జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్న కేటీఆర్…

జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

https://youtu.be/n8XtHC_g77I?si=37zwAlH0YSjCUecg

వారం రోజులుగా కేసీఆర్‌తో మంతనాలు జరిపినట్టు సమాచారం. పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను టార్గెట్ చేయడంతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప..

హైదరాబాద్, సెప్టెంబర్ 7 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి వారం రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌తో.. కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్‌కు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. కవితను సస్పెండ్ చేయటంతో పార్టీ క్యాడర్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమచారం.

మరోవైపు, పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ముఖ్యంగా టార్గెట్ చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు. వీటితోపాటు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేటీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ‌నెల 10న కొత్తగూడెం, 11న భద్రాచలం నియోజకవర్గాల్లో కేటీఆర్ టూర్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. 13న‌ గద్వాల్ నియోజకవర్గంలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని కేటీఆర్ భావిస్తున్నారు. దసరా లోపు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలని కేటీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు.

పెంచి తగ్గించడం పండగనా?

-జిఎస్టీ తగ్గింపుతో మేలు జరిగేనా!

-జనం నిజమని నమ్మమంటారా?

-పన్నులు పెంచి తగ్గించడం కూడా గొప్పేనా!

-ఏడేళ్లు ఏడిపించి ఇప్పుడు జోలపాడతారా!

-జిఎస్టీ తీసుకొచ్చిన రోజు దేశానికి రెండో స్వాతంత్య్రం అన్నారు.

-ఎడాపెడా స్లాబ్‌లు తెచ్చి పన్నులు బాదారు.

-ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు.

-ఇప్పుడు జిఎస్టీ తగ్గించి గొప్పలు చెప్పుకుంటున్నారు.

-పరోక్షంగా ప్రజలను పీడిరచుకు తిన్నామని ఒప్పుకున్నారు.

-జిఎస్టీ స్లాబ్‌లు తగ్గించడం వల్ల ప్రభుత్వానికి పెద్దగా నష్టమేమీ లేదు.

-కేవలం 1.1 శాతమే తేడా వస్తుంది.

-ప్రభుత్వానికి 48 వేల కోట్ల నష్టమని కేంద్రం చెప్పడం విడ్డూరం.

-జిఎస్టీ తగ్గించారు సరే కంపెనీలు ధరలు పెంచితే చేసేదే ముంది!

-ధరల పెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ.

-దానిని అదుపు చేయకుండా పన్నులు తగ్గించినట్లు ప్రకటిస్తే సరిపోతుందా!

-జనానికి ఊరట కల్గుతుందా?

-బంగారం మీద జిఎస్టీ తగ్గించామన్నారు.

-బంగారం ధర భారీగా తగ్గుతుందన్నారు.

-ఏడాలో తులం బంగారం ముప్పై వేలు పెరిగిం!

-నిత్యవసర వస్తువుల ధరలు అంతే…

-నాలుగు రోజులు తగ్గిస్తారు.

-కంపనీలు పెంచితే ఆటోమేటిక్‌గా ధరల భారం తప్పదు.

-ప్రభుత్వం చెప్పే గొప్పలకు అర్థముండదు.

-జనానికి ఊరట కల్గిన సంతోషం ఎంతో కాలం వుండదు.

-పన్నలు తగ్గిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని పాలకులే అంటారు.

-ఎన్నికలు రాగానే తగ్గించినట్లు ప్రకటించి మాయ చేస్తారు.

-జనానికి అన్నీ తెలుసు. భరించక తప్పదని తెలియంది కాదు.

-పన్నులు పీడిరపుకు మార్గం.

-అంతకన్నా ఏముంది దౌర్భాగ్యం

హైదరాబాద్‌, నేటిధాత్రి:

ప్రజలను బురిడీ కొట్టించడంలో రాజకీయ నాయకులను మించిన వారు లేరు. రాజకీయ నాయకులు ఏది చేసినా కరక్టె అనిపించుకుంటారు. తాము చేసిందే కరక్టని ప్రజల చేత కూడా అనిపిస్తారు. అదీ రాజకీయాలకు వున్న గొప్ప తెలివి. ప్రజాస్వామ్యంలో రాజకీయపార్టీలదే అంతిమ నిర్ణయం. అందుకే జనం ఏమనుకున్నా సరే..ఎన్నికల్లో గెచే దాక ఒకమాట. గెచాక ప్రజాభివృద్ది పేరుతో మరో మాట. రెండు నాలుకలు లేకుంటే నాయకులు కాలేదు. రాజకీయాలు చేయలేరని చెప్పడానికి చరిత్రలో అనేక సాక్ష్యాలున్నాయి. సరిగ్గా ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అంటూ జిఎస్టీని తెచ్చిం. అంతకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పన్నుల విషయంలో లెక్కా పత్రం వుండే కాదు. అంటూ జేపి చెప్పిన లెక్కలు జనం నమ్మారు. పన్నుల వసూలు అనేది ఎలా జరుగుతుందో కూడా లెక్క లేకపోతోం. దాంతో ప్రజలు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అంటూ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే వన్‌ నేషన్‌, వన్‌ టాక్స్‌ అంటూ ప్రజలను నమ్మించారు. ప్రజలు కూడా ఊరట కల్గుతుం. ధరలు పెద్దఎత్తున తగ్గుతాయని ఆశించారు. మన దేశంలో నూటికి ఎనభై మంది గువ మధ్య తరగతి ప్రజలే వుంటారు. వారికి రూపాయి ఆదా అయినా సరే అ ఎంతో భరోసాగా వుంటుందని ఆశించారు. అనుకున్నట్లుగానే కేంద్రంలో బిజేపి ప్రభుత్వం వచ్చిం. 2017లో దేశమంతా అబ్బురపడేలా జిఎస్టీ తీసుకొచ్చారు. తాము తెస్తున్న జిఎస్టీ దేశానికి రెండో స్వాతంత్య్రం లాంటిదన్నారు. అర్ధరాత్రి స్వతంత్య్రం వచ్చినట్లే, జిఎస్టీని కూడా అర్ధరాత్రి ప్రకటించారు. అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. దేశమంతా ఆ కార్యక్రమాన్ని రాత్రంతా మేలుకొని టివీలకు అతుక్కొని తిలకించారు. గతంలో ఒక వస్తువు, ఒక ప్రాంతంలో ఒక రకమైన పన్ను. మరో ప్రాంతంలో మరో రకమైన పన్ను విధానం వుండే. ఇక దేశంలో ఎక్కడైనా ఏ వస్తువైనా సరే ఒకే పన్ను విధానం అని చెప్పారు. పన్నులను సరలీకృతం చేస్తామని చెప్పారు. దేశమంతా సంతోషపడిర. ఎంతో సంబరపడిర. దేశం కోసం, ధర్మం కోసమంటే ఇదే అని ప్రజలు కూడా బిజేపిని ఎంతో కీర్తించారు. జీఎస్టీ అమలు విషయానికి వచ్చే సరికి ఐదు రకాల స్లాబులు తెచ్చారు. అంతా గందరగోళంగా వుందన్న అనుమానం ప్రజలకు ఆలోనే తెలిసిపోయిం. తగ్గాల్సిన ధరలు పెరుగుతూ వచ్చాయి. పారిశ్రామిక ప్రగతి కుంటుపడుతూ వెళ్లిం. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ గురించి తెలిసి, చిన్న చిన్న వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ఏదో జరుగుతుందని అనుకున్నారు. అనుకున్నట్లుగానే అటు ప్రజలకే కాదు, ఇటు వ్యాపారులకు కూడా జిఎస్టీ అనే గుడి బండగా మారుతూ వచ్చిం. ఏడా, రెండేళ్ల గడిచే సరికి దేశంలో వ్యాపారుల జీవితాలు తలకిందులౌతూ వచ్చాయి. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. జిఎస్టీ తెచ్చి, దానిని అమలు కార్యాచరణ ప్రకటించిన వెంటనే లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. జిఎస్టీ అనే పన్ను విధానంలో లోపభూయిష్టమైందన్నారు. ప్రజలకు నామాలు పెట్టడం తప్ప మరేం లేదన్నారు. ప్రజలను మరింత దోచుకునేందుకు ఎత్తుగడ అన్నారు. గతంలో పన్ను విధానాన్ని ఎత్తి చూపిన బిజేపి నిర్ణయం ప్రజలను పెనం మీద నుంచి పొయ్యిలో వేసినట్లే అవుతుందని అన్నారు. దాన్ని బిజేపి తీవ్రంగా తప్పు పట్టిం. పైగా ఆ సమయంలో ప్రతిపక్షాలకు పెద్దగా బలం లేదు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. అప్పటికే రాహుల్‌ గాంధీని టార్గెట్‌ చేస్తూ వుండే. రాహుల్‌ గాందీ మీద బిజేపి ఇష్టమొచ్చినట్లు విరుచుకుపడుతుండేది. రాహుల్‌ ఏం మాట్లాడినా పెడర్దాలు తీసేవారు. ప్రజలు కూడా నిజమే కావొచ్చని, రాహుల్‌ చెప్పేదే అబద్దమని కూడా అనుకుంటూ వచ్చారు. బిజేపి మాటలనే బలంగా నమ్ముతూ వచ్చారు. కాని ప్రజలకు రాను రాను అర్ధమైం. జిఎస్టీ వల్ల పెద్ద బొక్క పడుతోందని అర్ధమైం. ఆ సమయంలో రాహుల్‌ గాంధీ చెప్పిన వ్యాఖ్యలు నిజమే అనే అనుమానం ప్రజలకు వస్తుందన్న సమయంలో జిఎస్టీ స్లాబుల్లో మార్పులు చేశారు. ఐదు స్లాబులన నాలుగు చేశారు. ప్రజలను ఊరడిరచారు. ప్రజలకు ఊరటక్పస్తున్నామని చెప్పారు. అయినా రాహుల్‌ గాంధీ హెచ్చరిస్తూనే వచ్చారు. జిఎస్టీ మూలంగా దేశంలో 18లక్షల చిరు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు కనుమరుగయ్యారు. కొన్ని కోట్ల మంకి ఉపా లేకుండాపోయిందని రాహుల్‌ చెప్పారు. ఇప్పుడు అదే నిజమౌతోం. ఒకదశలో ఆహార పదార్థాల మీద కూడా వేసిన పన్నులపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న. పాలు, పెరుగు మీద కూడా 12శాతం జీఎస్టీ వేశారు. దాంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైం. దాంతో మళ్లీ దానిని సవరించారు. ఐదు శాతానికి తెచ్చారు. స్కూలు పిల్లలు వాడే పెన్నులు, పెన్సిళ్లు, ఏరేజర్లు, నోట్‌ బుక్స్‌ ఇలా ప్రతి వస్తువు మీద జీఎస్టీ వేయడం పెద్ద చర్చనీయాంశమైం. ముఖ్యంగా నిత్యావసర వస్తువులపై జిఎస్టీ వేయడాన్ని దేశమంతా తప్పు పట్టిం. కాలక్షేపం కోసం తినే పాప్‌ కార్న్‌లో కూడా మూడు రకాల పన్నులు వేయడం బిజేపి తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకున్న. అప్పటి నుంచి ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఎంత డిమాండ్‌ చేసినా కేంద్ర ప్రభుత్వం స్పంంచలేదు. గత ఎన్నికల్లో బిజేపికి పూర్తి స్దాయి మెజార్టీ వస్తే ప్రజల జీవితాలు ఎలా వుండేవో అని అనుకుంటున్నారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఏర్పాటైం. బలమైన ప్రతిపక్షం తయారైం. దాంతో బిజేపిపై ప్రతిపక్షాలు అడుగడుగునా విజయం సాధిస్తున్నాయి. బిజేపికి గడ్డుకాలం కనిపిస్తోం. ఓ వైపు ఓట్‌ చోరీ అంటూ రాహుల్‌ గాందీ చేస్తున్న పోరాటం ప్రజలను బాగా ఆకర్షిస్తోం. ప్రజల్లో పెద్దఎత్తున చైతన్యం నింపుతోం. పాకిస్తాన్‌పై ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టిన కేంద్రం ఎలాగైనా ఆ దేశానికి బుద్ది చెబుతుందని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలతో సహా,ప్రజలంతా అండగా నిచారు. పహల్‌గావ్‌లో టెర్రరిస్టులు చేసిన పనికి దేశమంతా కుతకుతలాడిర. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరిం. ఆపరేషన్‌ సిందూర్‌ మొదలు పెట్టిన కేంద్రం హటాత్తుగా ఆపరేషన్‌ ఆపేసిం. ఆపరేషన్‌ సిందూర్‌ అయిపోయం. పాకిస్తాన్‌ను చావు దెబ్బతీశామని ప్రజలు అనుకుంటున్న వేళ అమెరికా అద్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు దేశం వ్యాప్తంగా ఒక్కసారిగా కళకళం రేపాయి. యుద్దం నేనే ఆపానంటూ ట్రంప్‌ చెప్పారు. ఒకసారి కాదు పదే పదే చెబుతూ వచ్చారు. దాంతో మన దేశ సార్వభౌత్వం మీద అమెరికా పెత్తనమేమిటనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోమొదలైం. ఈ సంఘటన ప్రతిపక్షాలకు మంచి ఆయుధమైపోయిం. ఇక అప్పటి నుంచి అటు ఓట్‌ చోరీ అంశం, ఇటు ఆఫరేషన్‌ సిందూర్‌ అంశాలతో కేంద్రాన్ని ఉక్కిరిక్కిరి చేస్తున్నాయి. త్వరలో బిహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పహల్గావ్‌ మీద దాడి జరిగిన రోజు ప్రధాని మోడీ ఇరాన్‌ పర్యటనలో వున్నారు. హుటాహుటిన దేశానికి చేరుకున్నారు. దానిపై సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తారని అందరూఅనుకున్నారు. కాని మధ్యాహ్నం వరకు బిహార్‌ వెళ్లి ఎన్నికల సభలో మాట్లాడారు. ఇక్కడే ప్రతిపక్షాలకు, ప్రజలకు మరింత ఆగ్రహం వచ్చేలా చేసిం. పార్లమెంటు సమావేశాలలో అధికార బిజేపిని ప్రతిపక్షాలు ఊపిరి సలపనివ్వలేదు. ఇక ఎలాగైనా ప్రజల దృష్టి మళ్లించాలని అనుకున్న కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిం. ఆగష్టు పదిహేను స్వాతంత్య్ర నోత్సవం రోజున దేశ ప్రధాని మోడీ దీపావళికి ప్రజలకు కానుక ప్రకటిస్తున్నాను అని చెప్పారు. అందరూ ఏముంటుందని అనుకున్నారు. జిఎస్టీని తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడున్న నాలుగు స్లాబుల స్దానంలో రెండు మాత్రమే అమలు చేస్తామని చెప్పారు. తాజాగా జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయం చేశారు. ఇక ప్రజలు పండగ చేసుకొమ్మంటున్నారు. దాంతో ప్రతిపక్షాలు, ప్రజలు ఆశ్చర్యానికి గురైయ్యారు. కొండంత పెంచి రవ్వంత తగ్గించి పండగ చేసుకొమ్మడనం బిజేపికే చెల్లిందని ప్రతిపక్షాలు ఎదురు దాడి చేయడం మొదలు పెట్టాయి. ఇలా అయినా బిజేపికి వచ్చే రాష్ట్రాల ఎన్నికల్లో కలిసి వస్తుందని అనుకుంటే ఇక్కడ కూడా జిఎస్టీ ఎత్తుగడ పాచిక పారలేకుండాపోయిం. కాకపోతే కొంతలో కొంత ఊరట కల్గుతుందని అనుకుంటున్నారు. అయితే అది ఎంత కాలముంటుందో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ తగ్గిందని ధరలు తగ్గిస్తే, ఉత్పత్తి దారులు వస్తువుల ధరలు పెంచితే మొదటికే వస్తుందని నవ్వుకుంటున్నారు. ఇది బిజేపికి ఎంత మేర మేలు చేస్తుందో వేచి చూడాలి.

“బీసీ”లు “కవిత” వైపే”

“నేటిధాత్రి”,హైదరాబాద్.
జాగృతి అధ్యక్షురాలు కవిత ను కలిసి మద్దతు తెలిపిన బిసి కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్

ఈరోజు హైదరాబాదులో తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క ను కలిసిన బిసి కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మరియు ఇతర నాయకులు వారిని కలిసి మద్దతు ప్రకటించడం జరిగింది.

ఈ సందర్భంగా కవితక్క మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. బిసి ఉద్యమ బలోపేతం మరియు నలబై రెండు శాతం రిజర్వేషన్ పైన మరింత తీవ్రస్థాయిలో ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని బిసి రిజర్వేషన్ అమలు కోసం జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా భవిష్యత్తు లొ అనేక కార్యక్రమల రూపకల్పన జరుగుతుందని ‌వారు అన్నారు.

రానున్న రోజులలో తెలంగాణ జాగృతి, మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ చేసే ప్రతి ఉద్యమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకు పోవాలని 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం బిసిలను, బిసి సంఘం నాయకులను మేధావులను, ఇతర ప్రజా సంఘాలను, కలుపుక విస్తృతమైన ప్రజా జాగరణ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటూ ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలని కవితక్క సూచన చేయడం జరిగింది.
ప్రతి ఉద్యమానికి కరీంనగర్ జిల్లా ఆయువు పట్టు అలాంటి కరీంనగర్ జిల్లాకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని వారు కోరడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులలో జాగృతి కార్యకర్తలు కానీ, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులకు నేను అండగా ఉంటానని వారు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ధైర్యంగా ముందుకు పోవాలని వారు అన్నారు.
బిసి ఉద్యమం బలోపేతం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కవితక్క భవిష్యత్త్ లో ఎలాంటి నిర్ణయం తీసుకున్న వారికి తమ సంపూర్ణ మద్దతు కవితక్కే ఉంటుందని గుంజపడుగు హరిప్రసాద్ వారికి తెలియచేయడం జరిగింది.

సమాచారం అడిగితే నిర్లక్ష్యం వహిస్తున్న ఎంఈఓ…

సమాచారం అడిగితే నిర్లక్ష్యం వహిస్తున్న ఎంఈఓ

55రోజులు గడుస్తున్నా అందని సమాచారం

బిఎస్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మొగ్గం సుమన్

పరకాల నేటిధాత్రి

 

 

సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రయివేట్ పాఠశాల సమాచారం కోరగా పరకాల ఎంఈఓ రమాదేవినీ కోరగా ఇప్పటివరకు దాదాపు 55 రోజులు గడుస్తున్న సమాచారం ఇవ్వలేదని బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మోగ్గం సుమన్ అన్నారు.సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం జూలై 11.2025 రోజున ఎంఈఓ ను సమాచారం కోరగా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన ప్రతిఫలం లేకుండా పోయిందని వాపోయారు.అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేట్ విద్యా సంస్థలు పేద విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని,అధికారుల అండ చూసుకోనీ ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారం చేస్తున్నారని అన్నారు.ఇప్పటివరకు దాదాపు రెండు నెలలు కావస్తున్న సమాచారం ఇవ్వలేదని కార్యాలయానికి ఎప్పుడు వెళ్లిన అందుబాటులో ఉండటం లేదన్నారు.సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం,పౌర సమాచార అధికారి అప్పిలేటుకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని అన్నారు.

విజయ్ శంకర్ ఝా మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు…

విజయ్ శంకర్ ఝా మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

యంసిపిఐ(యు) మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ కేంద్ర కమిటీ శాశ్వత ఆహ్వానితులు కామ్రేడ్ విజయ్ శంకర్ ఝా మృతి ప్రజా ఉద్యమాలకు,ఎంసిపిఐ(యు) పార్టీకి తీరని లోటని పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.నర్సంపేట ఓంకార్ భవన్ లోఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో రాజస్థాన్ కోటా తల్వాండిలో అమరత్వం పొందిన పార్టీ మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు విజయ్ శంకర్ ఝా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.అనంతరం పార్టీ నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ అధ్యక్షతన జరిగిన సంతాప కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దారపు రమేష్ మాట్లాడుతూ అమరజీవి విజయ్ శంకర్ ఝ కార్మిక ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూనే రాజస్థాన్ రాష్ట్ర పార్టీ నిర్మాణంలో కామ్రేడ్ మోహన్ పునామియాతో కలిసి కీలకమైన బాధ్యతలు నిర్వహించిన గొప్ప మార్క్సిస్ట్ నాయకుడని ఉన్నారు. కామ్రేడ్ ఓంకార్ చూపిన బాటలో బూర్జువా భూస్వామ్య పెట్టుబడిదారీ శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఐక్యత కోసం నిరంతరం పరితపించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోనె కుమారస్వామి, ఐక్య ప్రజానాట్యమండలి, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శులు కన్నం వెంకన్న వంగల రాగసుద, పార్టీ రాష్ట్ర నాయకులు బాబురావు,నాగెల్లి కొమురయ్య, కనకం సంధ్య, జిల్లా నాయకులు మాలోత్ సాగర్,సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి,కొత్తకొండ రాజమౌళి, కేశెట్టి సదానందం,ఐతమ్ నాగేష్, మాలోత్ మల్లికార్జున్, ప్రభాకర్,ఓదేలు దాసు కుమారస్వామి,నరసయ్యలతోపాటు తదితరులు పాల్గొన్నారు.

గణప సముద్రం లో గణేశుల నిమజ్జనం…

గణప సముద్రం లో గణేశుల నిమజ్జనం

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో నవరాత్రులు పూజలు అందుకున్న గణేశులను నిమజ్జనం ఏర్పాట్లును పర్యావేక్షించిన తాసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో ఎల్ భాస్కర్, ఎస్సై రేఖ అశోక్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గణపసముద్రం వద్ద ఫ్లోట్ ఏర్పాట్లు సముద్రం సరసు వద్ద గణపతుల నిమజ్జనోత్సవానికి ఇరిగేషన్ శాఖ భూపాలపల్లి ఈ ఈ

 

 

 

బసవ ప్రసాద్ గౌడ్ గణపురం ఎస్ ఐ రేఖ అశోక్ రూ 35 వేళ్ళతో వెదురు బొంగులు ఇనుప డ్రమ్ములతో మొదటిసారి ఏర్పాటుతో విగ్రహాలను తీసుకెళ్లడంకి క్రేన్ సహాయంతో ఫ్లోట్ పైకి విగ్రహాలను ఎక్కించి లోతట్టు ప్రాంతానికి తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు.ఏ బి డి ఈ ఈ వరుణ్ ఏఈ శ్రీనివాస్ వీరి సహాయంతో ప్రత్యేకంగా నిమజ్జనోత్సవానికి శాశ్వత విద్యుత్ స్తంభాలను ఏర్పాట్లు అధికారులు ట్రాన్స్కో కో ఎస్ సి మల్పూర్ నాయక్ డి ఈ పాపిరెడ్డి గణపురం ట్రాన్ కో ఏ ఈ వెంకటరమణ మూడు రోజులపాటు విద్యుత్తు శాఖ సిబ్బంది తో ఎనిమిది విద్యుత్తు స్తంభాలను నూతనంగా ట్రాన్స్ఫారం ఏర్పాట్లు చేశారు.

సొంతింటి కల నెరవేర్చకపోతే దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధం…

సొంతింటి కల నెరవేర్చకపోతే దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధం

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి

శ్రీరాంపూర్, మంచిర్యాల నేటి ధాత్రి:

 

 

సింగరేణి కార్మికులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న సొంతింటి కల పథకం ప్రభుత్వం, యాజమాన్యం నెరవేర్చకపోతే దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధమేనని కార్మికులు, యూనియన్లకు అతీతంగా కార్మిక నాయకులు సూచనలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు.శనివారం ఇందారం 1ఎ గనిలో సిరికొండ శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ద్వార సమావేశంలో ఆయన పాల్గొని పొంతింటి పథకంపై బ్యాలెట్ నమూనా వాల్ పోస్టర్ ను కార్మికులతో ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 11,12వ తేదీలలో సొంతింటి పథకంపై సిఐటియు నిర్వహిస్తున్న అభిప్రాయ సేకరణలో భాగంగా నమూనా బ్యాలెట్ నిర్వహిస్తున్నందున కార్మికులు పాల్గొనాలని అన్నారు.అలాగే 15 వ తేదీన వాస్తవ లాభాలు ప్రకటించాలని,35 శాతం వాట కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిఎం కార్యాలయాల ముందు చేపట్టే ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒకవైపు ప్రతిపక్షాలు ఆందోళనలు ధర్నాలకు పిలుపునిస్తుంటే దసరా దగ్గర పడుతున్న ఇంకా లాభాల వాటా ప్రకటన చేయకపోవడం గుర్తింపు,ప్రాతినిధ్య సంఘాలకు సిగ్గుచేటని విమర్శించారు.తక్షణమే వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు లాభాల వాట చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.యాజమాన్యంపై గతంలో పోరాటాలు చేసిన గుర్తింపు,ప్రాతినిథ్య సంఘాల నాయకులు ఇప్పుడు వినతి పత్రాలకు పరిమితమయ్యారని ఆరోపించారు.ఇప్పటికైనా అన్ని సంఘాలను కలుపుకొని కార్మిక వర్గ శ్రేయస్సు కోసం యాజమాన్యంపై పోరాటాలు చేద్దామన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు గుల్ల బాలాజీ బ్రాంచ్ నాయకులు కస్తూరి చంద్రశేఖర్,వెంగళ శ్రీనివాస్, వెంకట్ రెడ్డి,కిషన్ రెడ్డి,నవీన్, ఐత శ్రీనివాస్,షేక్ షావలి,మొయినుద్దీన్,ఇప్ప నరేష్,వినయ్,సుదీర్ పాల్గొన్నారు.

మోడీ జీఎస్టీ తగ్గింపుకు పాలాభిషేకంతో స్వాగతం…

దేశ ప్రజల సంక్షేమమే బిజెపి లక్ష్యం. జీఎస్టీ స్లాబ్ లను తగ్గించి..దేశ ప్రజలకు ముందే పండుగ వాతావరణాన్ని కల్పించిన మోడీ

-బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి

-మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న భాజపా శ్రేణులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలపై ఆర్థిక భారాన్ని మరింత తగ్గించేందుకు జీఎస్టీ స్లాబ్ లను భారీగా తగ్గించి దేశ ప్రజలకు ముందే దీపావళి పండుగ వాతావరణాన్ని కల్పించారని బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి అన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం, భద్రత, మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా జీఎస్టీలో తీసుకొచ్చిన మార్పులను స్వాగతిస్తూ..జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో భాజపా శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి& బిజెపి రాష్ట్ర నాయకులు చెవ్వ శేషగిరి ప్రజలను, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. దేశాన్ని ప్రపంచంలోనే వికసిత్ భారత్ గా మార్చే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీకి మంచి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారత దేశ అభివృద్ధి, దేశానికి వస్తున్న పేరు ప్రతిష్టలు చూసి అగ్రరాజ్యమే వణికిపోతుందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. భారతదేశానికి వివిధ దేశాల నుంచి వస్తున్న మద్దత్, ఆదరణను చూసి అమెరికా వంటి దేశాలు కూడా ఈర్ష్య పడుతున్నాయన్నారు. మన దేశ కీర్తిని ప్రపంచ నలుమూలల పెంచుతున్న మన ప్రధాని నరేంద్ర మోడీకి దేశ ప్రజల అండదండలు మెండుగా ఉన్నాయన్నారు. జీఎస్టీ స్లాబ్ లను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో వ్యాపారస్తులకు, ఆరోగ్య పరికరాల కొనుగోలు అమ్మకం దారులకు, మధ్యతరగతి ప్రజలకు చాలా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కుమ్మరి లచ్చమ్మ సారయ్య దళిత మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు బండారి రవీందర్ జిల్లా నాయకులు పోతుగంటి సాయిలు మండల ప్రధాన కార్యదర్శులు బండారి శ్రీనివాస్ అరికాంతపు కృష్ణారెడ్డి మండల ఉపాధ్యక్షులు రాస బిక్షపతి మండల కోశాధికారి వంగరవి మండల కార్యదర్శి పులి భాస్కర్ రెడ్డి చిలక మారి రాజేంద్రప్రసాద్ బూత్ అధ్యక్షులు పొడి శెట్టి రవి సామల తిరుపతిరెడ్డి రేపల శ్రీనివాస్ మధుకర్ ముక్క రవీందర్ తదితరులు పాల్గొన్నారు

సరైన వైద్యం అందరికి అందాలి…

సరైన వైద్యం అందరికి అందాలి

కాంగ్రెస్ పార్టీ గుండాల మండల నాయకులు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

 

 

మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన వద్ద జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించి వారికి వెంటనే సరైన వైద్యం అందేలా చూడాలని హాస్పిటల్ సిబ్బంది తో మాట్లాడిన యువసేన కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్ ఈ సందర్బంగా వారు స్థానిక హాస్పటల్ డాక్టర్ తో మాట్లాడి ఏకలవ్య విద్యార్థుల ఆరోగ్యం పట్ల మెరుగైన వైద్యం అందించి అప్రమత్తం గా ఉండాలని కోరారు, అలాగే సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న తరుణంలో ఏకలవ్య మరియు గురుకుల పాఠశాలల్లో హెల్త్ క్యాంపు లను నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు గమనిస్తూ వారికి తగిన ఆరోగ్య చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమం లో ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, సీనియర్ నాయకులు మోకాళ్ళ బుచ్చయ్య, నూనావత్ రవి, పూనెం లక్ష్మి, గుర్రం పుష్పరాజ్, గడ్డం రాజేష్, బొంగు చంద్రశేఖర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి తరపున భక్తులకు సూచన…

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి తరపున భక్తులకు సూచన
జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానము లో తేది. 07-09-2025 అదివారం రోజున ” చంద్ర గ్రహణము” సందర్భంగా దేవాలయము మధ్యాహ్నం || 1:00 గం|| నుండి మూసివేయబడును. మళ్ళి సోమవారము నాడు 3໖. 08-09-2025 సంప్రోక్షణ కార్యక్రమం తరువాత స్వామి వారి దర్శనం భక్తులకు ఉదయం 6:00.గం.ల|| నుండి యధావిధిగా దర్శించుకోగలరు.కావున భక్తులు సహకరించగలరని తెలియపర్చడమైనది.

చేవెళ్లలో అడిషనల్ జూనియర్ సివిల్ కోర్ట్ ప్రారంభం

చేవెళ్లలో అడిషనల్ జూనియర్ సివిల్ కోర్ట్ ప్రారంభం

చేవెళ్ల, నేటిధాత్రి :

 

 

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అడిషనల్ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఆఫ్ రంగారెడ్డి జిల్లా జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, చేవెళ్ల సివిల్ కోర్టు న్యాయమూర్తి దశరథ రామయ్య తో కలిసి నూతన జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జ్ కోర్టును ప్రారంభించారు. అంతకుముందు చేవెళ్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ మాట్లాడుతూ సామాన్యులకు సత్వర న్యాయమందించే లక్ష్యంతో ప్రభుత్వం చేవెళ్లలో జూనియర్‌ సివిల్‌ కోర్టును ఏర్పాటు చేసిందన్నారు. కొత్తగా కోర్టును ప్రారంభించడం ద్వారా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి . శ్రీనివాస్ రెడ్డి, సి. మహేష్ గౌడ్, జనరల్ సెక్రటరీ, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

పాపయ్య గారికి నివాళులర్పించిన నల్లాల ఓదెలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-68.wav?_=1

పాపయ్య గారి పార్థివదేహానికి పూలమాలవేసి ప్రగాఢ సానుభూతి తెలిపిన నల్లాల ఓదెలు

మందమర్రి నేటి ధాత్రి

*మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ తండ్రి పాపయ్య కి నివాళులు అర్పించిన మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు

మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ గారి తండ్రి మేడిపల్లి పాపయ్య స్వర్గస్తులవగా విషయం తెలుసుకొని కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం, రామన్నపల్లి గ్రామంలోని వారి స్వగృహం నందు పాపయ్య గారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన *మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు

ఉత్తమ ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు టి ఎస్ ఘన సన్మానం…

ఉత్తమ ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు టి ఎస్ ఘన సన్మానం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం ను పురస్కరించుకొని కాసిపేట్ మండలం నుండి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులు జాడి ప్రవీణ్ ( రాష్ట్ర స్థాయి) టి జి ఎం ఎస్ కాశీపేట్,డి. పుష్పలత జడ్ పి ఎచ్ ఎస్ ముత్యం పల్లి,గంగిపల్లి రాజేశం జడ్.పి.హెచ్.ఎస్. ధర్మారావు పేట్ ను పి.ఆర్ టి.యు. కాశీపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్బంగా జరిగిన సమావేశం లో మండల శాఖ అధ్యక్షులు గంప శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎంపిక చేయబడిన ముగ్గురు ఉపాధ్యాయులు వారి వారి పాఠశాలల్లో మెరుగైన ఫలితాల సాధన కోసం కృషి చేయడమే కాకుండా, విధార్థులను శాస్త్ర సాంకేతిక అంశాలపై దృష్టి కేంద్రీకరించే విధంగా చేస్తూ ఇన్స్పైర్,సైన్స్ ప్రదర్శన లకు తీసుకువెళ్తూ, పాఠశాల కు విశేషం గా కృషి చేసినవారే కావడం వల్ల మండలం లోని ఉపాధ్యాయులు హార్షం వక్తం చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో వీరికి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమం లో ఎం ఈ ఓ వెంకటేశ్వర స్వామి,మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఖలీల్,రాష్ట్ర బాధ్యులు నాగ మల్లేష్, మండల శాఖ అసోసియేట్ అధ్యక్షులు కృష్ణ గోపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పోచమ్మ తల్లి దేవాలయానికి విరాళం.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-67.wav?_=2

పోచమ్మ తల్లి దేవాలయానికి విరాళం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో పోచమ్మ దేవాలయం నిర్మాణానికి విశ్రాంతి ఉపాధ్యాయుడు నాగులపల్లి యాదగిరి రూ 46,116 విరాళాన్ని శనివారం దేవాలయం నిర్వాహలకు అందజేశారు. ఈ విరాళంతో దేవాలయం గోపురం పైన ఉన్న కలశం చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి దాతలు విరాళాలు అందజేయాలని నిర్వాహకులు కోరారు.

ఘనంగా గణపతి నిమజ్జనం…

ఘనంగా గణపతి నిమజ్జనం

మరిపెడ నేటిధాత్రి

 

 

భక్తులతో నవరాత్రులలో ఘనంగా పూజలందుకున్న గణనాధుడి నిమజ్జనం వేడుకలు కోలాహలంగా నిర్వహించారు,మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రం తోపాటు ఊరూరా గణపతి నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో కోలాహలంగా నిర్వహించారు. మరిపెడ పట్టణ కేంద్రంలోని ఆర్ఎస్ ప్లాజా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది.మహిళల కోలాటాలు,డప్పు చప్పుల్లతో భక్తులు బారీగా హాజరై పట్టణ వీధుల్లో ర్యాలీగా శోభాయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ ఆర్ సత్తి రెడ్డి మాట్లాడుతూ గణపతి నీ భక్తి శ్రద్దలతో పూజించి కోరిన కోర్కెలు తీర్చాలని, అందరూ ఆరోగ్యంగా, సుభిక్షముగా ఉండాలని, అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నామనన్నరు,మాకుల చెరువు దగ్గర నిమజ్జనం చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు,అంతకుముందు గణేషుడి లడ్డు వేలంపాట నిర్వహించగా 61 వేల రూపాయలకు కరుణాకర్ రెడ్డి ఝాన్సీ దంపతులు,51 వేల రూపాయలకు రావుల సుమంత్ రెడ్డి లావణ్య దంపతులు, దక్కించుకున్నారు. లక్కీ డ్రా ద్వారా గందసిరి సునీత రమేష్ గౌడ్ దంపతులు దక్కించుకున్నారు, ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్లాజ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆర్ సత్తి రెడ్డి, నీరంజన్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి,శ్రీపాల్ రెడ్డి,దోమల సత్య శ్రీనివాస్, ఉడుగుల శ్రీను,కృష్ణ,భద్రీ,సాగర్,కార్తీక్,ఉపేందర్,సురేష్,సోమిరెడ్డి, రామ చంద్రయ్య,రేపల యాదయ్య, ఉపేందర్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.

గడప సముద్రం లో గణేశుల నిమజ్జనం..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-66-1.wav?_=3

గడప సముద్రం లో గణేశుల నిమజ్జనం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో నవరాత్రులు పూజలు అందుకున్న గణేశులను నిమజ్జనం ఏర్పాట్లును పర్యావేక్షించిన తాసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో ఎల్ భాస్కర్, ఎస్సై రేఖ అశోక్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గణపసముద్రం వద్ద ఫ్లోట్ ఏర్పాట్లు సముద్రం సరసు వద్ద గణపతుల నిమజ్జనోత్సవానికి ఇరిగేషన్ శాఖ భూపాలపల్లి ఈ ఈ బసవ ప్రసాద్ గౌడ్ గణపురం ఎస్ ఐ రేఖ అశోక్ రూ 35 వేళ్ళతో వెదురు బొంగులు ఇనుప డ్రమ్ములతో మొదటిసారి ఏర్పాటుతో విగ్రహాలను తీసుకెళ్లడంకి క్రేన్ సహాయంతో ఫ్లోట్ పైకి విగ్రహాలను ఎక్కించి లోతట్టు ప్రాంతానికి తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు.

Gadapa Samudram.

ఏ బి డి ఈ ఈ వరుణ్ ఏఈ శ్రీనివాస్ వీరి సహాయంతో ప్రత్యేకంగా నిమజ్జనోత్సవానికి శాశ్వత విద్యుత్ స్తంభాలను ఏర్పాట్లు అధికారులు ట్రాన్స్కో కో ఎస్ సి మల్పూర్ నాయక్ డి ఈ పాపిరెడ్డి గణపురం ట్రాన్ కో ఏ ఈ వెంకటరమణ మూడు రోజులపాటు విద్యుత్తు శాఖ సిబ్బంది తో ఎనిమిది విద్యుత్తు స్తంభాలను నూతనంగా ట్రాన్స్ఫారం ఏర్పాట్లు చేశారు.

ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి…

ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

 

కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్లందర్నీ పర్మినెంట్ చేసి,కనీస వేతనం నెలకు26,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న హైదరాబాదులో జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సుకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు గుండాల ఏరియా కమిటీ కార్యదర్శి యాసారపు వెంకన్న పిలుపునిచ్చారు. శనివారం గుండాల మండల కేంద్రంలో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ప్రజాల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని విమర్శించారు.రెక్కలు తప్ప ఆస్తులు లేని ఈ కార్మికులకు కనీస వేతనాలు కూడ అమలు చేయడం లేదని విమర్శించారు.మురికిలో మునిగి వీధులను శుభ్రం చేస్తున్న సపాయి కార్మికులకు హెల్త్ కార్డులు కూడా ఇవ్వకపోవడం చాలా విచారకరమని అన్నారు.పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్మిక సమస్యల పరిష్కారానికై సెప్టెంబర్ 7న హైదరాబాదులో నిర్వహించే ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సుకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు గడ్డం నాగేష్,తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు చింత నరసయ్య కార్మికులు పాల్గొన్నారు.

అతిధి అధ్యాపక నియమాకానికి దరఖాస్తుల ఆహ్వాన తేదీ పొడగింపు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-65-1.wav?_=4

అతిధి అధ్యాపక నియమాకానికి దరఖాస్తుల ఆహ్వాన తేదీ పొడగింపు

8వ తేదీన దరఖాస్తులు స్వీకరణ,9వ తేదీన ఇంటర్యూ నిర్వహణ

 

పరకాల నేటిధాత్రి
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025,26 విద్యా సంవత్సరానికి గాను ఆతిధి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.బేతి సంతోష్ కుమార్ తెలిపారు.విద్యాశాఖా కమీషనర్ ఆదేశాల మేరకు బోటనీ విభాగంలో 1,మరియు మాథెమాటిక్స్ విభాగంలో 1కి గాను ఆతిధి అధ్యాపక నియామకానికి దరఖాస్తులు స్వీకరించటం జరుగుతుందని,సంబందిత సబ్జెక్టులో 55శాతం మార్కులు (ఎస్సి,ఎస్టీ అభ్యర్థులు 50శాతం మార్కులు)కలిగి ఉంటే ధరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.పిహెచ్డి,నెట్,సెట్ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది తెలిపారు.దరఖాస్తులు ఈ నెల 08వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలని,ఇంటర్వ్యూలు 09వ తేదీ ఉదయం నిర్వహించడం జరుగుతుందని అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరుకావాలని తెలిపారు.సమాచారం కోసం 9951535357 గల నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్ గీత భాస్కర్..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-64.wav?_=5

కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్ గీత భాస్కర్

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గీతా భాస్కర్ గత కొద్ది నెలల క్రితం బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళగా తిరిగి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ సర్పంచ్ గీత భాస్కర్ తో పాటు పూజారి సాంబయ్య పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కొమ్ము రమేష్ యాదవ్, మారం రాము, గాదె భద్రయ్య, గుంటుక సోమయ్య,బండి సత్యనారాయణ రెడ్డి, నరేందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మోహన్ రెడ్డి, దొమ్మటి పురుషోత్తం, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

హత్యకు గురైన బాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-63-1.wav?_=6

హత్యకు గురైన బాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తిలో పట్టణానికి చెందిన బాలయ్య కొడుకు బీరయ్య చేతిలో హత్యకు గురైన బాలయ్య కుటుంబ సభ్యులను ప్రభుత్వ హాస్పిటల్ లో పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అనంతరం బాలయ్య భార్యను కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని అధైర్య పడద్దని అని అన్నారు.అదేవిధంగా అనంతరం హాస్పిటల్లో సందర్శించారు. వివిధ గ్రామాలకు చెందిన పాముకాటు గురైన చికిత్స పొందుతున్న యువకులను పరామర్శించి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలని అదేవిధంగా డాక్టర్లకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను సూచించారు అదేవిధంగా ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ సమాజంలో ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఘోరాలు చాలా ఎక్కువ అయ్యాయి దయచేసి కుటుంబ సభ్యులు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి సంఘటనలు చేసేటప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాటన్ మిల్ యూనియన్ అధ్యక్షులు సూర్య ప్రకాష్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బావుండ్ల మధు, మార్కెట్ మాజీ చైర్మన్ బాలయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మనోహర్ రెడ్డి,బండారి శ్రీనివాస్, భగత్ సింగ్ ,కిషోర్ వరుణ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version