బాసిల్‌కు బన్నీ గ్రీన్‌సిగ్నల్‌.

 బాసిల్‌కు బన్నీ గ్రీన్‌సిగ్నల్‌…

 

పుష్ప అంటే ఇంటర్నేషనల్‌’ అంటూ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌లానే ఇప్పుడు ఆయన ఇమేజ్‌ కూడా ఇంటర్నేషనల్‌ లెవల్‌కు వెళ్లింది. దాంతో ఆయనతో సినిమాలు చేయబోయే దర్శకులు.

పుష్ప అంటే ఇంటర్నేషనల్‌’ అంటూ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌లానే ఇప్పుడు ఆయన ఇమేజ్‌ కూడా ఇంటర్నేషనల్‌ లెవల్‌కు వెళ్లింది. దాంతో ఆయనతో సినిమాలు చేయబోయే దర్శకులు అంటూ రోజుకో పేరు తెరపైకి తెస్తున్నాయి సోషల్‌ మీడియా వర్గాలు. తాజాగా అల్లు అర్జున్‌ను డైరెక్ట్‌ చేయబోతున్న దర్శకుల జాబితాలో మలయాళ డైరెక్టర్‌ బాసిల్‌ జోసెఫ్‌ పేరు చేరింది. ఆయనతో ఓ సినిమా చేసేందుకు బన్నీ ఎస్‌ చెప్పారంటూ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బాసిల్‌ చెప్పిన కథ అల్లు అర్జున్‌కు బాగా నచ్చిందని, త్వరలోనే వీరి కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వస్తుందనేది ఆ వార్తల సారాంశం. బాసిల్‌ జోసఫ్‌ నటుడిగా, దర్శకుడిగా మలయాళ పరిశ్రమలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే అవేవీ అల్లు అర్జున్‌ స్థాయికి తూగేవి మాత్రం కావు. కాబట్టి ఈ ప్రచారంలో నిజానిజాలేమిటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.

 రాజాసాబ్‌కు కష్టం టీమ్‌ హెచ్చరిక.

 రాజాసాబ్‌కు కష్టం టీమ్‌ హెచ్చరిక…

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. ఇప్పుడీ చిత్రానికి  లీకుల కష్టం మొదలైంది. టీజర్‌లోని కొన్ని విజువల్స్‌ను నెట్టింట లీక్‌ చేశారు. దీనిపై టీమ్‌ స్పందించింది.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. (The raja saab) జూన్‌ 16న ఈ సినిమా టీజర్‌ విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇప్పుడీ చిత్రానికి  లీకుల కష్టం మొదలైంది. టీజర్‌లోని కొన్ని విజువల్స్‌ను నెట్టింట లీక్‌ చేశారు. దీనిపై టీమ్‌ స్పందించింది.
లీక్‌ కంటెంట్‌ను షేర్‌ చేసే వాళ్లపై  కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్‌ హెచ్చరించింది. ఎవరైనా ‘రాజాసాబ్‌’ కంటెంట్‌కు సంబంధించిన అనధికారక వీడియోలు, ఫొటోలు, షేర్‌ చేస్తే వారి సోషల్‌ మీడియా అకౌంట్‌ను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సినిమాటిక్‌ అనుభూతి అందించేందుకు చిత్రబృందం ఎంతో కష్టపడుతోందని దానికి అందరూ సహకరించాలని కోరింది.
ప్రభాస్‌ నటిస్తున్న తొలి హారర్‌ చిత్రమిది. దీంతో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. టీజర్‌ను ఈ నెల 16న విడుదల చేయనున్నట్లు టీమ్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్‌లో ఈవెంట్‌ చేయాలను కుంటున్నారని తెలిసింది. మాళవిక మోహనన్‌, నిధీ అగర్వాల్‌, రిద్థికుమార్‌ కథానాయికలు. సంజయ్‌దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

మైండ్ దొబ్బే క్రైమ్ థ్రిల్ల‌ర్‌.. స‌డ‌న్‌గా ఓటీటీకి!.

మైండ్ దొబ్బే క్రైమ్ థ్రిల్ల‌ర్‌.. స‌డ‌న్‌గా ఓటీటీకి! ఎందులో అంటే

 

 

 

 

 

 

ఎలాంటి హాడావుడి లేకుండా, ప్ర‌చార ఆర్బాటాలు లేకుండా రూపొంది గ‌త నెల మే9న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా బ్లైండ్ స్పాట్.

 

 

ఎలాంటి హాడావుడి లేకుండా, ప్ర‌చార ఆర్బాటాలు లేకుండా రూపొంది గ‌త నెల మే9న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా బ్లైండ్ స్పాట్ (Blind Spot).

న‌వీన్ చంద్ర (Naveen Chandra), అలీ రెజా (Ali Reza), రాశి సింగ్ (Rashi Singh), ర‌వి వ‌ర్మ (Ravi Varma), గాయ‌త్రి భార్గ‌వి కీలక పాత్ర‌లు పోషించారు.

మూవీ రిలీజ్ అయ్యాక ప‌బ్లిక్ నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్ప‌టికీ ఎలాంటి ప్ర‌చారం లేక పోవ‌డంతో జ‌నాల‌కు రీచ్‌ కాలేక పోయింది.

ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి ఆశ్చ‌ర్య‌ ప‌రిచింది.

రాకేష్ వర్మ (Rakesh Varma) ఈ సినిమాతో దర్శక‌, ర‌చ‌యిత‌గా ఎంట్రీ ఇచ్చాడు.

యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను రిలీజ్ చేసింది. 

 

సినిమా పుస్తకాలు

Blind Spot

జయరామ్ (రవివర్మ), దివ్య (రాశి సింగ్) భార్యాభర్తలు వీరికి ఓ చిన్న పాప ఉంటుంది.

వీరి ఇంట్లో లక్ష్మి (గాయత్రీ భార్గవి) పని మనిషిగా వ‌ర్క్‌ చేస్తుంటుంది.

అయితే ఒక రోజు రాత్రి దివ్య తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపిస్తుంది.

స‌మాచారం అందుకున్న పొలీసాఫీస‌ర్ విక్రమ్ (నవీన్ చంద్ర) కేసు టేక‌ప్ చేసి ఇంటి కొచ్చి అంతా ప‌రిశీలించి ఇది ఆత్మహత్య కాదు, హత్య అని డిసైడ్ అవుతాడు.

ఈ నేప‌థ్యంలో విక్ర‌మ్ ప‌రిశోధ‌న స్టార్ట్ చేసి ఆ ఫ్యామిలీకి సంబంధించిన ప్ర‌తి ఒక్క‌రినీ ఇంట‌రాగేట్ చేస్తూ వెళుతుంటాడు.

ఈ సంద‌ర్భంగా వారు చెప్పే అన్స‌ర్ సైతం అనుమానాస్ప‌దంగా గోచ‌రిస్తుంటాయి.

వాళ్లు చెప్పే జ‌వాబులు నిజంగా అనిపించినా అందులో ఎక్క‌డో, ఎవ‌రో అబ‌ద్ధం చెబుతున్నార‌ని అనిపిస్తుంటుంది.

ప్రతిసారీ ఓ కొత్త విషయం తెలుసుకుంటాడు.

ఈ నేప‌థ్యంలో విక్ర‌మ్ అస‌లు హంత‌కుడిని ప‌ట్టుకోగ‌లిగాడా, లేదా అస‌లు దివ్య ఎలా చ‌నిపోయిందనే ఇంట్రెస్టింగ్ క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్ తో సాగుతుంది.

కాగా.. ఇది రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే మ‌ర్ట‌ర్ థ్రిల్ల‌ర్ అయిన‌ప్ప‌టికీ చూసే వారికి ప్ర‌తి క్ష‌ణం ఉత్కంఠ‌ను క‌లుగ జేస్తూ త‌ర్వాత ఏం జ‌రుగ‌బోతుంద‌నే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.

ఒక హ‌త్య ప‌ది మంది అనుమానితులు వీరిలో అస‌లు హంత‌కుడిని క‌నిపెట్టే క్ర‌మంలో అంతా అనుమానితులుగా అనిపించ‌డం, పోలీసులు వ్య‌వ‌హ‌రించే విధానం బాగా చూయించారు.

సినిమా ఆరంభ‌మైన తొలి ఐదు నిమిషాల్లోనే డైరెక్ట్ క‌థ స్టార్ట‌వ‌డం చివ‌రి వ‌ర‌కు హంత‌కుడెవ‌ర‌నే పాయింట్‌తో స‌స్పెన్స్‌ను మెయింటెన్ ఏశారు.

Blind Spot

 

 

 

చివ‌రిలో వ‌చ్చే ట్విస్టు లు సైతం అదిరిపోయేలా ఉంటాయి.

ర‌వి వ‌ర్మ‌, ప‌ని మ‌నిషి పాత్ర‌లు కీ రోల్ పోషించాయి.

ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ కు వ‌చ్చేసింది.

ఎక్కువ‌గా మిస్ట‌రీ థ్రిల్ల‌ర్లు ఇష్ట‌ప‌డే వారు ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ బ్లైండ్ స్పాట్ (Blind Spot) చిత్రాన్ని మిస్ చేయ‌కుండా ఫ్యామిలీతో చూసేయ‌వ‌చ్చు.

మిత్రమండలి వినోదం.

మిత్రమండలి వినోదం.

 

 

 

 

 

ప్రియదర్శి, రాగ్‌ మయూర్‌, విష్ణు ఓయ్‌, ప్రసాద్‌ బెహరా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మిత్రమండలి’. నిహారిక ఎన్‌.ఎం కథానాయిక. విజయేందర్‌ ఎస్‌. దర్శకత్వంలో కల్యాణ్‌ మంతిన…

ప్రియదర్శి, రాగ్‌ మయూర్‌, విష్ణు ఓయ్‌, ప్రసాద్‌ బెహరా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మిత్రమండలి’. నిహారిక ఎన్‌.ఎం కథానాయిక. విజయేందర్‌ ఎస్‌. దర్శకత్వంలో కల్యాణ్‌ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. నిర్మాత బన్నీ వాసు, బీవీ వర్క్స్‌తో కలసి సమర్పిస్తున్నారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్‌ ‘మిత్రమండలి’ టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బన్నీ వాసు సమర్పిస్తున్న తొలి చిత్రం ఇది. టీజర్‌ చాలా బావుంది. దర్శకుడిలో ఎంతో ప్రతిభ ఉందని అర్థమవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి’ అని ఆకాంక్షించారు. బన్నీ వాసు మాట్లాడుతూ ‘వినోదాత్మకంగా, ఉల్లాసంగా సాగే నలుగురు స్నేహితుల కథ ఇది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. థియేటర్లకు వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకోండి’ అన్నారు. ‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కంటెంట్‌తో వస్తున్నాం’ అని విజయేందర్‌ ఎస్‌. అన్నారు. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమిదని నిర్మాతలు తెలిపారు.

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను తక్షణమే నిలిపివేయాలి.

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను తక్షణమే నిలిపివేయాలి.

 

 

 

 

 

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ఆపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫూల్‌ రాంరెడ్డి చెప్పారు…

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ఆపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫూల్‌ రాంరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను ఆంధ్రా సినిమాలకు ఇవ్వవద్దని హైకోర్టులో ఫిటిషన్‌ వేశామని, శుక్రవారం వాదనలు వినిపించబోతున్నామని వారు చెప్పారు. కోర్టు ద్వారా తెలంగాణ సినిమాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు.

సీనియర్‌ నిర్మాత మహేంద్ర కన్నుమూత.

సీనియర్‌ నిర్మాత మహేంద్ర కన్నుమూత

 

 

 

 

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు రవికుమార్‌ చౌదరి మరణించిన 24 గంటలు కాకముందే సీనియర్‌ నిర్మాత, ఎ.ఎ.ఆర్ట్స్‌ అధినేత కావూరి మహేంద్ర(79) గురువారం…

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు రవికుమార్‌ చౌదరి మరణించిన 24 గంటలు కాకముందే సీనియర్‌ నిర్మాత, ఎ.ఎ.ఆర్ట్స్‌ అధినేత కావూరి మహేంద్ర(79) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న మహేంద్ర తన స్వస్థలమైన గుంటూరులోని రమేశ్‌ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. నటుడు, నిర్మాత మాదాల రవి ఆయనకు అల్లుడు. కుమారుడు జీతూ కొన్నేళ్ల క్రితమే మరణించారు. ప్రొడక్షన్‌ మేనేజర్‌గా కెరీర్‌ ప్రారంభించిన మహేంద్ర తర్వాత నిర్మాణరంగంలోకి ప్రవేశించి గీతా ఆర్ట్‌ పిక్చర్స్‌, ఎ.ఎ. ఆర్ట్స్‌ బేనర్లపై 36 చిత్రాలు నిర్మించారు. 1977లో వచ్చిన ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ నిర్మాతగా మహేంద్ర తొలి సినిమా. రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘అర్జున’ ఆయన చివరి చిత్రం.

యుద్ధభూమిలో యోధుడు.

యుద్ధభూమిలో యోధుడు

 

 

 

 

 

 

గోపీచంద్‌ కథానాయకుడిగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘గోపీచంద్‌ 33-వర్కింగ్‌ టైటిల్‌’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు…

గోపీచంద్‌ కథానాయకుడిగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘గోపీచంద్‌ 33-వర్కింగ్‌ టైటిల్‌’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూపొందించిన భారీసెట్లో చిత్రీకరణ జరుగుతోంది. గోపీచంద్‌ పుట్టిన రోజు సందర్భంగా గురువారం చిత్రబృందం పోస్టర్‌ను, గ్లింప్స్‌ను విడుదల చేసింది. గోపీచంద్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించారు. యుద్ధభూమిలో వీరతిలకం ధరించిన యోధుడిగా ఆయన కనిపించారు. ఏడో శతాబ్దానికి చెందిన ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని ఓ పాయింట్‌తో సంకల్ప్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని యూనిట్‌ తెలిపింది.

ఓటీటీకి వ‌చ్చేసిన‌.. కేసరి ఛాప్ట‌ర్2!

ఓటీటీకి వ‌చ్చేసిన‌.. కేసరి ఛాప్ట‌ర్2!

డ‌య్య‌ర్‌ను.. ఢీకోట్టిన‌ శంకరన్‌ నాయర్ స్టోరి

 

 

 

రెండు నెల‌ల క్రితం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన బాలీవుడ్ చిత్రం కేసరి ఛాప్ట‌ర్ 2

రెండు నెల‌ల క్రితం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన బాలీవుడ్ చిత్రం కేసరి ఛాప్ట‌ర్ 2 (Kesari Chapter 2).

అక్ష‌య్ కుమార్ (Akshay Kumar), మాద‌వ‌న్ (R. Madhavan), అన‌న్యా పాండే Ananya Panday) కీల‌క పాత్ర‌ల్లో న‌టించగా క‌ర‌ణ్ త్యాగ్ (Karan Singh Tyagi) ర‌చన‌, ద‌ర్శ‌క‌త్వం చేశారు.

ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ (Dharma Productions) బ్యాన‌ర్‌పై క‌ర‌ణ్ జోహార్ (Karan Johar) మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌ల‌తో క‌లిసి నిర్మించారు.

హిస్టారిక‌ల్ కోర్ట్ రూ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం సుమారు 50 రోజుల త‌ర్వాత‌ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వస్తే..

1919లోబ్రిటీష్ హాయాంలో జ‌రిగిన దారుణ మార‌ణ‌ కాండ‌ జ‌లియ‌న్ వాలా బాగ్‌కు మూల కార‌కుడైన అప్ప‌టి పంజాబ్ జ‌న‌ర‌ల్ మైఖైల్ ఓ డ్వేయ‌ర్ ఆ వార్త బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండా చేస్తాడు.

ఆపై త‌మ‌కు అనుకూలంగా రిపోర్టు ఇవ్వాల‌ని ఆ స‌మ‌యంలో వైస్రాయ్‌ కౌన్సిల్‌లో సభ్యుడైన‌ అడ్వ‌కేట్ శంకరన్‌ నాయర్‌ (అక్షయ్‌ కుమార్‌)ను డ్వేయ‌ర్ కోరుతాడు.

కానీ ఆక్క‌డ జ‌రిగిన మార‌ణ‌కాండ విష‌యం తెలుసుకున్న ఆయ‌న అందుకు స‌సేమిరా అని అక్క‌డిక్క‌డే త‌న ప‌ద‌వికి సైతం రాజీనామా చేసి డ‌య్య‌ర్‌పైనే కేసు వేస్తాడు.

 

Kesari Chapter 2

 

దీంతో జ‌న‌ర‌ల్ మ‌రో ప్ర‌ముఖ అడ్వ‌కేట్‌ నెవిల్లే మెక్‌కిన్లే (ఆర్‌.మాధవన్‌)ని ఆశ్ర‌యించ‌డంతో కేసు ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది.

ఈ క్ర‌మంలో శంక‌ర్ నాయ‌ర్‌, మెక్‌కిన్లేల మ‌ధ్య ఎలాంటి వాద‌న‌లు జ‌రిగాయి, నాటి దురాగ‌తాన్ని ఎలా బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌జేశారు.

చివ‌ర‌కు క‌థ ఎన్ని మ‌లుపులు తిరిగిందనే క‌థ‌క‌థ‌నాల చుట్టూ సినిమా సాగుతూ నాటి జ‌లియ‌న్ వాలాబాగ్ దుర్ఘ‌ట‌న‌ను త‌లుచుకుని ఎమోష‌న‌ల్‌గా ఫీల‌య్యే విధంగా మూవీ న‌డుస్తుంది.

ఇప్పుడీ చిత్రం జూన్ 13 శుక్ర‌వారం నుంచి జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో ఈ సినిమా చూడ‌లేక పోయిన వారు, మల్లీ చూడాల‌నుకునే వారు ఇప్పుడు ఎలాంటి స‌మ‌స్య లేకుండా ఇంటి ప‌ట్టునే ఉంటూ ఫ్యామిలీతో క‌లిసి ముఖ్యంగా పిల్ల‌ల‌కు నాటి జ‌లియ‌న్ వాలా బాగ్‌ ఘ‌ట‌న‌ను తెలియ‌జేస్తూ మూవీ వీక్షించ‌వ‌చ్చు.

డోంట్ మిస్ ఇట్‌.

ముందే ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చిన‌ లేటెస్ట్‌ స్పొర్ట్స్‌ కామెడీ మూవీ.

ముందే ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చిన‌ లేటెస్ట్‌ స్పొర్ట్స్‌ కామెడీ మూవీ…

 

ప్రేమ‌లు హీరో నస్లెన్ మ‌రో ముగ్గురు యువ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా థియేట‌ర్లలో మంచి విజ‌యం సాధించిన మ‌ల‌యాళ అనువాద చిత్రం ఓ రోజు ముందే ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చింది.

ప్రేమ‌లు హీరో నస్లెన్ (Naslen) మ‌రో ముగ్గురు యువ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో ఏప్రిల్ నెలాఖ‌రున థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి పాజిటివ్ టాక్‌తో విజ‌యం సాధించిన మ‌ల‌యాళ అనువాద చిత్రం అలప్పుజ జింఖానా (Alappuzha Gymkhana). తెలుగు క‌న్నా ముందే ఏప్రిల్ 10న కేర‌ళ‌లో రిలీజైన ఈ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ సొంతం చేసుకుంది. గ‌తంలో టొవినో థామ‌స్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌ కాంబోలో త‌ల్లుమాల (Thallumaala) అనే సినిమాతో కేర‌ళ‌ను షేక్ చేసిన ఖ‌లీద్ ర‌హ‌మాన్ (Khalid Rahman) ఈ చిత్రాన్ని నిర్మించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం. కేవ‌లం రూ.5 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ చిత్రం రూ. 70 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు చేసి కేర‌ళ‌ నాట‌ హ‌య్యెస్ట్ గ్రాసింగ్ చిత్రాల్లో టాప్5లో నిలిచింది. సుమారు 55 రోజుల త‌ర్వాత ముంద‌స్తుగా ప్ర‌క‌టించిన డేట్ క‌న్నా ఓ రోజు ఎర్లీగానే ఈ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి షాకిచ్చింది.
సినిమా టికెట్లు

క‌థ విష‌యానికి వ‌స్తే.. జోజో జాన్సన్ (నెస్లన్), డీజే, చిరుత‌, పెద్దోడు, చిన్నోడు, సెహ‌నావాస్ ఐదుగురు చిన్న‌ప్ప‌టి నుంచి స్నేహితులు. అయితే ఇంట‌ర్ ఫలితాల్లో ఒక‌రు మాత్ర‌మే పాస్ అవుతారు.ఇక రెగ్యుల‌ర్‌గా కాలేజికి వెళ్లి చ‌దువుకోవ‌డం మ‌న వ‌ళ్ల‌ కానీ ప‌ని అని డిసైడ్ అయి కొత్త‌గా ఏదైనా ట్రై చేయాల‌ని నిర్ణ‌యించుకుంటారు. అందుకోసం బాక్సింగ్ పోటీల్లో పాల్గొని స్పోర్ట్స్ కోటాలో కాలేజీలో పాస్ మార్కుల‌తో బ‌య‌ట ప‌డొచ్చ‌ని ఫ్లాన్ చేస్తారు. ఈక్ర‌మంలో స‌మీపంలోని జింఖానా బాక్సింగ్ ఆకాడ‌మీలో శిక్ష‌ణ‌ కోసం చేరుతారు. ఈ నేప‌థ్యంలో ట్రైనింగ్ తీసుకునే క్ర‌మంలో వారు ఆ ప‌ని స‌రిగ్గా చేయ‌లేక, సీరియ‌స్‌నెస్ లేక‌ బాక్సింగ్‌ కోచ్ ముందు, అమ్మాయిల ఎదుట‌ చేసే విన్యాసాలు, జిమ్మిక్కులు ఆపై డిస్ట్రిక్‌ లెవ‌ల్‌, స్టేట్ లెవ‌ల్ టోర్న‌మెంట్స్ ఆడాల్సి రావ‌డంతో చివ‌ర‌కు ఆ కుర్రాళ్లు ఏం చేశారు, చివ‌ర‌కు ఎలా ముగించార‌నే ఆస‌క్తిక‌ర క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

 

కాగా ఈ చిత్రం ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఫుల్ ఫ‌న్ మోడ్‌లోనే సాగుతూ ప్రేక్ష‌కుల‌కు తీరిక ఇవ్వ‌ని వినోదంతో ఆక‌ట్టుకుంటుంది. అయితే మూవీలో ఫ‌లానా వాడు హీరో అని చెప్ప‌లేం. న‌స్లైన్ త‌ప్ప అంద‌రూ మ‌న‌కు ఏమాత్రం ప‌రిచ‌యం లేని మొహాలే అయినా ఐదుగురి పాత్ర‌ల‌కు స‌మ ప్రాధాన్య‌త ఉంటుంది. వారి చుట్టే క‌థ తిరుగుతూ వారి న‌ట‌న‌, డైలాగులు, వ‌న్ లైనర్స్ వాటినన్నింటినీ మ‌రిచి పోయేలా చేస్తుంది. మూవీ స్టార్ట్ అయిన నిమిషం నుంచే పంచులు, తెలుగు ఫేమ‌స్ మీమ్స్ అలేఖ్య ఫికిల్స్ టేస్ట్ చూయించాలి, వేణు స్వామి వ‌ద్ద జాత‌కం చూపించి చెప్పాలా వంటి వ‌న్ లైన‌ర్స్ తో కిక్ ఇస్తారు. ఫ‌స్టాఫ్ అంతా బాక్సింగ్ ట్రైనింగ్‌, అమ్మాయిల‌కు సైట్ కొట్టే స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో న‌వ్విస్తారు.

ఇక సెకండాఫ్ అంతా బాక్సింగ్ కోర్టులో యాక్ష‌న్ సీన్ల‌తో ఆటాడేసుకుంటారు. మిత్రులు ఒక్కొక్క‌రు బాక్సింగ్ రింగ్‌లోకి వెళ్లే ముందు తోటి మిత్రులు ఇచ్చే బిల్డ‌ప్‌లు, వ‌చ్చేపాట‌, డైలాగులు సీటులో కూర్చోనియ‌కుండా న‌వ్విస్తాయి. ఎక్క‌డా అస‌భ్య‌త‌, అశ్లీల‌త‌ల‌కు చోటివ‌కుండా పాత్ర‌ల మ‌ధ్య సంద‌ర్భోచిత‌ కామెడీతో ఆల‌రిస్తారు.ఇక క్లైమాక్స్ హీరో ఇంట్లో స‌న్నివేశం సినిమాకే హైలెట్‌. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో అదిరిపోతుంది. ఇప్పుడీ సినిమా జూన్ 12 నుంచి సోనీల లివ్ (SONY LIV) ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. చివ‌రి వ‌ర‌కు మంచిగా ఎలాంటి బాద‌ర‌బందీ లేకుండా హాయిగా మ‌న‌స్పూర్తిగా న‌వ్వుకోవాలంటే, ఎలాంటి లాజిక్‌లు వెత‌క్కుండా కుటుంబం అంతా క‌లిసి ఈ సినిమా చూసి తీరాల్సిందే.

ఒకేసారి నాలుగు ఓటీటీల్లోకి వెన్నులో వ‌ణుకు పుట్టించే సినిమా!

ఒకేసారి నాలుగు ఓటీటీల్లోకి.. వెన్నులో వ‌ణుకు పుట్టించే సినిమా!

డోంట్ మిస్‌

 

 

 

 

 

 

 

 

 

 

ఇటీవ‌ల వెబ్ సిరీస్‌ల‌లో వ‌రుస హిట్ల‌తో మంచి క్రేజ్‌తో దూసుకెళుతూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఫాలోయింగ్ సంపాందించుకున్న న‌టుడు న‌వీన్ చంద్ర‌.

 

ఇటీవ‌ల వెబ్ సిరీస్‌ల‌లో వ‌రుస హిట్ల‌తో మంచి క్రేజ్‌తో దూసుకెళుతూ థ్రిల్ల‌ర్ సినిమాలంటే త‌న‌కంటూ స్పెష‌ల్ ఫాలోయింగ్ సంపాందించుకున్న న‌టుడు న‌వీన్ చంద్ర‌ (Naveen Chandra).

 

ఆయ‌న హీరోగా న‌టించిన చిత్రం ఎలెవ‌న్ (Eleven) గ‌త నెల‌లో..

 

 

మే16న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి మంచి పాజిటివ్ టాక్‌తో మ‌స్ట్ వాచ్ మూవీగా పేరు తెచ్చుకుంది.

 

 

క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో రూపొందిన ఈ సినిమాలో రేయ హ‌రి (Reyaa Hari), అభిరామి (Abhirami) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

 

 

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సుంద‌ర్ సీ వ‌ద్ద అనేక సినిమాల‌కు అసిస్టెంట్‌గా ప‌నిచేసిన లోకేశ్ అజిల్స్ (Lokkesh Ajls) ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం చేశారు. ఇప్పుడీ సినిమా ఓటీటీకి వ‌చ్చేసింది.

 

క‌థ విష‌యానికి వ‌స్తే..

 

అరవింద్‌ (నవీన్‌ చంద్ర) విశాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా, స్మార్ట్‌ పోలీసుగా మంచి గుర్తింపును తెచ్చుకుంటాడు.

 

అయితే నగరంలో జ‌రుగుతున్న వరుస హత్యల కేసుని డీల్‌ చేస్తున్న పోలీస్‌ అధికారి రంజిత్‌ (శశాంక్‌) రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆ బాధ్య‌త‌ అరవింద్‌ తీసుకుంటాడు.

 

ఆపై కూడా వ‌రుస హత్యలు కొనసాగుతూనే ఉన్నా హంతకుడు, హత్యకి గురైనవాళ్ల ఆనవాళ్లు ఆధారాలు ఎంత‌కీ ల‌భించ‌వు.

 

 

ఈ క్ర‌మంలో చివ‌ర‌కు ఆరో హ‌త్య‌ దగ్గర ల‌భించిన‌ ఓ చిన్న క్లూతో కేసులో కదలిక వచ్చి ఒక్కొక్క‌రిగా హత్యకు గురైన వాళ్ల వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

 

 

కానీ హత్యలు చేసేది ఎవరనే విష‌యం మాత్రం తెలియ‌దు.

 

చివ‌ర‌కు అరవింద్ ఏం చేశాడు.

 

హంతుకుడిని పట్టుకో గ‌లిగాడా?

లేదా అతను ఈ దారుణాలు చేయడానికి కారణమేంటి?

ట్విన్‌ బర్డ్‌ స్కూల్‌కి, 6 మంది కవలలకి ఈ హత్యలకు సంబంధం ఏంటి?

 

ఈ కథలో బెంజిమన్‌ పాల్‌, ఫ్రాన్సిస్‌ ఎవరు?

అన్నది కథ.

 

సినిమా ఆరంభమైన 10 నిమిషాల‌లోనే ఇన్వెస్టిగేష‌న్ మొద‌లై..

 

ప్రేక్ష‌కులకు స్పైన్ చిల్లింగ్ ఇస్తూ సినిమా ఆద్యంతం స‌స్పెన్స్ తో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.

 

అంతేగాక సీరియ‌ల్ కిల్ల‌ర్ బ్యాగ్రౌండ్ స్టోరీ ఎమోష‌న‌ల్‌గా ట‌చ్ చేస్తుంది.

 

మ‌రి కొన్ని ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు సైతం ఆక‌ట్టుకుంటాయి.

 

ఇక ఫ్రీ ఇంట‌ర్వెల్‌కు ముందే కిల్ల‌ర్ బ‌య‌ట‌ప‌డ్డప్ప‌టికీ చివ‌ర్లో వ‌చ్చే ట్విస్టు సైతం గూస్‌బ‌మ్స్ తెచ్చేలా ఉంటుంది.

 

 

ఇప్పుడీ సినిమా జూన్ 13 శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లోనే కాకుండా మ‌రో మూడు ఓటీటీల్లో (ఆహా త‌మిళ్, టెన్ కొట్టా, సింప్లీ సౌత్‌) స్ట్రీమింగ్ అవుతోంది.

 

థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, మంచి థ్రిల్ల‌ర్ చిత్రం చూడాల‌నుకునే వారు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ ఎలెవ‌న్ (Eleven) సినిమాను మిస్ అవ‌కుండా చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

 

ఇదిలాఉంటే న‌వీన్ చంద్ర న‌టించిన మ‌రో థ్రిల్ల‌ర్ బ్లైండ్ స్పాట్ సైతం ఈ సినిమా విడుద‌ల రోజే థియేట‌ర్ల‌లోకి రాగా ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌ కూడా ఓకే రోజు రావ‌డ‌డం గ‌మ‌నార్హం.

 

సినిమా రివ్యూవ‌ర్ల‌పై.. ద‌య్యం ప‌గ‌!

సినిమా రివ్యూవ‌ర్ల‌పై.. ద‌య్యం ప‌గ‌! డీడీ నెక్స్ట్‌ లెవెల్ ఓటీటీకి వ‌చ్చేసింది

 

 

పాపుల‌ర్ త‌మిళ క‌మెడియ‌న్ సంతానం హీరోగా న‌టించిన కొత్త చిత్రం ‘డీడీ నెక్స్ట్‌ లెవెల్’ ఓటీటీకి తెలుగులోనూ వ‌చ్చేసింది.

పాపుల‌ర్ త‌మిళ క‌మెడియ‌న్ సంతానం (Santhanam) హీరోగా న‌టించిన కొత్త చిత్రం ‘డీడీ నెక్స్ట్‌ లెవెల్’ (DD Next Level).

సెల్వ రాఘవన్ (Selva raghavan), గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon), గీతికా తివారి (Geethika Tiwary) తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ (S. Prem Anand) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

గ‌తంలో సంతానం న‌టించిన హ‌ర్ర‌ర్, కామెడీ సినిమా డీడీ రిట‌ర్న్స్ కి సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మే16న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ప‌రాజ‌యం పాలైంది.

ఇప్పుడీ సినిమా నెల తిర‌గ‌కుండానే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించే కృష్టమూర్తి (సంతానం) త‌రుచూ కొత్త సినిమాల రివ్యూలు ఇస్తూ అందరి మ‌న్న‌న‌లు అందుకుంటుంటాడు.

ఒకసారి ‘డీడీ నెక్స్ట్‌ లెవెల్’ అనే సినిమా స్క్రీనింగ్‌కు హాజరు కావాలని మూవీ ఫ్యార‌డైజ్ అనే థియేట‌ర్ నుంచి కృష్టమూర్తి, మ‌రికొంత‌మంది రివ్యూవ‌ర్స్‌కి ప్రత్యేక ఆహ్వానం వస్తుంది.

దీంతో ఈ సినిమా చూడ‌డానికి కృష్ణ‌మూర్తి అక్క‌డ చిక్కుకుపోతాడు.

గ‌తంలో త‌న రివ్యూ వ‌ళ్ల న‌ష్ట‌పోయిన నిర్మాత ద‌య్యంగా మారి ట్రాప్ చేసి ఇక్క‌డ‌కు తీసుకు వ‌చ్చిన‌ట్లు తెలుసుకుంటాడు.

అక్క‌డ నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు గానీ సాధ్య ప‌డ‌దు..

పైగా ఆ థియేట‌ర్లో ర‌న్ అవుతున్న సినిమాల్లో వ‌చ్చి ప‌డ‌తాడు. 

ఈక్ర‌మంలో కృష్ణ‌మూర్తి ఆ సినిమాలో నుంచి ఆపై ద‌య్యం, థియేట‌ర్‌ నుంచి ఎలా బ‌య‌ట ప‌డ్డాడ‌నే నేప‌థ్యంలో సినిమా సాగుతుంది.

విన‌డానికి, చూడ‌డానికి ఈ మూవీ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉన్న‌ప్ప‌టికీ స్క్రీన్ ప్లే ప‌రంగాఫెయిల్ అయి సెకండాఫ్ కాస్త ఇబ్బంది పెడుతుంది.

అయినా ఒక సారి ఈ సినిమాను చూసేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

ఇప్పుడీ చిత్రం జీ5 (zee 5) ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగు ఇత‌ర సౌత్ భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

హ‌ర్ర‌ర్ చిత్రాలు ఇష్ట‌ప‌డే వారు ఒక‌సారి ఈ ‘డీడీ నెక్స్ట్‌ లెవెల్’ (DD Next Level) చిత్రాన్ని ట్రై చేయ‌వ‌చ్చు.

విజ‌య్‌సేతుప‌తి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఎస్ స‌డ‌న్‌గా ఓటీటీ స్ట్రీమింగ్కు వ‌చ్చి షాకిచ్చింది.

విజ‌య్‌సేతుప‌తి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఎస్ స‌డ‌న్‌గా ఓటీటీ స్ట్రీమింగ్కు వ‌చ్చి షాకిచ్చింది.

గ‌త నెల మే23న త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో థియేట‌ర్ల‌లోకి మిశ్ర‌మ స్పంద‌న‌ను ద‌క్కించుకున్న రొమాంటిక్ క్రైమ్ డ్రామా చిత్రం ఏస్ (Ace). విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi), రుక్మిణి వ‌సంత్ (Rukmini Vasanth), దివ్యాపిళ్లై (Divya Pillai), యోగిబాబు (Yogi Babu), ఫృథ్వీ రాజ్‌ (బ‌బ్లూ) (Babloo Prithiveeraj) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అర్ముగ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సామ్ సీఎస్ (Sam C. S), జ‌స్టిన్‌ప్ర‌భాక‌ర‌న్ (Justin Prabhakaran) సంగీతం అందించారు. అయితే పూర్ ప‌బ్లిసిటీ వ‌ళ్ల అటు త‌మిళంలో, ఇటు తెలుగులో ప్రేక్ష‌కుల‌కు చేరువ కాలేక ఈ చిత్రం డిజాస్ట‌ర్‌గా మిగిలింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి షార్ చేసింది.

 

క‌థ విష‌యానికి వ‌స్తే.. బోల్ట్ క‌న్న‌న్ జైలు నుంచి రిలీజై కొత్త జీవితం స్టార్ట్ చేసేందుకు మ‌లేషియా వెళ‌తాడు. అక్క‌డ జ్ఞానందం సాయంతో అక్క‌డే ఉంటూ క‌ల్ప‌న అనే యువ‌తి హోట‌ల్‌లో ప‌ని చేస్తుంటాడు. మ‌రోవైపు మ‌లేసియా పోలీసుగా ప‌ని చేసే కామంధుడైన పెంపుడు తండ్రి రాజా దొరైతో ఇబ్బందులు ప‌డుతూ ఓ బ‌ట్ట‌ల షాప్‌లో ప‌ని చేస్తూ ఉంటుంది రుక్మిణి. అయితే త‌ను అడిగిన డ‌బ్బు ఇస్తే వ‌దిలేస్తాన‌ని చెప్ప‌డంతో ప‌లుచోట్ల ప‌ని చేస్తూ డ‌బ్బు కూడ‌బెడుతూ ఉంటుంది. సేమ్ అపార్ట్‌మెంట్‌లో ఉండ‌డంతో బోల్ట్ క‌న్న‌న్‌, రుక్మిణిల మ‌ధ్య ప‌రిచయం ప్రేగా మారుతుంది.

ఇదిలాఉంటే.. ఓ వైపు క‌ల్ప‌న హోట‌ల్ కోసం తీసుకున్న లోన్ డ‌బ్బులు తిరిగి క‌ట్ట‌లేక పోతుండ‌డం, మ‌రో వైపు రుక్మిణి తన పెంపుడు తండ్రి నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి డ‌బ్బులు అవ‌స‌రం ప‌డ‌డంతో క‌న్న‌న్ వారి స‌మ‌స్య‌లు తీర్చేందుకు నిర్ణ‌యించుకుంటాడు. ఈక్ర‌మంలో లోక‌ల్‌గా అక్ర‌మ వ్యాపారుల మ‌ధ్య‌కు వెళ్లి క్యాసినో త‌ర‌హా గేమ్‌లు ఆడి ల‌క్ష‌ల్లో బ‌కాయి ప‌డ‌తారు. అయితే త‌మ డ‌బ్బు కోసం ప్రాణాలు తీసే వారి నుంచి హీరో ఎలా బ‌య‌ట ప‌డ్డాడు, అస‌లు హీరో ఆ గేమ్‌లు ఎందుకు ఆడాడు, క‌ల్ప‌న‌, రుక్మిణిల స‌మ‌స్య‌లు తీర్చాడా, అక్క‌డ జ‌రిగిన బ్యాంక్ రోబ‌రికి క‌న్న‌న్‌కు మ‌ధ్య ఉన్న లింకేంటి అనే క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతూ ఆక‌ట్టుకుంటుంది.

 

అయితే. సినిమాలో త‌ర్వాత‌ ఏం జ‌రుగ‌బోతుంద‌నేది మ‌న‌కు ముందే తెలుస్తున్నా చూసే ప్రేక్ష‌ల‌కు మాత్రం ఎక్క‌డా బోర్ కోట్ట‌కుండా విజ‌య్ సేతుప‌తి, యోగిబాబు పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. వారి మ‌ధ్య వ‌చ్చే సంభాష‌ణ‌లు డార్క్ కామెడీతో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. విల‌న్ల‌తో హీరో ఆడే గేమ్ కూడా స‌ర‌దాగా సాగుతుంది. బ్యాంక్ దొంగ‌త‌నం, క‌న్న‌న్ వేసే ఎత్తులు అన్నీ మంచి క్యూరియాసిటీని క‌లుగ జేస్తాయి. ఇప్పుడీ సినిమా జూన్ 13, శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideoIN) ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి ఫ‌న్ రైడ్ మూవీ చూడాల‌నుకునే వారికి ఈ ఏస్ (Ace) సినిమా మంచి ఆఫ్సన్‌. ఎక్క‌డా ఎలాంటి అస‌భ్య‌త లేకుండా సినిమా అలా స‌రదాగా సాగి పోతూ ఉంటుంది.

NTR – War 2: పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా లుక్స్‌..

NTR – War 2: పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా లుక్స్‌..

 

వార్‌-2 (War 2) చిత్రం తారక్‌ (Jr NTR) బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

 

వార్‌-2 (War 2) చిత్రం తారక్‌ (Jr NTR) బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల టీజర్‌ విడుదల చేయగా దానికి చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. టీజర్‌లో ఎన్టీఆర్‌ లుక్‌, స్టైలింగ్‌ అదిరిందనే ప్రశంసలు వచ్చాయి. ఆ క్రెడిత్‌ మొత్తం అనైతా ష్రాఫ్‌ అడజానియాకే (Anaita Shroff Adajania) దక్కుతుంది. తన కాస్ట్యూమ్స్‌కి, తన పని తనానికి వచ్చిన ప్రశంసని, అభిమానుల నుంచి వచ్చిన ప్రేమను చూసి ‘వార్‌ 2’ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ఆనందంతో మునిగి తేలుతున్నారు. దేశంలోనే అత్యుత్తమ స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందిన అనైతా ఈ మేరకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

‘‘వార్‌ 2’లో మొదటిసారి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో పని చేయడం పూర్తిగా సంతోషాన్ని ఇచ్చింది. అదొక కొత్త అనుభూతి. ఆయన సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తే ఆ ఎనర్జీ అంతా అందరిలోకి వచ్చేస్తుంటుంది. ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉందనిపిస్తుంది. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంతో ఉల్లాసంగా ఉంచుతారు. ఆపై అతను పోషిస్తున్న పాత్రలో ఎన్నో రకాల లేయర్స్‌ ఉంటాయి. అందుకే ఎన్టీఆర్‌ కోసం చాలా లుక్స్‌ డిజైన్‌ చేశాం. ఆయన పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేశాం. ఓ లక్ష్యంతో, ఉద్దేశ్యంతో పనిచేసే మానవ యంత్రంలా చూపించే ప్రయత్నం చేశాం’’ అని అన్నారు. ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రమిది. కియారా అద్వానీ కథానాయిక. ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో వార్‌ 2 భారీ ఎత్తున విడుదల కానుంది.

నలుగురు హీరోయిన్లతో జయం రవి హీరోగా, నిర్మాతగా.. 

నలుగురు హీరోయిన్లతో జయం రవి హీరోగా, నిర్మాతగా.. 

 

కోలీవుడ్‌లో రవి మోహన్‌కు(జయంరవి) ఉండే క్రేజ్‌ అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లు హీరోగా అందరినీ మెప్పించిన ఆయన ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 

కోలీవుడ్‌లో రవి మోహన్‌కు(జయంరవి) ఉండే క్రేజ్‌ అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లు హీరోగా అందరినీ మెప్పించిన ఆయన ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన హీరోగా, నిర్మాతగా రానున్న ‘బ్రోకోడ్‌’ (Brocode) చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ ప్రకటించారు. ‘డిక్కీలోనా’, ‘వడక్కుపట్టి రామసామి’ వంటి చిత్రాలతో పేరొందిన కార్తీక్‌ యోగీ దర్శకత్వంలో ‘బ్రోకోడ్‌’ చిత్రం తెరకెక్కనుంది. నలుగురు ప్రముఖ మహిళా నటులతో పాటు ఎస్‌.జె. సూర్య కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నారు. స్ల్లాప్‌ స్టిక్‌ కామెడీ అంశాలతో కూడిన ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రవి మోహన్‌ (Ravi Mohan) స్టూడియోస్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు జయం రవి. మహిళా నటీమణులు ఎవరనేది త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. రవి మోహన్‌ ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’, గణేష్‌ కె. బాబు డైరెక్ట్‌ చేస్తున్న ‘కరాటే బాబు’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా గురించి దర్శకుడు కార్తీక్‌ యోగీ మాట్లాడుతూ.. ‘నేను రవి మోహన్‌కి కథ చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. ఆయన ఈ కథను పూర్తిగా ఆస్వాదించారు. ఈ చిత్రంలో స్లాప్‌ స్టిక్‌ కామెడీ బేస్డ్‌ సినిమా ఇది. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ అందించేలా రూపొందిస్తున్నాం’’ అని అన్నారు. పోర్‌ తోజిల్‌ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన కలైసెల్వన్‌ శివాజీ, యానిమల్‌, అర్జున్‌ రెడ్డి వంటి విజయాలను అందించిన హర్షవర్థన్‌ ఈ ప్రాజెక్ట్‌ కోసం పని చేయనున్నారు. ఎడిటర్‌గా ప్రదీప్‌ ఇ. రాఘవ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఎ. రాజేష్‌ వ్యవహరించనున్నారు.

మరింత వెనక్కి దేవరకొండ సినిమా!

మరింత వెనక్కి దేవరకొండ సినిమా!
సినిమా పుస్తకాలు

Kingdom: నేటి ధాత్రి

 

 

 

 

 

జూలై 4న రావాల్సిన విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ మూవీ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. జూలై నెలాఖరుకు ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని సమాచారం.

Kingdom: మరింత వెనక్కి దేవరకొండ సినిమా!

ఇవాళ భారీ తెలుగు సినిమాలన్నీ విఎఫ్ఎక్స్ (VFX) మీదనే ఎక్కువగా డిపెండ్ అవుతున్నాయి.

ఆ వర్క్ కాస్తంత ఆలస్యమైనా…

పోస్ట్ ప్రొడక్షన్ లో ఊహకందని జాప్యం ఏర్పడుతోంది.

దాంతో సినిమాలను ముందు ప్రకటించిన తేదీకి విడుదల చేయలేని నిస్సహాయ స్థితిలోకి నిర్మాతలు జారిపోతున్నారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కారణంగానే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా పూర్తి కావడం లేట్ అయ్యిందన్నది వాస్తవం.

అయితే… పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చి, షూటింగ్ పూర్తి చేసినా…

విడుదల మరోసారి వాయిదా పడింది.

ఇప్పుడు దానికి కారణం సకాలంలో కాని వీఎఫ్ఎక్స్ పనులు.

జూన్ 12న జనం ముందుకు రావాల్సిన ఈ మూవీ ఇప్పుడు వాయిదా పడింది.

ఎప్పుడు వస్తోందో మేకర్స్ ఇంకా చెప్పలేకపోతున్నారు. సినిమా పుస్తకాలు

 

ఇదిలా ఉంటే… విఎఫ్ఎక్స్ కారణంగానే పలుమార్లు వాయిదా పడిన ‘కన్నప్ప’ (Kannappa) సినిమా ఎట్టకేలకు ఈ నెల 27న విడుదల అవుతోంది.

అలానే అనేక సార్లు పోస్ట్ పోన్ అయిన నితిన్ ‘తమ్ముడు’ (Thammudu) సినిమాను జూలై 4న విడుదల చేస్తున్నారు.

నిజానికి ఇదే తేదీన విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ (Kingdom) సైతం రావాల్సి ఉంది.

కానీ ఇప్పుడు ఆ తేదీన అది రావడం లేదని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా బాలెన్స్ ఉందని తెలుస్తోంది.

ఇప్పటి నుండి నాన్ స్టాప్ గా టీమ్ వర్క్ చేస్తే…

జూలై 25న ఈ సినిమాను విడుదల చేసే ఆస్కారం ఉందట.

మొదట్లో జూలై 24న చిరంజీవి ‘విశ్వంభర’ విడుదల కావచ్చుననే వార్తలు వచ్చాయి.

కానీ ఆ సినిమా విఎఫ్ఎక్స్ కూడా ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మళ్ళీ చేస్తున్నారు.

సో… అవి ఒక కొలిక్కి వచ్చే వరకూ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ గురించి ఆలోచించవద్దని చిరంజీవే స్వయంగా చెప్పాడని అంటున్నారు.

దాంతో జూలై 25వ తేదీ స్లాట్ దాదాపుగా ఖాళీ ఉన్నట్టే!

కేవలం హోంబలే ఫిల్మ్స్ ‘మహావతార్ నరసింహా’ అనే పాన్ ఇండియా మూవీ మాత్రం ఆ రోజున వస్తుందని గతంలో ప్రకటించారు.

సో… విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’కు జూలై 25 బెస్ట్ డేట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరి ఈ విషయమై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

పవన్‌తో హరీశ్‌ శంకర్‌ ఫ్లో మొదలైంది..

పవన్‌తో హరీశ్‌ శంకర్‌ ఫ్లో మొదలైంది..

 

 

నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, అటు రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇటు పూర్తి చేయాల్సిన సినిమాలపైన దృష్టిపెట్టారు.

 

నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan), అటు రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇటు పూర్తి చేయాల్సిన సినిమాలపైన దృష్టిపెట్టారు. ఇటీవల ఓ షెడ్యూల్‌తో హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేశారు. తదుపరి ఓజీ సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. ఇప్పుడు ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagath singh) వంతు వచ్చింది. హరీశ్‌ శంకర్‌(HariSh Shankar) దర్శకత్వంలో ఎప్పుడో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌ మళ్లీ ప్రారంభం కానుంది. మంగళవారం నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలు కానుందని తెలిసింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో షూటింగ్‌ జరగనుంది. ప్రస్తుతం సినిమాలో కీలక పాత్రధారులపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. తదుపరి ఈ నెల 12 నుంచి పవన్‌కల్యాణ్‌ సెట్‌లో అడుగుపెడతారని తెలిసింది.

 ఈ సినిమా అనుకున్నప్పుడు ‘తెరీ’ మూవీ రీమేక్ అనుకున్నారు. ఏపీ ఎలెక్షన్ ముందు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు
అందుకు తగ్గట్టుగా డైలాగ్స్ సీన్స్ రాసుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం కాబట్టి కంప్లీట్ గా సీన్స్, డైలాగ్స్ మార్చారని సమాచారం. మార్పులు చేర్పులు చేసిన కథతో సెట్స్‌ మీదకెళ్లనున్నారని సమాచారం.
 అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే దర్శకుడు స్పందించాల్సిందే. పవన్‌ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సెట్‌లో అడుగుపెట్టబోతున్నారని తెలియగానే అభిమానులు హంగామా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక.

 

 

టీవీల్లో రాబోతున్న నాని వయొలెంట్ మూవీ!

Hit -3: టీవీల్లో రాబోతున్న నాని వయొలెంట్ మూవీ!

 

 

నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ -3’ మూవీ బుల్లితెరలోనూ ప్రత్యక్షం కాబోతోంది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను టీవీ ఛానెల్స్ లో ప్రసారం కోసం రీ-సెన్సార్ కు మేకర్స్ అప్లయ్ చేశారని తెలుస్తోంది.

 

 

నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన ‘హిట్ -3’ (Hit -3) సినిమాను అతని కెరీర్ లోనే కాదు… తెలుగులో వచ్చిన అత్యంత హింసాత్మక చిత్రం అని విశ్లేషకులు కొందరు వ్యాఖ్యానించారు. నాని గత చిత్రాలకు భిన్నంగా ఇది ‘ఎ’ సర్టిఫికెట్ ను పొందింది. ఈ విషయాన్ని స్వయంగా నానినే ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్స్ లో తెలిపారు. చిన్న పిల్లలు, వయసులో మరీ పెద్ద వాళ్ళు ‘హిట్ -3’కి దూరంగా ఉండాలని, కథానుగుణంగా వయొలెన్స్ ను ఈ సినిమాలో పెట్టక తప్పలేదని వివరణ ఇచ్చాడు. మానసికంగా నాని అండ్ టీమ్ ప్రేక్షకులను అంతలా ప్రిపేర్ చేసినా… థియేటర్లలో ‘హిట్ -3’ చూసిన వాళ్ళు అవాక్కయ్యారు.

 

నాని సినిమాలో ఇంత దారుణమైన సన్నివేశాలు ఉన్నాయేమిటీ అని వాపోయారు. ప్రస్తుతం వివిధ భాషల్లో ఈ తరహా హింసాత్మక చిత్రాలు బాగానే ప్రేక్షాకరణ పొందుతున్నాయని కొందరు చెబుతూ, అందుకు ఉదాహరణగా మలయాళ చిత్రం ‘మార్కో’ను, హిందీ సినిమా ‘కిల్’ను ఉదహరించారు. తెలుగు వారికి ‘హిట్ -3’ మరో ‘మార్కో’ (Marco) లేదా ‘కిల్’ (Kill) అని సరిపెట్టుకోవాలని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. థియేటర్లలో ‘హిట్ -3’ని చూసి హింసను తట్టుకోలేక నోరు వెళ్లబెట్టిన చాలామంది… మే నెలాఖరులో ఓటీటీ (OTT) కి సెన్సార్ ఉండదు కాబట్టి నెట్ ఫ్లిక్స్ (Netfilx) లో ‘హిట్ -3’ అన్ ఎడిటెడ్ వర్షన్ చూసి ఖంగుతిన్నారు. ఓటీటీలో ఈ సినిమాను చూసిన తర్వాత… థియేట్రికల్ వర్షన్ చాలా బెటర్ గా ఉందని భావించారు.

 

 

ఇక ఇప్పుడు టీవీలో…

 

చిత్రం ఏమంటే… ‘హిట్ -3’ సినిమాలోని హింస గురించి సినీ గోయర్స్ లో అంతగా ప్రచారం జరిగిన తర్వాత కూడా ఈ మూవీ మేకర్స్ ‘హిట్ -3’ని టీవీలో స్క్రీనింగ్ చేయడానికి సిద్థపడ్డారట. నిజానికి ‘ఎ’ సర్టిఫికెట్ పొందిన సినిమాలను ఏ ప్రైవేట్ టీవీ ఛానెల్స్ కూడా ప్రసారం చేయవు. ఖచ్చితంగా యు/ఎ సర్టిఫికెట్ పొందాల్సిందే. అందుకే ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చిన చిత్రాలను నిర్మాతలు ‘యు/ఎ’ కన్వర్షన్ కోసం మళ్ళీ సెన్సార్ కు అప్లయ్ చేస్తారు. ‘హిట్ -3’ సినిమా నిర్మాతలు సైతం ఇప్పుడు ‘యు/ఎ’ సర్టిఫికేషన్ కోసం తిరిగి సెన్సార్ బోర్డ్ ను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ‘హిట్ -3’ మూవీ విడుదలకు ముందు ‘మా సినిమాను కేవలం పెద్దలకు మాత్రమే తీశాం, ఈ హింసను తట్టుకునే ధైర్యం ఉన్నవాళ్ళే థియేటర్లకు రండి, ఇది అందరి కోసం తీసిన సినిమా కాదు’ అని అంతగా గట్టిగా చెప్పిన హీరో నాని… ఇప్పుడు ఈ సినిమాను టీవీల్లో ప్రసారం చేయడానికి ఎందుకు తహతహ లాడుతున్నాడో!? ఈ సినిమాకు ఆయన కూడా నిర్మాతే కాబట్టి… టీవీ ఛానెల్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎందుకు వదులుకోవాలని నానికి బహుశా అనిపించి ఉండొచ్చు. దారుణమైన హింస ఉన్న కారణంగా ‘హిట్ -3’కి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బృందం… ఇప్పుడు ‘యు/ఎ’ కోసం ఎలాంటి కసరత్తులు చేస్తుంది? రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ సినిమాను టీవీ వీక్షకుల కోసం ఎంత ఎడిట్ అవుతుందనేది చూడాలి!?

ద్విభాషా చిత్రంలో సునీల్‌

ద్విభాషా చిత్రంలో సునీల్‌

 

రాజ్‌తరుణ్‌ హీరోగా తమిళ దర్శకుడు, ‘గోలి సోడా’ ఫేమ్‌ విజయ్‌ మిల్టన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించునున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో…
రాజ్‌తరుణ్‌ హీరోగా తమిళ దర్శకుడు, ‘గోలి సోడా’ ఫేమ్‌ విజయ్‌ మిల్టన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించునున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సునీల్‌ నటించనున్నారని మేకర్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా విజయ్‌ మిల్టన్‌ మాట్లాడుతూ ‘‘సినిమాలో సునీల్‌ చేయనున్న పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోంది. ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునే పాత్ర ఇది’’ అని తెలిపారు. చిత్ర టైటిల్‌ను ఈ నెల 15న ప్రకటించనున్నారు.

హరిహరి వీరమల్లు విడుదలపై మేకర్స్‌ క్లారిటీ

హరిహరి వీరమల్లు విడుదలపై మేకర్స్‌ క్లారిటీ

 

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara veeramallu) చిత్రం పార్ట్‌ 1 ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara veeramallu) చిత్రం పార్ట్‌ 1 ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొత్త విడుదల తేది ఎప్పుడా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. దాంతో నెట్టింట రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. జులై తొలి వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయని కొందరు అంటుంటే.. జూన్‌ 26న రిలీజ్‌ కానుందని ఓవర్సీస్‌కు చెందిన ఓ డిస్ర్టిబ్యూషన్‌ సంస్థ పోస్టు పెట్టింది. సంబంధిత పోస్టర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై మేకర్స్‌ ఎక్స్‌ వేదికగా స్పందించి రూమర్స్‌కు చెక్‌ పెట్టారు. ‘‘హరిహర వీరమలుల్ల’  రిలీజ్‌ డేట్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న పోస్ట్‌లను నమమకండి. మా సోషల్‌ మీడియా ఖాతా ద్వారా మరికొన్ని రోజుల్లోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. అప్పటి వరకూ మీ ప్రేమ, మద్దతు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం’’ అని నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పేర్కొంది. నాలుగేళ్ల క్రితం క్రిష్‌ దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం పలు కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యమైంది. ఆ తర్వాత సినిమా క్రిష్‌ చేతుల నుంచి జ్యోతికృష్ణ చేతికి వచ్చింది.  నిధి అగర్వాల్‌ ఈ చిత్రంలో కథానాయిక. . అనుపమ్‌ ఖేర్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రలు పోషించారు.

అఖిల్ రిసెప్షన్.. మహేష్ టీ షర్ట్ ధరపై చర్చ

అఖిల్ రిసెప్షన్.. మహేష్ టీ షర్ట్ ధరపై చర్చ

 

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu).. రీల్ లోనే కాదు రియల్ గా కూడా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాడు.

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu).. రీల్ లోనే కాదు రియల్ గా కూడా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాడు. ప్రస్తుతం SSMB29 సినిమాతో బిజీగా ఉన్న మహేష్ తాజాగా అఖిల్ అక్కినేని(Akhil Akkineni) రిసెప్షన్ లు కుటుంబ సమేతంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాడు. మహేష్ తో పాటు నమ్రత(Namrata) , సితార కూడా ఈ వేడుకలో సందడి చేశారు. అఖిల్- జైనబ్ వివాహం జూన్ 6 న జరిగిన విషయం తెల్సిందే. ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో సింపుల్ గా ఈ వివాహం జరిగింది. ఇక జూన్8 న వవీరి రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించారు.

 

ఇండస్ట్రీ నుంచి స్టార్ సెలబ్రిటీలు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో మహేష్ బాబు సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారాడు. ఎంతో సింపుల్ గా కనిపించినా.. అందరి చూపు మహేష్ పైనే ఉంది అని చెప్పొచ్చు. ఇక మహేష్ ధరించిన టీ షర్ట్ ను చూసి ముచ్చటపడిన అభిమానులు.. అలాంటి టీ షర్ట్ నే కొనడానికి, దాని రేటు ఎంత అని గూగుల్ చేసి ఖంగు తిన్నారు.

ఆలివ్ గ్రీన్ కలర్ లో ఫ్లవర్ డిజైన్ తో ఉన్న టీ షర్ట్ హెర్మ్స్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ తయారుచేసింది. దీని విలువ అక్షరాలా రూ. 1.51 లక్షలు. నమ్మడానికి వీలు లేకున్నా అది నిజం. అది సూపర్ స్టార్ రేంజ్. మొదటి నుంచి మహేష్ బయటకు చాలా సింపుల్ గా వచ్చినా చాలా కాస్ట్లీ దుస్తులు ధరిస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు షాక్ లు ఇస్తూనే ఉంటాడు. ఇక టీ షర్ట్ ధర లక్షల్లో ఉండడంతో నెటిజన్స్.. ఆమ్మో ఒక్క టీ షర్ట్ ధర అంతనా అని నోర్లు వెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version