యంగ్ హీరోస్ పరిస్థితేంటీ…

యంగ్ హీరోస్ పరిస్థితేంటీ…

 

 

 

 

 

 

 

 

 

shine junior college

 

 

 

 

 

 

 

 

 

 

మొన్నటి దాకా సందడి చేసిన టాలీవుడ్ యంగ్ హీరోస్ సడెన్ గా సైలెంట్ అయిపోయారు. హంగామా వద్దు – కష్టించడమే ముద్దు అనుకుంటున్నారు. మరి వీరిలో కష్టానికి ప్రతిఫలం దక్కించుకునే హీరోలెవరో చూద్దాం.

 

 

 

 

 

 

వెలుగు – చీకటి, కష్టం – సుఖం, మంచి – చెడు – ఎంత వ్యతిరేకమైనా పక్కపక్కనే ఉంటాయి. అదే తీరున నిశ్శబ్దం వెనకాలే శబ్దం కూడా చోటు చేసుకొని ఉంటుంది. ప్రస్తుతం ఓ గ్రాండ్ సక్సెస్ కోసం తపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోస్ (Tollywood Young Heros) అందరూ సైలెంట్ గానే కనిపిస్తున్నారు. తమ చిత్రాలతోనే సౌండ్ చేయాలని వీరు నిర్ణయించినట్టు అనిపిస్తోంది. అలాంటి వారిలో విశ్వక్ సేన్ (Vishwaksen), సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), వరుణ్ తేజ్ (Varun Tej), సుధీర్ బాబు (Sudheer Babu), ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) ఉన్నారు.

 

 

 

 

 

 

 

వీరందరూ ‘హంగామా వద్దు – కష్టపడడమే ముద్దు’ అనే సూత్రాన్ని నమ్మి సాగుతున్నట్లు అనిపిస్తోంది. ఆ మధ్య వరుస సినిమాలతో హంగామా చేసిన విశ్వక్ సేన్ తన తాజా చిత్రం ‘ఫంకీ’ని పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. ఓ సారి సినిమా పూర్తయ్యాకే ‘ఫంకీ’ ప్రమోషన్స్ లో కనిపించాలని విశ్వక్ సేన్, ఆ సినిమా డైరెక్టర్ అనుదీప్ భావిస్తున్నారట. మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ సైతం కామ్ గానే సాగుతున్నారు. ఆయన నటిస్తోన్న మూవీ ‘ఇండో కొరియన్ హారర్ కామెడీ’తో తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకు మేర్లపాక గాంధీ డైరెక్టర్. రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాకే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని వరుణ్, గాంధీ భావిస్తున్నారు. ‘జటాధర’ సినిమాలో నటిస్తోన్న సుధీర్ బాబు సైతం ప్రస్తుతం సైలెన్స్ నే ఆశ్రయించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రచార పర్వం ప్రారంభమయ్యాకే సుధీర్ నోరు విప్పే ఛాన్స్ కనిపిస్తోంది.

 

 

 

 

 

 

ఇక మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే ‘క’తో కనికట్టు చేసిన ఈయన ‘దిల్ రూబా’ పరాజయంతో కామ్ అయిపోయారు. ఇటీవల ‘కే ర్యాంప్’ సినిమా పూర్తి చేసిన కిరణ్ ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల పైనే అబ్బవరం ఫుల్ హోప్ పెట్టుకున్నాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. ఎలాంటి అప్డేట్స్ లేకుండా చిత్రీకరణ సాగుతోంది. ఇక అల్లరికి కేరాఫ్ అడ్రస్ గా నిలచిన సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’ పరాజయంతో కుదేలయ్యారు. ప్రస్తుతం ‘తెలుసు కదా’లో నటిస్తున్న సిద్ధూ ఈ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. మొన్నటి వరకూ భలేగా సందడి చేసిన ఈ యంగ్ హీరోస్ అందరూ ఒకేసారి హంగామా వద్దు అనుకోవడం విశేషమే. మరి ఈ యువ కథానాయకుల్లో ఎవరెవరు ఏ సినిమాతో హిట్ కొడతారో చూద్దాం.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో హవీష్‌ .

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో హవీష్‌

 

shine junior college

 

 

 

 

 

హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

 

 

యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్ (Havish), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు (Trinadha Rao Nakkina) కాంబోలో క్రేజీ మూవీ ఒకటి రూపుదిద్దుకుంటోంది.

 

 

‘నువ్విలా (Nuvvila), జీనియస్, రామ్ లీలా, సెవెన్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హవీష్‌. అలానే ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా (Dhamaka), మజాక (Mazaka)’ వంటి చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్ లో త్రినాథరావు నక్కిన కూ మంచి పేరుంది. వీరిద్దరి కలయికలో నిఖిల్ కోనేరు సినిమాను నిర్మిస్తోంది.

 

 

హవీష్‌ మూవీ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటోందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను ఈ నెల 19న రిలీజ్ చేయబోతున్నామని నిర్మాత నిఖిల కోనేరు తెలిపారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా.. నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

కోలీవుడ్ హీరో ఆర్య ఇంట్లో ఐటీ దాడులు..

కోలీవుడ్ హీరో ఆర్య ఇంట్లో ఐటీ దాడులు.. 

shine junior college

 

 

 

 

 

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య(Arya) నివాసంలో ఐటీ దాడులు నిర్వహించారు.

 

 

కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య(Arya) నివాసంలో ఐటీ దాడులు నిర్వహించారు. ఎప్పటికప్పుడు ఆర్య ఇలాంటి వివాదాల్లోనే ఇరుక్కుంటూ  ఉంటాడు. గతంలో ఒక  మహిళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఒక వ్యాపారవేత్తతో కలిసి రెస్టారెంట్ బిజినెస్ చేస్తూ  పన్ను ఎగ్గొట్టినట్లు గుర్తించిన అధికారులు నేడు ఆయనకు సంబంధించిన  వ్యాపార సంస్థలతో పాటు నివాసంలో కూడా ఐటీ దాడులను నిర్వహించారు. చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీ షెల్ రెస్టారెంట్స్ లో కూడా ఈ దాడులను నిర్వహిస్తున్నారు. 

 

 

 

చెన్నైలోని అన్నా నగర్, కొట్టివాకం వేలచెరి, కిల్పాక్ ప్రాంతాల్లో ఉన్న సీ షెల్ రెస్టారెంట్స్ లో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి.  ఈ రెస్టారెంట్ చైన్ కు ఆర్యకు సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే గతంలో ఈ రెస్టారెంట్స్ అన్నింటిని.. వ్యాపారవేత్త అయినా కున్హి మూసాకు విక్రయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.  ఇక కున్హి మూసా పై ఐటీ అధికారులు నిఘా పెట్టడంతో అది ఆర్య వరకు తీసుకొచ్చిందని సమాచారం. అందుకే ఆయన ఆఫీస్, ఇంట్లో కూడా అధికారులు  దాడులను నిర్వహించారు. ఇంకోపక్క ఆర్య తన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని, అంతేకాకుండా పన్ను కట్టకుండా  తిరుగుతున్నాడని కూడా అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ దాడుల గురించి ఆర్య మాట్లాడుతూ.. ” ఆ రెస్టారెంట్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రెస్టారెంట్ యజమాని నేను కాదు.. అతను వేరే వ్యక్తి.” అంటూ చెప్పుకొచ్చాడు. 

 

ఇక ఆర్య గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. రాజారాణి సినిమాతో ఆర్య తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ఇక ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్బింగ్  అవుతూ వస్తుంది.  ఇక ఆర్య ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో ఆయన చివరగా నిర్మించిన సినిమా ఎనిమీ. విశాల్, ఆర్య నటించిన ఈ సినిమా తమిళ్ లో విజయాన్ని అందుకుంది కానీ తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

 

ఇక ఆర్య.. హీరోయిన్ సయేషా సైగల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సయేషా తెలుగులో అక్కినేని అఖిల్ డెబ్యూ చిత్రంగా వచ్చిన అఖిల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక అఖిల్ తరువాత సయేషా తెలుగులో కనిపించలేదు.  ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. ప్రస్తుతం సయేషా రీఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. 

పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్

పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్

 

shine junior college

 

 

 

 

 

నాలుగు పదుల వయసులోనూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది త్రిష. అయితే విజయాలు మాత్రం ఆమెను చూసి ముఖం చాటేస్తున్నాయి. ఆమె వరుసగా ఆరు పరాజయాలను తన ఖాతాలో వేసుకుంది.

 

 

 

 

 

త్రిష కృష్ణన్ (Trisha Krishnan) కెరీర్ కు ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకుంటున్న సమయంలో ఫినిక్స్ పక్షిలా ఉవ్వెత్తున పైకి లేస్తూ వస్తోంది. నాలుగు పదుల వయసులోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ ను అందిపుచ్చుకుంటూ తన అభిమానులను అలరిస్తోంది. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ’96’ సినిమాలో కొత్త త్రిషను చూశారు సినీ జనం. ఆమె అభిమానులు సైతం త్రిషలోని ఆ క్యూట్ యాంగిల్ ను చూసి అవాక్కయ్యారు. మళ్ళీ మరోసారి ఆమెను ఆరాధ్యదేవతగా కొలవడం మొదలు పెట్టారు. అలా త్రిష తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఈ మధ్య కాలంలో ఇంత లాంగ్ రన్ కెరీర్ ను ఎంజాయ్ చేసిన హీరోయిన్లు పెద్దంతగా కనబడటం లేదు.

 

 

 

 

 

 

 

 

ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ రెండు భాగాలలోనూ త్రిష కీలక పాత్రలను పోషించింది. ఐశ్వర్యారాయ్, ఐశ్వర్య లక్ష్మీ, శోభిత దూళిపాళ్ల తదితరులు ఇందులో నటించినా… వీరందరి కంటే త్రిష పాత్రకే అత్యధిక ప్రాధాన్యం ఆ రెండు భాగాల్లోనూ ఉంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఘన విజయం సాధించకపోయినా… ఫర్వాలేదనిపించింది. అయితే… ఆ తర్వాత వరుసగా త్రిష పరాజయాలనే చవిచూస్తూ వచ్చింది. ‘పొన్నియన్ సెల్వన్ -2’ తర్వాత వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘ది రోడ్’ పరాజయం పాలైంది. ఉమెన్ సెంట్రిక్ గా తెరకెక్కిన ఈ సినిమా త్రిషకు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత వచ్చిన దళపతి విజయ్ ‘లియో’ సైతం త్రిషను నిరాశ పర్చింది. విజయ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ కారణంగా మూవీకి ఓపెనింగ్స్ వచ్చినా… అది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

 

 

 

 

 

 

 

 

విజయ్ మరో సినిమా ‘గోట్’లో త్రిష అతిథిపాత్రలో మెరిసింది. ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఫర్వాలేదనిపించింది కానీ ఆ విజయాన్ని త్రిష ఖాతాలో వేయలేదు. ఇక ఆ తర్వాత మలయాళ చిత్రం ‘ఐడెంటిటీ’లో త్రిష కీలక పాత్రను పోషించింది. ఇది కూడా ఎబౌ ఏవరేజ్ మూవీగానే ఉండిపోయింది. దీని తర్వాత అజిత్ హీరోగా నటించిన రెండు సినిమాల్లో త్రిష నటించింది. అందులో మొదటిది ‘విడుముయార్చి’ కాగా రెండోది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. బ్యాక్ టు బ్యాక్ వచ్చిన ఈ రెండు సినిమాలు అభిమానులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. దాంతో ఈ యేడాది వచ్చిన మూడు సినిమాలూ త్రిషకు బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ నే ఇచ్చాయని చెప్పాలి.

 

 

 

 

 

 

 

 

 

 

ఈ యేడాది త్రిష నటించిన నాలుగో చిత్రంగా ఇటీవలే ‘థగ్ లైఫ్’ వచ్చింది. కమల్ హాసన్ తోనూ, శింబుతోనూ గతంలో త్రిష సినిమాలు చేసింది. అలానే మణిరత్నం తోనూ ‘పొన్నియన్ సెల్వన్’ చేసింది. అయితే ఈ అందరూ మళ్లీ కలిసి చేసిన ‘థగ్ లైఫ్’ కూడా ఘోర పరాజయం పాలైంది. దాంతో త్రిష ఫ్లాప్స్ లో హ్యాట్రిక్ పూర్తి చేసినట్టు అయ్యింది. ఈ యేడాది ఆమెకు ఇది వరుసగా నాలుగో పరాజయం.

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రస్తుతం త్రిష… మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ మూవీలో చేస్తోంది. గతంలో ‘స్టాలిన్’లో కలిసి నటించిన త్రిష చాలా కాలం తర్వాత ఈ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది కానీ ఆలస్యమైపోయింది. ఎప్పుడు విడుదల అయ్యేది ఇంకా మేకర్స్ రివీల్ చేయలేదు. మరి ‘విశ్వంభర’ తో త్రిష తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.

చైతన్య జ్ఞాపకాలతో కన్ఫ్యూజ్ చేస్తున్న సమంత

చైతన్య జ్ఞాపకాలతో అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్న సమంత 

 

shine junior college
సమంత వెనుక మెడ కింద ఏ మాయ చేసావే కి గుర్తుగా YMC అనే అక్షరాలను టాటూ వేయించుకుంది.
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తుందా.. ? అంటే నిజమే అనే మాట వినిపిస్తుంది. అంతలా ఆమె ఏ విషయంలో కన్ఫ్యూజ్ చేసింది అని అంటే.. తాన్ మాజీ భర్త నాగ చైతన్య(Naga Chaithanya) గుర్తులను చెరిపేసిందా.. ? లేదా అనే విషయంలో అన్నమాట. ఏ మాయ చేసావే(Ye Mayaa Chesave) సినిమాతో సామ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా తరువాత స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక ఏ మాయ చేసావే సినిమాలో తనతో రొమాన్స్ చేసిన నాగ చైతన్యనే సామ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లి తరువాత అక్కినేని ఇంటి పెద్ద కోడలిగా ఆమె మంచి హోదానే అందుకుంది. ఆ సమయంలోనే తన ప్రేమకు గుర్తుగా ఒంటిపై మూడు టాటూలు వేయించుకుంది.  ఇక కలకాలం కలిసి ఉంటారన్న ఈ జనతా నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి చై ను సామ్ మర్చిపోలేక బాగా సతమతమవుతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే వస్తున్నాయి. ఇక ఇప్పటికే చై గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తూ వస్తుందని.. ఆమె నడుము పై భాగంలో ఉన్న చై అనే టాటూను రిమూవ్ చేయించిందని వార్తలు వచ్చాయి.

ఇక  ఈ మధ్యనే ఆమె ఇంకో టాటూను కూడా చెరిపివేసిందని వార్తలు వచ్చాయి. ఆమె వెనుక మెడ కింద ఏ మాయ చేసావే కి గుర్తుగా YMC అనే అక్షరాలను టాటూ వేయించుకుంది. ఆ సినిమా వలనే  చై తో పరిచయం ఏర్పడిందనే గుర్తుగా  ఆ టాటూను వేయించుకుంది. ఇక మొన్నటికి మొన్న ఒక వీడియోలో ఆ టాటూ కనిపించకపోవడంతో.. చై గుర్తుగా ఉన్న చివరి టాటూను కూడా సామ్ చెరిపేసి కొత్త జీవితాన్ని మొదలుపెడుతుందని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా బాంద్రాలో సామ్ జిమ్ అవుట్ ఫిట్ లో ఆమె కారు ఎక్కుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో YMC  టాటూ క్లియర్ గా కనిపించింది. అంటే మొన్న వీడియోలో సామ్ ఆ టాటూను మేకప్ తో కవర్ చేసిందని తెలుస్తోంది.  నిజంగా ఆమె ఈ టాటూస్ ను చెరిపివేయలేదని.. కావాలనే అప్పుడప్పుడు సామ్  ఇలా మేకప్ వేసి  ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తుందని తెలుస్తోంది. దీంతో నెటిజన్స్  ఆమె తీరుపై మండిపడుతున్నారు. ఎప్పుడు ఒకేలా ఉండాలని.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలనుకున్నప్పుడల్లా టాటూ గేమ్  ఆడుతున్నావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే సామ్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. 

రశ్మికతో కలిసి మళ్లీ దొరికిపోయాడు…

రశ్మికతో కలిసి మళ్లీ దొరికిపోయాడు…

 

shine junior college

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రశ్మిక మందణ్ణ మధ్య సాగుతున్న ప్రేమాయాణం ఇవాళ మొదలైందేమీ కాదు. అయితే వీరిద్దరూ ఆ విషయాన్ని ఇంతవరకూ అధికారికంగా మాత్రం చెప్పలేదు. దాంతో ఎక్కడైనా వీరిద్దరు కలిసి కనిపిస్తే పాపరాజీలకు అది పండగలా ఉంది.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నేషనల్ క్రష్‌ (National crush) రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) మధ్య సాగుతున్న ప్రేమాయణం గురించి ఇవాళ కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. కొన్నేళ్ళుగా సాగుతున్నదే. అయితే తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమానుబంధం గురించి రశ్మిక బయటపడినట్టుగా విజయ్ దేవరకొండ మాత్రం బయట పడటం లేదు. వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాడు.

రశ్మిక మాత్రం అవకాశం కుదిరినప్పుడల్లా విజయ్ ఫ్యామిలీతో తనకున్న బాండింగ్ ను విడమర్చి, విపులంగా చెబుతోంది. ఎవరు ఆ రిలేషన్ షిప్ గురించి ప్రశ్నించినా… సంకోచం లేకుండా దాచుకోకుండా డైరెక్ట్ గా చెప్పడం లేదు కానీ ఇన్ డైరెక్ట్ గా అందరికీ తెలిసిందేగా అనేస్తోంది. రశ్మిక ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా… ఆమె చుట్టు పక్కల విజయ్ దేవరకొండ లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా? అని పరికించి చూడడం అందరికీ అలవాటైపోయింది. అలానే విజయ్ దేవరకొండ ఫారిన్ ట్రిప్ వేసినా… అదే ప్లేస్ కు రశ్మిక కూడా వెళ్ళే ఉంటుందనే సందేహంతో ఆమె సోషల్ మీడియాను సెర్చ్ చేయడం కామన్ అయిపోయింది. ఏ మాత్రం హింట్ దొరికినా… ఇద్దరు ప్రేమికులు కలిసే వెళ్ళారోచ్ అంటూ ఆధారాలతో ఆ ఫోటోలను పెట్టడం పరిపాటిగా మారింది.

తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. విజయ్ దేవరకొండ, రశ్మిక మందణ్ణ ఇద్దరూ ముంబై ఎయిర్ పోర్ట్ నుండి వస్తున్న ఫోటో ఒకటి నిన్న రాత్రి నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైట్ కలర్ డ్రస్ లో రశ్మిక ఉండగా, బ్లూ కలర్ డ్రస్ లో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఇద్దరూ ముఖాలకు మాస్క్ పెట్టుకున్నారు. ఎయిర్ పోర్ట్ బయట కారు ఎక్కుతుండగా కొందరు దీనిని సెల్ లో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విజయ్ దేవరకొండ ఇప్పుడు ‘కింగ్ డమ్’ (Kingdom) మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూలై నెలాఖరులో లేదా ఆగస్ట్ లో విడుదల కాబోతోంది. అలానే రశ్మిక నటించిన ‘కుబేర’ (Kubera) సినిమా 20వ తేదీ జనం ముందుకు వస్తోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులను మరింత వెయిట్ చేయించకుండా ఈ జంట ఎప్పుడు తమ ప్రేమకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందో చూడాలి.

భయపడి అడుగు ఆపకే

భయపడి అడుగు ఆపకే

 

shine junior college

నితిన్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు…

నితిన్‌ హీరోగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. సప్తమి గౌడ కథానాయిక. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. మంగళవారం చిత్రబృందం ‘ఆగకే అమ్మాడీ… భయపడి అడుగు ఆపకే’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది ఈ సందర్భంగా చిత్రబృందం స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. లయ వర్ష బొల్లమ్మ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్‌

కూలీ సంచ‌ల‌నం.. రైట్స్‌తో రికార్డుల మోత‌

కూలీ సంచ‌ల‌నం.. రైట్స్‌తో రికార్డుల మోత‌

shine junior college

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూలీ చిత్రం విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

 

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) 171 చిత్రంగా డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ (Lokesh Kanagaraj) క‌ల‌యిక‌లో బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న రూపొందుతున్న‌ చిత్రం కూలీ (Coolie). భారీ బ‌డ్జెట్‌తో ఎన్నో అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రంలో నాగార్జున (Nagarjuna Akkineni), ఉపేంద్ర (Upendra), షౌబిన్ (Soubin Shahir), స‌త్య‌రాజ్(Sathya Raj), శృతిహాసన్ (Shruti Haasan) వంటి సౌత్ ఇండియా సూప‌ర్‌ స్టార్లు కీల‌క పాత్ర‌లు పోషించ‌గా అనిరుధ్ ర‌విచంద‌ర్ (Anirudh Ravichander) సంగీతం అందించాడు. స‌న్ పిక్చ‌ర్స్ (Sun Pictures) నిర్మించింది.

 

 

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం అగ‌ష్టులో 14న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమానుంచి ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ గ్లిమ్స్ సినిమాపై అమాంతం అంచ‌నాలు పెంచ‌గా.. ఆ వీడియోలో ర‌జ‌నీ మిన‌హా ఏ హీరో ముఖం డైరెక్టుగా క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం విశేషం.ఇదిలాఉంటే ఈ సినిమా విదేశీ రైట్స్ విష‌యంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుస్తున్నాయి. ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఈ వార్త హాట్ టాపిక్ అయింది.

 

 

బాక్సాపీస్ వ‌ద్ద‌ ‘కూలీ’ చిత్రం విదేశీ రైట్స్‌ ధర సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ప్రస్తుతం విదేశీ పంపిణీ హక్కుల బిజినెస్‌ ప్రారంభమైన క్ర‌మంలో ఈ మూవీ రైట్స్‌ సొంతం చేసుకునేందుకు ప్రముఖ సంస్థ ఏకంగా రూ.70 నుంచి రూ.80 కోట్ల మేర చెల్లించేందుకు ముందుకొచ్చింద‌ని వినికిడి. అయినప్పటికీ చిత్ర నిర్మాత కళానిధి మారన్‌ మరింత అధిక మొత్తాన్ని డిమాండ్‌ చేస్తున్నారని దాంతో ఈ ఫారిన్‌ రైట్స్‌ బిజినెస్ చ‌ర్చ‌లు ఇంకా న‌డుస్తూనే ఉన్నాయ‌ని ఈ నెలాఖ‌రున అన్నీ ఫైన‌ల్ అవుతాయ‌ని స‌మ‌చారం. ఈ సినిమా హక్కులను రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్లకు విక్రయిస్తే మాత్రం.. తమిళ చిత్ర పరిశ్రమలో ఈ రైట్స్ సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

నాకు నటించడమే రాదన్నారు

నాకు నటించడమే రాదన్నారు

shine junior college

‘శతమానం భవతి’, కార్తికేయ 2’ లాంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు అనుపమ పరమేశ్వరన్‌. ఆమె నటించిన ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ అనే…

 

‘శతమానం భవతి’, కార్తికేయ 2’ లాంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు అనుపమ పరమేశ్వరన్‌. ఆమె నటించిన ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ అనే మలయాళ చిత్రం ఈనెల 27న విడుదలవుతోంది. ఇందులో లాయర్‌గా సురేశ్‌ గోపీ నటించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనుపమ మాట్లాడుతూ ‘నాకు నటన రాదంటూ చాలా మంది ట్రోల్‌ చేశారు. అయినా దర్శకుడు ప్రవీణ్‌ నాకు అవకాశం ఇచ్చారు. ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ వంటి గొప్ప చిత్రంలో ఎంపిక చేశారు. నాపై నమ్మకంతో ఇలాంటి పాత్రను ఇవ్వడమే నాకు దక్కిన విజయంగా భావిస్తున్నాను. ఇక నుంచి ప్రేక్షకులకు నచ్చే సినిమాలు మాత్రమే అంగీకరించాలని నిర్ణయించుకున్నా. కొవిడ్‌ సమయంలో నా కెరీర్‌ పరంగా, జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను’ అని చెప్పారు. కాగా, అనుపమ వ్యాఖ్యలపై సురేశ్‌ గోపీ స్పందించారు. ఒక నటిపై వివక్షను ప్రదర్శించడం మలయాళ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి కాదని అన్నారు. ‘అనుపమ మాట్లాడిన మాటలు ఆమె హృదయాంతరాళం నుంచి వచ్చాయి. గతంలో నటి సిమ్రాన్‌ విషయంలోనూ ఇదే విధంగా జరిగింది. మలయాళ చిత్రపరిశ్రమ ఆమెను చిన్నచూపు చూసి ఇండస్ట్రీ వదిలిపోయేలా చేసింది’ అని అన్నారు.

మెగాస్టార్‌తో డ్యూయెట్‌

మెగాస్టార్‌తో డ్యూయెట్‌

shine junior college
చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (మెగా 157-వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా…
చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (మెగా 157-వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఉత్తరాఖండ్‌లోని మసూరీలో రెండో షెడ్యూల్‌ మొదలైంది. ఇందులో చిరంజీవి సహా ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. మంగళవారం నయనతార సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతారపై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించనున్నారు. దర్శకుడిగా వరుస విజయాలను అందుకుంటున్న అనిల్‌ రావిపూడి ప్రేమ, కుటుంబ విలువలతో హృద్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చిరంజీవి పాత్ర చిత్రణ నవ్యపంథాలో ఉంటుంది, ప్రేక్షకులు ఆశించే అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది అని యూనిట్‌ తెలిపింది. షైన్‌స్ర్కీన్స్‌, గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి

ఓటీటీకి.. తెలుగు సీట్ ఎడ్జ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్

ఓటీటీకి.. తెలుగు సీట్ ఎడ్జ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్

shine junior college

 

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు చాలా రోజుల త‌ర్వాత‌ ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ సిద్ద‌మ‌వుతోంది.

 

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు చాలా రోజుల త‌ర్వాత‌ ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) సిద్ద‌మ‌వుతోంది. మిస్ ఫ‌ర్‌ఫెక్ట్ సిరీస్ ఫేమ్‌ అభిజ్ఞ వూతలూరు (Abhignya Vuthaluru) లీడ్ రోల్‌లో, చరణ్ లక్కరాజు (Charan Lakkaraju) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా కృష్ణ పోలూరు (Poluru Krishna) దర్శకత్వం వ‌హించారు. గ‌తంలో శ్రీ రామ్‌, శివ‌బాలాజీల‌తో రెక్కీ (Recce) అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్‌ను రూపొందించి మంచి విజ‌యం ద‌క్కించుకున్న‌ సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీరామ్ మ‌లి ప్ర‌య‌త్నంగా ఈ సిరీస్‌ను నిర్మించారు.

 

1980లలో ఓ మారుమూల గ్రామం విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం వ‌ళ్ల అక్క‌డ‌ ప్రతి వధువు తమ‌ పెళ్లి రోజునే మరణిస్తుంటారు. దీంతో దశాబ్దంగా ఆ ఐర్లో పెళ్లిళ్లు అనేవి లేకుండా పోయి ప్ర‌తి ఒక్క‌రూ తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌తో జీవిస్తుంటారు. ఈక్ర‌మంలో ఒక పోలీస్‌ కానిస్టేబుల్ ఆ గ్రామానికి రావడం, అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోంది.

మూఢనమ్మకాలతో కొట్టుమిట్టాడే ప్రాంతంలో భయం అనేది సమాజాన్ని ఎలా నియంత్రించగలదో, ధైర్యం అనేది దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఎలా భంగపరచగలదో ఓ శక్తివంతమైన సందేశంతో ఈ సిరీస్‌ను మ‌లిచారు. ఈ నేప‌థ్యంలోగ్రామంలో ఉండే రహస్యాలు, దాన్ని ఛేదించేలా ఇంట్రెస్టింగ్‌గా సాగే ఇన్వెస్టిగేషన్ క‌థ‌కు అదిరిపోయే సూపర్‌నేచురల్ థ్రిల్లర్ అంశాల‌ను మేళ‌వించి చూసే ప్రేక్ష‌కుల‌కు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ ఇవ్వ‌నున్నారు. ఇప్పుడీ సిరీస్ జూన్ 27 నుండి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండ‌గా త్వ‌ర‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా దర్శకుడు కృష్ణ పోలూరు, నిర్మాత శ్రీరామ్‌, న‌టి అభిజ్ఞలు మాట్లాడుతూ.. ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణిస్తుంది. దాంలో అది ఆ విలేజ్‌లో భయంగా, భయం నిశ్శబ్దంగా మారిపోతుంది. అలాంటి గ్రామంలోని ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడమే ఈ సిరీస్ కథ అని అన్నారు. రియల్ లొకేషన్స్, గ్రామీణ వ్యక్తులతో చిత్రీక‌రించామ‌ని, ప్రేక్షకులు ఈ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) సిరీస్‌ను ఎప్పుడెప్పుడు వీక్షిస్తారా? అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నామ‌ని అన్నారు.

పూరి మూవీలో సంయుక్త

పూరి మూవీలో సంయుక్త

 

 

shine junior college

పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న సినిమాలో విజయ్ సేతుపతి, టబు, దునియా విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ సినిమాలోకి తాజాగా సంయుక్త వచ్చి చేరింది.

 

 

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఛార్మి (Charmy) నిర్మాణ భాగస్వామిగా ఉంటున్న ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులే అయ్యింది. ఇందులో ఓ ప్రధాన పాత్రకు టబును తీసుకున్నట్టు చిత్ర బృందం గతంలోనే ప్రకటించింది. ఇప్పుడీ సినిమాలో మరో కీలక పాత్ర కోసం సంయుక్త మీనన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది.

 

పూరి, విజయ్ సేతుపతి కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీకి ‘బెగ్గర్’ అనే పేరు ఖరారు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ‘బెగ్గర్’ అనే పేరును కోలీవుడ్ వర్గాలు అంగీకరించవు కాబట్టి దాని బదులు ‘బిక్షాందేహి’ అనే టైటిల్ పెడితే మరింత బెటర్ గా ఉంటుందనే సలహా వచ్చిందట. చిత్రం ఏమంటే… తమిళులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ టైటిల్ ను అయినా యాక్సెప్ట్ చేస్తారు కానీ సంస్కృత పదాన్ని తమ సినిమాకు పేరుగా ఎందుకు ఒప్పుకుంటారు? అని కొందరంటున్నారు. ఏతావాతా ఈ సినిమా టైటిల్ పై ఇంకా అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది.

 

ఇదిలా ఉంటే… సంయుక్త మీనన్ తెలుగులో బాలకృష్ణ సరసన ‘అఖండ -2’ లో నటిస్తోంది. అలానే తన ప్రెజెంటర్ గా, దర్శకుడు యోగి తెరకెక్కిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీలోనూ ఆమె నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’లోనూ సంయుక్త నాయికగా చేస్తోంది. ఇక పూరి జగన్నాథ్‌ స్వీయ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో తీయబోతున్న సినిమాలో ‘దునియా’ విజయ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే పూరి తనయుడు ఆకాశ్ కూడా ఓ కీ-రోల్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మళ్లీ వస్తున్న హనుమాన్‌ జంక్షన్‌.

మళ్లీ వస్తున్న హనుమాన్‌ జంక్షన్‌

 

 

shine junior college

 

అర్జున్‌, జగపతిబాబు, వేణు హీరోలుగా 2001లో వచ్చిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రం మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది…

అర్జున్‌, జగపతిబాబు, వేణు హీరోలుగా 2001లో వచ్చిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రం మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎడిటర్‌ మోహన్‌ నిర్మించిన ఈ చిత్రంతోనే ఆయన తనయుడు మోహన్‌ రాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. లయ, స్నేహ, విజయలక్ష్మి హీరోయిన్లుగా నటించిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రాన్ని ఈ నెల 28న మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్స్‌ తక్కువగా వస్తున్న ప్రస్తుత తరుణంలో ‘హనుమాన్‌ జంక్షన్‌’ మళ్లీ తన మ్యాజిక్‌తో మెస్మరైజ్‌ చేస్తుందని దర్శకనిర్మాతలు చెప్పారు.

విభిన్న కథతో.

విభిన్న కథతో

 

shine junior college

 

‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సుహాస్‌, శివానీ నగరం మరోసారి జంటగా తెరపై కనిపించనున్నారు. వీర్దిద్దరూ కలసి…

‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సుహాస్‌, శివానీ నగరం మరోసారి జంటగా తెరపై కనిపించనున్నారు. వీర్దిద్దరూ కలసి నటించనున్న కొత్త చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గోపీ అచ్చర ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్రిశూల్‌ విజనరీ స్టూడియోస్‌ బ్యానర్‌పై నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తం షాట్‌కు సత్యదేవ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నాగ్‌ అశ్విన్‌ క్లాప్‌ కొట్టారు. వంశీ నందిపాటి ఫస్ట్‌ షాట్‌కు దర్శకత్వం వహించారు. విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. షణ్ముఖ ప్రశాంత్‌ ఈ చిత్రానికి కథను అందించారు. 

రెగ్యులర్‌ షూట్‌ షురూ.

రెగ్యులర్‌ షూట్‌ షురూ

 

shine junior college

 

 

రవితేజ కథానాయకుడిగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఇటీవలె ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘ఆర్‌టీ 76’ వర్కింగ్‌ టైటిల్‌…

రవితేజ కథానాయకుడిగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఇటీవలె ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘ఆర్‌టీ 76’ వర్కింగ్‌ టైటిల్‌. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సోమవారం రెగ్యులర్‌ షూట్‌ను మొదలెట్టారు. హైదరాబాద్‌లో నిర్మించిన ఓ ప్రత్యేక సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో రవితేజతో పాటు ఇతర తారాగణం పాల్గొంటున్నారు. ఇది రవితేజ మార్క్‌ కామెడీతో పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా ఉండనుంది. ఇందులో ఆయన సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, డీఓపీ: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

రెచ్చిపోతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్

రెచ్చిపోతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్

 

కేవలం నెల రోజుల వ్యవథిలో అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చిన నాలుగు సినిమాల నుండి నాలుగు సింగిల్స్ రాబోతున్నాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్ (Anirudh Ravichander) ఓ యువ సంచలనం. యుక్త వయసులోని చిత్రసీమలోకి అడుగుపెట్టి సంగీత దర్శకుడిగా తన సత్తాను చాటుకుంటున్నాడు. కోలీవుడ్ లోని స్టార్స్ తో అతనికి అనుబంధం ఉన్నా… తన ప్రతిభతోనే అతను ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నాడు. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా ఒడిసిపట్టుకుని, తనకంటూ ఓ ప్రత్యేక మార్గాన్ని క్రియేట్ చేసుకున్నాడు.
shine junior college
విశేషం ఏమంటే… జూన్ మాసం అనిరుధ్‌ దే అని కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అతను సంగీతాన్ని సమకూర్చుతున్న నాలుగు సినిమాలకు సంబంధించిన నాలుగు సింగిల్స్ ఈ నెల రోజుల వ్యవధిలో సంగీత ప్రియులను అలరించబోతున్నాయి.
సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. ఈ మూవీ నుండి ఇప్పటికే చికితూ వైబ్, పవర్ హౌస్ ట్రాక్ విడుదలై సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఈ వారంలో చికితూ వైబ్ ఫుల్ వర్షెన్ ను విడుదల చేయబోతున్నారు. ఇందులో రజనీకాంత్ తన ట్రేడ్ మార్క్ స్టైల్ లో కనిపించబోతున్నాడు. ఈ ట్యూన్ ను శింబు తండ్రి టి. రాజేందర్ మూవీ నుండి తీసుకున్నారట. అలానే అనిరుథ్‌… విజయ్ (Vijay) నటిస్తున్న పొలిటికల్ డ్రామా ‘జన నాయగన్’కూ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. విజయ్ పుట్టిన రోజు జూన్ 22ను పురస్కరించుకని ఈ సినిమా నుండి ఓ గ్లిమ్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఒకటి ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా దర్శకుడు హెచ్. వినోద్… తెలుగు సినిమా ‘భగవంత్ కేసరి’ నుండి స్ఫూర్తి పొంది తీస్తున్నట్టు సమాచారం.
అలానే ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ ప్రస్తుతం శివ కార్తికేయన్ (Siva Karthikeyan) తో ‘మదరాసి’ మూవీని తీస్తున్నాడు. ఈ యాక్షన్ డ్రామాకూ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 5న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీని నుండి ఇదేవారం ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
ఇక అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న మరో తెలుగు సినిమా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన ‘కింగ్ డమ్’. ఈ మూవీ నిజానికి మే 30న విడుదల కావాల్సింది. అయితే అనివార్య పరిస్థితుల్లో వాయిదా పడింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఆల్ రెడీ గత నెల విడుదలై సూపర్ రెస్పాన్స్ ను అందుకుంది. అయితే ఈ నెల చివరాఖరు లేదా ఆగస్ట్ మొదటి వారంలో ‘కింగ్ డమ్’ నుండి సెకండ్ సింగిల్ ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఈ రకంగా అనిరుధ్‌ స్వరాలు సమకూర్చిన ‘కూలీ, జన నాయగన్, మదరాసి, కింగ్ డమ్’ చిత్రాలకు సంబంధించిన సింగిల్స్ ఒకే నెల వ్యవధిలో రాబోతున్నాయి. మరి అనిరుథ్‌ తన మ్యాజికల్ మ్యూజిక్ తో ఈ సినిమాలను ఏ విధంగా విజయతీరాలకు చేర్చుతాడో చూడాలి.

తేనెకళ్ల సుందరి మోనాలిసా సాంగ్ అదుర్స్…

తేనెకళ్ల సుందరి మోనాలిసా సాంగ్ అదుర్స్…

 

అమ్మో అమ్మాయేనా… ఎల్లోరా శిల్పమా అని పాడుకుంటున్నారు ఆ అమ్మడిని చూసి నెటిజన్లు. అమ్మడికి పట్టిన అదృష్టాన్ని చూసి కొందరు మధ్యలో ట్రోల్ చేశారు కానీ రీసెంట్ గా వదిలిన శాంపిల్ ను చూసి నోరెళ్ల బెడుతున్నారు. అవమానించిన వాళ్లే ఔరా అంటున్నారు. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా… మోనాలిసా గురించి.

 

shine junior college
మహా కుంభమేళ 2025లో ఒక్కసారిగా సోషల్ మీడియాని షేక్ చేసిన అమ్మాయి మోనాలిసా భోంస్లే (Monalisa). ఈ 16 ఏళ్ల మధ్యప్రదేశ్ బ్యూటీ, ప్రయాగ్‌రాజ్‌లో రుద్రాక్ష మాలలు, పూసల దండలు అమ్ముతూ ఉండగా, ఒక నెటిజన్ తీసిన వీడియోతో రాత్రికి రాత్రే వైరల్ అయ్యింది. ఆమె ఆకర్షణీయమైన తేనెకళ్లు, చిరునవ్వు, సింపుల్‌గా ఉండే స్వచ్ఛమైన అందంతో నెట్టింట్లో స్టార్ అయిపోయింది. జాతరలో పూసలు అమ్మే అమ్మాయి నుంచి ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారింది. బాలీవుడ్ లో  ఛాన్స్ కొట్టేసింది కానీ సినిమా తెరపైకి వచ్చేందుకు టైం పట్టేలా ఉంది. ఆ లోపు అమ్మడు మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది.

ఈ భామ ఇటీవల ఒక మ్యూజిక్ వీడియోలో నటించింది. అది రీసెంట్ గా యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యి రచ్చ చేస్తోంది. ఉత్కర్ష్ సింగ్‌ (Utkarsh Singh)తో కలిసి మోనాలిసా ఆ సాంగ్‌లో ఎంబ్రాయిడరీ లెహంగా, క్లాసీ జ్యువెలరీతో ఫుల్ స్టన్నింగ్‌గా కనిపించింది. ఆమె డాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ ఫ్లాట్  అవుతున్నారు. ఈ అమ్మాయి… హీరోయిన్స్‌కి ఏం తక్కువ అంటూ  కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అంతేకాదు.. ఈ సాంగ్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు తెగ చూసేస్తున్నారు.

Monalisa

సనోజ్ మిశ్రా (Sanoj Mishra) డైరెక్ట్  చేస్తున్న హిందీ సినిమాలో ఈ భామ లీడ్ రోల్‌లో కనిపించబోతోంది. యాక్టింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఫుల్ ట్రైనింగ్ తీసుకుంటూ, సినిమా ఎంట్రీ కోసం ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురుచూస్తోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ‘సాద్గి’ సాంగ్ లింక్‌కి లైక్స్, కామెంట్స్ జోరు చూస్తే, ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. పూసల అమ్మాయి నుంచి కలల రాణిగా మారిన మోనాలిసా జర్నీ చూస్తే, ఎవరైనా సరే అవకాశం వస్తే ఆకాశం అందుకోవచ్చని నిరూపించేలా ఉంది. ఇక ఇప్పుడు ఈ భామ సినిమా రంగంలో ఎలా రాణిస్తుందో చూడాలి!

కన్నప్ప కు రజనీ అభినందనలు.

కన్నప్ప కు రజనీ అభినందనలు…

 

shine junior college

దిగ్గజ నటులు రజనీకాంత్‌, మోహన్‌బాబు కలసి నటించిన ‘పెదరాయుడు’ విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1995 జూన్‌ 15న విడుదలైన ఆ చిత్రం సంచలన…

దిగ్గజ నటులు రజనీకాంత్‌, మోహన్‌బాబు కలసి నటించిన ‘పెదరాయుడు’ విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1995 జూన్‌ 15న విడుదలైన ఆ చిత్రం సంచలన విజయం సాధించి, వసూళ్ల చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆదివారం రజనీకాంత్‌ ఇంట్లో ఆయన్ని కలిశారు మోహన్‌బాబు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ క్రమంలోనే మోహన్‌బాబు నిర్మించిన ‘కన్నప్ప’ చిత్రాన్ని రజనీకాంత్‌ చూశారు. విష్ణుని అక్కున చేర్చుకుని సినిమా బాగుందంటూ అభినందించారు. ఈ ఆనందాన్ని ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు విష్ణు. ‘ఈ క్షణం కోసమే 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. నా నటనని రజనీ అంకుల్‌ మెచ్చుకోవాలని నా కల. అది ఇప్పుడు నెరవేరింది. ఈ రోజు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’ అని అందులో పేర్కొన్నారు. అలాగే మోహన్‌బాబు కూడా సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ ‘ నేను నిర్మించిన ‘పెదరాయుడు’ చిత్రానికి 30 ఏళ్లు పూర్తైన రోజునే నా ప్రియ మిత్రుడు రజనీకాంత్‌ ‘కన్నప్ప’ చిత్రాన్ని తన కుటుంబ సభ్యులతో కలసి చూశారు. సినిమా చూసిన అనంతరం ఆయన కురిపించిన ప్రేమ, అభిమానం, ప్రశంసలు, ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరచిపోలేను. థాంక్యూ మిత్రమా’ అని పేర్కొన్నారు. ‘కన్నప్ప’ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది.

అందుకే పాకిస్థాన్‌లో విడుదల చేయలేదు.

అందుకే పాకిస్థాన్‌లో విడుదల చేయలేదు.

 

 

shine junior college

ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘దంగల్‌’. 2016లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయలకు…

ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘దంగల్‌’. 2016లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాఽధించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ఆమిర్‌ఖాన్‌ వెల్లడించారు. తాజాగా ఓ టెలివిజన్‌ షో పాల్గొన్న ఆయన ‘దంగల్‌’ను పాకిస్థాన్‌లో విడుదల చేయకపోవడం వెనుకున్న కారణాన్ని వివరించారు. ‘గీతా ఫొగట్‌ విజయం సాధించిన అనంతరం జాతీయ పతాకం నింగిలోకి ఎగురుతూ ఉండగా… జాతీయ గీతం వినిపించే దృశ్యాలు సినిమా నుంచి తొలగించండి లేదంటే చిత్ర ప్రదర్శనకు అంగీకరించం’ అని పాకిస్థాన్‌ సెన్సార్‌ బోర్డు షరతు విధించింది. ఇదే విషయమై చిత్ర సహ నిర్మాణ సంస్థ డిస్నీ నన్ను సంప్రదించగా నష్టం వచ్చినా సరే.. మనం సినిమాని పాకిస్థాన్‌లో విడుదల చేయడం లేదు అని ఖరాఖండిగా చెప్పేశాను’ అని ఆమిర్‌ఖాన్‌ వివరించారు. ‘మీ జాతీయ పతాకాన్ని తొలగించండి, మీ జాతీయ గీతాన్ని తీసివేయండి అనే వారితో నాకు పనేంటి. అలాంటి వ్యాపారం అక్కర్లేదని చెప్పేశాను’ అంటూ ఆయన ఆ నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

నాపై ప్రభాస్‌కు ఉన్న నమ్మకమే రాజాసాబ్‌.

నాపై ప్రభాస్‌కు ఉన్న నమ్మకమే రాజాసాబ్‌

 

 

 

 

ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న హారర్‌ కామెడీ ‘రాజాసాబ్‌’.

మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ కథానాయికలు.

సంజయ్‌దల్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌…

 

ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న హారర్‌ కామెడీ ‘రాజాసాబ్‌’.

మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ కథానాయికలు.

సంజయ్‌దల్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

డిసెంబరు 5న చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సోమవారం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

వింటేజ్‌ లుక్‌లో ప్రభాస్‌ చేసిన హంగామా, అదిరిపోయే విజువల్స్‌, నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

ముఖ్యంగా ప్రభాస్‌ సంభాషణలు, ఆయన చేసిన కామెడీ అభిమానులను ఖుషీ చేశాయి.

మారుతి టేకింగ్‌ ప్రధానాకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో మారుతి మాట్లాడుతూ ‘ఓ రోజు యువీ వంశీ నిన్ను ప్రభాస్‌ పిలుస్తున్నారు అని చెప్పారు.

ఆయన్ని కలిసేందుకు ముంబై వెళ్లా.

‘నువ్వు చేసిన ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘భలేభలే మగాడివోయ్‌’ లాంటి వినోదాత్మక కథ రెడీ చెయ్యి.

సినిమా చేద్దాం’ అని అన్నారు.

‘పక్కా కమర్షియల్‌’ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో నాతో సినిమా చెయ్యాలనుకున్న నిర్మాత వెనక్కి వెళ్లారు.

అయినా నాపై నమ్మకంతో ప్రభాస్‌ ఈ సినిమాను చేశారు.

ఆయనకు నాపై ఉన్న నమ్మకమే ఈ సినిమా. 

 

షూటింగ్‌ మొదలయ్యాక కూడా ‘ఈ టైమ్‌లో ప్రభా్‌సకు మారుతితో సినిమా అవసరమా’..
‘అయినా ప్రభాస్‌ కామెడీ చేయడమేంటి’ వంటి సందేహాలు వినిపించాయి.
అన్ని సవాళ్లనూ స్వీకరిస్తూ ఈ సినిమాను మరింత పట్టుదలతో కొనసాగించా.
అభిమానులు ఆయన్ని ఎంతగా ప్రేమిస్తారో తెలిసిందే.
అంతకు వెయ్యిరెట్లు ఆయన వారిని ప్రేమిస్తారు’’ అని అన్నారు.
టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఆరంభం నుంచి ముగింపు వరకూ సినిమా మీ అందర్నీ ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోనివ్వకుండా ఎంటర్టైన్‌ చేస్తుంది.
40 నిమిషాల క్లైమాక్స్‌ అద్భుతంగా ఉంటుంది’’ అని చెప్పారు.
నిర్మాత ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం మొదలైనప్పుడు ఓ నిర్మాత దీనిపై నెగెటివ్‌గా మాట్లాడారు.
సినిమా విడుదలయ్యాక ఆయనే పొగుడుతారు’’ అని తెలిపారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version