ఫోటోగ్రాఫర్ కిరణ్ కు 5000 ఆర్థిక సహాయం.

ఫోటోగ్రాఫర్ కిరణ్ కు 5000 ఆర్థిక సహాయం

జిల్లా అధ్యక్షుడు రఘోత్తం రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

నూతన జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టగానే ఫోటో గ్రాఫర్ల సంక్షేమం కోసం పని చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నాడు ఫోటోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షులు రఘోత్తం రెడ్డి మంగళవారం
రేగొండ మండలం కొడవటంచ గ్రామ ఫోటోగ్రాఫర్ సింగరి కిరణ్ ఇటీవల బైక్ పై నుండి కిందపడి కాలు ప్యాక్చర్ కావడం జరిగింది. విషయం తెలుసుకున్న నూతన జిల్లా అధ్యక్షులు బండ రగోతంరెడ్డి ఫోటోగ్రాఫర్కు ఆపుద వస్తే నేనున్నానని భరోసానిస్తూ 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ మండల అధ్యక్షులు జంబుల రఘు, ఫోటోగ్రాఫర్స్ జిల్లా కోశాధికారి ఎల్దండి రాకేష్, టేకుమట్ల మండల ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షులు దాసారపు సదానందం, ప్రధాన కార్యదర్శి గుగులోతు రాజేందర్ నాయక్, కోశాధికారి బండి కమలాకర్,రేగొండ ఫోటోగ్రాఫర్స్ మోరే మొగిలి, మల్లె బోయిన స్వామి, సింగరి సతీష్, సామల సురేందర్ రెడ్డి, కోల రాజు,చుక్క ప్రశాంత్, పబ్బ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అంతడుపుల నాగరాజు కు అపూర్వ స్వాగతం.

అంతడుపుల నాగరాజు కు అపూర్వ స్వాగతం

మందమర్రి నేటి ధాత్రి

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సలహా సభ్యుడు గా నియమితులైన సందర్బంగా తొలిసారి మందమర్రి కి విచ్చేసిన అంతడుపుల నాగరాజు గారికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా శాలువాతో సత్కారించి పూల బొకే అందజేశారు. అనంతరం అంతడుపుల నాగరాజు మాట్లాడుతూ నేను నా పురిటి గడ్డ అయినా మందమర్రి అంటే నాకు ఎంతో ప్రీతి నేను ఈ మందమర్రి లో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ తెలంగాణ అంటే నాకు అమితమైన ప్రేమ నేను ఎన్ని మంచి అవార్డుసు అందుకున్నా మందమర్రిని మర్చిపోవడం అంటూ ఉండదు నేను చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. నా చిన్ననాటి నుంచి నేను ఒక కళాకారుడిగా ఒక మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నందుకు నేను ఈ ఈ మందమర్రి కి రుణపడి ఉంటాను అని వ్యాఖ్యానించారు

బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు.

బిఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితమే వ్యవసాయ రైతులకు సాగునీరు విడుదల

బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు

నేటిధాత్రి చర్ల

బిఆర్ఎస్ పార్టీ ఉద్యమం వలన ఈరోజు రైతులకు తాలిపేరు కాలవల నుండి నీరు విడుదల చేసారు అని బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ ఒక ప్రకటనలో తెలిపారు జూలై 6 తేదీన డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానెం రామకృష్ణ చర్ల మండల బిఆర్ యస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రాజెక్ట్ నిండా నీరు ఉన్న నీరు విడుదల చేయడం లేదని రైతులు ఆందోళన చెందారు వెంటనే నీరు రైతులకు విడుదల చేయాలని డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు దాని పలితమే ఈ రోజు రైతులకు నీరు విడుదల చేసారు చాలా సంతోషం అదే విధంగా కాలువలకు పడిన గండ్లను కూడ పూడ్చే కార్యక్రమాన్ని కూడ చేపడితే కింది ప్రాంత రైతుల కూడా న్యాయం జరుగుతుంది దుమ్ముగూడెం మండలంలో తూరుబాక వద్ద కల్వర్టు కృంగి పోయి ఉంటే బిఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు మండల నాయకులు ఉద్యమాన్ని చేపడితే వెంటనే బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు బిఆర్ఎస్ పార్టీ ఏప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసం రైతుల కోసం నిరంతరం పోరాటం చేస్తుందని తెలియజేసారు

మొహరం పండుగలో పాల్గొన్న జహీరాబాద్ ఎమ్మెల్యే.

 

మొహరం పండుగలో పాల్గొన్న జహీరాబాద్ ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం బొప్పనపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్థుల ఆహ్వానం మెరకు మత సామరస్యాలకు అతీతంగా జరిగిన మొహ‌రం ఉత్సవాల్లో జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు పాల్గొని దర్గాకు పూలమాలలు చాదర్ సమర్పించి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ సంగమేశ్వర్, మాజీ కేతాకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,మాజీ సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి , సంగారెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి,సంతు పటేల్,నాగేందర్ పటేల్,విజయ్ పటేల్, సోహైల్,ఉల్లాస్,బొప్పానపల్లి సీఎహేచ్ నాగన్న, కి. శశివర్ధన్ రెడ్డి,సయ్యద్,గఫార్,నర్సింలు,లేయాకత్, విష్ణువర్ధన్ రెడ్డి,జి సిద్ధప్ప,దిగంబర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,రవి,సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో వచ్చే ప్రజల ఫిర్యాదులు అధికారులు పరిష్కరించాలి.

ముఖ్యమంత్రి ప్రజావాణిలో వచ్చే ప్రజల ఫిర్యాదులు అధికారులు పరిష్కరించాలి

కలెక్టర్ ఆదర్శ్ సురబి అధికారులకు ఆదేశాలు

వనపర్తి నేటిదాత్రి .

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-4.wav?_=1

ముఖ్యమంత్రి ప్రజా భవన్ లో ప్రజల నుండి వచ్చే వనపర్తి జిల్లా ప్రజల ఫిర్యాదులను వనపర్తి అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా ప్రజావావాణి లో స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు వెంటనే సమాచారం అందించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి, మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, ప్రతి సోమవారం జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం ఒక వరం.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం ఒక వరం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నవాబుపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి వెంకటయ్య

శంకర్ పల్లి, నేటిధాత్రి :

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-3.wav?_=2

బీసీల రిజర్వేషన్ 42 శాతనికి పెంచడం బీసీ ప్రజలకి ఒక గొప్ప వరమని నవాబుపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి వెంకటయ్య అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా అత్యధికంగా ఉన్న బీసీ ప్రజల కోసం వారి యొక్క ఉద్యోగాల్లో గానీ స్థానిక సంస్థల పదవుల్లో గానీ ఉన్నత స్థానం కల్పించాలనే సదుద్దేశంతో 42 శాతం రిజర్వేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు సహచర మంత్రులకు బీసీ సంక్షేమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గడిచిన గత పది సంవత్సరాలలో ఏనాడు కూడా
బి ఆర్ యస్ పార్టీ, బీసీల గురించి ఆలోచించ లేదు కదా వారికీ కనీస విలువ కూడా ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది రోజులలోనే బీసీ ల పట్ల చూపించిన గౌరవానికి ఎల్లపుడు పార్టీ కి రుణపడి ఉంటామని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ అధ్యక్షులు జూలకంటి శ్రీధర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి…

ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి…

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-1.wav?_=3

నేటి ధాత్రి -బయ్యారం :-.

మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేసిన కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులుమరియు బయ్యారం మాజీ సొసైటీ చైర్మన్ రామగిరి బిక్షం డిమాండ్ చేశారు. సోమవారం న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో జి.విజయలక్ష్మి కి అందజేశారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి రామగిరి బిక్షం మాట్లాడుతూ,2024 – 2025 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలు పనులు చేసిన ఆరు వారాల డబ్బులు విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సరం చేస్తుందని అన్నారు.ఒక వారానికి 300 రూపాయలు ఆటో కిరాయి పెట్టుకొని పని ప్రదేశానికి వెళ్లి పని చేయడం జరిగిందని, ఇలా సుమారు మూడు నుంచి ఆరు వారాల వరకు పని చేసినా డబ్బులు కార్మికుల ఖాతాల్లో పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుండి పనిచేసిన వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి డబ్బులు చెల్లిస్తున్నారని విమర్శించారు. కొంత మంది కార్మికులు పని చేసినా వారికి హాజరు వేయకుండా ఆబ్సెంట్ వేసారని అన్నారు. ఉపాధి హామీ పనిలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని, అధికారులకు డబ్బులు ఇస్తేనే బ్యాంకుల్లో డబ్బులు పడే విధంగా చేస్తున్నారని అనేక మంది కార్మికులు వాపోతున్నారని అన్నారు.వేసవిలో ఎర్రటి ఎండలో కష్టపడి పని చేస్తే వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేయడం దుర్మార్గమని విమర్శించారు.ప్రతి సంవత్సరం ఉపాధి హామీ కూలీలకు రెండు నుండి మూడు వారాలు డబ్బులు చెల్లించకుండా ఎగవేస్తున్నారని విమర్శించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ డబ్బులు చెల్లించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉపాధి హామీ కార్మికులను సమీకరించి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు తుడుం వీరభద్రం, నేతకాని రాకేష్, గ్రామ నాయకులు బి రెడ్డి సంగన్న,జరిపోతుల బుచ్చయ్య, రెడ్డి మల్ల విశ్వనాధం, సోమారపు సుధాకర్, జినక లక్ష్మీనారాయణ, ఉపాధి కూలీలు జినుక రేణుక, గాజుల వెంకన్న, అబ్బరబోయిన రేణుక, విజయ, కాశమ్మ తదితరులు పాల్గొన్నారు.

పంట పొలాలకు తాలిపేరు నీటిని విడుదల చేసిన..

పంట పొలాలకు తాలిపేరు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

నేటిదాత్రి చర్ల

చర్ల మండలం పెదమిడిసిలేరు గ్రామంలో తాలిపేరు ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలకు సాగునీరు అందించడం కొరకు కాలువ గేట్లు ఎత్తి నీళ్లును విడుదల చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

MLA Dr. Tellam Venkat Rao

ఈ ప్రాజెక్ట్ 0. 5 టిఎంసి నీటిని ఉపయోగించుకుంటూ ఈ ఆయకట్టు ద్వారా చర్ల దమ్ముగూడెం మండలాల్లోని గ్రామాలకు చెందిన సుమారు 25000 ఎకరాలకు సాగునీరును అందిస్తుందని తెలిపారు

MLA Dr. Tellam Venkat Rao

ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

MLA Dr. Tellam Venkat Rao

 

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download.wav?_=4

 

సన్నబియ్యం ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే.

సన్నబియ్యం ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే.

మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.

దుగ్గొండి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

నిరుపేదలు,సామాన్య ప్రజలు,ధనికుల ఓకె రకమైన సన్నబియ్యం తినాలనే ఉద్దేశ్యంతో దేశంలో మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ప్రారంభించారని దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ అన్నారు.ఇటీవలే నూతనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్సు చేసి దేశంలో చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందపరించిన విధంగా అన్ని పథకాలు అమలు చేస్తున్నదని వాటి అమలును ప్రజల్లోకి మండల పార్టీ సహకారంతో తీసుకెళ్తానని పేర్కొన్నారు. తనకు గత 30 ఏండ్లుగా రాజకీయ అనుభవం ఉన్న నేపథ్యంలో దుగ్గొండి మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించుకుంటానని రమేష్ గౌడ్ హామీ ఇచ్చారు.తమపై నమ్మకంతో మండల అధ్యక్షునిగా బాధ్యత ఇచ్చిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి,సహకరించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,నియోజకవర్గ నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

జోగంపల్లి చలివాగుప్రాజెక్టు నీటిని విడుదల చేసిన..

జోగంపల్లి చలివాగుప్రాజెక్టు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం జోగం పల్లి చలివాగు ప్రాజెక్టు చెరువు నీటిని దిగువన ఉన్న పంట పొలాలకు నీటిపారుదల శాఖ, ఇతర శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొ న్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నీటిని విడుదల చేశారు. అక్కడ తూము వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి, చెరువులోకి పూలు చల్లారు. అనంతరం తూము గేట్ వాల్వ్ ను తిప్పి కిందికి నీటిని వదిలారు. అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులకుఏకకాలం లో రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు. రైతులు బాగుం టేనే గ్రామాలు అభివృద్ధిచెందు తాయన్నారు.ఈ కార్యక్రమం లో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

ఆషాఢమాసం బోనాల కార్యక్రమంలో పాల్గొన్న.

ఆషాఢమాసం బోనాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆషాఢమాసం బోనాల సందర్భంగా పట్టణంలోని వివిధ ఆలయలలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు,నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని వేడుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ తాంజమ్, సినియర్ నాయకులు నామ రవికిరణ్,మాజీ పట్టణ అధ్యక్షులు యాకుబ్, విజిలిన్స్ మెంబెర్ రామకృష్ణ,ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,వెంకట్, శివ ముదిరాజ్,నరేష్ రెడ్డి,మహమ్మద్ అలీ, జఫ్ఫార్, సందీప్, తదితరులు.

ఆశాఢ మాస బోనాల ఉత్సవాలల్లో పాల్గొన్న.

ఆశాఢ మాస బోనాల ఉత్సవాలల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,

◆:- రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారు,మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్విర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని గడి విధి లో జరిగిన ఆశాఢ మాస ఊరడమ్మ తల్లి బోనాల పండుగలో పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి,మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్ తన్విర్ గార్లతో కలిసి దర్శించుకున్నారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,మాజీ కౌన్సిలర్లు రాజశేఖర్,మహిపాల్ రెడ్డి,అక్తర్ గోరి,రంగా అరుణ్,కాశీనాథ్,ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,అశ్విన్ పాటిల్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి,అక్బర్,జావిద్,హఫీజ్,జుబేర్,రాజు నాయక్,మల్లికార్జున్,యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ రెడ్డి,హర్షవర్ధన్ రెడ్డి,కిరణ్ గౌడ్,జగదీశ్వర్ రెడ్డి,నథానెయల్,అక్షయ్ జాడే,విష్ణువర్ధన్ రెడ్డి,నర్సింహా యాదవ్,పాండు యాదవ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల ఎమ్మెల్యే గారి సొంత గ్రామమైన ఝరాసంగం లో అనారోగ్యంతో బాధపడుతు కోలుకున్నా గ్రామ మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్,రామ్ సింగ్,కేతన్ చౌతయి, గార్ల వారి నివాసనికి చేరుకొని శాసనసభ్యులు కోనింటి మానిక్ రావు గారు,ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ డీసీఎంఎస్ శివకుమార్ గార్లు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి త్వరగా కోవాలని కోరారు.
వారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, పట్టణ అధ్యక్షులు ఎజాస్ బాబా, మాజీ సర్పంచ్ లు పరమేశ్వర్ పటేల్,శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్, అమరజిత్, ప్రభు పటేల్,బస్వరాజ్ పటేల్,ఫరూక్ పటేల్, నాయకులు వెంకట్ రెడ్డి, నవాజ్ రెడ్డి, నాగేశ్వర్ సజ్జన్,సంగన్న, శివ శంకర్ పటేల్, శశి వర్ధన్ రెడ్డి, కిజర్, విజయ్ పాటిల్, మాణిక్ యాదవ్,ఎంపీ శ్రీనివాస్ పటేల్,ఎంపీ నాగన్న, సోహైల్,రమేష్,రాజు కుమార్, బాలరాజ్, విల్లాస్, అనిల్ పటేల్, కృష్ణ, విజయ్, సాయ్యేద్, శివ వైజ్యనాథ్, రామ్ రెడ్డి, తదితరులు ఉన్నారు

ఝరాసంగం మాజీ సర్పంచ్ ను పరామర్శన..

ఝరాసంగం మాజీ సర్పంచ్ ను పరామర్శన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఇటీవల ఎమ్మెల్యే గారి సొంత గ్రామమైన ఝరాసంగం లో అనారోగ్యంతో బాధపడుతు కోలుకున్నా గ్రామ మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్,రామ్ సింగ్,కేతన్ చౌతయి, గార్ల వారి నివాసనికి చేరుకొని శాసనసభ్యులు కోనింటి మానిక్ రావు గారు,ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ డీసీఎంఎస్ శివకుమార్ గార్లు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి త్వరగా కోవాలని కోరారు.
వారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, పట్టణ అధ్యక్షులు ఎజాస్ బాబా, మాజీ సర్పంచ్ లు పరమేశ్వర్ పటేల్,శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్, అమరజిత్, ప్రభు పటేల్,బస్వరాజ్ పటేల్,ఫరూక్ పటేల్, నాయకులు వెంకట్ రెడ్డి, నవాజ్ రెడ్డి, నాగేశ్వర్ సజ్జన్,సంగన్న, శివ శంకర్ పటేల్, శశి వర్ధన్ రెడ్డి, కిజర్, విజయ్ పాటిల్, మాణిక్ యాదవ్,ఎంపీ శ్రీనివాస్ పటేల్,ఎంపీ నాగన్న, సోహైల్,రమేష్,రాజు కుమార్, బాలరాజ్, విల్లాస్, అనిల్ పటేల్, కృష్ణ, విజయ్, సాయ్యేద్, శివ వైజ్యనాథ్, రామ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసీఆర్ విజన్‌కు సాక్ష్యం.

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసీఆర్ విజన్‌కు సాక్ష్యం: కేటీఆర్

పరిపాలన అంటే కేవలం శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదని.. అభివృద్ధి, ప్రగతి అంటే రాజకీయ హంగులు ఆర్భాటాలు ఏమాత్రం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావువ్యాఖ్యానించారు. నిజమైన నాయకుడు ఒక తరం లేదా ఒక ఎన్నిక గురించి మాత్రమే ఆలోచించరని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్: పరిపాలన అంటే కేవలం శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదని.. అభివృద్ధి, ప్రగతి అంటే రాజకీయ హంగులు ఆర్భాటాలు ఏమాత్రం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) వ్యాఖ్యానించారు. నిజమైన నాయకుడు ఒక తరం లేదా ఒక ఎన్నిక గురించి మాత్రమే ఆలోచించరని చెప్పుకొచ్చారు. తరతరాలపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనాలు కలిగించే ప్రణాళికలే నిజమైన నాయకుడి పనితనమని తెలిపారు కేటీఆర్.

ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాంటి నాయకుడు కేసీఆర్ దూరదృష్టి ఫలితంగా రెండు అద్భుత ఫలితాలను తెలంగాణ ఈరోజు సాధించిందని ఉద్ఘాటించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసీఆర్ విజన్‌కు మరో జీవన సాక్ష్యమని నొక్కిచెప్పారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మోటార్లు ఆన్ చేయడంతో.. ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరానికి, వ్యవసాయ భూమికి సాగునీరు అందుతోందని వెల్లడించారు. కేసీఆర్ హయాంలోని మరో అద్భుతం యాదాద్రి థర్మల్ ప్లాంట్. దామరచర్ల అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్‌లోని యూనిట్ వన్‌లో 72 గంటల కోడ్ (COD)ని విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పుకొచ్చారు. తమ నాయకుడు కేసీఆర్ పాలన, విజన్ మా అందరికీ గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్ ముందుచూపుతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం: హరీష్‌రావు

కేసీఆర్ ముందుచూపుతో గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించి సస్యశ్యామలంగా చేయాలన్న సంకల్పంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) తెలిపారు. ఎట్టకేలకు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేసి నీళ్లు అందించడంతో రైతులు కేసీఆర్ కృషిని గుర్తు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టు విలువ ఏమిటో ఇప్పుడు అనుభవంలోకి వచ్చిందని అన్నారు. నదీ జలాల సద్వినియోగానికి కేసీఆర్ చిత్తశుద్ధితో చేసిన కృషికి సీతారామ ప్రాజెక్టు ఓ సజీవ సాక్ష్యమని ఉద్గాటించారు. సీతారామ ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేసినట్లే, కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి సాగు నీటి కోసం ఎదురుచూస్తున్న రైతాంగాన్ని రేవంత్ ప్రభుత్వం ఆదుకోవాలని హరీష్‌రావు కోరారు.

కమిటీలకు దిక్కు లేదు..కార్యకర్తలకు గుర్తింపు లేదు!

`వాళ్ల కష్టానికి ఫలితం లేదు.

`అన్ని పార్టీలది అదే తీరు.

`ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకొస్తారు.

`ఏళ్లకేళ్లు వెట్టి చాకిరి చేయించుకుంటారు.

`కడుపు కట్టుకొని పార్టీ కోసం కార్యకర్తలు పని చేస్తారు.

`జెండాలు కట్టడానికి, నాయకులకు సలాం కొట్టడానికి పనికొస్తారు.

`సభలు పెడితే జేజేలు కొట్టడానికి అవసరౌతారు.

`పథకాల అమలులో కూడా వివక్షకు గురౌతారు.

`సొంత పార్టీ వాళ్లకే ప్రయోజనమౌతుందని కార్యకర్తలను పక్కన పెడతారు.

`ఓట్లేయించేందుకు మాత్రమే కార్యకర్తలు అవసరమౌతారు.

`పార్టీ కోసం ఏం ఆశించకుండా పని చేస్తారని గొప్పలు చెప్పి నోరు మూయిస్తారు.

`అడుగడుగునా మాయ చేసి చెప్పు చేతుల్లో వుంచుకుంటారు.

`నాయకులు గ్రూపులు కట్టి కార్యకర్తలను విభజిస్తారు.

`సొంత పార్టీలలోనే కార్యకర్తలు శత్రులయ్యేలా చేస్తారు.

`నాయకులు మాత్రం చెట్టా పట్టాలేసుకొని తిరుగుతారు.

`గ్రామ, మండల కమిటీలు వేయకుండా కార్యకర్తలను ఆశల పల్లకిలో ఊరేగిస్తారు.

`కమిటీలెప్పుడు వేసినా పదవి నీకే అని అందరికీ చెప్పి కాలయాపన చేస్తారు.

`పై స్థాయిలో వున్న వాళ్లు ఒక్కొక్కరు నాలుగు పదవులు చేపడతారు

`కుటుంబంలో వున్న వాళ్లకు పదవులు పంచుకుంటారు.

………………………..

`పదేళ్లు అధికారంలో వున్నా ‘‘బిఆర్‌ఎస్‌’’ కార్యకర్తలు బతికింది లేదు.
`అప్పుల పాలై దివాళా తీసినా ఒక్కరినీ ఆదుకున్నది లేదు.
`నామినేటెడ్‌ పదవులిచ్చి గౌరవించింది లేదు.
`కనీసం పార్టీ కమిటీలు వేసి పదవులు అప్పగించింది లేదు.
`ఇప్పటికీ ‘‘బిఆర్‌ఎస్‌’’ కమిటీలు వేయాలన్న సోయి లేదు.
……………………….
`కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావొస్తోంది.
`పార్టీ కమిటీలకు దిక్కు లేదు..
`పూర్తి స్థాయిలో నామినేట్‌ పదవులు పంచింది లేదు.
…………………..
`బిజేపి ఇందుకు తీసిపోయిందేమీ లేదు.
`ఆ పార్టీ అనుసరిస్తున్నది అదే తీరు.
`మూడు పార్టీలలో కమిటీలకు దిక్కు లేదు.
`ఎన్నికల పేరు చెప్పుకొని నాయకులు ఎగేసుకొస్తారు.
`గెలిపించే బాధ్యత మీదే అని కార్యకర్తలను ఆకాశానికెత్తురు.
`మీరు లేకుండా పార్టీయే లేదని ఉబ్బిస్తారు.
`ఎన్నికలైపోయిన తర్వాత ముఖం చాటేస్తారు.
`కార్యకర్తలు కరివేపాకులు..రాజకీయాలలో గోలించి పడేస్తారు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయ నాయకులు, కార్యకర్తలు అనగానే ఖద్దరు చొక్కాలు. రేబాన్‌ కళ్లజోళ్లు. కాళ్లకు ఖరీదైన చెప్పులు. అయితే టూవీలర్‌, లేకుంటే కారు. కాలు తీసి బైట పెడితే చాలు గౌరవాలు. మర్యాదలు. పైరవీలు. ప్రజ సమస్యలు. అబ్బో ఆ సెటప్పే వేరు. కనిపించిన వాళ్లను పలకరించడం. వారికి టీలు తాగిపించడం. అవసరమైతే టిఫిన్లు చేయించడం. ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం అదో సంతర్పణ కార్యక్రమం. ఇదంతా ఎలా? అనుకుంటే సమాధానం చెప్పడానికి నోరు రాదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడేంత దుఖం. కాని పైకి మాత్రం చెరగని చిరునవ్వు. నోరు తెరిస్తే కోట్ల రూపాయల రియల్‌ వ్యాపారం మాటలు విన పక్కవాళ్లు అబ్బో అనుకోవాలి. అంతే కాని అబ్బా..అనేలా వుండకూడదు. అలా మెంటైన్‌ చేయకపోతే నాయకుడే కాదు. కార్యకర్త కూడా కాదు. కాని ఇంత హడావుడి చేస్తున్నా ఆయా రాజకీయ పార్టీలలో వారి పదవులు ఏమిటని మాత్రం ఎవరూ అడగొద్దు. ఎందుకంటే కొంచెం వయసు చిన్నదైతే కార్యకర్త. కాస్త పెద్ద వయసైతే సీనియర్‌ కార్యకర్త. ఇక వాళ్లు పార్టీల కోసం పడే కష్టం అంతా ఇంత కాదు. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు కేక వేస్తే చాలు జీ హుజూర్‌ అని వాలిపోవాల్సిందే. చేతులు కట్టుకొని నిలడాల్సిందే. నోరు నొచ్చేదాకా ఆ పార్టీ నాయకులు జేజేలు కొట్టాల్సిందే. పార్టీ కండువాలు మెడలో వేసుకొని, జెండా కూడా మోయాల్సిందే. ఇంతగా పార్టీకి సేవ చేస్తున్నా పదవులు ఇస్తారా? ఇస్తాం..ఇస్తామంటూ ఊరిస్తారు. పుణ్యకాలం పూర్తయ్యేదాకా వాయిదా వేస్తూ వెళ్లాల్సిందే. అధికారంలో వున్నప్పుడు నాయకులు ఊడిగం చేయాలి. ప్రతిపక్షంలో వున్నప్పుడు పార్టీకి రక్షణ కవచాలు కావాలి. ఒక రకంగా చెప్పాలంటే మొత్తానికి పార్టీ కార్యకర్తలు వెట్టి చాకిరీ చేసే కూలీలుగా మారిపోవాలి. ఇంతకు మించి రాజకీయం అంటే చెప్పుకోవడానికి ఏదీ వుండదు. పార్టీ పేరు చెప్పి బతికే కొంత మంది లైక్యం తెలిసిన కారకర్తలుంటారు. చిన్నా చితక పైరవీలతో నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు. నాయకులు చెప్పి పనులు చేయించుకుంటారు. ఇది కూడా ఏ ఐదు శాతమో వుంటారేమో? కాని మిగతా నాయకులంతా జేజేలు కొట్టడం మాత్రం చేస్తుంటారు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పదవి రాకపోతుందా? అని జీవితాంతం ఎదురు చూస్తుంటారు. జీవితాంతం కార్యకర్తగానే మిగిలిపోయిన వాళ్లు కొన్ని లక్షల మంది వుంటారు. కడుపు కట్టుకొని పార్టీకి సేవ చేస్తుంటారు. అప్పులు చేసిన పార్టీ కోసం పనిచేస్తుంటారు. ఆస్ధులు అమ్ముకొని రాజకీయాల్లో సాగుతుంటారు. ఇంత చేస్తున్నా నాయకులకు సలాం కొట్టడానికి మాత్రమే వుంటారు. నాయకుడు ఫోన్‌ చేస్తే క్షణాల్లో వాలిపోతారు. నాయకుడు కదలమని చెప్పేదాకా అక్కడే పడిగాపులు కాస్తారు. నిజం చెప్పాలంటే ఇది రాజకీయం కాదు. నాయకులకు ఊడిగం చేయడం. సరే ఇంత చేస్తున్నా ప్రభుత్వ పథకాలనైనా కార్యకర్తలకు అందుతాయా? అదీ వుండదు. ఎందుకంటే అడుక్కుంటే చులకనౌతాడు. పట్టుబట్టి తీసుకుందామంటే నాయకుల ఆగ్రహానికి గురౌతారు. మనం పంచే స్దితిలో వున్నాం. అడుక్కుంటామా? అని చెప్పే నాయకుల మాటలకు తలవంచేవాళ్లుంటారు. సర్ధుకుపోయే మనస్తత్వమే అలవాటు చేసుకుంటారు. పథకాలు పార్టీ కార్యకర్తలకే పంచుకుంటున్నారన్న అవపాదు మోయొద్దని నాయకులు చెప్పే మాటలు విని ఆశలు చంపుకుంటారు. ఇది అన్ని పార్టీలలో వుండే కార్యకర్తల దీనస్ధితికి నిదర్శనం. కనీసం పార్టీ పదవులు ఇచ్చారా? అంటే అదీ లేదు. బిఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్ల కాలం అదికారంలో వున్నా ఇప్పటి వరకు సంస్ధాగత నిర్మాణం ఎక్కడా జరగలేదు. మాటలకు మాత్రం 60లక్షల మంది కార్యకర్తలున్నారని గొప్పగా చెబుతారు. కాని ఎంత మంది కార్యకర్తలకు పదవులిచ్చారన్నది చెప్పరు. ఇప్పటికీ గ్రామస్దాయి నుంచి రాష్ట్ర స్దాయి వరకు పదవుల పంపకాలు లేవు. పదేళ్ల అదికారంలో నామినేటెడ్‌ పదువులు కొద్ది మందికి తప్ప పూర్తిగా ఇచ్చింది లేదు. నాయకుల ఇంట్లో ఒక్కొక్కరికి నాలుగు పదవులు పంచారు. అదే కుంటుంబంలో నలుగురున్నా పదవులు పంచారు. కాని పార్టీ కోసం పనిచేసిన ఎంతో మంది కార్యకర్తలకు ఆఖరులోకూడా పదవులు పంచలేదు. వారి జీవితాలను నిలబెట్టలేదు. కార్యకర్తలంటే ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొచ్చే వాళ్లుగా మారిపోయారు. ఎన్నికల సమయంలో జనాన్ని పోగేసుకునేందుకు పడే అవస్దలు కార్యకర్తలతో తీర్చుకుంటున్నారు. వారిని కూరలో కరివేపాకులు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వచ్చిన కష్టాలు పగ వాడికి కూడా రాకూడదనుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నాయకులకు కూడా పదవులు లేదు. గుర్తింపు లేదు. కొత్త నీరుకు పెద్దగా పని లేదు. పదేళ్ల తర్వాత అదికారంలోకి వచ్చామన్న సంతోషమే తప్ప, పదువులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రేపు, మాపు అనుకుంటూ ఇప్పటికీ ఏడాదిన్న కాలం చూస్తుండగానే కరిగిపోయింది. పార్టీ అదికారంలోకి వస్తే అంతా ఇక మా కాలామే..మా రాజ్యమే అనుకున్న ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు పదవుల రాక యాతన పడుతున్నారు. కనీసం చెప్పుకోవడానికిపార్టీ పదవులు కూడా ఇంకా పూర్తి స్ధాయిలో పంపకాలు జరగలేదు. మాకు ఎప్పుడు అవకాశాలు వస్తాయో అని ఎదరుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే పదవులు అందుకుంటామనుకున్నారు. కాని రెండేళ్ల దగ్గర పడుతున్నా ఎదరు చూపులు తప్పడం లేదు. ..పదవులకోసం పడిగాపులు తప్పడం లేదు. అదికారంలోకి వచ్చి ఏడాదిన్నరౌతుంటే ఆశలు ఆవిరౌతాయేమోనన్న ఆందోళనలో వున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్ధితుల్లో రియల్‌ వ్యాపారం కూడా సాగడం లేదు. కాంగ్రెస్‌ నాయకులకు ఆ రకంగా కూడా కలిసి రావడం లేదు. రేవంత్‌ సర్కారు తీసుకొస్తున్న కొన్ని సంస్కరణల మూలంగా వున్న ఉపాధి కూడా పోయిందని రియల్‌ వ్యాపారం చేసే కాంగ్రెస్‌ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. హైడ్రా వల్ల హైదరాబాద్‌లో భూముల అమ్మకాలు,కొనుగోలు ఆగిపోయింది. భూములు కొనాలంటేనే జనం భయడిపోవాల్సి వస్తోంది. వారికి భరోసా ఇచ్చే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. ఇక ధరణి పేరుతో బిఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు కొంత బాగు పడ్డారు. భూ భారతి వచ్చినా, కాంగ్రెస్‌ నాయకుల సమస్యలు తీరడం లేదు. వారికి ఏదీ కలిసి రావడం లేదు. దాంతో పార్టీపరమైన పదవులు వచ్చినా చెప్పుకోవడానికి ఒక హోదా వుంటుందని అనుకుంటున్నా అవీ రావడం లేదు.ద అన్ని స్దాయిలో నాయకులకు ఎప్పుడొస్తాయో పదవులు అని ఎదురుచూస్తున్నారు. పైగా తమకు వస్తాయా? లేక ఇతరులకు వస్తాయా? కూడా అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో ఎక్కడిక్కడ నాయకులనే నిలదీసేంద ధైర్యం చేస్తున్నారు. ప్రభుత్వ పధకాలు అందక, పార్టీ పరమైన పదవులు అందక, ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేతికి రాక ఆర్ధికంగా నాయకులు చితికిపోతున్నారు. అప్పుల పాలౌతున్నారు. చిన్నా చితక కాంట్రాక్టులు వచ్చిన బాగుండని అనుకుంటున్నారు. పల్లెల్లో మొరం పనులు కూడా రాక సతమతమౌతున్నారు. రోడ్డెక్కితే వందలు ఖర్చవున్నాయి. నాయకులు చుట్టూ తిరిగేందుకు వేలకు వేలు ఖర్చవుతున్నాయి. నాయకులు మాటలు నమ్మి తిరిగాల్సిన పరిస్తితి ఎదురౌతోంది. ఇంట్లో కూర్చోలేరు. చేతిలో వున్న పైకం ఖర్చు చేసుకుంటూ సాగలేరు. ఇక పదవులు, పదువులు అని కలవరిస్తూ, ఏ కార్యక్రమం పెట్టినా పై స్దాయి కాంగ్రెస్‌ నాయకులకు ఎదురీతలు తప్పడం లేదు. కార్యకర్తల ప్రశ్నలు ఎదుర్కొ తప్పించుకునే పరిస్దితి లేదు. ఇక కాంగ్రెస్‌ అంటేనే గ్రూపులు. ఆ గ్రూపుల మధ్య సమన్వయం నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పదేళ్ల తర్వాత అదికారంలోకి వచ్చినా కష్టాలు తీరడం లేదని కార్యకర్తలు మొత్తుకుంటున్నారు.. అధికార పార్టీలో నాయకులుగా వుంటూ కూలీ చేసుకోలేరు. ఊరికి పరిమితమై వుండలేరు. నాయకుల పర్యటనల్లో పాలు పంచుకోక వుండలేరు. ఎక్కడా పనులు లేవు…చేతికి పైకం అందింది లేదని మదనపడుతున్నారు. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ ఓదార్చుకుంటున్నారు. అధికారంలోవున్నామన్న మాటే కాని అణా సంపాదన లేదంటూ నిట్టూర్చుతున్నారు. . ఖర్చులు మాత్రం ఆగడం లేదు..కార్యకర్తల పోషణ తప్పడం లేదు. ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంటికొచ్చి కార్యకర్తలు విసుక్కుంటున్నారు. మంత్రుల మందే నాయకులు తిట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల నాయకులు కొట్లాడుకుంటున్నారు. సెక్యూటిరీని కూడా నెట్టేసుకుంటే కష్టాలు చెప్పుకుంటున్నారు. గందరగోళంలో పార్టీ శ్రేణులు. స్దానిక సంస్దల ఎన్నికలు రావడం లేదు..పదువుల అందుతాయా అన్నదిగులు. అధికారంలోవున్న మాటే గాని, సంతోషం ఎక్కడా కనిపించడం లేదు. బిజేపి నాయకులు, కార్యకరర్తల పరిస్ధితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ కూడా అదే పరిస్దితి. కార్యకర్తలకు పదవులు ఇచ్చింది లేదు. కేంద్రంలో పార్టీ అదికారంలోవున్నా గ్రామీణస్దాయి నాయకులకు నామినేటెడ్‌ పదవులు పంచింది లేదు. కార్యకర్తలు కూరలో కరివేపాకులు..రాజకీయాల్లో గోలించి పడేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చుక్క రమేష్ గౌడ్.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చుక్క రమేష్ గౌడ్.

నర్సంపేట,నేటిధాత్రి:

దుగ్గొండి మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లంపల్లి గ్రామానికి చెందిన చుక్క రమేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఎన్నిక చేశారు. మండల అధ్యక్షులుగా చుక్క రమేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా చెన్నూరి కిరణ్ రెడ్డి, ఒలిగె నరసింగారావు, ఇంగోలి రాజేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి అజ్మీర రవీందర్ నాయక్, ఉపాధ్యక్షులు కామశోభన్ బాబు, నల్ల వెంకటయ్య, కార్యదర్శి అమ్మ రోహిత్, ప్రచార కార్యదర్శి కూరతోట సురేష్, కోశాధికారి జంగిలి రవి, కార్యవర్గ సభ్యులు హుస్సేన్ పల్లి విరాట్, గిన్నె స్వామి,రేవూరి వెంకట్ రెడ్డి,యార రవి, నల్ల యాదవ రెడ్డి, ఎర్ర ఆదిరెడ్డి, వేములపల్లి ఓదేలు, పుపాల శ్రీను, పరుపాటి ప్రభాకర్ రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీ గుర్తింపు..

గత 30 సంవత్సరాలుగా వివిధ పార్టీలకు మండల స్థాయి బాధ్యతలు చేపట్టి ఎంపీపీ,సర్పంచ్ పదవులను చేపట్టి సేవలను అనుభవం కలిగిన వ్యక్తిగా దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన చుక్క రమేష్ గౌడ్ కు గుర్తింపు పొందాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హాయంలో దుగ్గొండి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.అలాగే తెలుగుదేశం పార్టీ దుగ్గొండి మండలం అధ్యక్షుడిగా సుమారు 15 ఏళ్ల పాటు పనిచేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా భాజపాకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గెలుపు కృషి చేశారు. కాగా చుక్క రమేష్ గౌడ్ దుగ్గొండి మండలంలో అన్ని గ్రామాలలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రజలకు సన్నిహితంగా ఉంటారు. గత శాసనసభ ఎన్నికల్లో రమేష్ గౌడ్ చేసిన కృషి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పైస్థాయి సీట్లను సాధించగలిగే సత్తా ఉండడంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
గుర్తించి దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షునిగా ఎంపిక చేసినట్లు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా..

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్..

అనతి కాలంలోనే తనపై నమ్మకంతో దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అవకాశం కల్పించారని,కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుల సహకారంతో పార్టీని దుగ్గొండి మండలంలో పూర్తిస్థాయిలో బలోపేతం చేయడానికి
తన వంతుగా కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ హామీ ఇచ్చారు. దేశంలోని ఎక్కడలేని విధంగా కులగనన చేపట్టి 42 శాతం బీసీ రిజర్వేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసిందని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రల బాబు పలువురు నాయకులకు చుక్క రమేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.

లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి.

లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) చెక్కులు పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి;

జహీరాబాద్ టౌన్ : పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ నివాసంలో శనివారం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు
న్యాల్కల్ మండలం సంగమేశ్వర్ -న్యాల్కల్
(₹55,000/-) నర్సింహులు- కాకిజన్వాడ
(₹24,000/-) అశ్విని – హద్నూర్
(₹60,000/-) మాణిక్ – కాకిజన్వాడ
(₹60,000/-)మొత్తం ₹ 199,000 /- విలువగల సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) చెక్కులను ఆయన స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ కార్యక్రమo లో అశ్విన్ పాటిల్,రాజేంద్ర,జగన్నాథ్ రెడ్డి,వేంకట్ రెడ్డి,వెంకట్, సందీప్,ఫయీమ్, ఇస్మాయిల్,సందీప్ రెడ్డి, సునీల్ రెడ్డి మరియు లబ్దిదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సబ్ స్టేష‌న్ లు పెంచండిః.

విద్యుత్ సబ్ స్టేష‌న్ లు పెంచండిః

మంత్రి గొట్టిపాటికి ఎమ్మెల్యే విన‌తి

తిరుప‌తి(నేటి ధాత్రి) జూలై 12:

పెరుగుతున్న జ‌నాభాకు అనుగుణంగా తిరుప‌తిలో నూత‌నంగా ప‌ది విద్యుత్ స‌బ్ స్టేష‌న్లు ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు శ‌నివారం ఉద‌యం కోరారు. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తిరుప‌తికి వ‌చ్చిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటికి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు విన‌తి ప‌త్రం ఇచ్చారు. జ‌న‌భా పెరుగుద‌ల‌తో విద్యుత్ విన‌యోగం పెరిగింద‌ని భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ఠ్యా విద్యుత్ స‌ర‌ఫ‌రా మెరుగుద‌ల‌కు 33 / 11 కేవి స‌బ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆ విన‌తి ప‌త్రంలో ఎమ్మెల్యే కోరారు. మ‌హిళా యూనివ‌ర్శిటీ, ఆర్సీ రోడ్డు, కొర‌మేణుగుంట‌, తుడా ట‌వ‌ర్స్ వ‌ద్ద త‌క్షిణం స‌బ్ స్టేష‌న్ లు ఏర్పాటుకు మంత్రి అంగీక‌రించారు.అలాగే బైరాగిప‌ట్టెడ‌,జీవ‌కోన‌, రామ‌చంద్ర‌పుష్క‌రిణి, శెట్టిప‌ల్లి, క‌పిల‌తీర్థం, అర్బ‌న్ త‌హ‌శిల్దార్ కార్యాల‌య స‌మీపంలో కూడా స‌బ్ స్టేష‌న్ లు ఏర్పాటు చేయాల‌ని కోర‌గా త్వ‌ర‌లోనే వీటి నిర్మాణానికి ఏపిఈఆర్సీ అనుమ‌తి ఇస్తుంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులుకు మంత్రి స్ప‌ష్టం చేశారు.

విధేయుడు తిరుపతి రెడ్డికే పట్టం.

విధేయుడు తిరుపతి రెడ్డికే పట్టం.

నల్లబెల్లి, నేటిదాత్రి:

కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడుతున్న వ్యక్తి చిట్యాల తిరుపతి రెడ్డికి మరోసారి మండల అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా వైనాల అశోక్, ఇస్తారు శేఖర్ గౌడ్,, కర్దూరి కట్టయ్య ఎన్నికయ్యారు.

ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం.

ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్

కోటగిరి సతీష్ గౌడ్ టేకుమట్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు ప్రకారం నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ కేబినెట్ మంత్రి వర్గానికి స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో పాల సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే జిఎస్ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం. ఈ సందర్భంలో ఇంత గొప్ప పార్టీలో ఒక బీసీ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని సతీష్ గౌడ్ తెలిపారు.గత అసెంబ్లీ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి,అన్ని పార్టీలతో మంతనాలు జరిపి రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపేలా చొరవ చూపిన మంత్రులు,ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.విద్యా, ఉద్యోగరంగం తో పాటు రాజకీయంగా,ఇతర అన్ని అంశాల్లో బీసీ రిజర్వేషన్ అందుబాటులోకి వస్తే ఎంతో ఉన్నతి చెందుతారని తెలిపారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వంతో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర వేయించి ఫలాలను అందించేలా కృషి చేయాలని అన్ని పార్టీల నేతలను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version