
ఆపత్కాలంలో అండగా సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..
ముఖ్యమంత్రి సహాయ నిధిపేదలకు వరమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. శుక్రవారం హన్మకొండలోని వారి నివాసంలో పరకాల,నడికూడ,ఆత్మకూరు,దామెర మండలాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరు చేసిన చెక్కులను ఎమ్మెల్యే అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. గ్రామాలలో అనారోగ్యంతో భాదపడుతూ చికిత్స చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒకవరంలా మారిందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ఆపత్కాలంలో ఎంతోమంది నిరుపదలకు ఆసరగా నిలుస్తుందన్నారు. పేద ప్రజలను…