నర్సంపేట మండల బిఆర్ఎస్ యూత్ కమిటీ ఎన్నిక.

నర్సంపేట మండల బిఆర్ఎస్ యూత్ కమిటీ ఎన్నిక

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట రూరల్ మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ నూతన కమిటీని ఎంపిక చేసినట్లు పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిక చేసినట్లు తెలిపారు.బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడుగా గన్న రాజేష్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్స్,మంచిక హరీష్,పెండ్యాల స్వామి,ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీకాంత్,అధికార ప్రతిధులుగా బుస శ్రీశైలం,దారావత్ మహేందర్,ఉపాధ్యక్షులు భాషబోయిన ప్రవీణ్,కర్దూరి హరీష్,కొంగర మురళీ,ఆల్లె రాజు,గజ్జి రాము,సహాయ కార్యదర్శులు జినుకల అఖిల్,పుట్ట అఖిల్,బయ్య నవీన్,చెరిపెల్లి రాజు,కోశాధికారి అజ్మీర నరేష్,కార్యవర్గ సభ్యులు చిలుక నరేందర్,దరావత్ రాజు,వాంకుడోతు అక్షయ్ కుమార్,
మోటం హరీష్,నునావత్ పవన్ కుమార్,భూక్య సుమన్ లు ఎన్నికైనట్లు ప్రకటించారు.మండలం లోని అన్ని గ్రామాల నుండి ఎన్నిక చేయడం జరిగిందని మండల పార్టి అధ్యక్షుడు నామాల సత్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరములు,క్లస్టర్ ఇన్చార్జి మోటురి రవి,సీనియర్ నాయకులు బోల్లం బక్కయ్య,గడ్డం రాజు,బగ్గి రాజు,జై కిసాన్,బాణోత్ రవి,చిప్ప ప్రశాంత్,సమ్మెట రంగయ్య తదతరులు ఉన్నారు.

ఎమ్మెల్యే సహకారంతో ఎల్ఓసి అందజేత.

ఎమ్మెల్యే సహకారంతో ఎల్ఓసి అందజేత
• కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు

నిజాంపేట: నేటి ధాత్రి
మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రౌవు సహకారంతో 2,50,000 ఎల్ఓసి అందజేయడం జరిగిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మనుబోతు మైసవ్వ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో 2 లక్షల 50 వేల ఎల్ఓసి చెక్కును కాంగ్రెస్ నాయకులు జేల్లా లక్ష్మణ్ కుటుంబ సభ్యులు రాజుకు అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్ఓసికి సహకరించిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు కు, మైనంపల్లి హనుమంతరావుకు ఎల్లవేళల రుణపడి ఉంటామని కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు, రాములు, నరేష్ పాల్గొన్నారు

సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి.

సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి
• పిచ్చి మొక్కలకు గడ్డి మందు పిచ్కారి.

నిజాంపేట: నేటి ధాత్రి

వర్షాకాలం సీజనల్ వ్యాధులను నేపథ్యంలో పారిశుద్ధ్యం పై గ్రామస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామ కార్యదర్శి మమత ఆదేశాల మేరకు పారిశుద్ధ కార్మికులు కలుపు మొక్కలకు గడ్డి మందు పిచికారి చేస్తున్నారు. కార్యక్రమంలో నర్సిములు, కొమ్మట రాజు, పోచవ్వ, ఎల్లవ్వ, జామున, ఎల్లయ్య లు ఉన్నారు.

మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ పై మాట్లాడే..

మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ పై మాట్లాడే అర్హత నీకు లేదు అని హెచ్చరించిన

బిఆర్ఎస్వి జిల్లా కార్యదర్శికంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టిఆర్ఎస్వి జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ మీరు మా కేటీఆర్ పైన మాట్లాడే అర్హత నీకు లేదని తెలియజేస్తున్నా బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేటీఆర్ పొగడ్తూ షాడో సీఎం అన్న సంగతి గుర్తుకు రాలేదా అని హనుమంతరావును ప్రశ్నించిన కంచర్ల రవి గౌడ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవి ఇచ్చింది కేటీఆర్ మర్చిపోయావా. సిరిసిల్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదని అన్నారు కేటీఆర్ ఎంత అభివృద్ధి చేసిండో సిరిసిల్ల ప్రజలకు తెలుసు అని అన్నారు సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ ను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని అన్నారు మిమ్మల్ని మల్కాజ్గిరి ప్రజలు తిరస్కరించిన విషయాన్ని మర్చిపోదని గుర్తు చేశారు కేటీఆర్ ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసినా మహా నాయకుడు అని తెలంగాణ ప్రజలకు తెలుసు మీరు కేటీఆర్ గారి పైన మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ అభిమానులుగా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు సాయి,సూర్య ఎస్.కె అప్రోచ్ మట్టి శ్రీనివాస్, అనిల్, నరేష్, అరవింద్ జోసఫ్,సురేష్,రాజేందర్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి రూ. లక్ష విరాళం.

అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి రూ. లక్ష విరాళం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం అభివృద్ధి కోసం ఎన్నారై దాత ఒక లక్ష రూపాయల విరాళాన్ని దేవాలయం అధ్యక్షుడు సైపా సురేష్ కు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ ధర్మ శాస్తా అయ్యప్పస్వామి దేవాలయం సేవా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు సైపా సురేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త బండారి వైకుంఠం కూతురు అల్లుడు ఎన్నారై యూఎస్ఏ రాపాక స్వాతి నర్సింగరావు దేవాలయ పున నిర్మాణంలో భాగంగా ఒక లక్ష ఒక వెయ్యి 116 దేవాలయ కమిటీకి అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా దాత ఎన్నారై యూఎస్ఏ రాపాక స్వాతి నర్సింగరావు,ప్రముఖ వ్యాపార వేత్త బండారి వైకుంఠం లను అయ్యప్పస్వామి దేవాలయంలో ఘనంగా సన్మానించారు.ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కమలాకర్ రెడ్డి,కోశాధికారి రవీందర్,దొడ్డ వేణు,బండారి చంచారావు,దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా,దాత కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందించిన..

పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందించిన జిల్లా కలెక్టర్

జిల్లాలో మొత్తం 14 వేల నూతన రేషన్ కార్డుల పంపిణీ

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని లబ్ధిదారులకు చంద్రంపేట రైతు వేదికలో రేషన్ కార్డుల పంపిణీ
అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

Collector Sandeep Kumar Jha

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను సోమవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.సిరిసిల్ల పట్టణంలోని అర్హులైన 2610 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఉన్న కార్డుల్లో మొత్తం 4527 మందిని అదనంగా చేర్చామని వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మొత్తం 21 వేల రేషన్ కార్డుల లబ్ధిదారులకు బియ్యం పంపిణీ అవుతున్నాయని తెలిపారు.రేషన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్ అని, ఆధార్ కార్డు, కరెంట్ కనెక్షన్ , ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, గుర్తింపు కోసం కూడా ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.
జిల్లాలో నూతనంగా 14 వేల లబ్దిదారులకు రేషన్  అందించేందుకు కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం రేషన్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. నూతన రేషన్ కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, ఫించన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా కార్డు రాని వారు ఉంటే సమీపంలోని మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Collector Sandeep Kumar Jha

కార్యక్రమంలో కే కే మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎం సివిల్ సప్లై రజిత, లబ్ధిదారులు, సంబంధిత  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బాబోయ్ ప్రయి’వేటు’ పాఠశాల..?

బాబోయ్ ప్రయి’వేటు’ పాఠశాల..?

చదువు కొనాల్సిందే…

విద్య హక్కు చట్టమా నీవెక్కడ..?

సదువు సారేడు,ఫిజులు బారేడు…

ఉన్నత అధికారుల పర్యవేక్షణ కరువు…

విద్య అంగట్లో వ్యాపారమేనా..?

పుస్తకాలతో పాటు అన్ని పాఠశాలలో అందుబాటులో…

ఎం ఆర్ పి కంటే అధిక రేటుకు అమ్మకాలు…

విద్యాశాఖ అలసత్వం విద్యార్థులకు శాపమేనా…

నేటి ధాత్రి -మహబూబాబాద్ :-

సదువు సారేడు ఫిజులు బారేడు అన్నట్లు ఉంది ప్రయివేటు పాఠశాలల తీరు చూస్తే.ఉన్నత చదువులు అంగట్లో అందుబాటులో ఉన్నాయి అన్నట్లు ఉంది ప్రయివేటు పాఠశాలల పనితీరు.మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రయివేటు పాఠశాలల దందా మూడు పువ్వులు అరుకాయలుగా సాగుతుంది.ఉన్నత చదువులు విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారాయి.ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తాము పెట్టిందే సిద్ధాంతం అంటూ అధిక ఫిసులు వసులు చేస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులకు పెను భారంగా మారింది. స్కూల్ మొదలు అడ్మిషన్ ల పేరుతొ వేలకు వేలు వసులు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్మకూడదని ఆదేశాలు ఉన్న, తమకేమి పట్టనట్లు ఎం ఆర్ పి కి మించి ఇష్టానుసారంగా పాఠ్యపుస్తకాలు,నోటు పుస్తకాలు అమ్ముతు లక్షలు గడిస్తున్నారు.స్కూల్ యూనిఫామ్ లతో పాటు టై లు, బెల్ట్ లు, షు లు అన్ని అంగట్లో అందుబాటులో ఉన్నాయంటూ పవిత్ర పాఠశాలను అంగడి సంతగా మారుస్తున్నారు. ఇదంతా తెలిసిన విద్యాశాఖ అధికారులు సైతం తమకేమి పట్టనట్లు వ్యవహరించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ గోడును ఎవ్వరి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.

మరోవైపు ఉన్నత చదువులకై ప్రభుత్వ గురుకుల, నవోదయ ఎంట్రెన్స్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలలో టిసి కోరగా దానికి సైతం వేలల్లో డబ్బులు వసులు చేస్తున్నారు.నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను ప్రభుత్వం గుర్తించి నవోదయ, గురుకుల వంటి పాఠశాలల్లో సిటు అందించినప్పటికీ,ప్రయివేట్ పాఠశాలల చేతివాటం వల్ల అధికాస్త తల్లిదండ్రులకు శాపంగానే మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ప్రయివేటు పాఠశాలలలో మొత్తం ఒక్కసారిగా కడితే 10% డిస్కౌట్ అంటూ ఆఫర్ లు సైతం పెడుతున్నప్పటికీ అధికారులు మాత్రం అటు వైపు కన్నీత్తి చూడటం లేదు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలలో నిర్దేశిత ఫీజులను అందుబాటులో ఉంచగా విద్యాశాఖ అలసత్వం వల్ల అధికాస్తా అందని ద్రాక్షగానే మారింది.మరోవైపు పరిమితికి మించి ఆటోలు టాటా ఏసీ లు, బస్సులల్లో విద్యార్థులను తీసుకుని వస్తు ప్రమాదలు జరిగి, విద్యార్థుల ప్రాణాలను గాలిలో దీపాలుగా మారుస్తున్నారు.ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రజలు మా ఇంటి ముంగట మోరీలు నిర్మించండి.

జహీరాబాద్ ప్రజలు మా ఇంటి ముంగట మోరీలు నిర్మించండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ గాంధీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 6 లో కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు మోరీలు నిర్మించడం లేదు దాదాపు ఈ ఏరియా గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీలో కలుపుకోవడం జరిగింది కానీ మున్సిపాలిటీ ఏరియా అని ఇంటి టాక్స్లు వసూలు చేస్తున్నారు కానీ ఇంటి ముంగట రోడ్డు గాని మోరిల్ల నిర్మాణం గానీ చేపట్టడం లేదు స్థానిక ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేయడం జరిగింది జహీరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ కు దీనిపైన చొరవ తీసుకొని టాక్స్లు వసూలు చేసుడు కాదు ముందు మోరిలా నిర్మించాల్సిందిగా స్థానిక ప్రజలు కాలనీవాసులు కోరుతున్నారు మరియు ఈ రాంనగర్ 100 ఫీట్ల రోడ్డు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ రోడ్డుకు రెండు సైడ్ల మోరీలు కట్టలేని పరిస్థితి దీనివల్ల వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి రోడ్డు పాడయింది ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా చూసి చూడనట్టు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఎవరిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఫ్లైఓవర్ నుండి రాంనగర్ దర్గా వరకు రెండు వైపుల పెద్ద మోరి నిర్మించాల్సిందిగా మహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్ తొందర్లో రోడ్డు మరియు మోరీలు నిర్మించకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందట రాంనగర్ కాలనీ గాంధీనగర్ కాలనీ గుల్షన్ నగర్ బాగా రెడ్డి కాలనీ జమాలీ కాలనీ సలాం నగర్ కాలనీ ప్రజలతో ధర్నా చేస్తామని డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ ఇండ్ల రాకతో నిరుపేదల కళ్ళలో ఆనందం.

ఇందిరమ్మ ఇండ్ల రాకతో నిరుపేదల కళ్ళలో ఆనందం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఎస్సీ కాలనీ లో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు కొయ్యడ సుమలత సమ్మయ్య ఇందిరమ్మ ఇల్లు అమలు కావడం చాలా సంతోషకరంగా ఉంది గత 10 సంవత్సరాల కాలం నుండి గుడిసెలలో అంటూ ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో ఇందిరమ్మ ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి కి భూపాలపల్లి శాసన సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇట్టి కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మొలుగూరి రాజు కొయ్యాడ భద్రయ్య ఎడ్ల లింగయ్య జన్నే సుమంత్ గ్రామస్తులు పాల్గొన్నారు

ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే రాగిజావ అమలు..

ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే రాగిజావ అమలు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-65-1.wav?_=1

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలల్లో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు అమలు చేస్తున్న రాగిజావ పంపిణీ పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఇప్పటివరకు అందలేదని మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గత ఏడాది వరకు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రాగిజావ పంపిణీ జరిగిందని పేర్కొన్నారు.ఈ ఏడాది ఆదేశాలు వస్తే విద్యార్థులకు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి.

స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి

నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-64.wav?_=2

నర్సంపేట,నేటిధాత్రి;

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ పిలుపునిచ్చారు.మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఎంపీటీసీ పరిధి బిఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం గ్రామ పార్టీ అధ్యక్షులు కందిపల్లి శంకర్ అధ్యక్షతన నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్,ఎంపిటిసి పరిధి ఇన్చార్జ్ శానబోయిన రాజ్ కుమార్ పాల్గొని ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట ప్రాంతానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను నెమరువేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ప్రభుత్వ జిల్లాఆసుపత్రిగాఏర్పాటు అలాగే జిల్లా కేంద్రంలో ఉండే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయించారని అన్నారు.మండల కేంద్రాలకు లింకు రోడ్లు వేయడం ప్రతి గ్రామంలో ఇంటర్నల్ రోడ్లు 100 శాతం నిర్మించడం,రైతులకు సరిపడ యూరియా, రైతు బందు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీలో అందించడంలో నర్సంపేట ముందు వరుసలో ఉందన్నారు.కేసీఆర్ హామీలు ఇవ్వని అనేక సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేశారని గుర్తుకు చేశారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ పాలన
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పట్ల ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల పట్ల ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని రాజ్ కుమార్ తెలిపారు. వచ్చే స్థానిక జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలలో గ్రామంలో అభ్యర్థి గెలుపు కొరకు అందరు కంకణ బద్దులమై ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహమ్మదాపురం పిఎసిఎస్ చైర్మన్ ఊరటి మహిపాల్ రెడ్డి,డైరెక్టర్లు నాంపల్లి సుధాకర్,వ్యవసాయ కమిటీ అధ్యక్షులు రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ విజయ మోహన్,మండల నాయకులు ఊరటి రవి,తాళ్లపల్లి వీరస్వామి,మాజీ సర్పంచ్ దారావత్ రాజు, మాజీ ఉపసర్పంచ్ ఉరటి జయపాల్ రెడ్డి, గుండెబోయిన రవి, కక్కర్ల సాంబయ్య, ఏడాకుల రమణరెడ్డి,దుగ్గొండి మండల బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొర్కటి రాజు కుమార్, గ్రామ పార్టీ సభ్యులు ఉప అధ్యక్షులు ఊరటి రామచంద్రు,మంద రాజు,అదర్ సండే రాజు, గోర్కటి రఘుపతి,కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నూతన గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి..

నూతన గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి..

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-63.wav?_=3

హన్మకొండ, నేటిధాత్రి:

గ్రేటర్ వరంగల్ నగర పరిధి, మడికొండ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య (సి ఎన్ జీ) గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర రెవిన్యూ హౌసింగ్ సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, వర్దన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, స్టేషన్ ఘన్ పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, వరంగల్ (పశ్చిమ) శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, కుడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, కార్పొరేటర్ లు సి.ఎన్.జీ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-62.wav?_=4

* ప్రిన్సిపల్ జన్ను విజయ్ కుమార్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ విద్య శాఖ ఆదేశాల మేరకు అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం చేస్తున్నామని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జన్ను విజయ్ కుమార్ ఒక ప్రకటనలో సోమవారం రోజున తెలిపారు. మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల లో 2025 -2026 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న కంప్యూటర్స్ విభాగంలో రెండు పోస్టులు, ఎకనామిక్స్ విభాగంలో ఒక పోస్ట్ ఖాళీగా ఉన్నాయని ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల లోపు కళాశాలలో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు రెండు జతలు జిరాక్స్ కాపీలు సమర్పించవలసిందిగా తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులు పొంది ఉండాలని ఇతరులు 55 శాతం మార్కులు పొంది ఉండాలని సంబంధిత సబ్జెక్టుల్లో అర్హతలు పీజీ తో పాటు నెట్, సెట్, పీహెచ్డీ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జన్ను విజయకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లాస్థాయి పద్యపఠన పోటీలకు లేఖన ఎంపిక..

జిల్లాస్థాయి పద్యపఠన పోటీలకు లేఖన ఎంపిక

అభినందించిన ప్రధానోపాధ్యాయులు స్వరూప.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-61.wav?_=5

నర్సంపేట,నేటిధాత్రి:

దాశరథి కృష్ణమచార్యా శత జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా స్థాయి పద్యపఠన పోటీలకు నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంలో గల జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థిని ఇజ్జగిరి లేఖన ఎంపికయ్యింది.ఈసందర్భంగా విద్యార్థిని ఇజ్జగిరి లేఖనను పాఠశాలల
ప్రధానోపాధ్యాయులు స్వరూప అభినందించారు. హెచ్ఎం మాట్లాడుతూ నర్సంపేట మండలంలో మొత్తం 54 మంది విద్యార్థులు పాల్గొనగా కేవలం 4 విద్యార్థులు ఎంపిక అయ్యారన్నారు.అందులో భాగంగా తమ పాఠశాల విద్యార్థిని లేఖన ఎంపిక అయ్యిందని పేర్కొన్నారు.లేఖన ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణం అని ప్రధానోపాధ్యాయులు స్వరూప ఆనందం వెళ్లుబుచ్చారు. అనంతరం లేఖనను సన్మానించి ప్రధానోపాద్యాయురాలు ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జర్నలిస్టులు రాస్తారోకో..

ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జర్నలిస్టులు రాస్తారోకో

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-60.wav?_=6

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సెంటర్ లో ప్లకార్డ్ తో రోడ్డుపై బైఠాయిచి రాస్తారోకో చేశరు. నేడు జిల్లాలో కొనసాగుతున్న ముగ్గురు మంత్రుల పర్యటనను బహిష్కరించి నిరసన తెలిపారు.

MLA Gandra Satyanarayana Rao

జర్నలిస్టుల పై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

సిరిసిల్ల కవయిత్రికి జాతీయ పురస్కారం..

సిరిసిల్ల కవయిత్రికి జాతీయ పురస్కారం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-59.wav?_=7

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ ఉపాధ్యాయురాలు,కవయిత్రి శ్రీమతి తాళ్లపల్లి (మోతుకుల) భాగ్యలక్ష్మి,శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ,శ్రీ ఆర్యాణి సకల కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిలింభవన్ లో జాతీయస్థాయి 2025 భారత్ విభూషణ్ అవార్డుల ప్రదానోత్సవం లో పురస్కారం అందించడం జరిగినది. మరియ తల్లీ నీకు వందనం కవితాసంకలనం ఆవిష్కరణ మహోత్సవంలో అద్భుతమైన కానుక అమ్మ కవిత ముద్రణకు ఎంపికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గౌతమేశ్వర సేవా సంస్థ మరియు ఆర్యాణి కళా సంస్థల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దూడపాక శ్రీధర్, డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, ప్రతిమ హాస్పిటల్ డెర్మటాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ గీతారెడ్డి , డాక్టర్ మోత్కుల నారాయణ గౌడ్, ప్రముఖ సాహితీవేత్తలు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా బోనాల పండుగ…..

అంగరంగ వైభవంగా బోనాల పండుగ…..

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-58.wav?_=8

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం గ్రామ పరిధిలోని ఆదివారం బోనాల పండుగ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలతో మహిళలు బోనాలు ఊరేగింపుగా తీసుకొని ఝరాసంగం కాలనీలోని పోచమ్మ మందిరానికి తీసుకువచ్చారు.

Bonala festival

గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న అందరూ కలిసిమెలిసి ఆయా కాలనీ వాసులు అమ్మవారికి బోనాలు సమర్పించారు.ఈ బోనాల కార్యక్రమానికి ఝరాసంగం ప్రాంత వాసులే కాకుండా చుట్టుపక ప్రాంత ప్రజలు కూడా భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదనా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోచమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు వివిధ ప్రాంతాల చెందిన భక్తులు పాల్గొన్నారు.

అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు.

అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-57.wav?_=9

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలో
అనుమతు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని న్యాల్కల్ ఎంపీడీవో గూడెం శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల కోసం పంచాయతీ కార్యదర్శుల వద్ద అనుమతులు తీసుకోవాలని చెప్పారు. అన్ని గ్రామాల్లో పారిశుధ్య వ్యవస్థ మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్న నేరుగా ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు..

సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-56.wav?_=10

జహీరాబాద్ నేతి ధాత్రి:

దక్షిణ కాశీగా పిలిచే ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయంలో సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం కృష్ణపక్షం, బహుళ దశమి పురస్కరించుకొని పార్వతి సహిత సంగమేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. సహస్రనామాలు, కుంకుమార్చన, బిల్వార్చన తదితర పూజలతో మంగళహారతి చేశారు. సోమవారం కావడంతో దూరప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు.

నానో ఎరువులతో లాభాలేన్నో..

నానో ఎరువులతో లాభాలేన్నో

రైతులకు నానో ఎరువులపై అవగాహన కార్యక్రమం

మండల వ్యవసాయ అధికారి గంగా జమున

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-55.wav?_=11

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో నానో యూరియా,నానో డిఏపి వాడేలా రైతులను ప్రోత్సహిం చాలని మండల వ్యవసాయ అధికారి గంగా జమున ఆధ్వ ర్యంలో రైతులకు నానో ఎరు వులపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏవో మాట్లాడుతూ నానో యూరియా, నానో డిఎపి వాడటం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదకత నాణ్యత పెరుగుతుంది పంటలకు పర్యావరణ ఒత్తిడి తెగుళ్లను తట్టుకునే శక్తిని అందిస్తాయని అన్నారు అంతే కాకుండా పర్యావరణహితంగా పనిచేస్తాయని పేర్కొన్నారు నెలల ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా గాలి నీటి కాలుష్యాన్ని తగ్గిస్తాయని వివరించారు. సంప్రదాయక ఎరువులకు బదులుగా నానో యూరియా నానో డిఏపి ఎరువులను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వాటి వినియోగం గురించి రైతులకు తెలియ జేయడం జరిగింది ఈ కార్యక్ర మంలో, ప్రగతిసింగారo గ్రామం లోని రైతులు, డీలర్లులు, ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version