శివాలయ పునర్నిర్మాణానికి బీరవోలు దంపతులు.

శివాలయ పునర్నిర్మాణానికి బీరవోలు దంపతులు 2 లక్షలు విరాళం.

చిట్యాల, నేటి ధాత్రి ;

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బీరువోల నిర్మల – త్రిలోక రెడ్డి దంపతులు నవాబుపేట గ్రామంలో నిర్మిస్తున్నటువంటి నూతన శివాలయ ప్రతిష్టాపనకు 200116/- అక్షరాలా (రెండు లక్షల నూట పదహారు రూపాయలు) విరాళం ఇస్తామని ప్రకటించడం జరిగింది..అందులో భాగంగా గురువారం రోజున 50000 /- ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో శివాలయ కమిటీ అధ్యక్షులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మోతుకూరి నరేష్, ప్రధాన కార్యదర్శి సర్వ శరత్, కోశాధికారి మందల రాఘవరెడ్డి, కమిటీ సభ్యులు కొక్కుల సారంగం, తీగల నాగరాజు, తిప్పణవేణి రవి, బొమ్మ శంకర్, అనగాని రాజయ్య, మోతుకూరి రాజు, కాల్వ సమ్మిరెడ్డి, చెక్క నర్సయ్య, .ప్రధాన అర్చకులు రఘునందన్ శర్మ పాల్గొన్నారు.

హెచ్ సియు భూములమ్మే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలి..

హెచ్ సియు భూములమ్మే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలి..

సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పైన పోలీసులు నిర్బంధం ఆపాలి

సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు డిమాండ్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల అమ్మే ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిపిఎం పార్టీ వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు డిమాండ్ చేశారు.విద్యార్థుల మీద, ఎస్ఎఫ్ఐ విద్యార్థి యూనియన్‌ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని అపాలని సీపీఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ హెచ్.సీ.యు భూముల రక్షణ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులను, సీపీఎం నాయకులను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పోరాటాలపై, నాయకులపై నిర్బంధం పెరిగిందని విమర్శించారు.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు అనేక మాయ మాటలు చెప్పారని ఇప్పుడు అధికారం చేపట్టాక గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఈ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆరోపించారు.తమ ప్రభుత్వ మనుగడ కోసం ప్రభుత్వ భూములను అమ్ముకోవడం కరెక్ట్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను ప్రభుత్వము ఇప్పటికైనా విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.విశ్వవిద్యాలయాలను, విద్యా వ్యవస్థను బలోపేతం చేయవలసిన దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకొని అమ్మకానికి పెట్టిందని ఇప్పటికైనా విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని అమ్మకానికి పెట్టవద్దని, యూనివర్సిటీ అభివృద్ధికే వినియోగించాలని కోరారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌,ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో గత కొద్ది రోజులుగా విద్యార్థులు పోరాడుతున్నారని అన్నారు.ఐదు రోజుల నుండి పెద్ద ఎత్తున పోలీసులు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ తూర్పు క్యాంపస్‌లోకి బుల్డోజర్లతో ప్రవేశించడాన్ని , ప్రభుత్వం ఎంపిక చేసిన 400 ఎకరాల స్థలం దాటి తూర్పు క్యాంపస్‌ స్థలంలో కూడా చదును చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అమ్మొద్దని ప్రశ్నిస్తున్నా విద్యార్థులను అరెస్టు చేయడం, పోలీస్‌ స్టేషన్లల్లో నిర్బంధించారని కొంతమంది విద్యార్థులను రిమాండ్ చేసారని అన్నారు పైగా మరోసారి ఆందోళన చేయబోమని అంగీకరిస్తూ వీడియో చేస్తేనే విడుదల చేస్తామని ఒత్తిడి చేయడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది సిగ్గుమాలిన చర్య అని ఎద్దేవా చేశారు.ఈ రకమైన పద్ధతులలో ఇబ్బందులకు గురిచేయడం అప్రజాస్వామికమని దీనిని రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఖండించాలని అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ తన ఏడవ గ్యారెంటీగా ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామని, 400 ఎకరాల భూమి అమ్మకం ప్రయత్నాలను విరమించాలని, విద్యార్థుల మీద కేసులు ఉపసంహరించకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమారస్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, పట్టణ నాయకులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, ఇప్ప సతీష్ బుర్రి ఆంజనేయులు,హన్మకొండ సంజీవ కలకోట అనిల్ వజ్జంతి విజయ, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి, గణిపాక ఇంద్ర యాక లక్ష్మి, లక్క రాజు, ఐటిపాముల వెంకన్న పైస గణేష్, నాగరాజు నర్సింహా రాములు,ఎల్లయ్య, వీరన్న, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం..

నూతన గ్రామపంచాయితీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం పలికిన గొల్లగూడెం గ్రామ ప్రజలు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో 20 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయితీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని,కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచేందుకు కృషి చేస్తుందని , గొల్లగూడెం గ్రామపంచాయితీలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, గ్రామ పంచాయతీ అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని తెలియజేశారు
ఈ యొక్క కార్యక్రమంలో కరకగూడెం ఎమ్మార్వో నాగ ప్రసాద్ , ఎంపీడీవో దేవ వర కుమార్ , సీఐ వెంకటేశ్వర్లు , ప్రభుత్వ అధికారులు, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ , పోలబోయిన శ్రీవాణి ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు

విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం సరి కాదు..

విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం సరి కాదు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేయడానికి భారతీయ జనతా యువమోర్చా(బిజేవైఎం) వ్యతిరేకించడం జరుగుతుంది. విశ్వవిద్యాలయం భూములను కాపాడుకోవాలి అదేవిధంగా పర్యావరణాన్ని మూగజీవాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న అమాయక విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం పట్ల బాధ్యత వహిస్తూ ఈరోజు జహీరాబాద్ పట్టణం లో బిజేవైఎం అధ్యారంలో దిష్టి బొమ్మ దహనం చేయడానికి వెళ్తున్న బిజేవైఎం నాయకులను ముందస్తుగా అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది ఈకార్యక్రంలో సోమా అనిల్. నరేష్ పాటిల్ రూషబ్. నిఖిల్ యాదవ్ పాల్గొన్నారు రేవంత్ రెడ్డి తక్షణమే బహిర్గత క్షమాపణ చెప్పాలి అని బిజేవైఎం డిమాండ్ చేసింది.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అవగహన.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అవగహన
• మండల ఎంపీడీఓ రాజిరెడ్డి

నిజాంపేట: నేటి ధాత్రి

ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల పై అధిక డబ్బు వెక్షించి అప్పుల పాలు కావద్దని మండల ఎంపీడీఓ రాజీరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఇండ్ల లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మాట్లాడారు… ప్రజలు ఇండ్లకు అధిక డబ్బు పెట్టి అప్పులపాలు కావద్దని ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులతో ఇండ్లను నిర్మించుకోవలన్నారు. గ్రామంలో 16 ఇండ్ల పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ఏపీఓ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, గ్రామస్తులు జీవన్ రెడ్డీ, పిట్ల నర్సయ్య, భూపతి రెడ్డీ, మల్లేశం గౌడ్, ఏనుగంటి పోచయ్య, మమ్మద్ షాయదా, మ్యాదరి రజిత లు ఉన్నారు.

పేద ప్రజలను దోచుకుంటున్న మెడికల్ షాపు యజమానులు.

పేద ప్రజలను దోచుకుంటున్న మెడికల్ షాపు యజమానులు..!

◆ నిషేధిత మందులు అంటగడుతున్న వైనం

◆ వందల నుంచి వెయ్యిలో దోపిడీ

◆ పట్టించుకోని సంబంధిత అధికారులు

◆ చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

Medical shop owners are looting poor people.

జహీరాబాద్ నియోజకవర్గంలో, ముఖ్యంగా జహీరాబాద్ పట్టణంలో ఆయా మండలాల మెడికల్ షాపుల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. వ్యాపారం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నాణ్యతలేని మందులను విక్రయిస్తూ అధిక లాభాలను ఆర్జించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిపై జిల్లా ద్రగీ అధికారులు పట్టించుకునే స్థితిలో లేరు. నిర్లక్ష్య ధోరణితో అనేక మెడికల్ షాపులు నిబంధనలను అతిక్రమించి నిషేధిత మందులు సైతం విక్రయిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నిషేధించిన మందులు, అబార్షన్ కిట్ లు గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారు. మెడికల్ షాపుల నిర్వహణ పూర్తిగా వా ణిజ్యపరంగా మారింది. ప్రజల ఆరోగ్యాన్ని పక్కనపెట్టి, ఏది ఎక్కువ లాభం తెస్తుందో ఆ మందులను రోగులకు అందిస్తున్నారు. ఏది అందుబాటులో ఉంటే అది ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. నిషేధిత మందులు సైతం గుట్టుచ ప్పుడు కాకుండా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ సంబందిత అధికారులు స్పందించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జహీరాబాద్ లో కొన్ని ఏజెన్సీలు కూడా నిలువు దోపిడి చేస్తున్నారు. జిల్లాలో డ్రగ్ ఇన్స్ పెక్టర్ ఉన్నా, మెడికల్ షాపులను తనిఖీ చేసిన దాఖలాలు కని పించడం లేదు. తనిఖీలకు భయపడాల్సిన మెడికల్ షాపుల యజమానులు ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు. మందుల సర ఫరాలో పారదర్శకత లేక పోవడం, నాణ్యత లేని ఔషధాలను విక్రయించడాన్ని నియంత్రించాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది ప్రజలు వాపోతున్నారు.

ప్రసూతి దావకాన మీద పట్టింపేది.

ప్రసూతి దావకాన మీద పట్టింపేది

#చెట్ల తీగలతో ముసురుకున్న ఆసుపత్రి

#శిధిల వ్యవస్థకు దగ్గరగా వెల్నెస్ సెంటర్

#పాములకు పక్షులకు నివాసంగా!

#భయభ్రాంతులకు గురవుతున్న రోగులు

#కానరాని అధికారులు

హనుమకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):

 

హనుమకొండలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి లోని వెల్నెస్ సెంటర్ భవనం చుట్టుప్రక్కల పిచ్చి మొక్కలు పెరగడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం చెట్లతీగలతో ముసురుకుంది.

అసలు ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఉందా లేదా అనే భావన కలుగుతుంది.

వెల్ నెస్ సెంటర్ కి రోజుకి కనీసం వందకు మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పత్రిక పాత్రికేయులు వస్తుంటారు అదేవిధంగా వెల్నెస్ సెంటర్ భవనం మొదటి అంతస్తుకి గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు టీకాలు తీసుకోవడానికి వస్తుంటారు,వెల్నెస్ సెంటర్ భవనానికి చుట్టుపక్కల పిచ్చి చెట్లు పెరిగి తీగలు పారి మొదటి అంతస్తులోకి విస్తరించడంతో వాటి నుండి పాములు కీటకాలు వచ్చే అవకాశం ఉండడంతో రోగులు మరియు సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్ కి రావాలి కానీ హాస్పిటల్ కి వస్తేనే సమస్య ఎదురయ్యేలా ఉంది ఇక్కడి పరిస్థితి ఇదిలా ఉంటే గర్భిణీలు ప్రసూతి కోసం చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల నుండి ఆసుపత్రి కి వస్తుంటారు, రోజుకు వందకు మందికి పైగా అవుట్ పేషెంట్స్ వస్తుంటారు వందకు మంది పైగా ఇన్ పేషెంట్స్ అడ్మిట్ అవుతారు, అందులో 30 నుండి 50 ప్రసవాలు జరుగుతాయి.

Hospital

 

ఆసుపత్రిలో డాక్టర్లు మరియు సిబ్బంది తక్కువగా ఉండడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రభుత్య ఆసుపత్రి అంటేనే రోగులు జంకుతున్నారు మెరుగైన వైద్యం అందడం లేదనీ రోగుల బంధువులు అంటున్నారు,ఆసుపత్రిలో బెడ్స్ కూడా తక్కువగా ఉన్నాయని దీనికి తోడు ఆసుపత్రి గోడల చుట్టూ చెట్ల తీగలతోభయంకరమైన చెట్ల తీగలతో ఉండటంతో రోగులు భయభ్రాంతులకు గురవుతున్నామని ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుకుంటున్నారు.

ఇదిలా ఈ సమస్యపై అధికారులకు సమాచారం అందించిన కూడా ప్రభుత్వ దావఖాన పట్టింతే లేకుండా పోయిందని రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం….

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల్ అత్నూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం గురువారము మండల పరిధిలోని అత్నూర్ గ్రామంలో డీలర్ అబ్దుల్ రెహమాన్ రేషన్ షాపులో మండల కాంగ్రెస్ సీనియర్ యువ నాయకులు మొహమ్మద్ యూనుస్ లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ యూనుస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలో తెలంగాణలోని సబ్బండ వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ నెరవేరుస్తుం దని,ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయడం వారు 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్ అబ్దుల్ రెహమాన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పాపన్న గౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలుగు ప్రజలు గర్వించదగ్గ మహానుభావులలో ఒకరని, ఆయన జీవితంలోని గొప్ప త్యాగాలు, పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని తెలిపారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడిగా ఆయన చరిత్రలో నిలిచారని గుర్తు చేశారు.

పాపన్న జీవితం మనకు ధైర్యం, నిబద్ధత, న్యాయ పోరాటం వంటి విలువలను నేర్పుతుందని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలను గుర్తించి, ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయేలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు.

యువత ఆయన జీవితం నుంచి ప్రేరణ తీసుకొని, సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, పాపన్న గౌడ్ అభిమానులు, యువత, గ్రామస్తులు పాల్గొని, మహానుభావుని సేవలను స్మరించుకున్నారు.

సమావేశమైన జిల్లా SP మహేష్.బి.గితే IPS.

జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశమైన జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే ఐపిఎస్

సిరిసిల్ల టౌన్: ( నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల జిల్లాలోని జిల్లా పోలీస్ అధికారులతో నేడు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలని ,పెండింగ్ కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలని సూచించారు.పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల దర్యాప్తుల్లో మరింత నాణ్యత ప్రమాణాలను పాటించాలని, పెండింగ్ ఉన్న కేసులలో త్వరగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి నింధితులను అరెస్టు చేసి త్వరగా చార్జిషీట్ దఖాలు చేయాలని సూచించారు.శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు పగడ్భందీగా వ్యవహరించాలని,నేరాల చెదనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని అధికారులను ఆదేశించారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి డయల్ 100 కాల్స్ పట్ల తక్షణమే స్పందిస్తూ త్వరగతిన సంఘటన స్థలాలకు చేరుకొని సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు.ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి, పేకాట, పిడిఎస్ రైస్, గుడుంబా,ఇతర చట్ట వ్యతిరేకమైన నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయాలని, ఇతర చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు.రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని,ఓవర్ స్పీడ్,ట్రిపుల్ డ్రైవింగ్,మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, సదన్ కుమార్, మధుకర్, ఎస్.ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

రెండు బైకులు ఢీ వ్యక్తికి గాయాలు..

— రెండు బైకులు ఢీ వ్యక్తికి గాయాలు

నిజాంపేట: నేటి ధాత్రి

ఎదురుదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కోని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన నిజాంపేట మండలం కె. వెంకటాపూర్ గ్రామ శివారులో జరిగింది. పోలిసుల వివరాలు.. పోతారెడ్డి కి చెందిన చింతకింది భాను పని నిమిత్తం పులిమామిడికి బైక్ పై వెళ్తున్న క్రమంలో నార్లపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ నిర్లక్ష్యం గా డ్రైవింగ్ చేస్తూ టక్కరి చేసినట్లు భాను చిన్నాన్న రాములు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్ధంతి..

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్ధంతి

గౌడ సంఘం అధ్యక్షుడు మాదాసు రవి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో బుధవారం కల్లుగీత కార్మిక సొసైటీ ఆవరణలో మాదాసు రవి గౌడ్ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్ధంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు జయశంకర్ జిల్లా కేజీ కేఎస్ అధ్యక్షులు బత్తిని శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన మహనీయుడు మన పాపన్న గౌడ్ బహుజనుడు పూర్వంలో తురుష్క సైనికులు కల్లు మండవ లో పాపన్న స్నేహితుని కాలుతో తన్నబోయేది చూసి కోపంతో సైనికుల్ని మార్ కత్తితో మేడ నరికినాడు అప్పటి నుండి రాజ్యం లో విప్లవకారుడు అయ్యాడు పాపన్న పేరు జనగామ ప్రదేశములో మారుమోగింది యువకులు పాపన్న వద్ద సైనికులుగా చేరారు అతి తొందర్లోనే 3,000 మందిని సొంతంగా సైనికులుగా సమకూర్చారు 1675 సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు అని అన్నారు ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచులు నారగాని దేవేందర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ గౌడ సంగం జిల్లా నాయకులు ల్యాదళ్ల సమ్మయ్య గౌడ్ గుర్రం తిరుపతి గౌడ్ పాలకవర్గ ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులు మాజీ సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి’

కల్వకుర్తి/ నేటి ధాత్రి

 

 

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలో బుధవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు..

బత్తుల బాల కుమార్ గౌడ్, తాలూకా ఉపాధ్యక్షులు శ్రీశైలం గౌడ్, పాలకోవు యువజన ఉపాధ్యక్షులు ధర్మని రవి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ గౌడ్ ప్రచార కార్యదర్శి విష్ణు గౌడ్, ప్రధాన కార్యదర్శి గణేష్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ పద్మ అనిల్, జంగయ్య, కృష్ణా, నరేందర్ గౌడ్, పాండు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీకాంత్ గౌడ్ ,అల్లాజీ గౌడ్,సురేష్ గౌడ్, రాకేష్ గౌడ్, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

సన్న బియ్యం పంపిణి మహత్తర కార్యక్రమం..

సన్న బియ్యం పంపిణి మహత్తర కార్యక్రమం

ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన మాట
నెరవేర్చిన రేవంతన్న సీతక్క
కొత్తగూడ,నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన రేషన్ షాప్ లో సన్నాబియ్యం కార్యక్రమం
కొత్తగూడ గ్రామం లో జరిగింది
ముఖ్య అతిధిగా విచ్చేసిన
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య పాల్గొన్నారు
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ప్రియతమ నాయకురాలు బడుగు బలహీన వర్గాల ఆశ ద్విపం మన ప్రాంత అభివృద్ధి ప్రధాత
ధనసరి సీతక్క
ప్రజలందరూ సన్నబియ్యం పంపిణి చేస్తే సంతోషం గా ఉంటారని భావించి నేడు అమలు చేస్తున్న శుభ సందర్బంలో గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఆ విధంగా ఇచ్చేసేది అలాంటిది కాకుంటా ప్రజలందరూ కూడా సన్నబియ్యం ఇయ్యాలని సన్నబియ్యం తినాలని ఉద్దేశంతోనే మన తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇవాళ మన ఉగాది రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి మన పార్టీ మన ప్రభుత్వం ఇవాళ ఈ యొక్క సంగతి కార్యక్రమాన్ని మన స్టార్ట్ చేయడం జరిగింది. పేదలందరికీ కూడా ఇవాళ సన్న బియ్యం పంపిణి జరుగుతుంది గత ప్రభుత్వం లో బియ్యం తీసుకున్న గాని మళ్లీ వేరే బయట దళారుల అమ్ముకొని పరిస్థితి కనపడే ఇప్పుడు మాత్రం అలాంటిది లేదు మీ అందరూ కూడా తీసుకొని వినియోగించుకోవాలి అనే ఉద్దేశం ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన పథకాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హామీ ఇచ్చిందా అవన్నీ కూడా పేద ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం అమలు చేస్తది కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఆ మాట కట్టుబడి అమలు చేస్తుంది అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారంజక పరి పాలన కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి మన పేద ప్రజలు ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఓల్దార్లు అందరు కూడా దీని ఉపయోగించుకొని మరిన్ని సంక్షేమ పథకం లు ఉన్నాయి కనుక కార్యక్రమాన్ని ఇంకా ముందుకు జరిగే విధంగా మీరందరూ కూడా ప్రభుత్వానికి సాయ సహకారాలు అందించి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వానికి వెన్నంటే ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కూడా మనస్పూర్తిగా కోరడం జరుగుతోంది ఇందులో భాగంగానే ఇవాళ మాటిచ్చిన ప్రకారంగా ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో పించన్స్ గాని విద్యార్థులు కానీ ఇవన్నీ కూడా మళ్లీ కొనసాగిస్తుంది కూడా మన పార్టీ మన ప్రభుత్వం మన నాయకురాలు ఇప్పటికే కొందరికి మంజురి చేసినవి అవి కూడా ఈ మధ్యకాలంలోనే స్టార్ట్ అయితాయి ఇవన్నీ కూడా మీరందరూ దగ్గరుండి వినియోగించుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వం పక్షాన అదే విధంగా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మీ అందరిని కూడా పేదలందరికీ కూడా కోరాడం జరుగుతోంది మన పార్టీ పేదల పార్టీ మన పార్టీ ప్రజలకు కోసం పనిచేసేది ప్రజలకు సేవ చేసే పార్టీ మన నాయకురాలు కూడా నిత్యం అనునిత్యం పేద ప్రజల కోసం పేద ప్రజలు ఎక్కడ ఏ పని కావాలన్న గాని మనకు అందుబాటులో ఉంటుంది మన నాయకురాలు సీతక్క గారు ఉన్నారు కాబట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి గాని మనకొచ్చేస్తుంటే సంక్షేమ ఫలాలు గాని మన నాయకురాలు సీతక్క ఆధ్వర్యంలో మనం మన నాయకురాలకు తోడు నీడగా ఉండి మనందరం కూడా మన నాయకురాలు ఇచ్చేస్తుంటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి మన ప్రభుత్వం పథకాలను మీరు భవిష్యత్తులో ఉపయోగించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కోరడం జరుగుతోంది.అనిఅన్నారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ సుంకర బోయిన మొగిలి, డీసీసీ సభ్యులు వీరనేని వెంకటేశ్వర్రావు, మండల అధికార ప్రతినిధి ఈర్ప రాజేశ్వర్, కొత్తగూడ మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్, టౌన్ ఉపాధ్యక్షులు వెలుదండి వేణు,సోషల్ మీడియా కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్, డోనాల లక్ష్మి నారాయణ, మహేందర్, రవీందర్, గ్రామస్తులు, మహిళాలు తదితరులు పాల్గొన్నారు…

బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి.

బీజేపీ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్

బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిన్నటి రోజున గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లకు వచ్చి సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి.ఏదో కాగితాలు తెచ్చాడు.

అవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని. అంతేకాకుండా నిన్న ప్రారంభించినటువంటి సన్న బియ్యం కార్యక్రమం కోట సంవత్సరానికి అయ్యే ఖర్చు పదివేల కోట్ల రూపాయలు అందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ మైనటువంటి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారు.

అంతేకాకుండా కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి రాష్ట్రం వాటాన చెల్లిస్తుందని తెలియజేశారు.

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గరీబ్ యోజన కింద ప్రతి మనిషికి ఐదు కిలోల బియ్యం కేంద్రం నుండి లభిస్తుంది మిగిలిన ఒక కిల బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుండి లభిస్తుందని తెలియజేశారు.

BJP

 

మంత్రి పొన్నం తేవాల్సింది సన్న బియ్యం కాగితాలు తేక బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందో అని వేరే ముచ్చట్లు చెయ్యడం కరెక్ట్ కాదు.

అని సిరిసిల్ల బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, ఉరవకొండ రాజు,మెరుగు శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.

బాలికల ఉన్నత పాఠశాలలో బాలల పుస్తక దినోత్సవం.

నేడు సిరిసిల్ల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలల పుస్తక దినోత్సవం

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ లోని బాలల పుస్తక దినోత్సవం (Children’s Book Day) ప్రతి ఏడాది ఏప్రిల్ 2న జరుపుకుంటారు.

ఈ రోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సిరిసిల్ల లో బాల చెలిమి గ్రంథాలయములో , చదవడం, గ్రంథాలయ ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది.

ఈ రోజు విద్యార్థులు చవిచూసి, కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి పెంచేందుకు ఉద్దేశ్యమైంది.

అలాగే పుస్తకాలు చదివిన తరువాత కథ పై సమీక్షా రాయలని చెప్పడం జరిగింది.

Children’s

 

ఇది హాన్‌సా క్రిస్టియన్ ఆండర్సన్ యొక్క జయంతి సందర్భంగా, అతను పిల్లల కథలను రచించడం మరియు ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు మంచి పుస్తకాలు అందించడం ద్వారా ప్రసిద్ధి చెందాడు.

ప్రధానోపాధ్యాయులు L. శారదా మాట్లాడుతూ ఈ రోజు పిల్లలు పుస్తకాల మధ్య ప్రయాణం చేస్తూ, కొత్త కథలు చదవడానికి, అక్షరాల మహిమను తెలుసుకునేందుకు ప్రేరణ పొందవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమం లో బాల చెలిమి గ్రంధాలయం ఇంచార్జ్ ఎలగొండ రవి పాల్గొన్నారు.

పేదలకు పౌష్టిక ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.

పేదలకు పౌష్టిక ఆహారం
అందించడమే ప్రభుత్వ లక్ష్యం

నాగర్ కర్నూల్ / నేటి ధాత్రి

 

 

రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్న బియ్యం అందుబాటులో ఉండాలి పేదలకు పౌష్టిగా ఆహారం అందాలని వచ్చే నాలుగు సంవత్సరాలు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం పేద ప్రజల మేలు కోరే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకు సన్నబియ్యం పంపిణీ ఈ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు,18వ వార్డు, 8వ వార్డులలో ఏర్పాటు చేసిన సన్న బియ్యం పంపిణీ పథకం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పేదలకు సన్నబియ్యం పంపిణీలు చేసిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉగాది కానుకగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారు శ్రీమంతుల తరహాలో సన్నబియ్యం పేదలకు కూడా అందాలని దేశంలో ఎక్కడా లేని విధంగాతెలంగాణ రాష్ట్రంలో సీఎం సన్న బియ్యం పంపిణి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే చేస్తుందని అందుకే వారి ఆకలి తీర్చేందుకు ఈ పథకాన్ని తేవడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

బాక్స్‌ డ్రైన్‌ పనులు ప్రారంభించిన కార్పొరేటర్ MLA.

బాక్స్‌ డ్రైన్‌ పనులు ప్రారంభించిన. కార్పొరేటర్, ఎమ్మెల్యే

మల్కాజిగిరి నేటిధాత్రి 02:

 

 

నేరేడ్‌మెట్‌ డివిజన్‌ లోని ఎంప్లాయీస్ కాలనీ నుంచి సాయికృష్ణ ఎన్‌క్లేవ్‌కి 2 ఏళ్ల క్రితం పెట్టిన బాక్స్‌ డ్రైన్‌ పనులకు అనుమతి రావడంతో, 6.2 కోట్లు ఎన్‌డీపీ కింద ఇవ్వాల కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన. స్థానిక కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి , మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

గతంలో ఎస్‌ఎన్డీపీ కింద 40 కోట్లతో యాప్రాల్‌లో పనులు పూర్తి చేసి యాప్రాల్‌కి వర్షాకాలంలో 20 సంవత్సరాల నుండి పెద్ద సమస్య పరిష్కరించడం జరిగింది

MLA

అలాగే ఈ పనులు కుడా పూర్తి అయిపోతే ఇక్కడ కాలనీ వాళ్ళకి కూడా వర్ష కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు అని స్థానిక కార్పొరేటర్ చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆదిత్య, పరమేష్, శర్మ, సత్యనారాయణ, రాజి రెడ్డి, పర్వతాలు,శ్యామ్, అకారం సాయి, పవన్, నవీన్ గౌడ్, ఆల్బర్ట్, పంకజం, సుదర్శిని, షాలిని, ఎస్‌ఎన్డీపీ అధికారులు, కాలనీ సభ్యులు మరియు పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఉక్కుపిడికిలి…పోరు వాకిలి బిఆర్‌ఎస్‌’’.

`తెలంగాణ కోసం పద్నాలుగేళ్ల యుద్ధం కేసిఆర్‌.

`తెలంగాణ కోసం పుట్టిన ఉద్యమ ఖడ్గం కేసిఆర్‌.

`తెలంగాణ జాతి విముక్తి పోరాటం కేసిఆర్‌.

`ఉద్యమానికి కేసిఆర్‌ ఊపిరిపోసి ఇరవైఐదు వసంతాలు!

`కేసిఆర్‌ జై తెలంగాణ గొంతెత్తి జైకొట్టి ఇరవైఐదేళ్లు.

`పిల్లా, జెల్లాకు ఉగ్గు పాలతో నూరిపోసిన నినాదం జై తెలంగాణకు పచ్చీస్‌ సాల్‌.

`ఉడుకు నెత్తురు ఉప్పెనై పొంగిన ఆవేశం టిఆర్‌ఎస్‌.

`బక్క పలుచని కేసిఆర్‌ సింహ గర్జనకు పాతికేళ్లు.

`చెక్కు చెదరని తెలంగాణ ఆత్మ గౌరవ విశ్వాసానికి సిల్వర్‌ జూబ్లీ.

`తెలంగాణకు గులాబీ తిలకం దిద్ది ట్వెంటీ ఫైవ్‌ ఇయర్స్‌.

`రైతు నాగలి గుర్తుతో జై తెలంగాణ నినాదం గర్జించిన రోజులు.

 `సరిగ్గా ఇరవై ఐదేళ్ల నాడు ఎటు చూసినా కరువే.

`ఎవరిని కదిలించినా దుఖమే.

`ఆగమైన బతుకునుండి కన్నీటి మంటలతో రగిలిన తెలంగాణ.

`తెలంగాణ తెచ్చుకోకపోతే పల్లెలు వల్లకాడులై పోతాయన్న భయం నుంచి పట్టిన బాట జై తెలంగాణ.

`పటపట మంటూ పండ్లు నూరుకుంటూ పరుగు పరుగున సాగిన ఉప్పెన తెలంగాణ.

`ఒక్కడుగా మొదలై కోట్ల మందికి గర్జన నేర్పిన నేత కేసిఆర్‌.

`‘‘పుబ్బ’’ లో పుట్టి ‘‘మగ’’ లో మాడిపోతుందన్న వారిని ఎదిరించి నిలిచిన పార్టీ టిఆర్‌ఎస్‌.

`తెలంగాణ సాధించే వరకు పద్నాలుగేళ్ల అవిశ్రాంత పోరాటం టిఆర్‌ఎస్‌.

`పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ ఆవిష్కృతం బిఆర్‌ఎస్‌.

`తెలంగాణ చీకట్లను పారదోలిన పార్టీ బిఆర్‌ఎస్‌.

`మోడువాడిన తెలంగాణను చిగురింపజేసిన పార్టీ బిఆర్‌ఎస్‌.

`ఎడారి లాంటి తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన పార్టీ బిఆర్‌ఎస్‌.

`అన్నమో రామచంద్రా అనే ఆకలి కేకల నుంచి దేశానికి అన్నం పెట్టిన పాలన బిఆర్‌ఎస్‌.

`తెలంగాణ రైతును రాజును చేసిన పార్టీ బిఆర్‌ఎస్‌.

`తెలంగాణ తెచ్చింది ‘‘టిఆర్‌ఎస్‌’’… బంగారు తెలంగాణ చేసింది ‘‘బిఆర్‌ఎస్‌’’.

తెలంగాణ ఉద్యమ సృష్టికి మూలమైన బిఆర్‌ఎస్‌ పార్టీ ఎవరూ ఊహించనటు వంటి ఉద్యమాలకు, పోరాటాలకే కాదు, సభలకు, సమావేశాలకు కూడా పెట్టింది పేరు. రాజకీయ పార్టీల చరిత్రలో బిఆర్‌ఎస్‌పార్టీ నిర్వహించినన్ని సభలో ఏ పార్టీ నిర్వహించి వుండకపోవచ్చు. పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్తానంలో కొన్ని వందల సభలు నిర్వహించిన ఘనత ఒక్క బి ఆర్‌ఎస్‌కే దక్కుతుంది. సభలల్లో చిన్న చిన్న సభలే కాదు, ఎవరి ఊహకందనటు భారీ భహిరంగ సభల నిర్వహణలో బిఆర్‌ఎస్‌దే పై చేయి. అలాంటి భారీ రాజకీయ, ఉద్యమ సభలు దేశంలో ఏ పార్టీ నిర్వహించలేదు. గతంలో హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో సభలు నిర్వహించి, వాటినే గొప్ప సభలుగా చెప్పుకున్న రోజులున్నాయి. ఎప్పుడైతే బిఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహంచిన భారీ భహిరంగ సభలతో పరేడ్‌ గ్రౌండ్‌ సభలకు కాలం చెల్లినట్లైంది. తెలంగాణలో ఏ పార్టీ రాజకీయ సభ పెట్టినా, బిఆర్‌ఎస్‌ సభలతో పోల్చుకుంటూ, మీడియా అనేక చర్చా వేధికలు ఇప్పటీకీ ఏర్పాటు చేస్తుంటాయి. సభల్లో బిఆర్‌ఎస్‌ను బీట్‌ చేయడం ఎవరి వల్ల కాదని ఆఖరుకు తీర్పునిస్తుంటాయి. అంతగొప్పగా సభలు నిర్వహించడంలో బిఆర్‌ఎస్‌ నాయకుల వ్యూహం ముందు ఏ పార్టీ సభలైనా బలారూరే అని చెప్పాలి. ఉద్యమ సమయంలో బిఆర్‌ఎస్‌ సభ అంటే పుట్టలు పగలి చీమలు వచ్చినట్లు జనం తండోపతండాలుగా వచ్చేవారు. ఎండా, వాన, చలిలను లెక్క చేయకుండా ఉద్యమ సభలను ప్రజలు విజయవంతం చేస్తుండేవారు. కరీంనగర్‌లో నిర్వహించిన సింహ గర్జనతో మొందలైన పెద్ద పెద్ద పెద్ద సభలు అప్పట్లో జిల్లాకొకటి జరగుతూ వుండేది. అప్పట్లో వరంగల్‌లో జరిగిన బిఆర్‌ఎస్‌ గురించి ప్రపంచమంతా మాట్లాడుకున్నదంటే ఆశామాషీ కాదు. వరంగల్‌ సభకు పదిహేను లక్షలమంది హజరైనట్లు లెక్కలున్నాయి. ఆ తర్వాత కూడా అనేక సభలు నిర్వహించి, ప్రజల్లో తెలంగాణ ఉద్యమాన్ని సజీవం చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత గాని, అదికారంలో వున్న పదేళ్లలో గాని మళ్లీ అంత పెద్ద సభలు బిఆర్‌ఎస్‌ల నిర్వహణలు ఆపలేదు. 2014 ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల సభలు పెద్దఎత్తున నిర్వహించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసిఆర్‌ చేసిన బస్సుయాత్రకు కూడా ప్రజలు తండోపతండాలుగా కదలి వచ్చారు. అంతకు ముందు నిర్వహించిన నల్గొండ సభకు కూడా ప్రజలు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. బిఆర్‌ఎస్‌ పార్టీ పుట్టి 25 సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. ఆ పార్టీ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేసింది. అందులో భాగంగా తెలంగాణ ప్రజల్లో బిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజాభిమానం చెక్కు చెదరలేదని నిరూపించేందుకు వరంగల్‌లో మరో భారీ భహిరంగ సభ నిర్వహించేందు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే గతంలో బిఆర్‌ఎస్‌సభలకు, ఈ నెల 27న వరంగల్‌లో జరిగే సభకు కొంత వ్యత్యాసముంది. గతంలో ఉద్యమ కోణంతోపాటు,రాజకీయ ఎన్నికల సభలు జరుగుతూ వుండేవి. కాని ఇప్పుడు బిఆర్‌ఎస్‌ పార్టీ పుట్టి ఇప్పటికీ 25 ఏళ్లు పూర్తి కావస్తుండడంతో ఈ సభ కూడా చరిత్రలో నిలిచేలా ప్లాన్‌ చేస్తున్నారు. గతంలో బిఆర్‌ఎస్‌కున్న రికార్డును బ్రేక్‌ చేయాలని చూస్తున్నారు. వరంగల్‌ సమీపంలోని ఎల్కతుర్తి సమీపంలో సుమారు 1200 ఎకరాలలో బిఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీసభ నిర్వహణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 15 లక్షల మందిని సమీకరించే పనిలో బిఆర్‌ఎస్‌ శ్రేణులున్నాయి. తెలంగాణలో అధికారంకోల్పోయినా సరే, బిఆర్‌ఎస్‌పై ప్రజలకు ఏ మాత్రం అభిమానం తగ్గలేదని నిరూపించాలంటే ఉద్యమ సమయంలో జరిగిన సభలను మించి నిర్వహించాలని చూస్తున్నారు. అందుకోసం బిఆర్‌ఎస్‌ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పటికప్పుడు నాయకులతో చర్చలు జరుపుతున్నారు. సభ ఏర్పాట్లును ఎప్పటికికప్పుడు సమీక్షిస్తున్నారు. పనులు వేగం పెంచేందుకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ సభతో బిఆర్‌ఎస్‌ మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టేలా వుండనున్నది. బిఆర్‌ఎస్‌కు తెలంగాణలో ఎదురులేదని, తిరుగులేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాడిన్న కాలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా వుంటున్న కేసిఆర్‌ మొదటి సారి తన గళాన్ని వినిపించే వేదిక కావడంతో తెలంగాణ అంతా ఆ సభలో వుండేలా చూసుకుంటున్నారు. అందుకే 1200 ఎకరాల స్థలంలో సభ నిర్వహణను ఏర్పాటు చేస్తున్నారు.

బిఆర్‌ఎస్‌ అంటే రాజకీయాల కోసం పుట్టిన పార్టీ కాదు. ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ. కేసిఆర్‌ ఆలోచనతో మొగ్గ తొడిగిన పార్టీ. ప్రజల ఆవేదనల నుంచి పురుడు పోసుకున్న పార్టీ. ప్రజల ఆక్రందనల నుంచి మొలకెత్తిన పార్టీ. తెలంగాణ గోసలు తీర్చేందుకు ఏర్పాటైన పార్టీ. తెలంగాణ సాధన కోసం జ్వనించిన పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ధ్యేయంగా జ్వలించిన పార్టీ. ఉద్యమమై ఉరకలెత్తిన పార్టీ. పోరు దారిలో తెలంగాణ నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా వినిపించిన పార్టీ. తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరులూదిన పార్టీ. తెలంగాణ అనే నినాదాన్ని ఆకాశాన్ని తాకేలా గర్జించిన పార్టీ. తెలంగాణ అనాలంటే ముందు,వెనుక ఒకటికిపదిసార్లు ఆలోచించేవారు కూడా పిడికిలి బిగించి జై తెలంగాణ అని ఎలిగెత్తేలా చేసిన పార్టీ. గొంతు సవరించుకొని అప్పటి పాలకుల గుండెలు అదిరేలా జై తెలంగాణ అని నినదించిన పార్టీ. సమైక్య పాలకులు గుండెలు అదిరేలా జై తెలంగాణ జపం చేసిన పార్టీ. తెలంగాణను అడ్డుకున్న వారి వెన్నులో వణుకుపుట్టించిన పార్టీ. తెలంగాణ వ్యతిరేకులను, సమైక్య వాదులకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన పార్టీ. ఇక తెలంగాణ మనది కాదని సమైక్య వాదులు మూట ముల్లె సర్ధుకొని వెళ్లిపోయేలా చేసిన పార్టీ. ఇక ఎంత అడ్డుకున్నా తెలంగాణ ఆగేది లేదని, కాదని తెలుసుకొని సమైక్య వాదులచేత కూడా జై తెలంగాణ అని పించిన పార్టీ. తెలంగాణ నుంచి ఆకలి కేకలతో, బతుకెళ్లదీసుకునేందుకు వలసలు పోయిన ప్రజలు మళ్లీ ఆత్మగౌరవంతో బతికేలా చేసిన పార్టీ. వారి ఆకలి తీర్చి, అన్నం పెట్టిన పార్టీ. ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసిన పార్టీ. తెలంగాణలో నీటి పరవళ్లు నింపిన పార్టీ. ఎప్పుడో దశాబ్దాల తరబడి ఎండిపోయిన వాగుల్లో , వంకల్లో, ఒర్రెల్లో కూడా నీరు పారించిన పార్టీ. ఎప్పుడో ఎండిపోయి, తుమ్మలు మొలిచి ఆనవాలు లేకుండాపోయిన చెరువులను బాగు చేసి, ఊరుకు కల్పతరువు చేసిన పార్టీ. ఊరుకు చెరువే ఆదరవని నిరూపించిన పార్టీ. పదేళ్ల పాటు చెరులన్నీ గంగాళలంలా కళకళలాడేలా చేసిన పార్టీ. ఎండా కాలంలో కూడా చెరువులు మత్తళ్లు దుంకేలా చేసిన పార్టీ. పాడి పండలతో తెలంగాణ సిరి సంపదలతో తులతూగేలా చేసిన పార్టీ. ఇదంతా ఒక్క కేసిఆర్‌ సృష్టి. తెలంగాణ సాధనలో కేసిఆర్‌ కలలుగన్న ఆర్తి. తన కలలను తానే నిజం చేసి, తెలంగాణకు సిరుల తెలంగాణ చేసిన కీర్తీ కేసిఆర్‌. తెలంగాణను బంగారు తెలంగాణ చేసి సుసంపన్నం చేసిన ఘణకీర్తి కేసిఆర్‌. పద్నాలుగేళ్లపాటు అలుపెరగని పోరాటం చేసి, లక్ష్యం ముద్దాడిన పార్టీ. తెలంగాణ తెచ్చిన చరిత్రకు కీర్తి కిరీటం కేసిఆర్‌. తెచ్చిన తెలంగాణలో బంగారు సిరి రాసులను పండిరచేలా ప్రాజెక్టులను నిర్మాణం చేసిన అపర భగీరధుడు కేసిఆర్‌. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు తెలంగాణ రాకపోతే కలలో కూడా ఊహించలేం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ లాంటి నాయకుడు లేకపోతే తెలంగాణలో జలసిరులు చూడలేకపోయేవాళ్లం. అందుకే కేసిఆర్‌ అనే మూడక్షరాల పదమే తెలంగాణకు జీవం. తెలంగాణ ప్రగతి వేదం. ఆయన చూపే ప్రజలకు వరం. ఆయన నవ్వే బంగారం. తెలంగాణ కోసం ఆయన జీవితమే ఒక త్యాగం. ఆ త్యాగ ఫలాలే మనం అనుభవిస్తున్న జీవితాలు అర్ధం…పరమార్ధం. పదేళ్లతో తెలంగాణ తల రాత మార్చిన ముక్కంటి శివునికి ప్రతిరూపం. తెలంగాణ భవిష్యత్తును తీర్చి బ్రహ్మరాతకు కేసిఆర్‌ జలయజ్ఞం నిదర్శనం. తెలంగాణను అన్ని రంగాలలో పదేళ్లల పరుగులు పెట్టించిన ఆధునిక ఆర్దిక వేత్త కేసిఆర్‌. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందేలా చేసిన వైతాళికుడు కేసిఆర్‌. తెలంగాణ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జాతి పిత కేసిఆర్‌.

చలో జోడెన్ ఘాట్ ను విజయవంతం చేయాలి.

చలో జోడెన్ ఘాట్ ను విజయవంతం చేయాలి

“తుడుందెబ్బ” పిలుపు.

కొత్తగూడ, నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రము లోని ఆదివాసీలు తమ అస్తిత్వం ను,కోల్పోయి బ్రతుకు జీవుడా అంటూ అభివృద్ధి కి దూరంగా,ప్రభుత్వ, సంక్షేమ పధకాలకు నోచుకోకుండా,ఆదివాసీ నిరుద్యోగ యువత కు ఉద్యోగ కల్పన,ఉపాధి,లేక పోవడం తో,తీవ్ర మనో వేదనకు గురౌ తున్నారని,రాష్ట్రము లోని ఆదివాసీల భూములు వలస వాదుల,అదీనం అక్రమంగా దోపిడీ కి గురైన విధానము ను గిరి గ్లాని కమీషన్ రిపోర్ట్ తేట తెల్లం చేసిన విషయం,ప్రభుత్వా లకు తెలిసినా ఆదివాసీల దోపిడీ చేసిన వర్గాలకే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు, వంతపాడుతున్నాయని,ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేకంగా స్వయం పాలన అధికారం అమలులో ఉందనే నిజo తెలిసినా పాలకులు తమ రాజకీయ అధికారం కోసం ఆదివాసీలను అణిచి వేసే ధోరణి తో ఆదివాసీల పై,కుట్ర పూరిత విధానాలు అనుసరించి చొర బాటుదారుల తో ఆదివాసీ ప్రాంతం ను చిన్నా భిన్నం చేస్తూ ఆదివాసీ ల మనుగడ కు తీవ్ర ఆటంకం కల్గిస్తున్న భూర్జవ రాజకీయ పార్టీలు,వలసవాద గిర్జనేతరుల,భారీ నుండి ఆదివాసీలను కాపాడు కునేందుకు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ,రాష్ట్ర మహాసభ లను ,చలో జోడెన్ ఘాట్ ఏప్రిల్ 12,13, 14 తేదీలలో రాష్ట్ర మహా సభలు, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,కెరమేరి మండలం, కొమురం భీమ్ యుద్ధ భూమి అయిన జోడెన్ ఘాట్ లో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది, ఈ రాష్ట్ర మహాసభల కు వక్తలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత MLC ప్రొపెసర్ ఆచార్య కోదండరాం, ఓయూ ప్రిన్సిపాల్ ప్రొపెసర్ కాశిం, విశ్రాంత ప్రొపెసర్ హరగోపాల్ లు హాజరై ప్రసంగిస్తారాని,ఈ మహా సభల విజవంతం కోసం తుడుందెబ్బ రాష్ట్ర,జిల్లా మండల ముఖ్య నాయకత్వం హాజరై విజయవంతం చేయాలనీ తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ ఆగబోయిన రవి, ఈ రోజు కొత్తగూడ గ్రామ పంచాయితీ,అవరణం లో జిల్లా అధ్యక్షులు కుంజ నర్సింగ రావు అధ్యక్షతన జరిగిన సమావేశం లో పిలుపునిచ్చారు,సమావేశం లో అల్లెం జంపయ్య,సిడం రమేష్,సిద్దబోయిన లక్ష్మీ నారాయణ,సతీష్,తదితరులు పాల్గొన్నారు…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version