acbki pattubadina public prosecutor, ఏసిబికి పట్టుబడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

ఏసిబికి పట్టుబడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. గురువారం రాజేంద్రనగర్‌ కోర్టులో లంచం తీసుకుంటుండగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను పట్టుకున్నారు. రాజేంద్రనగర్‌ కోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్నలక్ష్మి 15వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు చిక్కారు. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పిపి ప్రసన్నలక్ష్మిని రాజేంద్రనగర్‌ కోర్టులో పట్టుకున్నారు.

Read More

అధికారులపై గవర్నర్‌ ఆగ్రహం

అధికారులపై గవర్నర్‌ ఆగ్రహం పదో తరగతి పాసైన విద్యార్థులు..ఇంటర్మీడియట్‌లో ఎందుకు ఫెయిల్‌ అవుతున్నారని, వారికి సున్నా మార్కులు రావడం ఏంటి’ అని గవర్నర్‌ నరసింహన్‌ అధికారులను ప్రశ్నించారు. ‘ఎన్నడూ లేనట్టు ఇంటర్‌ ఫలితాలపై వివాదం ఎందుకు జరుగుతోందని, ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటి’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్‌ విద్యార్థుల ఆందోళనలతో తాజా పరిస్థితిపై నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దాంతో బుధవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.జోషి, ఉన్నత విద్యా శాఖ…

Read More

2 నుంచి జర్నలిస్టుల క్రీడాపోటీలు

2నుంచి జర్నలిస్టుల క్రీడాపోటీలు వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో మే నెల 2 నుంచి 20వ తేదీ వరకు జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, జర్నలిస్టుల మానసిక ప్రశాంతత కోసం ఈ క్రీడలు నిర్వహిస్తున్నామని హన్మకొండ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, పెరుమాండ్ల వెంకట్‌ తెలిపారు. గురువారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్‌, వాలీబాల్‌, షటిల్‌, బ్యాడ్మింటన్‌, క్యారమ్స్‌, చెస్‌ క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నామని వారు సంయుక్తంగా…

Read More

acbki pattubadina public prosecutor, ఏసిబికి పట్టుబడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

ఏసిబికి పట్టుబడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. గురువారం రాజేంద్రనగర్‌ కోర్టులో లంచం తీసుకుంటుండగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను పట్టుకున్నారు. రాజేంద్రనగర్‌ కోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్నలక్ష్మి 15వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు చిక్కారు. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పిపి ప్రసన్నలక్ష్మిని రాజేంద్రనగర్‌ కోర్టులో పట్టుకున్నారు.

Read More

adhikarulanu suspend cheyali, అధికారులను సస్పెండ్‌ చేయాలి

అధికారులను సస్పెండ్‌ చేయాలి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటును ఆడ్డుకుని, డంపింగ్‌ యార్డుకు తరలించిన అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని దళితరత్న అవార్డు గ్రహీత జన్ను రాజు అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహం తొలగించి చెత్త డంపింగ్‌ యార్డుకు తరలించిన అధికారులను శిక్షించాలని, వెంటనే భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం…

Read More

vidyashaka mantrini tholiginchali, విద్యాశాఖ మంత్రిని తొలిగించాలి

విద్యాశాఖ మంత్రిని తొలిగించాలి ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలలో తప్పులు దొర్లాయని పూర్తి బాధ్యతను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వహించాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని బిసి సంక్షేమ సంఘం యువజన విభాగ జాతీయ కార్యదర్శి కల్లూరి పవన్‌ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 5లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Read More

prapancha maleria nirmulana dinnostvam, ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం

ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వైద్యులు డాక్టర్‌ నరేష్‌, డాక్టర్‌ రాహిల్‌ మాట్లాడుతూ నేడు కీటక జనిత వ్యాధుల నియంత్రణా కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలో ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మలేరియా వ్యాధిని సమూలంగా నిర్మూలించడమే ప్రపంచంలోని దేశాల ధ్యేయమని పేర్కొన్నారు. పరిసరాల…

Read More

collectorku vinathi, కలెక్టర్‌కు వినతి

కలెక్టర్‌కు వినతి ములుగు కలెక్టర్‌ కార్యాలయం ముందు ఇంటర్‌ ఫలితాల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో అవకతవకాలపై నిరసన తెలిపి కలెక్టర్‌ సి.నారాయణరెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో జరిగిన అవకతవకలు, బోర్డ్‌ నిర్లక్ష్యం ఐటి కంపెనీ నిర్వాకం తదితర అంశాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని, విధ్యార్థులకు సంపూర్ణ న్యాయం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు….

Read More

railu kindapadi inter vidyarthi atmahatya, రైలు కిందపడి ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

రైలు కిందపడి ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నెక్కొండ మండలం మత్తడి తండాకు చెందిన బానోత్‌ నవీన్‌ అనే విద్యార్థి నెక్కొండ – ఇంటికన్నె రైల్వేస్టేషన్‌ మధ్యలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Read More

hanamkondalo vijayashanti arrest, హన్మకొండలో విజయశాంతి అరెస్ట్‌

హన్మకొండలో విజయశాంతి అరెస్ట్‌ ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ముట్టడిలో పాల్గొనేందుకు వచ్చిన టీపీసీసీసి చైర్‌పర్సన్‌ విజయశాంతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ఏకశిలా పార్కు నుంచి కాంగ్రెస్‌ ర్యాలీ మొదలు కాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న విజయశాంతిని అరెస్ట్‌చేసి హసన్‌పర్తి పోలీసుస్టేషన్‌కు తరలించారు. హన్మకొండ, సుబేదారి పోలీస్‌స్టేషన్‌లకు తరలించే వీలు ఉన్న…

Read More

kishanreddyki matruviyugam, కిషన్‌రెడ్డికి మాతవియోగం

కిషన్‌రెడ్డికి మాతవియోగం బీజేపీ నేత కిషన్‌రెడ్డి తల్లి గంగాపురం అండాలమ్మ (80) కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి తర్వాత అండాలమ్మ తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం ఆమె స్వస్థలం కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అండాలమ్మ మతిపట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. కిషన్‌రెడ్డి తల్లి మృతిచెందిన విషయం తెలిసిన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆమె మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపి, కిషన్‌రెడ్డిని పరామర్శించారు.

Read More

ambedkar vigrahanni punaprathishitinchali, అంబేద్కర్‌ విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలి

అంబేద్కర్‌ విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని పంజాగుట్ట సెంటర్‌లో పున:ప్రతిష్టించాలని, లేకుంటే అమరణ నిరాహార దీక్ష చేస్తానని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మహాసేన జాతీయ అధ్యక్షుడు కొంగర అనిల్‌కుమార్‌ తెలిపారు. గురువారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చడం, ఎస్సీ, ఎస్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని, ప్రభుత్వం వెంటనే అంబేద్కర్‌ విగ్రహన్ని పున:ప్రతిష్టించాలని డిమాండ్‌ చేశారు. దేశంలోని…

Read More

kaleshwaram project wet run vijayavantham, కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌ రన్‌ విజయవంతం

కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌ రన్‌ విజయవంతం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్క తం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్‌ వెట్‌ రన్‌ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ పూజలు నిర్వహించి స్విచాన్‌ చేసి వెట్‌ రన్‌ను ప్రారంభించారు. నందిమేడారం సర్జ్‌పూల్‌ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్‌పూల్‌ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్‌కు చేరనున్నాయి. అక్కడి నుంచి గోదావరి జలాలు…

Read More

zptc abyarthiga nomination dakalu, జడ్పీటిసి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు

జడ్పీటిసి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు వీణవంక మండలకేంద్రంలో జడ్పీటిసిగా రామకష్ణపూర్‌ సర్పంచ్‌ మ్యాకల సమ్మిరెడ్డి సతీమణి మ్యాకల అనిత నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వీణవంక సర్పంచ్‌ నీల కుమార్‌, ఉపసర్పంచ్‌ భాను, సిద్దెపెల్లి మహిపాల్‌రెడ్డి అభ్యర్థిని ప్రతిపాదించారు.

Read More

chinna nagaramlo health camp, చిన్ననాగారంలో హెల్త్‌క్యాంప్‌

చిన్ననాగారంలో హెల్త్‌క్యాంప్‌ నూగూరు వెంకటాపురం మండలంలోని చిన్న నాగారం గ్రామంలో బుధవారం హెల్త్‌క్యాంప్‌ నిర్వహించారు. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో బిపి, షుగర్‌ తదితర వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రజలందరికీ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ హెల్త్‌ క్యాంప్‌లో డాక్టర్‌ రాజమౌళి, సిబ్బంది వై.సరోజన, రాఘవులు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Read More

inter board ethesthara…?, ఇంటర్‌ బోర్డు ఎత్తేస్తారా…?

ఇంటర్‌ బోర్డు ఎత్తేస్తారా…? ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం…విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో బోర్డు వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీరియస్‌ అయ్యారు. గత కొన్ని రోజులుగా ఇంటర్‌ ఫలితాల్లో దొర్లిన తప్పులపై ఆందోళన కొనసాగుతుండగా ఫెయిల్‌ అయ్యామనే ఆందోళనతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి బుధవారం తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అసలు ఫలితాల ప్రకటనలో తప్పులు ఎలా దొర్లాయని ప్రశ్నించారు. పేపర్లు దిద్దడంలో ఏజెన్సీ గందరగోళానికి పాల్పడిందా…అసలు లోపం ఎక్కడుందని ఆయన ఆరాతీసినట్లు…

Read More

balaji techno school nirvakam, బాలాజీ టెక్నో స్కూల్‌ నిర్వాకం

బాలాజీ టెక్నో స్కూల్‌ నిర్వాకం నర్సంపేట లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్‌లో వేసవి సెలవుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు బుధవారం పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆర్జేడీ, ఇంచార్జి డీఈవో టీ.రాజీవ్‌, ఎంఈఓ దేవా తదితరులు పాల్గొన్నారు. బాలాజీ టెక్నో స్కూల్‌ యాజమాన్యం అధికారులు తనిఖీలు నిర్వహించేందుకు వస్తున్న విషయాన్ని తెలుసుకుని విద్యార్థులను దాచేశారు. తరగతి గదుల్లో విద్యార్థుల పుస్తకాలు లభ్యం కాగా, అందులో కొద్దిరోజులుగా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయుల…

Read More

endalo jagratha, ఎండలో జాగ్రత్త

ఎండలో జాగ్రత్త జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్‌ ప్రకటన జారి చేసారు. మే నెలాఖరు వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. జిల్లాలో ఎండ వేడిమి అధికంగా ఉండడంతో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వడదెబ్బకు వద్ధులు, గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఎక్కువగా గురి అవుతున్నారని…

Read More

ennikala sadarana parishilakuluga sharavanan, ఎన్నికల సాధారణ పరిశీలకులుగా శరవణన్‌

ఎన్నికల సాధారణ పరిశీలకులుగా శరవణన్‌ జిల్లాలో జరగనున్న ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సి.శరవణన్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లాకు సాధారణ పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలకు సంబంధించి ఏమైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే ఎన్నికల సాధారణ పరిశీలకులు సి.శరవణన్‌ మొబైల్‌ నంబర్‌ 9440810105లో సంప్రదించాలని జిల్లా…

Read More

kcr gadde digali, కేసిఆర్‌ గద్దె దిగాలి

కేసిఆర్‌ గద్దె దిగాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కారు…16 అంటే ఎలాగోలా తంటాలు పడి నయానో…భయానో 16సీట్లను గెలిపించుకుంటారనీ అనుకున్నామని, కానీ ఇలా ఘోరాతిఘోరంగా 16మంది విద్యార్థులను బలి కొంటారని ఎవరూ ఊహించలేదని, కేసిఆర్‌ చరిత్ర అంతా ఇలా నమ్మించి ప్రాణాలు తీసిన చరిత్రేనని ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (డిఎస్‌ఓ), తెలంగాణ కమిటీ (యుసిసిఆర్‌ఐ (ఎంఎల్‌)) కిషన్‌ వర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే తెలంగాణా సాధనకు ఎంతగానో కషి చేసిన…

Read More