రోజున అర్జెంటీనా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత గెరిల్లా నాయకుడైన ఎర్నెస్టో “చే” గువేరా జ్ఞాపకార్థం గుర్తు చేసుకుంటారు. ఆయన 1928 జూన్ 14న జన్మించారు.
చే గువేరా 33 ఏళ్ల వయస్సులో క్యూబా పరిశ్రమల శాఖ మంత్రి అయ్యారు. ఆ తర్వాత విప్లవాన్ని విస్తరించేందుకు ఆయన ఆ పదవిని వదులుకున్నారు.
అర్జెంటీనా రాజధాని బ్యూనెస్ అయిరెస్ కళాశాలలో డాక్టర్ చదువు పూర్తి చేసిన చే గువేరా సుఖంగా జీవితం గడపాలని అనుకున్నారు.
కానీ, తన చుట్టూ పెరుగుతున్న పేదరికం, జరుగుతున్న దోపిడీలను చూసి చలించిపోయి పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ తర్వాత దక్షిణ అమెరికాలో పెరుగుతున్న సమస్యలకు సాయుధ ఉద్యమమే మార్గమని నమ్మి ఉద్యమాలు నడిపించారు.
1955లో ఆయన తన 27 ఏళ్ల వయసులో క్యూబా విప్లవ నాయకుడైన ఫిడెల్ కాస్ట్రోతో కలిశారు. ఆ తర్వాతి క్రమంలో పలు ఉద్యమాలలో పాల్గొన్న ఫలితంగా యువ విప్లవకారుడిగా ఆయన పేరు నలు దిశలా మార్మోగింది. ఆయన అన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందజేయాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందజేయాలి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

 

గత సీజయన్ లో రైతు భరోసా ఇవ్వని రైతులకు వెంటనే రైతు బరోసా డబ్భులు ఇవ్వాలని బిఆర్ఎస్ నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ గతకాలం సీజన్ లో రైతులకు రైతు భరోసా కేవలం 3 ఎకరాలలోపు ఉన్న కొందరు రైతులకు మాత్రమే రైతు భరోసా వేశారని ఇప్పుడు వానాకాలం సీజన్ మొదలు అవుతుందని అన్నారు.గౌరవ తెలంగాణ తోలి ముఖ్యమంత్రి కేసిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రైతు బందును సమయానికి రైతుల ఖాతాలో వేసి రైతులకు అదుకున్నారని పేర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి ఓక సీజన్ రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశాడని ఆరోపించారు.ఎలాంటి అంక్షలు లేకుండా రైతు భరోసా బాకి ఉన్న రైతులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరాములు,మోతే జైపాల్ రెడ్డి,మోతే పద్మనాభ రెడ్డి,కోమల్ల గోపాల్ రెడ్డి,బండారి రమేష్,మోటూరి రవి,కోడారి రవి,తాల్లపెల్లి రాం ప్రసాద్,భూక్య వీరన్న,కడారి కుమారస్వామి,పెద్ది శ్రీనివాస్ రెడ్డి,వళ్ళల కర్ణకార్,అల్లి రవి,మర్ద నవీన్,సంగెం శ్రీకాంత్,చిప్పు రాజు తదితరులు ఉన్నారు.

జంగాలపల్లి MPPS పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం.

జంగాలపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

ప్రభుత్వ బడులలో పిల్లలను చదివిద్దాం బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం

నేటి ధాత్రి చర్ల

 

 

 

 

 

చర్ల మండల కేంద్రంలోని ఎంపీపీస్ జంగాలపల్లి పాఠశాలలో శుక్రవారం నాడు బడిబాట కార్యక్రమంలో భాగంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించి చిన్నారుల భవిష్యత్తును వెలుగులతో నింపాలని ఉపాధ్యాయులు కోరారు ప్రభుత్వ బడిలో చదువుకుంటాం కానీ ప్రైవేట్ బడిలో డబ్బుతో చదువును కొంటాం డబ్బులు ఎవరికీ ఊరికే రావు ప్రభుత్వ బడిలో విలువలతో కూడిన చదువుకొని మంచి ఉన్నత చదువులు చదివి అనుభవమున్న ఉపాధ్యాయులు ఉంటారు విశాలమైన తరగతి గదులు మధ్యాహ్న భోజనం వారానికి 3 గుడ్లు మూడు రోజులు రాగి జావ ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచితంగా దుస్తులు ఇవ్వబడతాయి అని ఉపాధ్యాయులు గ్రామాల్లోని పిల్లల తల్లిదండ్రులకు వివరించారు ఇకనైనా ప్రైవేటు స్కూళ్లపై మక్కువ మాని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే రామలక్ష్మి ఉపాధ్యాయులు సకినం బాలకృష్ణ అంగన్వాడీ టీచర్ పద్మ పిల్లల తల్లితండ్రులు గ్రామస్తులు  పాల్గొన్నారు

ఉత్తమ చిత్రానికి రూ. 10 లక్షలు.

ఉత్తమ చిత్రానికి రూ. 10 లక్షలు

 

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది.

 

 

 

 

 

 

  • ప్రత్యేక అవార్డుకు రూ. 10 లక్షల నగదు బహుమతి
  • ఉత్తమ ద్వితీయ, తృతీయ చిత్రాలకు రూ. 7, 5 లక్షలు
  • ఉత్తమ నటుడికి, ఉత్తమ నటికి చెరో రూ. 5 లక్షలు
  • నేడు గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వేడుక

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డుల విజేతలకు అందజేసే నగదు బహుమతిని భారీగా పెంచింది.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు సహా పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొననున్నారు.
కాగా, గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల జాబితాను ఇటీవలె ప్రకటించారు.
2014 నుంచి 2023 వరకు ప్రతి ఉత్తమ చిత్రానికి హీరో, హీరోయిన్‌, దర్శకుడు, నిర్మాతలకు కలిపి నాలుగు అవార్డులను ప్రదానం చేస్తారు.
ఇలా ప్రతి ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలకు అందజేస్తారు. 2024వ సంవత్సరానికి ప్రకటించిన అన్ని అవార్డులను కూడా బహూకరిస్తారు.
వీటితోపాటు 2024వ సంవత్సరం నుంచి రఘుపతి వెంకయ్య, బీఎన్‌ రెడ్డి, ఎన్టీఆర్‌, పైడి జైరాజ్‌, కాంతారావు, చక్రపాణి పేర్లతో ప్రత్యేక అవార్డులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది.
ఈ ఆరు ప్రత్యేక అవార్డుల్లో ఒక్కో అవార్డుకు రూ.పది లక్షల చొప్పున, మూడు ఉత్తమ చిత్రాలకు వరుసగా రూ. 10, 7, 5 లక్షల చొప్పున అందజేయనుంది.
అదేవిధంగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటికి రూ.5 లక్షల చొప్పున అందజేయనున్నారు. 14 సంవత్సరాల విరామం తర్వాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సహించే సంప్రదాయానికి తెలంగాణ ప్రభుత్వం తిరిగి శ్రీకారం చుట్టడం పట్ల అవార్డుల గ్రహీతలు, సినిమా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, విజేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు.
తెలంగాణ కళారంగంలో వేగుచుక్కలాంటి గద్దర్‌ పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

థగ్‌లైఫ్‌ మూవీ బ్యాన్‌ కోర్టులో విచారణ.

 థగ్‌లైఫ్‌ మూవీ బ్యాన్‌ కోర్టులో విచారణ…

కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్‌లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి.

థగ్‌లైఫ్‌ హీరో కమల్‌ హాసన్‌ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో.

కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్‌లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి.
థగ్‌లైఫ్‌ హీరో కమల్‌ హాసన్‌ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
కమల్‌ క్షమాపణ చెప్పకపోతే థగ్‌లైఫ్‌ సినిమాను రాష్ట్రంలో విడుదల చేయనివ్వబోమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి.
కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలి కూడా ఈ మేరకు తీర్మానం చేసింది.
దీన్ని ప్రశ్నిస్తూ, సినిమా నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌ ధర్మాసనం విచారించింది.
సినిమా విడుదలకు అభ్యంతరాలు తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

ప్రియాంకను అనుకున్నారు రకుల్‌ను తీసుకున్నారు.

ప్రియాంకను అనుకున్నారు.. రకుల్‌ను తీసుకున్నారు

 

భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘రామాయణ’. రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నితిశ్‌ తివారి భక్తిశ్రద్ధలతో రూపొందిస్తున్నారు.

 

భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘రామాయణ’. రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నితిశ్‌ తివారి భక్తిశ్రద్ధలతో రూపొందిస్తున్నారు. వివాదాలకు తావు లేకుండా, విజువల్‌ వండర్‌గా ‘రామాయణ’ చిత్రాన్ని రూపొందించడానికి కృషి చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ చాలా కాలం క్రితమే మొదలైనా గత ఏడాది నవంబర్‌ నెలలో అధికారికంగా వివరాలు వెల్లడించారు. సాయిపల్లవి సీతగా, రావణుడిగా కన్నడ హీరో యశ్‌, సన్నీ డియోల్‌ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణునిగా, కాజల్‌ అగర్వాల్‌ మండోదరిగా, లారా దత్తా కైకేయిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర శూర్పణఖ. రామ, రావణ యుద్ధం జరగడానికి కారణమైన ఈ పాత్రను రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పోషించనున్నారు. ఆమె కంటే ముందు ఆ పాత్ర కోసం ఎవరిని సంప్రదించారో తెలుసా? పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రాను. ఆమె శూర్పణఖ పాత్ర పోషిస్తే అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ‘రామాయణ’ చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుందని దర్శకనిర్మాతలు భావించారు. అయితే తనకున్న ఇతర కమిట్‌మెంట్స్‌ వల్ల ఆ పాత్ర చేయలేనని ప్రియాంక చెప్పడంతో అప్పుడు రకుల్‌ను ఈ అవకాశం వరించింది. ప్రియాంక చోప్రా ఇప్పుడు మహేశ్‌, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా రామాయణగాథ స్ఫూర్తితో రూపొందుతుండడం విశేషంగా పేర్కొనాలి.

ఎయిరిండియాలోనే మంచు లక్ష్మీ ప్రయాణం ఆమె ఏమన్నారంటే.

ఎయిరిండియాలోనే మంచు లక్ష్మీ ప్రయాణం ఆమె ఏమన్నారంటే…

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలిన రోజే మంచు లక్ష్మీ ఎయిరిండియా విమానంలో లండన్‌కు వెళ్లారు.

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా (Air india Plain) విమానం కుప్పకూలిన రోజే మంచు లక్ష్మీ (manchu lakshmi Prasanna) ఎయిరిండియా విమానంలో లండన్‌కు వెళ్లారు. దీంతో ఆమె ఎలా ఉన్నారో ఆరా తీశారు అభిమానులు. మెసేజ్‌లు చేశారు.  అయితే తాను క్షేమంగా ఉన్నానంటూ మంచు లక్ష్మి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.  ‘‘ఫ్లైట్‌ దిగిన తర్వాత ప్రమాదం గురించి తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యాను. నేను ఎలా ఉన్నానో కనుక్కోవడం కోసం ఎన్నో ఫోన్లు, మెేసజ్‌లు వస్తూనే ఉన్నాయి. నేను, మా అమ్మాయి అదేరోజు ముంబయి నుంచి లండన్‌కు ఎయిరిండియా విమానంలో ప్రయాణం చేశాము. దేవుడి దయ వల్ల మేము సేఫ్‌గా చేరుకున్నాం. అక్కడికి వెళ్లిన వెంటనే ఈ ప్రమాదం గురించి తెలిసి ఉలిక్కిపడ్డాను.
ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. విద్యార్థులు కూడా మృతి చెందారని తెలిసి నా హృదయం ముక్కలైంది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన ప్రాణాలు క్షణంలో ముగిసిపోతాయనడానికి ఈ ప్రమాదం ఒక ఉదాహరణ. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని మంచు వీడియోలో పేర్కొన్నారు. ఈ నెల 12న జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా ఆస్పత్రి, నివాస సముదాయం లోని ప్రజలు కొంత మంది మరణించినట్లు చెప్పారు.

బాసిల్‌కు బన్నీ గ్రీన్‌సిగ్నల్‌.

 బాసిల్‌కు బన్నీ గ్రీన్‌సిగ్నల్‌…

 

పుష్ప అంటే ఇంటర్నేషనల్‌’ అంటూ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌లానే ఇప్పుడు ఆయన ఇమేజ్‌ కూడా ఇంటర్నేషనల్‌ లెవల్‌కు వెళ్లింది. దాంతో ఆయనతో సినిమాలు చేయబోయే దర్శకులు.

పుష్ప అంటే ఇంటర్నేషనల్‌’ అంటూ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌లానే ఇప్పుడు ఆయన ఇమేజ్‌ కూడా ఇంటర్నేషనల్‌ లెవల్‌కు వెళ్లింది. దాంతో ఆయనతో సినిమాలు చేయబోయే దర్శకులు అంటూ రోజుకో పేరు తెరపైకి తెస్తున్నాయి సోషల్‌ మీడియా వర్గాలు. తాజాగా అల్లు అర్జున్‌ను డైరెక్ట్‌ చేయబోతున్న దర్శకుల జాబితాలో మలయాళ డైరెక్టర్‌ బాసిల్‌ జోసెఫ్‌ పేరు చేరింది. ఆయనతో ఓ సినిమా చేసేందుకు బన్నీ ఎస్‌ చెప్పారంటూ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బాసిల్‌ చెప్పిన కథ అల్లు అర్జున్‌కు బాగా నచ్చిందని, త్వరలోనే వీరి కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వస్తుందనేది ఆ వార్తల సారాంశం. బాసిల్‌ జోసఫ్‌ నటుడిగా, దర్శకుడిగా మలయాళ పరిశ్రమలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే అవేవీ అల్లు అర్జున్‌ స్థాయికి తూగేవి మాత్రం కావు. కాబట్టి ఈ ప్రచారంలో నిజానిజాలేమిటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.

 రాజాసాబ్‌కు కష్టం టీమ్‌ హెచ్చరిక.

 రాజాసాబ్‌కు కష్టం టీమ్‌ హెచ్చరిక…

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. ఇప్పుడీ చిత్రానికి  లీకుల కష్టం మొదలైంది. టీజర్‌లోని కొన్ని విజువల్స్‌ను నెట్టింట లీక్‌ చేశారు. దీనిపై టీమ్‌ స్పందించింది.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. (The raja saab) జూన్‌ 16న ఈ సినిమా టీజర్‌ విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇప్పుడీ చిత్రానికి  లీకుల కష్టం మొదలైంది. టీజర్‌లోని కొన్ని విజువల్స్‌ను నెట్టింట లీక్‌ చేశారు. దీనిపై టీమ్‌ స్పందించింది.
లీక్‌ కంటెంట్‌ను షేర్‌ చేసే వాళ్లపై  కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్‌ హెచ్చరించింది. ఎవరైనా ‘రాజాసాబ్‌’ కంటెంట్‌కు సంబంధించిన అనధికారక వీడియోలు, ఫొటోలు, షేర్‌ చేస్తే వారి సోషల్‌ మీడియా అకౌంట్‌ను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సినిమాటిక్‌ అనుభూతి అందించేందుకు చిత్రబృందం ఎంతో కష్టపడుతోందని దానికి అందరూ సహకరించాలని కోరింది.
ప్రభాస్‌ నటిస్తున్న తొలి హారర్‌ చిత్రమిది. దీంతో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. టీజర్‌ను ఈ నెల 16న విడుదల చేయనున్నట్లు టీమ్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్‌లో ఈవెంట్‌ చేయాలను కుంటున్నారని తెలిసింది. మాళవిక మోహనన్‌, నిధీ అగర్వాల్‌, రిద్థికుమార్‌ కథానాయికలు. సంజయ్‌దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఖరీఫ్ సాగులో రైతులు బిజీ బిజీ.

ఖరీఫ్ సాగులో రైతులు బిజీ బిజీ

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు

సేద్యం పనుల్లో రైతులు బిజీ బిజీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

గుకోసం రైతులు సేద్యం పనుల్లో బిజీబిజీగా మారారు. మండ లంలో రెండు వేల హెక్టార్లకు పైగా సాగు విస్తీర్ణం ఉందని వ్యవసాయాధి కారులు పేర్కొంటున్నారు జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ ఝరాసంగం మొగుడంపల్లి కోహిర్ న్యాల్కల్ మండలంలో నాలుగు రోజులుగా వర్షాలు కురు స్తుండటంతో వ్యవసాయ పొలాల్లో ట్రాక్టర్ల సాయంతో దుక్కిళ్లు చేస్తున్నారు. పొలాల్లో, గట్టుపై పెరిగిన పిచ్చిమొక్కలు, రాళ్లు తొలగించడంలో రైతులు నిమగ్నమయ్యారు. ఈ యేడాది ముందస్తు వర్షాలు కురవడంతో వేరుశనగ పంట సాగుచేసేందుకు మండలంలోని రైతులు ఆసక్తి చూపుతున్నారు.

గోదాం లవద్ద సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి.

గోదాం లవద్ద సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి

బురదమయం అవ్వడంతో బస్తాలు దింపడంలో ఇబ్బదులను ఎదుర్కొంటున్నాం

ఏఐటియూసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసరి అశోక్

పరకాల నేటిధాత్రి

 

 

 

 

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లోగల గోదాంల వద్ద సీసీ రోడ్లను వేయించాలని ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసరి అశోక్ అన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ 2014-15వ సంవత్సరంలో పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో 5000 మెట్రిక్ టన్నుల గోదాంను నాబార్డ్ వారి సహకారంతో 3,00,00 లక్షలతో నిర్మించడం జరిగిందని గోదాంలో సరైన సౌకర్యాలు లేక కొన్ని సంవత్సరములు ఖాళీగా ఉన్న గోదాంను కార్మికులామంతా కలిసి సివిల్ సప్లై డిఎం,ఆర్ఎం లకు కలిసి గోదాంలు కాలిగా ఉంటున్నాయని వాటిలో పీడీఎస్ బియ్యాన్ని దింపినటైతే మాకు కూలి దొరుకుతుందని మా పరిస్థితిని వెళ్ళబుచ్చగా 2025లో జనవరి మాసంలో వాళ్లతో అగ్రిమెంట్ ఒప్పందం చేసుకొని 5,000 మెట్రిక్ టన్నుల గోదాంలో బియ్యం దింపడం జరిగింది.

కార్మికుల కష్టాలు తీరుతున్నాయానుకునే సమయంలో వర్షాకాలం సమీపిస్తున్న వేల అసలైన సమస్య ఎదురైందని గోదాం చుట్టూ సీసీ రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నామన్నారు.

గతంలో వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని గోదాం చుట్టూ లోతట్టు ప్రాంతం అవ్వడంతో నీరు నిల్వవుండి బురద మయంగా మారిందని పిడిఎస్ బియ్యంతో వచ్చే లారీలు దిగబడుతున్నాయని, బస్తాలు మోయాలంటే కష్టంగా ఉన్నదని,బియ్యం బస్తాలు దూరం మోయవలసి వస్తుందని దానివల్ల మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నామన్నారు.

 

CC roads

 

 

గోదాం చుట్టూ సీసీ ఏర్పాటు చేసి మా కార్మికుల కష్టాలను తీర్చాలని ప్రభుత్వాన్ని అధికారులను కార్మిక సంఘం తరుపున కోరుతున్నామని తెలిపారు.

కార్మిక నాయకులు ప్రధాన కార్యదర్శి నాగేళ్లి శంకర్,కోగిల శంకరయ్య,రేణిగుంట్ల రాజయ్య,కోడపాక ఐలయ్య,కోట యాదగిరి,బొట్ల భద్రయ్య,కోడపాక చిరంజీవి,శ్రీపతి రాజయ్య, శ్రీపతి కుమార్,కోగిల కైలాసం,జన్ను పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించిన.

అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ప్రాథమిక పాఠశాల న్యాల్కల్ మండల రేజింతల్ గ్రామంలో ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా అధ్యక్షతన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నూతనంగా 1 వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా ఉపాధ్యాయులు జ్యోతి, మానస, ఏ ఏ పి సి చైర్మన్ రామేశ్వరీ, మాజీ ఎంపీటీసీ నల్లవల్లి మల్లిక, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఆమ్మదాబాద్ విమానం ప్రమాదం లో మృతులకు.

ఆమ్మదాబాద్ విమానం ప్రమాదం లో మృతులకు నివాళులు అర్పించిన గణేష్ వాకింగ్ టీమ్

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమానము ప్రమాదంలో మృతి చెందిన ప్రజలు గుజరాత్ మాజీ సీఎం మృతి చెందిడము పట్ల వనపర్తి గణేష్ వాకింగ్ గ్రూప్ సబ్యుల అధ్యర్య ములో రాజవారి బంగ్లాలో నివాళులర్పించామని అధ్యక్షులు గోనూర్ వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు రాజాపేట సుదర్శన్ రెడ్డి దొంత అశోక్ వాకింగ్ టీము సబ్యులు నివాళులర్పించారు

సిపిఐ 18వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.

సిపిఐ 18వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

భూపాలపల్లి నేటిధాత్రి:

సిపిఐ 18వ పట్టణ మహాసభలను పురస్కరించుకొని సిపిఐ ఎల్బీనగర్ శాఖ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని వాల్ పోస్టులను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు సోత్కు ప్రవీణ్ కుమార్, గురిజాల సుధాకర్ రెడ్డి,మాతంగి రామచందర్, రాయ మల్లు, కత్తెర శాల, పత్తి వేణుగోపాల్ సంపత్ తదితరులు పాల్గొన్నారు

సంకెళ్లు వేస్తున్న సెల్ ఫోన్.

సంకెళ్లు వేస్తున్న సెల్ ఫోన్…

వీడియో గేమ్స్ తో, యూట్యూబ్ లతో కాలం గడిపేస్తున్న యువత…

చాటింగ్, వీడియో కాలింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న వైనం…

సెల్ ఫోన్ తో సందడి కోల్పోతున్న ఉమ్మడి కుటుంబం…

యువత పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న నిపుణులు…

నేటి ధాత్రి గార్ల:

నేటితరం యువతకు సెల్ ఫోన్ సంఖ్యలు వేస్తుంది యువతలో ఆధునికత అరుదైన రుగ్మతను తెచ్చిపెట్టింది. యువతరం పై స్మార్ట్ ఫోన్ ప్రభావం ఎక్కువగా పడుతుంది. సమాచార మార్పిడి భావ ప్రకటన స్వేచ్ఛ తదితర అంశాలలో సామాజిక మాధ్యమం కీలక పాత్ర పోషిస్తుంది. విజ్ఞానాన్ని పెంచడంతోపాటు అంతే అనర్ధాన్ని తెచ్చిపెడుతుంది. నేటి యువత సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, స్నాప్ చాట్ లకు బానిసలవుతున్నారు. కొంతమంది వాటిని మోసాలు బ్లాక్ మెయిల్ చేసేందుకు వినియోగిస్తున్నారు. ఈ తరం సోషల్ మీడియాలకు బానిసలుగా మారడంపై మానసిక నిపుణుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. సామాజిక సాధనాలకు బానిస అవుతున్న యువత రోజంతా భోజనం లేకున్నా భరించగలుగుతున్నారు. కానీ ఐదు నిమిషాలు ఇంటర్నెట్ అందుబాటులో లేకుంటే అసహనానికి గురవుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఓ చెయ్యి స్మార్ట్ ఫోన్ పైనే ఉంటుంది. షేరింగ్, లైక్, కామెంట్ ఈ క్షణం ఇదే ప్రపంచంగా యువత, పెద్దలు గడిపేస్తున్నారు. ఇందులో మంచి కంటే చెడు వైపు మొగ్గు చూపే వాటి సంఖ్య అధికంగా ఉండటమే ఆందోళన కలిగించే అంశం. కొందరు సామాజిక మాధ్యమాల్లో ముందుకెళ్తుంటే మరికొందరు వీడియో గేమ్స్ తో, యూట్యూబ్ లతో కాలం గడిపేస్తున్నారు. గతంలో నెట్ దొరకాలంటే నానా అవస్థలు పడేవారు. ప్రస్తుత త్రిజి,ఫోర్ జి,ఫైజి సేవలతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా ప్యాకేజీలు దొరకడంతో నెట్ వినియోగం పెరిగిపోయింది. యువత చాటింగ్, వీడియో కాలింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉమ్మడి కుటుంబం భారతీయుల ప్రత్యేకం. ఒకప్పుడు రాత్రి భోజనాలు అయ్యాక అంతా ఓ చోట కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు.ఇంట్లో నలుగురు ఉన్న ఇల్లంతా సందడిగా కనిపించేది. ఇప్పుడు నలుగురు ఉన్న చోట కూడా మౌనం రాజ్యమేలుతుంది. పిల్లలు నిత్యం ల్యాబ్ ట్యాబ్, సెల్ ఫోన్లతో గడుపుతున్నారు. ఆ సమయంలో ఇబ్బంది కలిగిస్తే కోపంతో ఊగిపోతారు. చదువును సైతం నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు. చాలామంది విజ్ఞానం కోసం వినియోగించకుండా కొత్త పరిచయాలు, కొత్త స్నేహం కోసం వెతుకుతుంటారు. ఇలాంటి వారి పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కామారెడ్డిపల్లి గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు.

కామారెడ్డిపల్లి గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు

 

పరకాల నేటిధాత్రి

 

 

శుక్రవారం రోజున మండలంలోని కామారెడ్డి పల్లి గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సునుఎమ్మార్వో విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని,ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.రైతులు,ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ అశోక్ రెడ్డి,సర్వేయర్ విజయ్ కుమార్,రేవన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమం.

జైపూర్ అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ అంగన్వాడి కేంద్రం1లో ఫ్రీ స్కూల్ పిల్లలకి స్వాగతం పలుకుతూ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.అలాగే విద్యార్థులకు అక్షరాభ్యాసం చేపించి అంగన్వాడి కేంద్రంలో ప్రీ స్కూల్ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది.3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలను తప్పకుండా అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలని సూచించారు.అంగన్వాడి కేంద్రంలో ఉచిత భోజనం,ఉచిత విద్య,ఉచిత వసతులను విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ మనోరమ,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,సూపర్వైజర్ కవిత,అంగన్వాడి టీచర్స్ సరిత,ఉమాదేవి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

యాదవ సంఘం అధ్యక్షునికి ఆత్మీయ సమ్మేళనం…

యాదవ సంఘం అధ్యక్షునికి ఆత్మీయ సమ్మేళనం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

 

తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి యాదవ సంఘం అధ్యక్షుడికి ఆత్మీయ సత్కారం చేసిన మండల యాదవ సంఘం నేతలు. తంగళ్ళపల్లి మండలం పాపాయి పల్లి గ్రామానికి చెందిన చేన్న వేణి. తిరుపతి యాదవ్ పాపాయిపల్లి గ్రామ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది తంగళ్ళపల్లి మండల యాదవ సంఘం ఆధ్వర్యంలోఎన్నికైన చిన్న వేణి తిరుపతి యాదవ్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన మండల యాదవ సంఘం నేతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ. యాదవ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని నూతన అధ్యక్షుడికి తిరుపతికి సూచించిన మండల యాదవ సంఘం నాయకులు. తద్వారా ఆత్మీయ సత్కారం చేసిన యాదవ సంఘం మండల నాయకులకుఈ oదుకుగాను మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో యాదవ సంఘం మండల నాయకులు. బోట్ల ఐలయ్య యాదవ్. బండి దేవేందర్ యాదవ్. మహేష్ యాదవ్. జక్కుల కొమురయ్య యాదవ్. శ్రీకాంత్ యాదవ్ యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

బల్దియా కమిషనర్ గా పదవీ బాద్యతలు చేపట్టిన.

బల్దియా కమిషనర్ గా పదవీ బాద్యతలు చేపట్టిన చాహాత్ బాజ్ పేయి…

▪కమీషనర్ కు
శుభాకాంక్షలు తెలియజేసిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది….

నేటిధాత్రి, వరంగల్.

 

 

 

 

బల్దియా నూతన కమిషనర్ గా చాహాత్ బాజ్ పయ్ శుక్రవారం ప్రధాన కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని, కరీంనగర్ లో మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన అనుభవం ఉందని మున్సిపల్ సర్వీసులపై అవగాహన ఉందని స్పష్టంచేసిన కమిషనర్ సానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించి నగర పరిశుభ్రతకు తోడ్పడడంతో పాటు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే లక్ష్యం, భవన నిర్మాణ అనుమతులకు జారీ చేసే విధానాన్ని, శానిటేషన్ విభాగం లో విధులు నిర్వహించే సిబ్బంది సంఖ్య చెత్త తరలింపు జరిపే వాహనాలకు జీ పి ఎస్ అనుసంధానం , తదితర అంశాలను సంబంధిత విభాగాల అధికారులకు అడిగి తెలుసుకున్నారు.

Baldia Commissioner.

 

 

అన్ని విభాగాల అధికారులు సిబ్బంది సహకారంతో నగర అభివృద్దికి కృషి చేస్తానని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. అనంతరం బల్దియా లోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు సిబ్బంది కమిషనర్ కు పుష్పగుచ్చాలు, పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Baldia Commissioner.

 

 

కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో డిప్యూటీ కమిషనర్ (అడ్మిన్)రాజేశ్వర్ సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి ఇంచార్జి ఎస్ ఈ ,సిటీ ప్లానర్ లు శ్రీనివాస్ రవీందర్ రాడేకర్
పి ఆర్ ఓ ఆయుబ్ అలీ డిప్యూటీ కమిషనర్లు రవీందర్, ప్రసన్న రాణి, ఈ ఈ లు డి ఈ లు, ఆర్ ఓ లు ఆర్ ఐ లు తదితరులు ఉన్నారు

విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.

విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

నిజాంపేట్, నేటి ధాత్రి

 

 

 

 

నస్కల్ గ్రామంలో
విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని,విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలను అందజేసి, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించాలని దళిత బహుజన ఫ్రంట్(డిబీఎఫ్)జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్ డిమాండ్ చేశారు.
శుక్రవారం నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో డిబీఎఫ్ ఆధ్వర్యంలో విద్యా హక్కుల పరిరక్షణకై ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించి,విద్య హక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేటు విద్యాసంస్థలలో కూడా పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. పాఠ్యపుస్తకాలలో మహనీయుల జీవిత చరిత్రను పొందపరచాలని ప్రభుత్వ కళాశాలలో కూడా చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.విద్యారంగ సమస్యల సాధన కోసం డిబిఎఫ్ ఆధ్వర్యంలో పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు సత్యం రెడ్డి తో పాటు ఉపాధ్యాయ బృందము పిల్లలు పాల్గొన్నారు తదితరులు పాల్గోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version