గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు నమూనా విడుదల..!

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు నమూనా విడుదల..! ఫస్ట్ లుక్ అదుర్స్

 

తెలుగు సినిమా రంగంలో విశేష ప్రతిభను కనబరిచిన వారికి తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విప్లవాత్మక తెలుగు కవి గద్దర్ గౌరవార్థం ఆయన పేరు మీద ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ (GTFA) ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు తాజాగా అవార్డు నమూనాకు సంబంధించి ఓ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ ఫొటోలో అడుగు భాగంలో గద్దె ఆపైన చేతిలో ఓ మూవీ రీల్ బాక్స్ ఉండటం మనం గమనించవచ్చు.

కాగా, మే 29న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు (Gaddar Telangana Film Award)లను ఇవాళ జ్యూరీ చైర్పర్సన్ జయసుధ (Jayasudha)తో పాటు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju), జ్యూరీ సభ్యులు ప్రకటించారు. 2024కు గాను ఉత్తమ చిత్రంగా కల్కి 2898 AD మూవీ ఎంపికైంది. రెండో బెస్ట్ మూవీగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డును సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా ఉత్తమ దర్శకుడి అవార్డు కల్కి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ను వరించింది .

ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప-2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (చిన్న కథ కాదు.. 35), ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయా ఘోషల్ (పుష్ప-2), ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి (గామి) స్పెషల్ జ్యూరీ అవార్డులను దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్), అనన్య నాగళ్ల (పొట్టేల్), ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2), ఉత్తమ సహాయ నటుడిగా ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం), ఉత్తమ సహాయ నటి శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్), ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ (రాజూ యాదవ్) అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్టూరి (లక్కి భాస్కర్), ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్ (రజాకార్), ఉత్తమ హస్య నటులుగా వెన్నెల కిషోర్, సత్య, ఉత్తమ కొరియోగ్రాఫర్గా గణేష్ ఆచార్య (దేవర), బెస్ట్ స్టోరీ రైటర్గా శివ పాలడుగు, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్- చంద్రశేఖర్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను అందుకోనున్నారు. అదేవిధంగా ఉత్తమ బాలల చిత్రంగా 35.. ఇది చిన్న కథ కాదు, ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ చిత్రంగా ‘రజాకార్’, ఉత్తమ పుస్తకంగా రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం) అవార్డులను కైవసం చేసుకున్నాయి.

విక్రమ్ స్థానంలో మాధవన్ .

విక్రమ్ స్థానంలో మాధవన్

 

దర్శక ధీరుడు రాజమౌళి చిత్రంలో ఆఫర్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ చియాన్ విక్రమ్ మాత్రం… ‘సారీ… నో’ అనే శాడట!

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అని ఎంతోమంది నటీనటులు అనుకుంటారు. ఆయన డైరెక్షన్ లో ఒక్క సినిమా చేస్తే చాలు… తమకు ఓవర్ నైట్ స్టార్ డమ్ వస్తుందని హీరోలు, హీరోయిన్లు నమ్ముతారు. ఆయన ఆఫర్ ఇవ్వాలే కానీ.. రెండు మూడేళ్ళ పాటు కాల్ షీట్స్ ఇవ్వడానికీ బిజీ ఆర్టిస్టులు సిద్థపడతారు. అయితే ఈ మాయ పడకుండా… తమ కెరీర్ ను జాగ్రత్తగా బిల్డ్ చేసుకునే నటీనటులూ కొందరు ఉంటారు. రాజమౌళికి రెండు మూడేళ్ళు రాసిచ్చేయడానికి ఆసక్తి చూపించవారి విషయమే ఇది! చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) తన కెరీర్ ను చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టాడు. అప్పట్లో తెలుగులో పెద్దంత ప్రాధాన్యం లేని పాత్రలను సైతం చేశాడు. చివరకు తమిళంలో బ్రేక్ వచ్చిన తర్వాత అతని సినిమాలు తెలుగులో డబ్ అయ్యి గ్రాండ్ గా రిలీజ్ కావడం మొదలైంది. ఒకానొక సమయంలో విక్రమ్ సినిమాలు తమిళంలో కంటే తెలుగులోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వైవిధ్య మైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ ఆసక్తిని కనబరిచే విక్రమ్.. మహేశ్ బాబు (Mahesh Babu), రాజమౌళి సినిమాలో వచ్చిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది.
కొంతకాలం క్రితం రాజమౌళి బృందం విక్రమ్ ను కాంటాక్ట్ చేసి, మహేశ్ బాబు – రాజమౌళి ప్రాజెక్ట్ లో పాత్ర చేయమని కోరిందట. ఈ ప్రాజెక్ట్ కు ఉన్న క్రేజ్ తెలిసి కూడా విక్రమ్ ఆ ఆఫర్ కు నో చెప్పాడట. ఎందుకంటే… అతని పాత్ర సినిమాలో నెగెటివ్ షేడ్స్ తో సాగుతుందట! ఇప్పుడు తనకున్న ఇమేజ్ కు అలాంటి పాత్ర చేయడం సబబు కాదని విక్రమ్ భావించాడని సన్నిహితులు చెబుతున్నారు. హీరోగా ఎంతటి రిస్క్ చేయడానికైనా సాహసించే విక్రమ్… మహేశ్, రాజమౌళి ప్రాజెక్ట్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడానికి మాత్రం ధైర్యం చేయలేకపోయాడని తెలుస్తోంది. విక్రమ్ ‘నో’ చెప్పిన తర్వాతే చిత్ర బృందం ఆర్. మాధవన్ (R Madhavan) ను అప్రోచ్ అయ్యిందని, ఆయన వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించి, డేట్స్ అడ్జస్ట్ చేశాడని అంటున్నారు. మాధవన్ హీరోగా కొన్ని చిత్రాలు చేసి, హీరోగా తనను తాను నిరూపించుకుని ఇప్పుడు ప్రతినాయకుడి పాత్రలు సైతం చేస్తున్నాడు. అంతే కాదు… ఇటీవల దర్శకుడిగా మారి మెగాఫోన్ నూ చేతిలోకి తీసుకున్నాడు. మొత్తానికి రాజమౌళి మూవీలో ఆర్టిస్టుల ఎంపిక కుర్చీల ఆటను తలపిస్తోందని సినిమా రంగానికి చెందిన వారు చెవులు కొరుక్కుంటున్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో కె. ఎల్. నారాయణ (K.L. Narayana) దీనిని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి స్వరరచన చేస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ సోమవారం మొదలైంది.

శివుడే నన్ను ఎంచుకున్నాడు

శివుడే నన్ను ఎంచుకున్నాడు

విష్ణు కథానాయకుడిగా ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. డా.మోహన్‌బాబు నిర్మించారు. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా…

విష్ణు కథానాయకుడిగా ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. డా.మోహన్‌బాబు నిర్మించారు. ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు మాట్లాడుతూ ‘‘దాదాపు ఏడెనిమిదేళ్లు కష్టపడి ఈ సినిమా తీశాం. ఇందులో నటించమని అడిగిన వెంటనే అంగీకరించిన మా బావ ప్రభా్‌సకు కృతజ్ఞతలు. ఈ సినిమాను శివుడు ఆశీర్వదించాడు’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో ఎవరెవరు పనిచేయాలి అనేది శివాజ్ఞతోనే జరిగింది. ఈ చిత్ర ప్రయాణం నన్ను చాలా మార్చింది. ‘కన్నప్ప’ కథను మరోసారి చెప్పరా అని శివుడు నన్ను ఎంచుకున్నాడని భావిస్తున్నా’’ అని మంచు విష్ణు చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, రఘుబాబు, శివబాలాజీ, కౌశల్‌ పాల్గొన్నారు.

సర్దార్ 2 షూటింగ్ పూర్తి!

సర్దార్ 2 షూటింగ్ పూర్తి!

కార్తీ సూపర్ హిట్ మూవీ ‘సర్దార్’ సీక్వెల్ షూటింగ్ పూర్తయిపోయింది. ‘సర్దార్’కు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా, సీక్వెల్ కు సామ్ సీఎస్ ను తొలుత అనుకుని ఇప్పుడు యువన్ శంకర్ రాజాతో మ్యూజిక్ చేయించుకున్నారు.

కార్తీ (Karthi) హీరోగా నటించిన ‘సర్దార్’ (Sardar) సినిమా 2022లో దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. తండ్రీ కొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రజిషా విజయన్ (Rajisha Vijayan), రాశీఖన్నా (Rasi Khanna) హీరోయిన్లుగా నటించారు. లైలా (Laila) ఓ కీలక పాత్రను పోషించి మెప్పించింది. పి.ఎస్. మిత్రన్ (P.S. Mithran) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే మేకర్స్ తెలిపారు. అన్నట్టుగానే ఈ సినిమా సీక్వెల్ ను కొంతకాలం క్రితం ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేశారు. థాయ్ లాండ్ లోని హువా హిన్ ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా టోటల్ క్రూ అంతా కలిసి కేక్ కట్ చేసి హర్షాన్ని వ్యక్తం చేశారు.

ప్రిన్స్ పిక్చర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘సర్దార్ -2’లో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath), రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ చేస్తుండగా, ఎస్. జె. సూర్య (SJ Suryah) ఓ పవన్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తొలుత సామ్ సి.ఎస్.ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ కొద్ది రోజులకే ఆ స్థానంలోకి యువన్ శంకర్ రాజా (Yuvan Sakar Raja) వచ్చాడు. చిత్రం ఏమంటే… ‘సర్దార్’ తొలి భాగానికి వీరిద్దరూ కాకుండా జి.వి. ప్రకాశ్‌ కుమార్ సంగీతాన్ని అందించాడు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రాఫీ సమకూర్చుతున్న ‘సర్దార్ -2’ చిత్రానికి దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ కొరియోగ్రాఫర్. ఎస్. లక్ష్మణ్‌ కుమార్ నిర్మిస్తున్న ‘సర్దార్ 2’ కు ఎ. వెంకటేశ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతరం కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.

బాలకృష్ణతో మరోసారి 

బాలకృష్ణతో మరోసారి 

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు…

 

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ బాలకృష్ణతో మరోసారి సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మా కాంబో చేసే గర్జన మరింత ఎక్కువగా ఉండబోతోంది. చరిత్రలో నిలిచిపోయే చిత్రమిది’’ అని పేర్కొన్నారు. మంగళవారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఇది ఆయన నటించనున్న 111వ చిత్రం. వెంకట్‌ సతీష్‌ కిలారు నిర్మించనున్నారు. కాగా, బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని కలయికలో ‘వీరసింహా రెడ్డి’ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

అఖండ 2 టీజర్‌ వచ్చేస్తోంది

హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబో హ్యాట్రిక్‌ కొట్టిన సంగతి తెలిసిందే. వారి కలయికలో నాలుగోసారి తెరకెక్కుతోన్న సినిమా ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమా టీజర్‌ను నేడు విడుదల చేయనున్నారు మేకర్స్‌.

అఖిల్‌, జైనబ్ రిసెప్ష‌న్‌..

అఖిల్‌, జైనబ్ రిసెప్ష‌న్‌.. త‌ర‌లివ‌చ్చిన తారాలోకం

 

అక్కినేని వార‌సుడు అఖిల్‌, జైనాబ్‌ల వివాహాం రెండు రోజుల క్రితం అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే.

అక్కినేని వార‌సుడు అఖిల్‌ (Akhil), జైనాబ్‌ (Zainab)ల వివాహాం రెండు రోజుల క్రితం అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే మొన్న కేవ‌లం అతి కొద్దిమంది స‌మ‌క్షంలోనే ఈ పెళ్లి జ‌రుగ‌గా సినీ ఇండ‌స్ట్రీ నుంచి కొద్దిమంది అతిథులు మాత్ర‌మే హ‌జ‌ర‌య్యారు.

తాజాగా వీరి నిశ్చితార్ధం హైద‌రాబాద్‌లో క‌నుల‌పండువ‌గా జ‌రిగింది. ఈ వేడుక‌కు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు భారీ ఎత్తున హ‌జ‌ర‌య్యారు.

ముఖ్యంగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు (Mahesh Babu), సూర్య‌, వెంకి అట్లూరి ఈ రిసెప్ష‌న్‌కు హ‌జ‌రైన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మీరూ వాటిపై ఓ లుక్ వేయండి.

రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న‌, అల్ల‌రి న‌రేశ్‌, నాని, నిఖిల్, క‌న్న‌డ స్టార్ య‌శ్‌ దంప‌తుల‌తో పాటు సుధీర్‌బాబు, ద‌ర్శ‌కుడు సుకుమార్ దంప‌తులు, బుచ్చిబాబు సాన‌, నిర్మాత‌లు దిల్ రాజు, అశ్వినీ ద‌త్‌, బీవీ ప్ర‌సాద్‌, కేఎల్ నారాయ‌ణ‌ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

రాజ‌కీయ నాయ‌కులు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డిలు సైతం ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

ఈ వారం ఓటీటీ సినిమాలివే.!

 ఈ వారం ఓటీటీ సినిమాలివే.. అన్నీ అదిరిపోయే బొమ్మ‌లే

 

నేటిధాత్రి:

 

 

 

 

 

 

ఈవారం ఓటీటీ () ప్రేక్ష‌కుల చెంత‌కు అదిరిపోయే కంటెంట్ అందుబాటులోకి రానుంది.

ఈవారం ఓటీటీ () ప్రేక్ష‌కుల‌కు అదిరిపోయే కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఎప్ప‌టిలానే ఈ వీకెండ్ కూడా 100కు పైనే సినిమాలు, సిరీస్‌లు డిజిట‌ల్ స్ట్రీమింగుకు వ‌స్తుండ‌గా వాటిలో చాలా వ‌ర‌కు ప్ర‌ధాన కంటెంట్‌ తెలుగులోనూ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే వీటిలో అధిక శాతం మూవీస్‌ కేవ‌లం అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ల‌లోనే వ‌స్తుండ‌డం విశేషం.

వీటిలో ముఖ్యంగా హీరోయిన్ స‌మంత నిర్మాత‌గా మారి మొట్ట మొద‌టి సారి నిర్మించిన శుభం, మ‌ల‌యాళ యువ నటుడు, ప్రేమ‌లు హీరో న‌టించిన అల‌ప్పుజ జింఖానా, న‌వీన్ చంద్ర ఇన్వెస్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్ ఎలెవ‌న్ చిత్రాల‌తో పాటు రానా నాయుడు వెబ్ సిరీస్‌, బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కేస‌రి2, త‌మిళ చిత్రాలు మామ‌న్‌, డీడీ నెక్స్ట్ లెవ‌ల్ వంటి కొత్త చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ‌స్తున్నాయి. థియేట‌ర్ల‌లో ఈ సినిమాల‌ను మిస్స‌యిన వారు, ఇంటి పట్టునే ఉండి చూసే వారికి ఈ వీక్ స‌రిపోను వినోదం అందించ‌డానికి రెడీగా ఉన్నాయి.

 

 

 

Jio Hotstar

Padakkalam (Malayalam + Multi)

Snow White (English + Hindi) – JioHotstar

The Real Housewives Of Miami: S4 (English) [Series]

Subham (Telugu + Multi )

When No One Sees Us (Spanish)

Under Dogs (English)

 

 

 

 

 

 

Netflix

Train Wreck : The AstroWorld Tragedy (English)

OurTimes (Mexican)

Aniela (Polish) [Series]

CheersToLife (Brazilian)

Titan : The OceanGate Disaster (English)

CocaineAir : Smugglers at 30,000 Ft. (English) [Series]

FlatGirls (Thai)

MasameerJunior (Saudi)

AndTheBreadWinnerIs (Filipino)

Cells At Work (Japanese)

Rana Naidu : Season 2 (Hindi)

A Business Proposal (Indonesian)

Too Hot To Handle: Spain (Spanish) [Series]

The Rookie (English) – Netflix

 

Prime Video

The Amateur (English)

Misericordia (English) Rent

When Fallis Coming (English) Rent

Clown In A Cornfield (English) Rent

Deep Cover (English)

Eleven (Tamil)

Kesari Chapter2 June 13

DD Next Level June 13

Bonjour Tristesse (English) Rent

The Chosen: Last Supper Season 5 (English) [Series]

Final Destination Bloodlines Rent June 17

Zee5

Maaman (Tamil) June 13

Aha Tamil

Eleven (Tamil)

 

 

 

Sony Liv

Alappuzha Gymkhana (Malayalam + Multi)

Tentkotta

Eleven (Tamil)

ETv win

Aa Okkati Adakku (Telugu)

HBO Max

Cleaner (English)

Apple Tv+

EchoValley (English)

Simply South

Eleven (Tamil)

Alappuzha Gymkhana (Malayalam + Multi)

Lionsgate Play

The Prosecutor (Chinese) (Cantonese, Eng, Hi, Ta, Tel)

ఘ‌నంగా అక్కినేని అఖిల్ పెళ్లి.

ఘ‌నంగా అక్కినేని అఖిల్ పెళ్లి.. వివాహ వేడుక‌లో సినీ తార‌ల సంద‌డి

నేటిధాత్రి

 

 

 

 

  • అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీల వివాహం
  • హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా వేడుక
  • హాజరైన చిరంజీవి, ప్రశాంత్ నీల్ వంటి ప్రముఖులు
  • తెలుగు రాష్ట్రాల సీఎంల‌ను ఆహ్వానించిన నాగార్జున దంపతులు
  • ఈ నెలాఖరులో జోధ్‌పూర్‌లో గ్రాండ్‌గా రిసెప్ష‌న్‌

టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రవ్జీతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగిన వేడుకలో ఏడడుగులు నడిచారు. గతేడాది నవంబర్ లో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు, ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి విచ్చేసి, వేడుకకు మరింత శోభను చేకూర్చారు. అఖిల్ తండ్రి, అగ్ర నటుడు నాగార్జున అక్కినేని, తల్లి అమల వ్యక్తిగతంగా పలువురు ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా నాగార్జున దంపతులు స్వయంగా కలిసి ఆహ్వానించడం గమనార్హం. దీనివల్ల ఈ వివాహానికి సినిమా రంగంలోనే కాకుండా, సామాజికంగా కూడా ఎంతటి ప్రాధాన్యత ఉందో స్పష్టమవుతోంది.

వధువు జైనాబ్ రవ్జీ ప్రతిభావంతురాలైన ఆర్టిస్ట్, పర్ఫ్యూమర్. ఆమె సృష్టించే ఎక్స్‌ప్రెసివ్ అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్‌వర్క్‌కు మంచి పేరుంది. అలాగే, “ఒన్స్ అపాన్ ది స్కిన్” అనే పేరుతో ఆమె నడుపుతున్న ఫ్రాగ్రెన్స్ బ్లాగ్ కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. హైదరాబాద్‌లో జన్మించిన జైనాబ్, ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందినవారు. అంతేకాకుండా ఎం.ఎఫ్. హుస్సేన్ దర్శకత్వం వహించిన “మీనాక్షి: ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్” చిత్రంలో కూడా జైనాబ్ చిన్న పాత్రలో నటించారు.

ఇక‌, అక్కినేని అభిమానులు ఎంతోకాలంగా ఈ పెళ్లి వేడుక వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వీరి నిశ్చితార్థం ప్రైవేట్‌గా జరగడం, అంతకుముందు 2017లో అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థం జరిగి, తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో రద్దు కావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ పెళ్లిపై మరింత ఆసక్తి నెలకొంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుక అనంతరం, ఈ నెలాఖరులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మరో భారీ వేడుకను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహానికి దేశవ్యాప్తంగా మీడియాలో విస్తృత ప్రచారం లభించింది. పలువురు శ్రేయోభిలాషులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులు అందిస్తున్నారు.

 

4 గంటలు పని చేసే నటులు కూడా ఉన్నారు.

4 గంటలు పని చేసే నటులు కూడా ఉన్నారు: దీపికా పదుకొణే వివాదంపై రానా వ్యాఖ్యలు

 

 

నేటిధాత్రి:

 

 

 

 

భారతీయ సినిమా పరిశ్రమలో నటీనటుల పని గంటలపై జరుగుతున్న చర్చకు నటుడు రానా దగ్గుబాటి తనదైన శైలిలో స్పందించారు.

నటి దీపికా పదుకొణె…

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి పనివేళల విషయంలో విభేదాల కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే వార్తల నేపథ్యంలో, రానా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమని, ఇక్కడ నిర్దిష్ట ప్రమాణాలను చేరుకోవడానికి ఎక్కువ గంటలు పనిచేయడం, ఎక్కువ కృషి చేయడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒక ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ, “భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని మనం అర్థం చేసుకోవాలి.

మనం అభివృద్ధి చెందిన దేశం కాదు.

తలసరి ఆదాయం పరంగా చూస్తే మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో బహుశా 186వ స్థానంలో ఉంటుంది” అని పేర్కొన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన వైనాన్ని గుర్తుచేస్తూ, “కొన్ని కుటుంబాలు, వందలాది మంది తమ సర్వస్వాన్ని వదులుకుని ఒక నగరం నుంచి మరో నగరానికి వచ్చి ఇక్కడ పరిశ్రమను స్థాపించారు.

నాకు ఇది పనిలా కాకుండా ఒక జీవన విధానంలా అనిపిస్తుంది” అని తెలిపారు.

పరిశ్రమను బట్టి మారే పనివేళలు

పనిగంటలు అనేవి ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు, అలాగే ప్రాజెక్టును బట్టి కూడా గణనీయంగా మారుతాయని రానా వివరించారు.

“ఉదాహరణకు, మహారాష్ట్రలో 12 గంటల షిఫ్ట్ ఉంటుంది, తెలుగులో 8 గంటల షిఫ్ట్ ఉంటుంది.

కానీ మహారాష్ట్రలో ఉదయం 9 గంటలకు పని మొదలుపెడితే, తెలుగులో మేం ఉదయం 7 గంటలకే మొదలుపెడతాం.

అలాగే, షూటింగ్ జరిగే ప్రదేశం, నగరం, సెట్‌లో చిత్రీకరిస్తున్నారా లేదా స్టూడియోలోనా అనే అంశాలు కూడా పనిగంటలను ప్రభావితం చేస్తాయి.

సెట్‌లో షూట్ చేయడానికి ఎక్కువ సన్నాహాలు అవసరం, అదే స్టూడియో అయితే సౌకర్యవంతంగా ఉంటుంది.

కాబట్టి ఇది ప్రాజెక్టును బట్టి మారుతుంది.

దీన్ని ఒక సాధారణ విషయంగా చూడకూడదు” అని ఆయన స్పష్టం చేశారు.

నటీనటులను ఎక్కువ గంటలు సెట్‌లో ఉండమని బలవంతం చేస్తారా అన్న ప్రశ్నకు రానా సమాధానమిస్తూ, “ఎవరూ ఎవరినీ బలవంతం చేయడం లేదు.

ఇది ఒక ఉద్యోగం.

‘మీరు ఈ షో చేయాల్సిందే’ అని ఎవరూ మిమ్మల్ని నిర్బంధించలేరు.

ఇది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక.

జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై ప్రతి ఒక్కరికీ వారి వారి అభిప్రాయాలు ఉంటాయి.

కేవలం 4 గంటలు మాత్రమే షూట్ చేసే నటులు కూడా ఉన్నారు.

అది వారి పనివిధానం” అని తెలిపారు.

దేశ జనాభాలో 70-80 శాతం మంది రోజుకు 100 రూపాయలు సంపాదించే పరిస్థితులున్నాయని, ఈ కోణంలో చూసినప్పుడు మనం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉందని రానా అన్నారు.

గుంటూరులో ఘనంగా ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ వేడుక

గుంటూరులో ఘనంగా ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ వేడుక

 

నేటిధాత్రి

 

 

 

 

* అంగరంగ వైభవంగా జరగనున్న కార్యక్రమం
* ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే సౌకర్యం
* భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ చిత్రం
* సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ వేడుక

తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో ప్రారంభమైంది. ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రభుదేవా, ముఖేశ్ రిషి తదితరులు హాజరయ్యారు. కాసేపట్లో హీరో మంచు విష్ణు కూడా హాజరుకానున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

భారీ బడ్జెట్‌తో, ఉన్నత సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటున్న ‘కన్నప్ప’ చిత్రంపై ప్రేక్షకుల్లో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గుంటూరులో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా సినిమా ట్రైలర్ లేదా కొత్త పాటలను విడుదల చేసే అవకాశం ఉంది.

సమంత బోల్డ్ ఫోటోలు వైరల్ మతి పోవాల్సిందే.!

సమంత బోల్డ్ ఫోటోలు వైరల్… మతి పోవాల్సిందే !

 

నేటిధాత్రి:

 

 

 

 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భర్త విడాకులు ఇచ్చినప్పటికీ ఒంటరి జీవితాన్ని గడుపుతూ తన లైఫ్ ను లీడ్ చేస్తోంది సమంత. హీరోయిన్ గా, అలాగే నిర్మాతగా.. బిజినెస్ మ్యాన్ గా దూసుకు వెళ్లోంది సమంత. దాదాపు 14 సంవత్సరాలుగా టాలీవుడ్ ໐໕໖ (Tollywood Industry) .

అయితే అలాంటి సమంత.. తాజాగా దుబాయ్ లో (Dubai ) పర్యటించారు. ఈ సందర్భంగా దుబాయ్ అందాలను ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పంచుకుంటున్నారు. దాదాపు మూడు రోజుల నుంచి సమంత దుబాయ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడికి ఓ ఖరీదైన హోటల్లో దిగిన సమంత.. ఎడారి దిబ్బలు, నైట్ లైఫ్, ఇలా అన్ని ఎంజాయ్ చేస్తోంది.

ఇక తాజాగా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తూ ఓ బోల్డ్ ఫోటోను పంచుకుంది. బ్లాక్ డ్రెస్ లో స్నానం చేస్తూ కనిపించింది. ఈ ఫోటోలను స్వయంగా సమంత పంచుకోవడంతో వైరల్ గా మారింది. ఈ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఏం అందం రా బాబు.. అంటూ సమంతను పొగుడుతున్నారు. ఇది ఇలా ఉండగా 2021 లో అక్కినేని నాగచైతన్య- సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

నితిన్ ‘తమ్ముడు’ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్.

నితిన్ ‘తమ్ముడు’ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్.. ట్రైబల్ యువతిగా ఆకట్టుకుంటున్న లుక్

 

నేటిధాత్రి

 

 

 

 

యంగ్ హీరో నితిన్ (Nithin) రీసెంట్గా ‘రాబిన్ హుడ్’ (Robin Hood) సినిమాతో మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తమ్ముడు’ (Thammudu). శ్రీరామ్ వేణు(Sriram Venu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో లయ(Laya), స్వశిక (Swashika), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), సౌరభ్ సన్దేవా (Sourabh Sachdev) కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ (Ajaneesh Loknath) సంగీతం అందించారు.

 

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూవీ టైటిల్తో వస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం జులై 25న గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ హీరోయిన్ పోస్టర్ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈ సినిమాలో ‘కాంతార’ (Kanthara) నటి సప్తమి గౌడ (Sapthami Gouda) కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు సప్తమి బర్త్డే కావడంతో ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ఈ ఫొటో చూస్తుంటే.. ట్రైబల్ యువతిగా సప్తమి కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇండస్ట్రీలో పనిగంటలపై చర్చ రానా దగ్గుబాటి కీలకవ్యాఖ్యలు.

ఇండస్ట్రీలో పనిగంటలపై చర్చ.. రానా దగ్గుబాటి కీలకవ్యాఖ్యలు

 

నేటిధాత్రి:

 

 

 

 

ఇటీవల పని గంటలపై జరుగుతున్న చర్చలు చిత్ర పరిశ్రమకు కూడా వ్యాపించాయి. ‘స్పిరిట్’ (Spirit) సినిమా నుంచి దీపికా పదుకొణె (Deepika Padukone) వైదొలగడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) తనదైన శైలిలో స్పందించారు. పని సంస్కృతి, ఆర్థిక పరిస్థితులపై చర్చలు అనవసరమని, నిరంతర సాధన, కృషే పని జీవితానికి నిజమైన విలువని అన్నారు. భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమని, అధిక సామర్థ్యం, ఎక్కువ పని గంటలు దేశ అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు.

సినీ పరిశ్రమలో పని గంటలు ప్రాజెక్ట్ను బట్టి మారతాయని రానా వివరించారు. “భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. తలసరి ఆదాయంలో మన ఆర్థిక వ్యవస్థ 186వ స్థానంలో ఉంది. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు మారినప్పుడు వందలమంది కుటుంబాలతో వలస వచ్చారు. నా దృష్టిలో అది కేవలం పని కాదు, జీవనశైలి. ప్రతి ప్రాజెక్టు, దానిలో పనిచేసే వ్యక్తులను బట్టి పని గంటలు మారతాయి” అని అన్నారు.

 

మహారాష్ట్రలో 12 గంటల షిఫ్ట్ విధానం, తెలుగు పరిశ్రమలో 8 గంటల షిఫ్ట్ సాధారణమన్నారు. అయితే షూటింగ్ షెడ్యూల్లు లొకేషన్, సెట్, స్టూడియో వంటి అంశాలపై ఆధారపడతాయని రానా వివరించారు. “మహారాష్ట్రలో ఉదయం 9 గంటలకు షూటింగ్ మొదలవగా, తెలుగులో 7 గంటలకే ప్రారంభమవుతుంది. సెట్ సన్నద్ధత, లొకేషన్ ఎంపిక వంటివి సులభమైనవి కావు. దేశంలో 70-80% మంది రోజువారీ సంపాదన వంద రూపాయలే. ఈ విషయాలను సూక్ష్మంగా చూడాలి” అని ఆయన అన్నారు.

నటులు సెట్ లో ఎక్కువ సమయం గడపడానికి బలవంతంగా ఒత్తిడి ఉంటుందనే వాదనపై రానా స్పందిస్తూ.. “ఎవరూ బలవంతంగా ఉండమని చెప్పరు. సినిమా ఒక వృత్తి. ఒత్తిడి చేయడం జరగదు. ఇందులో పనిచేయాలనుకుంటే చేయొచ్చు. అది వ్యక్తిగత ఎంపిక. కొంతమంది నటులు 4 గంటలు మాత్రమే పనిచేస్తారు, అది వారి విధానం” అని పేర్కొన్నారు.

కొరియన్ స్టార్లా ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్స్.

*40 ఇయర్స్ ఏజ్లో ఆ విషయంలో గట్టి పోటీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ.. కొరియన్ స్టార్లా ఉన్నావంటూ నెటిజన్ల
కామెంట్స్*

నేటిధాత్రి

 

 

 

అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్ (Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కెరీర్ స్టార్టింగ్లో ట్రెడిషనల్గా ఆకట్టుకున్న ఈ భామ.. ‘మల్లన్న'(Mallanna) సినిమాతో బోల్డ్ రెచ్చిపోయింది. దీంతో ఈ అమ్మడు పై నెగిటివిటీ రావడమే కాకుండా ట్రోలింగ్ కూడా పెద్ద ఎత్తున చేశారు. అంతేకాకుండా అప్పటి నుంచి అవకాశాలు రావడం చాలా వరకు మానేశాయి. దీంతో చేసేది ఏమి లేక ఇండస్ట్రీకి దూరం అయింది.

ఇక కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మకు ఒక పాప ఉంది. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇదిలా ఉంటే.. నిత్యం సామాజిక మాధ్యమాల్లో తన గ్లామర్తో పిచ్చేక్కిస్తుంది ఈ అమ్మడు. 42 సంవత్సరాల్లోనూ యంగ్ హీరోయిన్స్కి అందం విషయంలో మంచి ఫిజిక్ను మొయిన్ టైన్ చేస్తూ గట్టి పోటీ ఇస్తుంది.

 

ఈ క్రమంలో శ్రియ శరన్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రియ తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో సిల్వర్ కలర్ ట్రెండింగ్ డ్రెస్లో మెస్మరైజ్ చేసింది. హాట్ హాట్ స్టిల్స్తో నెట్టింట రచ్చ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొరియన్ స్టార్లాఉన్నావని, బ్యూటిఫుల్, సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బ్లాక్ డ్రెస్లో మతిపోగొడుతున్న టాలీవుడ్ హీరోయిన్.

బ్లాక్ డ్రెస్లో మతిపోగొడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. వావ్ సూపర్ అంటున్న నెటిజన్లు

 

నేటిధాత్రి:

 

 

 

ఊహలు గుసగుసలాడే (Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా (Rashi Khanna) మనందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ యూత్ క్రష్గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వరుస సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది.

ప్రజెంట్ ఈ అమ్మడు తెలుగులో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా'(Telusu Kada) మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ (Bollywood)లోనూ వెబ్ సిరీస్, ఐటెం సాంగ్స్ చిందులేస్తూ ఉంది. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరో పక్క నిత్యం సోషల్ మీడియా (Social Media)లో యాక్టీవ్గా ఉంటూ తన గ్లామర్ తో హీట్ పుట్టించడంతో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా రాశి ఖన్నా తన ఇన్స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్సులో దర్శనమిచ్చింది. కళ్లకు కాటుక పెట్టుకోవడంతో ఈ ముద్దుగుమ్మ మరింత అందంగా కనిపించింది. అలాగే వైట్ తెర వెనుక నిలబడి ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చింది. అంతేకాకుండా వాటికి.. ‘బయట అంతా మంచు, లెక్కించదగ్గ చోటంతా నిప్పు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు వావ్ సూపర్ ఉన్నావు అని కామెంట్స్ చేస్తున్నారు

చైతన్య గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్న సమంత..

చైతన్య గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్న సమంత.. గుడ్ డెసిషన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

 

నేటిధాత్రి:

 

 

 

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ (Shobhitha Dhulipala)తో డిసెంబర్లో రెండో పెళ్లి చేసుకున్నాడు.

సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్ (Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రజెంట్ నిర్మాతగా మారి ‘శుభం’ (Shubham) సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. తన ఫస్ట్ మూవీతోనే ప్రొడ్యూసర్గా సక్సెస్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సామ్ మెడపై వైఎమ్సి (YMC) అనే టాటూ ఉంటుంది.

తన మొదటి సినిమా ‘ఏ మాయ చేశావే’ గుర్తుగా ఆ టాటూ వేయించుకుంది సమంత. గౌతమ్ మీనన్ (Gowtham Menon) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించాడు. ఇక ఈ వైఎమ్సి టాటూ గురించి పలు ఇంటర్వ్యూల్లోనూ సమంత చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియోలో సమంత మెడ పై టాటూ ఎక్కడా కూడా కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్ గుడ్ డెసిషన్ తీసుకున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై సామ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

పూజా హెగ్దే ఎమోషనల్ కామెంట్స్.

చాలా బాధగా ఉంది.. ఇదొక చేదు వార్త.. పూజా హెగ్దే ఎమోషనల్ కామెంట్స్

 

నేటిధాత్రి

 

 

ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) మూవీలో నాగ చైతన్య (Naga Chaitanya) సరసన నటించిన పూజా హెగ్దే(Pooja Hegde)..

తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అంతేకాకుండా యూత్ మనసులో క్రష్ అయిపోయింది.

దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

అలా వచ్చిన చిత్రాలన్నిటిలో నటించి మెప్పించింది.

ఇక అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikuntapuramlo) సినిమాలోని ‘బుట్టబొమ్మ’ (Butta Bomma) సాంగ్తో మరింత ఫేమ్ తెచ్చుకుంది.

అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అలరించిన ఈ బ్యూటీకి సడెన్గా వరుస ప్లాప్స్ రావడం స్టార్ట్ అయ్యాయి.

దీంతో ఐరన్ లెగ్ బిరుదుతో పాటు సినిమా చాన్స్లు కరువయ్యాయి.

దీంతో కొన్ని నెలలు సినిమాలకు దూరం అయిన ఈ బ్యూటీ రీసెంట్గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) నటించిన ‘రెట్రో’ (Retro) మూవీతో మన ముందుకు వచ్చి ఓకే ఓకే అనిపించుకుంది.

ప్రస్తుతం దళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్తో జరుగుతుంది.

ఇక పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ క్రమంలో తాజాగా పూజా హెగ్దే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ..

‘ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి.

కొన్నాళ్లుగా నా లైఫ్ లో విజయం అనే పదానికి అర్థం మారిపోయింది.

కానీ నాకు ఈ టైం చాలా ఇంపార్టెంట్..

భవిష్యత్తులో నేను చేసే సినిమాలు నేను ఎలాంటి నటిని అనేది ప్రేక్షకులకు చూపిస్తాయని అనుకుంటున్నా..

సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన నాలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు..

వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నా కానీ నేను సాధించాల్సింది చాలా ఉంది.

అందరి జీవితంలో హెచ్చుతగ్గులు కచ్చితంగా ఉంటాయి.

మేము నటులం ఫ్లాప్లను కూడా స్వీకరించాలి.

‘బీస్ట్'(Beast) సినిమా తర్వాత ఇప్పుడు ‘జన నాయగన్’ (Jana Nayagan) సినిమాలో నటించడం ఆనందంగా ఉంది.

కానీ ఇది విజయ్ చివరి చిత్రం అవ్వడం ఒకింత బాధగా అనిపిస్తుంది.

నా దృష్టిలో ఇదొక చేదు వార్త.

ఎందుకంటే నాతో పాటు చాలా మంది అభిమానులు విజయ్ సినిమాల్ని ఇష్టపడతారు.

ఒకప్పుడు ఆయన సినిమాల కోసం ఎదురు చూసేవాళ్ళం’ అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం పూజా హెగ్దే చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

విజయ్ సేతుపతి సినిమాకు వెరైటీ టైటిల్ ఫిక్స్.!

పూరి జగన్నాథ్- విజయ్ సేతుపతి సినిమాకు వెరైటీ టైటిల్ ఫిక్స్..?

ఇది అస్సలు ఊహించలేదుగా అంటూ కామెంట్స్

 

నేటిధాత్రి:

 

 

 

 

 

స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్(Poori Jagannath) ప్రస్తుతం హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi)తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటిలానే హీరోయిన్ ఛార్మి (Charmy)తో కలిసి ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నారు. ఇక హీరోయిన్స్ బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే (Radhika Abde), టబు(Tabu)లాంటి బ్యూటీస్ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు ‘బెగ్గర్’ (Beggar) అనే టైటిల్ అనుకుంటున్నారని ఇన్ సైడ్ టాక్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో పూరిజగన్నాథ్ ఈ చిత్రం కోసం ఇప్పుడు ఓ వెరైటీ టైటిల్ను ఖరారు చేశారని తెలుస్తుంది. వివరాలోకి వెళితే..

పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాకు ‘భవతీ భిక్షాందేహి’ (Bhavathi Bhikshandehi) అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. అయితే సాధారణంగా పూరి సినిమాలకు ‘ఇడియట్’, ‘పోకిరి’, ‘లోఫర్’, ‘రోగ్’ ఇలా వెరైటీ టైటిల్స్ ఉంటాయన్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఇప్పుడు భవతి భిక్షాందేహి అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ న్యూస్ తెలిసి పూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతుండగా.. నెటిజన్లు ఇది అసలు ఊహించలేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సమంత తొలి నిర్మాణం ఒక హాస్యాస్పదమైన శైలి.

సమంత తొలి నిర్మాణం ఒక హాస్యాస్పదమైన శైలి.

సుభం’ సినిమా సమీక్ష:నేటిధాత్రి

 

 

 

దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మరియు రచయిత వసంత్ మారింగంటిల తెలుగు చిత్రం వినోదాత్మకమైన ఇండీ-స్టైల్ హర్రర్ కామెడీ మరియు సామాజిక వ్యంగ్యం.

‘సుభం’ చిత్ర తారాగణం | ఫోటో క్రెడిట్: స్పెషల్ అరేంజ్‌మెంట్

ఒక నిరాడంబరమైన సినిమా పెద్దగా ఊగిపోయి హాయిగా ల్యాండ్ అయినప్పుడు అది ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది, మరియు శుభం అనే తెలుగు హర్రర్ కామెడీ కూడా అదే చేస్తుంది. నటి సమంతా రూత్ ప్రభు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రానికి సినిమా బండికి చెందిన ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు మరియు వసంత్ మారింగంటి రచన చేశారు. ఉపరితలంపై, ఇది భయానక కామెడీ, కానీ హృదయంలో, ఇది లింగ సున్నితత్వంపై పదునైన వ్యాఖ్యానం – తెలివైన రచన మరియు మనోహరమైన ప్రదర్శనల ద్వారా మరింత ప్రభావవంతంగా మారింది.

2000ల ప్రారంభంలో, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత భీమిలిలో ఇంటర్నెట్‌కు ముందు రోజుల్లో, కథ కేబుల్ టీవీ ఆపరేటర్ అయిన శ్రీను (హర్షిత్ రెడ్డి) మరియు బ్యాంక్ ఉద్యోగి అయిన శ్రీ వల్లి (శ్రియా కొంఠం) మధ్య జరిగే మధురమైన వికారమైన పెళ్లి చూపులు (ఒక కుదిర్చిన వివాహం)తో ప్రారంభమవుతుంది. ఉపగ్రహ టీవీ అంగుళంలో ప్రవేశించడం ప్రారంభించినప్పుడు కేబుల్ ఇప్పటికీ రాజ్యమేలుతున్న నేపథ్యం – కథనాన్ని ముంచెత్తకుండా నోస్టాల్జియాను జోడిస్తుంది.

పాత తెలుగు సినిమాల ‘సుఖాంతం’ టైటిల్ కార్డులకు గుర్తుగా ‘ సుభం ‘ అనే టైటిల్ ప్రేక్షకులను నిజంగా సంతోషకరమైన కుటుంబం ఎలా ఉంటుందో ఆలోచించమని ఆహ్వానిస్తుంది. ఇక్కడ, సమాధానం చాలా ఆధునికమైనది: లింగ సమానత్వం. స్క్రిప్ట్ సమకాలీన సృజనాత్మక స్వేచ్ఛలను తీసుకున్నప్పటికీ, అది స్థానం నుండి తప్పినట్లు అనిపించదు – దాని స్పర్శ తేలిక, పుష్కలంగా నవ్వులు మరియు 125 నిమిషాల కఠినమైన రన్‌టైమ్‌లో తెలివైన భయానక సన్నివేశాలకు ధన్యవాదాలు.
దర్శకుడు : ప్రవీణ్ కాండ్రేగుల
నటీనటులు : హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్
నిడివి : 125 నిమిషాలు
కథాంశం : ఒక చిన్న పట్టణంలో, స్త్రీలు టెలివిజన్ షో చూస్తున్నప్పుడు వ్యామోహంలో మునిగిపోతారు. పురుషులు పరిష్కారాలను కనుగొనాలి మరియు దానికి వారు తమలో తాము చూసుకోవాలి.

శుభం లో సూక్ష్మమైన లింగ వ్యాఖ్యానం ప్రారంభంలోనే బయటపడటం ప్రారంభమవుతుంది – శ్రీ వల్లి పని చేస్తుంది మరియు మర్యాదపూర్వక శైలికి సరిగ్గా సరిపోదు కాబట్టి పెద్దలు ఆమె వధువుగా సరిపోతుందని ప్రశ్నిస్తారు. ఇంతలో, శ్రీను స్నేహితులు అతనిని ‘ఆల్ఫా మేల్’ ప్రవర్తనలో శిక్షణ ఇస్తారు, అదే వారి భార్యలను ఆకట్టుకునేలా చేయడంలో రహస్యం అని నమ్ముతారు. ఈ క్షణాలు హాస్యంతో సాగుతాయి, ఏదైనా విషపూరిత ఉద్దేశ్యం కంటే పురుషుల అజ్ఞానాన్ని హైలైట్ చేస్తాయి.

తర్వాత, ట్విస్ట్: పట్టణంలోని మహిళలు ఒక మెలోడ్రామాటిక్ టీవీ షో చూస్తున్నప్పుడు వారిపై ఆకర్షితులవుతారు. గందరగోళం గురించి. వ్యంగ్యంగా ప్రారంభమయ్యేది హాస్యాస్పదంగా, భయానకంగా మారే అల్లకల్లోలంగా మారుతుంది, పురుషులు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి తహతహలాడుతుండగా, హాస్యాస్పదమైన మాటలు మరియు హాస్యం.

దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మరియు రచయిత వసంత్ మారింగంటి ఈ చిత్రాన్ని చిన్న పట్టణ విచిత్రాలు – సుపరిచితమైన కబుర్లు, కేబుల్ టీవీ నోస్టాల్జియా మరియు విచిత్రమైన పాత్రలలో – ఎంకరేజ్ చేస్తారు. వివేక్ సాగర్ సంగీతం శృంగారం నుండి భయానక స్థాయికి సులభంగా కదులుతుంది మరియు మృదుల్ సేన్ సినిమాటోగ్రఫీ స్వర మార్పును నైపుణ్యంతో సంగ్రహిస్తుంది.
‘సుభం’ లో సమంత రూత్ ప్రభు | ఫోటో క్రెడిట్: స్పెషల్ అరేంజ్మెంట్

ఈ సినిమాలోని సోప్ ఒపెరా, జన్మ జన్మల బంధం , ఒక తెలివైన కథన పరికరంగా మారుతుంది. కల్పిత సోప్‌లను హాస్యాస్పదంగా ఉపయోగించే ఇటీవలి చిత్రాల మాదిరిగా కాకుండా (మత్తు వడలారా మరియు దాని సీక్వెల్ గుర్తుకు వస్తుంది), శుభం మూడు జంటల మధ్య లింగ గతిశీలతను ప్రతిబింబించేలా చేస్తుంది, ఈ పిచ్చికి బరువును జోడిస్తుంది.

మొదటి అర్ధభాగంలో కొన్ని ప్రశాంతతలు ఉన్నాయి, కానీ కథ త్వరలోనే వేగం పుంజుకుంటుంది. సమంత తన సాధారణ ఇమేజ్‌కు విరుద్ధంగా నటించిన డెడ్‌పాన్ కామియో క్లుప్తంగా ఉన్నప్పటికీ ప్రభావవంతంగా ఉంటుంది. ఆమె మౌనం ఏకపాత్రాభినయం కంటే ఎక్కువ చెబుతుంది.

ఊహించదగిన పరిష్కారం వైపు వెళ్ళవచ్చని మీరు అనుకుంటున్న సమయంలో, ప్రవీణ్ మరియు వసంత్ ఒక ఆశ్చర్యకరమైన మలుపును ఇస్తారు. మీరు సినిమా బండిని చూసినట్లయితే , మీరు క్రాస్ఓవర్‌ను మరింత ఆనందిస్తారు, కానీ మీరు చూడకపోయినా ఇది ఇప్పటికీ పనిచేస్తుంది. ఇది సినిమాటిక్ విశ్వాలకు దర్శకుడు యొక్క ఉల్లాసభరితమైన సమాధానం, ఇది స్వతంత్ర చిత్రాలకు కూడా ఉమ్మడి ప్రపంచాలను కలిగి ఉండవచ్చని మనకు గుర్తు చేస్తుంది.

మెయిల్ మరియు కల్కి 2898 AD లలో ప్రత్యేకంగా నిలిచాడు ) శ్రీనుకి ఆప్యాయతను తెస్తాడు, మరియు శ్రియ కొణతం నిశ్శబ్దంగా దృఢంగా ఉండే శ్రీ వల్లిగా తనదైన శైలిలో నటించాడు. మిగిలిన తారాగణం – గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, మరియు వంశీధర్ గౌడ్ – తమ పాత్రలను అతిగా ప్రదర్శించకుండా వినోదాన్ని పెంచారు.

“రింగ్స్ ఆఫ్ ది లార్డ్” చూస్తున్నానని గర్వంగా చెప్పుకునే పాత్ర వంటి ఒక ఆహ్లాదకరమైన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే, ఒక వదులుగా ఉన్న థ్రెడ్ ఏమిటంటే, స్త్రీలు మొదట ఎందుకు దయ్యాలను పట్టుకుంటారు. ఈ చిత్రం ఒక కారణం చెప్పకుండానే తప్పించుకుంటుంది, బహుశా అది మంచి కోసమే కావచ్చు – కొన్ని విషయాలు వివరించకుండా వదిలేస్తే సరదాగా ఉంటాయి.

శుభమ్ అనేది ‘ఆల్ఫా మేల్స్’ అందరికీ ఒక పదునైన సందేశాన్ని అందించే హారర్-కామెడీ. మరియు ఇది పుష్కలంగా నవ్వులతో ప్రేక్షకులను అలరిస్తుంది.

శుభమ్ ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

ఆకాశాన్ని తాకుతున్న అమ్మడి రెమ్యునరేషన్.

ఆకాశాన్ని తాకుతున్న అమ్మడి రెమ్యునరేషన్

Rukmini Vasanth:నేటి ధాత్రి:

 

 

 

ఇటు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీలో నటిస్తున్న రుక్మిణీ వసంత్ కు బన్నీ – అట్లీ మూవీలో సైతం ఛాన్స్ దొరికిందని వార్తలు వస్తున్నాయి. అందుకే కాబోలు అమ్మడు ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట.

ఆర్మీ ఫ్యామిలీ నుండి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth). ఆమె నటించిన కన్నడ చిత్రం ‘సప్త సాగరాలు దాటి’ (Saptha Sagaralu Daati) రెండు భాగాలుగా విడుదలైంది. ఈ హృద్యమైన ప్రేమకథా చిత్రం ఇతర భాషల్లోకీ డబ్ అయ్యింది. అలానే కొద్ది వారాల గ్యాప్ లోనే ‘సప్త సాగరాలు దాటి’ పార్ట్ వన్ అండ్ టు జనం ముందుకు వచ్చాయి. గాఢమైన ఈ ప్రేమకథా చిత్రంలో రుక్మిణీ వసంత్ తన పాత్ర కోసం ప్రాణం పెట్టేసింది. దాంతో ఈ సినిమా తర్వాత ఆమె డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. తెలుగుతో పాటు పాన్ ఇండియా మూవీస్ లోనూ రుక్మిణీ వసంత్ ను వెతుక్కుంటూ పాత్రలు వెళుతున్నాయి.

సినిమా టికెట్లు

‘సప్త సాగరాలు దాటి’ మూవీ టైమ్ లోనే తెలుగులో నిఖిల్ (Nikhil) సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీకి రుక్మిణీ సైన్ చేసింది. కాస్తంత ఆలస్యంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు పెద్దంత ప్రమోషన్స్ లేకుండానే జనం ముందుకు తీసుకొచ్చారు. దాంతో అది కాస్తా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. చాలామందికి నిఖిల్ అలాంటి ఓ సినిమాలో నటించాడని కానీ కన్నడ హీరోయిన్ రుక్మిణి ఆ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అని కానీ తెలియదు. అయితే చిత్రంగా ప్రశాంత్ నీల్ (Prasanth Neel)… ఎన్టీఆర్ (NTR) తో తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో రుక్మిణీ వసంత్ కు చోటుదక్కింది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం చాలామంది ప్రయత్నాలు చేశారు కానీ చివరికి అదృష్టం రుక్మిణిని వరించింది. 

సినిమా టికెట్లు

అలానే అల్లు అర్జున్ తో అట్లీ తెరకెక్కించబోతున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా మూవీలోనూ రుక్మిణీ వసంత్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని సమాచారం. అదే నిజమైతే… దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న రెండు బెస్ట్ మూవీస్ లో అమ్ముడు నటిస్తుండటం కెరీర్ పరంగా గ్రేట్ అఛీవ్ మెంట్. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తలంపుతో రుక్మిణీ వసంత్ ఇప్పుడు ఏకంగా సినిమాకు మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తోందట. మొన్నటి వరకూ సినిమాకు కోటి రూపాయలు మాత్రమే తీసుకున్న రుక్మీణీ ఇప్పుడు 3నుండి 4 కోట్ల వరకూ అడుగుతోందని అంటున్నారు. ఒకవేళ ఇటు ఎన్టీఆర్ మూవీ లేదా అల్లు అర్జున్ మూవీస్ లో ఒకటి హిట్ అయినా… రుక్మిణి కెరీర్ తారాజువ్వలా పైకి ఎగసిపోతుందని అంటున్నారు. ఇప్పటికే పరభాషా చిత్రాల నుండి వస్తున్న అవకాశాలతో కన్నడ చిత్రాలకు రుక్మిణీ ఎస్ చెప్పలేకపోతోందట. అమ్మడికి లభిస్తున్న డిమాండ్ చూస్తుంటే… అతి తక్కువ సమయంలోనే… నేషనల్ క్రష్ రష్మికా మందణ్ణ సరసన చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. చూద్దాం… ఏం జరుగుతుందో!!

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version